Home Blog Page 2096

డీజే టిల్లుకి డైరెక్టర్ తో లొల్లి

0

ఈ ఏడాది తెలుగు సినిమా పరిశ్రమ నుండి వచ్చిన సూపర్ హిట్ చిత్రాలలో “డీజే టిల్లు”సినిమా ఒకటి. చిన్న సినిమాగా విడుదలైనా, ‘డీజే టిల్లు’ బాక్సాఫీస్‌ వద్ద అందరికీ లాభాలు తెచ్చి పెట్టింది. సిద్ద జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్‌ అయి భారీ విజయం సాధించింది.

లైఫ్‌ బిఫోర్ వెడ్డింగ్‌, గుంటూరు టాకీస్‌, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్‌ హిజ్‌ లీల వంటి చిత్రాలలో నటించిన సిద్ధు జొన్నల గడ్డ.. నిజానికి పదమూడేళ్ళ క్రితం విడుదలైన నాగ చైతన్య తొలి చిత్రం అయిన “జోష్” చిత్రంలో ఒక పాత్రలో తెరంగేట్రం చేశారు.ఆ తరువాత రామ్ చరణ్ హీరోగా చేసిన “ఆరెంజ్” సినిమాలో సహాయక పాత్రలో నటించారు. అలా అడపాదడపా చిన్న పాత్రలు, అలాగే హీరోగా నటిస్తూ వచ్చిన సిద్ధు గత ఏడాది ఓటీటీలో విడుదలైన “కృష్ణ అండ్ హిజ్ లీల” చిత్రంతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక ఈ యువ హీరోకు ‘డీజే టిల్లు’ సినిమాతో ఇన్నేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పేరొచ్చింది. ‘డీజే టిల్లు’ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే సినిమాకి మంచి హైప్ ఉన్నప్పుడే సీక్వెల్‌ కూడా ప్రకటించి ప్రేక్షకులను ఆనంద పరిచారు దర్శక నిర్మాతలు.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘డీజే టిల్లు’ దర్శకుడు విమల్‌ కృష్ణ ఈ సీక్వెల్‌ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా సీక్వెల్ ‍ప్రారంభమైన తర్వాత దర్శకుడు విమల్, హీరో సిద్ధు మధ్య స్క్రిప్ట్ విషయంలో అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నాయట. అందువల్ల దర్శకుడు విమల్‌ కృష్ణ ఈ సీక్వెల్‌ నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు ఈ సీక్వెల్‌కు హీరో సిద్ధు నే స్క్రిప్ట్ సరిదిద్దే భాద్యతలు చూసుకుంటున్నారట. ఇదివరకు “కృష్ణ అండ్ హిజ్ లీల” “మా వింత గాథ వినుమా” సినిమాలకు కూడా స్క్రిప్ట్ వర్క్ లో సిద్ధు పాల్గొన్నారు. ఇప్పుడు దర్శకుడు విమల్‌ స్థానంలో కొత్త దర్శకుడు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో డీజే టిల్లు చిత్ర యూనిట్ నుండి ఈ విషయం పై ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం.

Telugu Producers Council meeting: నిర్మాతల మండలి కీలక సమావేశం ప్రకటన

0

కరోనా తరువాత తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటూ వస్తుంది. ఒక వైపు నిర్మాణ వ్యయం పెరిగిపోవడం.. మరో వైపు సినిమాల నిర్మాణం నెలల తరబడి వాయిదా పడటం వంటి కారణాలతో నిర్మాతలకు పలు రకాల సమస్యలు ఎదురయ్యాయి. అయితే ఈ ఏడాది వేసవిలో ఆర్ ఆర్ ఆర్ , కేజీఫ్ 2 వంటి పాన్ ఇండియా సినిమాలతో పాటు సర్కారు వారి పాట వంటి అగ్ర హీరోల సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు నమోదు చేసి కాస్త ఊపిరి పోయడంతో మెల్లగా ఒక క్రమంలో పునరుద్ధరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.

ఆ రకంగా పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ సంచలనం సృష్టించాయి. ఆ తరువాత అగ్ర హీరోలు ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలు తీయాలనే ఆలోచనతో ఉండటంతో నిర్మాణ వ్యయం కూడా పెరగడం మొదలు పెట్టింది.

దీనికి తోడు ఇదివరకే చెప్పుకున్నట్లు ప్రేక్షకులు టాక్ చాలా బాగుంటేనే థియేటర్లకు వస్తున్నారు.ఇందుకు పెరిగిన టికెట్ ధరలు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. వాటి ప్రభావం వల్ల సినిమాలు కేవలం తొలి మూడు రోజులు మాత్రమే సరైన విధంగా కలెక్షన్లు రాబడుతున్నాయి. ఆ తరువాత ఎంతో హైప్ ఉన్న సినిమాలు తప్ప మిగతా రోజులలో కలెక్షన్లు రావడం లేదు.

ఇక పెరిగిన నిర్మాణ వ్యయం, ఆర్టిస్ట్ ల రికార్డు స్థాయి రెమ్యూనరేషన్లు మరియు టెక్నీషియన్ల పారితోషికాలు, ఓటీటీ ప్రభావం, వీపీఫ్ ఛార్జీలు వంటి అనేక సమస్యలు నిర్మాతలను చుట్టు ముట్టాయి.

దీనిపై నిర్మాతలంతా ప్రత్యేకంగా ఓ భేటీని ఏర్పాటు చేసుకుని కూలంకషంగా చర్చించి ఓ నిర్ణయానికి రావాలనే ఆలోచనలో వున్నారట.ఈ మేరకు జూలై 21న తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రత్యేకంగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించ బోతోంది.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ అధికారిక ప్రకటన కూడా చేశారు. ఈ భేటీలో పైన చెప్పుకున్న సమస్యలతో పాటు ఫైటర్స్ యూనియన్ ఫెడరేషన్ సమస్యలు.. నటీనటుల రెమ్యూనరేషన్ లపై కూడా చర్చ జరపనున్నారట. మరి ఈ నెల 21న జరగనున్న నిర్మాతల మండలి కీలక సమావేశంలో ఎలాంటి నిర్ణయాల్ని తీసుకుంటారో చూడాలి.

Telugu Film Producers Council Conducting A Meeting To Revive The Theatrical Market

0

It is common news now that the theatrical market has suffered a lot in the recent few years due to COVID-19. The concerned members have been actively trying to solve this problem but nothing seems to be helping.

The Telugu Film Producers Council has conducted several meetings to tackle this issue but no conclusive solution has been obtained. The council is now planning to conduct another meeting to tackle a lot of issues surrounding the theatrical market.

In a press note that was released today, the members of the council have been asked to meet on 21st July 2022 to discuss the following agenda. A special general body meeting will take place at Hyderabad in the Filmnagar Housing Complex.

The agenda of the special general body meeting will be to discuss the various aspects surrounding the theatrical business. The council will discuss the role of OTT in the theatrical revenue model, VPF charges, Role of Managers, Artists/Technician issues.

They will also be discussing the ticket rates being imposed on big and medium-budgeted movies. Working conditions, rates as well as the cost of production will also be given special emphasis. It is also mentioned that the meeting will involve the matters of Fighters Union and Federation issues.

New Trend in Tollywood: టికెట్ రేట్లు తక్కువ చేసిన థాంక్యూ టీమ్

0

యువ సామ్రాట్ అక్కికేని నాగ చైత‌న్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దిల్‌రాజు ప్రొడ‌క్షన్ అసోసియేష‌న్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేష‌న్‌తో శ్రీమ‌తి అనిత స‌మ‌ర్పణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. జూలై 22న సినిమా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం చిత్ర యూనిట్ వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.

అయితే ఇటీవలే తెలుగు సినిమా ప్రచార పద్ధతుల్లో ఒక కొత్త ఒరవడి మొదలుపెట్టారు సినీ వర్గాలు. అదేంటంటే మా సినిమా టికెట్ రేట్లు తగ్గించాం.. దయచేసి సినిమా చూడండి అని ప్రచారం చేయడం. కరోనా దాడుల తరవాత సినిమాలు మళ్ళీ యధావిధిగా విడుదల అవుతున్న నేపథ్యంలో అత్యాశకు పోయి టికెట్ రేట్లు అమాంతం పెంచేశారు.. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరీ ఎక్కువగా రేట్లు పెంచారు.

ఇప్పుడు చేసిన తప్పుకు పరిహారంగా, సినిమా విడుదలకు ముందు టికెట్ రేట్లను తగ్గించిన విషయాన్ని ప్రచార సాధనంగా ఉపయోగించు కుంటున్నారు.

ఈ నెలలోనే విడుదలైన పక్కా కమర్షియల్ మరియు హ్యాపీ బర్త్ డే చిత్రాలకు కూడా ఈ విధంగా ప్రకటించారు. అయితే పక్కా కమర్షియల్ సినిమా పేరుకే టికెట్ రేట్లు తగ్గించారు అని చెప్పారు కానీ కేవలం 50 రూపాయల వరకే తగ్గించారు.

ఇప్పుడు “థాంక్యూ” సినిమాకి కూడా ఇదే తరహా ప్రచారం చేస్తున్నారు. చిత్ర యూనిట్ చెప్పిన సమాచారం ప్రకారం సింగిల్ స్క్రీన్ – 100(ఎక్సీఎల్ GST) గానూ మల్టీప్లెక్స్ – 150( excl GST) గానూ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ రేట్లు నిజంగా అమలు అవడం కష్టమే. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని సినిమాలకు సింగిల్ స్క్రీన్ లకు దాదాపు 150/- .. మల్టీప్లెక్స్ లకు 180/- ఫిక్స్డ్ రేట్లు అమలులో ఉంటున్నాయి. అంతకంటే అవసరం అయితే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎటొచ్చీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చిన్న పిల్లల ఆటకు మాదిరి ఒక్కో సినిమాకి ఎక్కువ తక్కువ అంటూ సిల్లీగా వ్యవహరిస్తున్నారు.

Jai Bhim: హీరో సూర్య పై కేసు కొట్టివేసిన మద్రాస్ హై కోర్టు

0

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్. గత ఏడాది అమెజాన్ లో నేరుగా ఓటీటీ రిలీజ్ గా వచ్చిన ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. కేవలం సూర్య అభిమానులనే కాదు భాషలకు అతీతంగా ప్రేక్షకులను మెప్పించింది. గిరిజ‌నుల‌కు అండ‌గా నిలుచున్న లాయ‌ర్ చంద్రు పాత్ర‌లో హీరో సూర్య న‌టించారు. న‌టుడి గానే కాదు నిర్మాత‌గానూ ఆయ‌న ఎప్పుడూ కొత్త కథలను, సినిమాలని ప్రోత్సహిస్తూ ఉంటారు.

ఆ కోవలోనే 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ‘జై భీమ్‌’ సినిమాను రూపొందించారు. పోలీసులు, కేసులు, అంటూ సాగే ఈ సినిమా సామాజిక అస‌మాన‌త‌లు, ఒక వ‌ర్గాన్ని మ‌రో వ‌ర్గం త‌క్కువ‌గా చూడటం అనే అంశాల నేపథ్యంలో రూపొందించబడింది. రాజ్యాంగం కల్పించిన హ‌క్కులు అంద‌రికీ అందుబాటులో ఉండ‌టం లేదనే అంశంతో, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా జై భీమ్. అయితే ఈ సినిమాకు ఎన్నో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

ఆ విమర్శల్లో భాగంగానే హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక పై గతంలో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. జై భీమ్ సినిమాలో తమ కులాన్ని, మతాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి అంటూ కోర్ట్ ని ఆశ్రయించారు రుద్ర వన్నియార్ కుల చత్రియార్ సంఘం అధ్యక్షుడు సంతోష్ నాయక్. సినీ నిర్మాతలు, హీరో సూర్య, నటి జ్యోతికపై సంతోష్ నాయక్ సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ వెంటనే ఇరువురి పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

అయితే ఈ కేసు విషయంలో సూర్యనే గెలిచారు.సూర్య – జ్యోతిక పై పెట్టిన కేసును మద్రాసు హై కోర్టు కొట్టివేసింది. హీరో సూర్య పై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదని ఈ మేరకు హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు ఖచ్చితంగా హీరో సూర్యకు, ఆయన అభిమానులకు సంతోషాన్ని ఇస్తుంది.

మన హీరోలు బంగారం అంటున్న దిల్ రాజు

0

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు..స్క్రిప్ట్ ల పై ఆయన జడ్జిమెంట్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో మంచి పేరు ఉంది. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు ఇష్టపడతారో ఆయనకు బాగా తెలుసు. ఆ విషయం ఆయన బ్యానర్ లో ఉన్న హిట్ సినిమాల సంఖ్య చూస్తేనే అర్థం అవుతుంది.

ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు నిర్మిస్తూ బిజీగా వున్నారు. అలాంటి దిల్ రాజు ఇప్పడు కొన్ని విషయాల పట్ల ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆయనను అంతగా ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటంటే..కరోనా తరువాత గత సినిమాలు చూసే విషయంలో ప్రేక్షకుల అభిరుచి మరియు ఆలోచనా ధోరణి మారింది అన్నమాట వాస్తవం. భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు అయితేనో.. లేదా అద్భుతమైన ఆడియో లేదా ప్రచారం జరిగిన సినిమాలకే థియేటర్లకు కదులుతున్నారు. ఎంత పెద్ద హీరో అయినా, క్రేజీ కాంబినషన్, భారీ నిర్మాణ సంస్థ అయినా తమను ఆకట్టుకునే అంశాలు ఉంటేనే.. ఏదో అద్భుతం దాగి ఉంది అన్న భావన కలిగితేనే ప్రేక్షకులు సినిమా చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.

అందుకే ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నిర్మాతలు, హీరోలు, పాన్ ఇండియా చిత్రాలు లేదా ద్విభాషా చిత్రాలు నిర్మించి నిత్యం ఏదో ఒక అంశంతో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాలు విడుదల చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం పరిశ్రమ ఎదురుకుంటున్న సమస్యల గూర్చి నిర్మాత దిల్ రాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చర్చించారట. సమస్యల గురించి కూలంకషంగా చర్చించిన అనంతరం రామ్ చరణ్ ఆయా విషయాలపై సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.

ఈ విషయాన్నే చెప్తూ నిర్మాత దిల్ రాజు తెలుగు సినీ స్టార్ హీరోలను పొగడ్తలతో ముంచెత్తారు. మన హీరోలు బంగారం లాంటి వారని, సరైన విధంగా సమస్యలేంటో వివరిస్తే వారు ఖచ్చితంగా వింటారని ఆయన అన్నారు.

Thank You, The Movie Team Made a Smart Decision with Ticket Pricing

0

Thank You movie has made a smart decision regarding the pricing. Agree or not, the surge in ticket prices has been one of the most affecting factors of movie failure at the box office. These movie collections are affecting both big hero and small hero films.

However, the big heroes have some traction and craze among the audience that pulls them into theatre but it is not same with small heroes. Movies are coming to OTT platforms within first four weeks till now and this has prevented people from going to theaters completely.

People are now in an opinion to stay back at home and watch the movie. In these uncertain times, releasing the movie with less ticket price is a great idea. Thank You, the movie is going to hit theaters on 21st July and the ticket pricing in Nizam is commendable.

Thank You, The Movie Nizam Ticket Rates :

Single Screens : 100/-

Multiplex : 150/-

(Excluding GST)

AP as usual upto ₹147.5 & ₹177!

This ticket pricing is indeed the best as people will show interest in watching the movie without burning a hole in their pocket.

High Court Final Statement about the Case on Surya’s Jai Bhim

0

Surya’s Jai Bhim is one of the thought-provoking movies that were released last year. The movie discusses about various things like caste based discrimination and touches other important points. This court drama story inspired Surya so much that he produced the movie apart from just being a part of it along with his wife Jyothika.

The movie was released on Amazon Prime directly and received a lot of accolades.

However, Vanniyar Community group called as Rudra Vanniyar Sena has raised an issue about Surya’s Jai Bhim and filed a case against the team. They think that their community has been shown in the bad light in entire movie.

They took this to the court. The group filed a compliant against the team in Chidambaram district. The case was then forwarded to High court in Chennai. The high court has went over the arguments and finally decided to let the team go off. As the movie is all about fictional characters, there is no point in holding the team against it.

Creative Difference Between Another Director and Hero

0

DJ Tillu was nothing less than a sensation this year. The movie came out with very few expectations but created amazing records. Hero Sidhu got a lot of fame and has been talk of the town since this movie release. His mannerisms, dialogues have been imbibed on the audience mind and even now we can see so many imitating those dialogues. DJ Tillu team wanted to make the most out of this hype and are all set to the sequel DJ Tillu2. The pooja ceremony for the same was completed recently. However, it looks like there is some creative difference between Sidhu and director Vimal Krishna. According to the rumours, Vimal Krishna has walked away from the movie.

Creative differences between a hero and the director has become a common phenomena in the industry. As of now there is no director for the movie yet. We have to see who will be directing the movie from now.

DJ Tillu is being produced by Sitara Entertainments. As of now except for Sidhu, there is no clarity on the other actors whom we will be seeing in the movie. Even the crew information isn’t revealed yet.

Vaashi (మలయాళం) రివ్యూ: అభినందించదగ్గ ప్రయత్నం

0

చిత్రం : వాశి (Vaashi)

నటీనటులు: టోవినో ధామస్, కీర్తీ సురేష్, కొట్టాయం రమేష్, మాయా విశ్వనాథ్, రోని డేవిడ్, బైజు తదితరులు.

స్క్రీన్ ప్లే – దర్శకత్వం: విష్ణు జీ రాఘవ్

కథ: జానిజ్ చాకో సైమన్

కెమెరా: రాబీ వర్ఘీస్ రాజ్

సంగీతం: కైలాస్ మీనన్

నిర్మాణం : జీ సురేష్ కుమార్

రేటింగ్ : 3/5

కథ: ఎబిన్ (టోవినో ధామస్) మాధవి (కీర్తీ సురేష్) లాయర్లుగా ప్రాక్టీస్ చేసిన స్నేహితులు. ఒకరంటే ఒకరికి ఇష్టమున్నా పైకి టామ్ అండ్ జెర్రీ లా పొట్లాడుతూ ఉంటారు. అయితే వారి మధ్య ఉన్న ప్రేమను ఒకరికి ఒకరు తెలుపుకుని పెళ్లికి సిద్ధం అయ్యే సమయంలో వారిద్దరూ కోర్టులో ఓకే కేసులో ప్రతివాదులుగా తలపడాల్సి వస్తుంది. మరి ఆ కేసులో ఎవరు గెలిచారు? అసలు ఆ కేస్ వల్ల వారి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి అనేది అసలు కథ.

విశ్లేషణ: కథలో రెండు ప్రధాన పాత్రల మధ్య చక్కని సంఘర్షణ ఉంది. దాన్ని తెర మీద సరైన విధంగా తెరకెక్కించడంలో దర్శకుడు విష్ణు జీ రాఘవ్ సఫలం అయ్యారు అనే చెప్పాలి. ప్రధాన సమస్యలోకి వెళ్ళే ముందు హీరో హీరోయిన్ల మధ్య ఉన్న భందాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు పెద్దగా సమయం తీసుకోలేదు. అలాగే కోర్టు రూం డ్రామా అంటే సాధారణంగా వాద ప్రతివాదనలు అంటే ఉద్వేగభరితమైన డైలాగుల నేపథ్యంలో ఉంటాయి.

కానీ వాశి సినిమాలో దర్శకుడు ఆ చాయలకు పోకుండా సున్నితమైన పొరలా భావోద్వేగాలను పండించారు. ప్రస్తుతం సమాజంలో ఉన్న యువతి యువకులు ప్రేమ,, సెక్స్ పట్ల ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు. పరిస్థితులు తమ చేయి దాటిపోయినప్పుడు వారు కోపంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, ప్రవర్తించిన తీరు వల్ల ఎలాంటి సమస్యలు దారి తీస్తాయి అనే అంశాలను చక్కగా చూపించారు.

లైంగిక వేదింపులు ఆరోపింబబడ్డ యువకుడి తరపున హీరోయిన్.. భాదింపబడ్డ యువతి తరపున హీరో నిలబడటం వల్ల వారు వాదిస్తున్న కేసుని, సినిమాని కూడా ఒక ఆసక్తికర కోణంలో చూసే అవకాశాన్ని దర్శకుడు కల్పించారు. మొదట్లో కేసు విషయంలో వృత్తిపరంగానే తలపడే హీరో హీరోయిన్లు.. క్రమంగా కేసు గెలవడం అనే విషయాన్ని ఈగో సమస్యగా మార్చేసుకుంటారు. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం వహించే తాపత్రయంలో ఒకరికి ఒకరు దూరం అయిపోయే ప్రమాదంలో పడటాన్ని దర్శకుడు ఎక్కడా ఒక పాత్ర వైపు పక్షపాతం వహించకుండా చూపించారు.

అలాగే ఆ కేసులో ఉన్న యువతీ యువకుల పాత్రల మధ్య ఉన్న సంఘర్షణను కూడా బాగా చూపించారు.

వాశి సినిమా కథ, కథనం చూస్తే గతంలో హిందీలో వచ్చిన “సెక్షన్ 375” సినిమా గురుకు వస్తుంది. అయితే అందులో ఉన్నంత భావోద్వేగాలు ఇక్కడ లేకపోయినా ముందుగానే చెప్పుకున్నట్టు దర్శకుడు పాత్రల ఉద్దేశాలను, పాత్ర చిత్రణలను సున్నితంగా స్పృశిస్తునే అప్పుడప్పుడూ బలమైన సంభాషణలు, సన్నివేశాలు పొందుపరిచారు.

నటీనటుల విషయానికి వస్తే టోవినో ధామస్ ఎబిన్ పాత్రలో చక్కగా నటించారు. అలాగే కీర్తి సురేష్ తనదైన నటనతో బలమైన ముద్ర వేశారనే చెప్పాలి. వారికి స్నేహితుడుగా, సరైన సమయంలో దిశానిర్దేశం చేస్ పాత్రలో బైజు ఆకట్టుకుంటారు. ఇక ఈ చిత్రంలో మరో ప్రధాన జంటగా కనిపించిన అను మోహన్, అనఘా నారాయణన్ తమ ఉనికిని చాటుకోగా.. జడ్జి పాత్రలో కొట్టాయం రమేష్ హుందాగా కనిపించారు.

సాంకేతిక వర్గం విషయానికి వస్తే.. కెమెరా వర్క్ సినిమా మూడ్ కు తగ్గట్టుగా ఉండి సన్నివేశాల్లో ఇమిడిపోయింది. అలాగే సంగీతంలో పాటలు పరవాలేదు అనిపించగా, నేపథ్య సంగీతం బాగుంది.

మొత్తంగా అభినందించదగ్గ ప్రయత్నమైన “వాశి” చిత్రానికి బలమైన కథ, పాత్రల చిత్రణ మరియు కోర్టు సన్నివేశాలు బలంగా నిలవగా.. అక్కడక్కడా కథనంలో వేగం లోపించడం, కోర్టు కేసుకు సరైన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వంటివి బలహీనతలుగా చెప్పుకోవచ్చు.