Home Blog Page 2071

డీజే టిల్లు దర్శకుడితో నాగ చైతన్య సినిమా?

0

2022లో విడుదలై విజయం సాధించిన సినిమాల్లో ‘డీజే టిల్లు’ సినిమా ఒకటి. చిన్న సినిమాగా వచ్చి సూపర్ ఎంటర్టైనర్ గా నిలిచింది. టైటిల్ రోల్ లో సిద్ధు జొన్నలగడ్డ అద్భుతంగా నటించి తనదైన ఎనర్జీతో ఆకట్టుకున్నారు. డీజే టిల్లు చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అంతే కాకుండా నిర్మాతలకు రెండింతల లాభాలు తీసుకొచ్చింది. ఈ సినిమాతో యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డకి మంచి బ్రేక్ వచ్చింది. తెరపై సిద్ధూ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటే ఆ పనితనాన్ని రాబట్టుకుని తన దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారు విమల్ కృష్ణ.

‘డీజే టిల్లు’ సినిమాకు దర్శకత్వ బాధ్యతతో పాటు రచయితగా కూడా పని చేశారు విమల్ కృష్ణ. ఈ సినిమాతో తన ప్రతిభను నిరూపించుకున్న విమల్ కృష్ణకి డీజే టిల్లు విజయం తరువాత హీరోలు, నిర్మాతల నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది. ఈ యువ దర్శకుడిని పిలిపించుకొని మరీ కథను వింటున్నారట హీరోలు, నిర్మాతలు.

ఇటీవల విమల్ కృష్ణ నాగచైతన్యను కలిసి కథ వినిపించారని తెలిసింది. విమల్ చెప్పిన కథ చైతన్యకి బాగా నచ్చిందట.ప్రస్తుతం చైతన్య – విమల్ కృష్ణల మధ్య కథా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఒక్కసారి కథ ఓకే అయిపోతే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని చూస్తున్నారట. కానీ ప్రస్తుతం నాగ చైతన్య షెడ్యూల్ చాలా బిజీగా ఉంది.

‘థాంక్యూ’ సినిమా విడుదలైన తరువాత పరశురామ్ పెట్లతో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అలానే బొమ్మరిల్లు భాస్కర్ తో కూడా ఒక సినిమా ఉంటుందని సమాచారం. వీటితో పాటు మరో రెండు, మూడు కథలను కూడా చైతన్య ఎంపిక చేశారట. వీటన్నింటి మధ్య విమల్ కృష్ణతో సినిమా ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.

థాంక్యూ లాంటి డిజాస్టర్ తరువాత మళ్ళీ గట్టి హిట్ కొట్టాలని నాగ చైతన్య బలమైన సంకల్పంతో ఉన్నారు. వరుస విజయాలతో ఉన్న సమయంలో థాంక్యూ చిత్రం నాగ చైతన్యను తీవ్రంగా నిరాశ పరిచింది. మరి చక్కని కథలతో మరియు పాత్రలతో తిరిగి ప్రేక్షకులని ఆకట్టుకుని నాగ చైతన్య తిరిగి విజయాలు సాధిస్తారని ఆశిద్దాం.

Sita Ramam Storms Past Half Million Dollar Mark In USA

0

Sita Ramam was released in theatres on August 5th and has opened to positive reviews and a decent opening weekend in terms of box office. The film had a decent opening day followed by a jump in collections on Saturday and Sunday. The film is doing pretty well regionally but even the overseas box office has been promising.

Sita Ramam is having an excellent run in the USA. It has already stormed past the $500K mark on the first Sunday alone. It is also performing better than the other Tollywood release which is also tasting box office success currently. Sita Ramam has outperformed Bimbisara in the USA.

Sita Ramam is also the first film to cross the $500K mark from Tollywood after Ante Sundaraniki. There have been no films that come even a little close to touching the $500K mark since Ante Sundaraniki’s release.

With the positive word of mouth only increasing with each passing day, the box office numbers are sure to increase. However the performance of the film may be affected due to the parallel release of Bimbisara as well.

Sita Ramam stars Dulquer Salmaan, Mrunal Thakur, Rashmika Mandanna and Tharun Bhascker among others. Hanu Raghavapudi is the director of the movie and Vyjayanthi movies have produced the project. Vishal Chandrashekar is the music director of the movie.

OTT : డార్లింగ్స్ రివ్యూ

0

నటీనటులు: ఆలియా భట్, షెఫాలీ షా, విజయ్ వర్మ, రోషన్ మ్యాథ్యూ తదితరులు

రచన, దర్శకత్వం: జస్మిత్ కే రీన్

డైలాగ్స్: విజయ్ మౌర్య, పర్వీజ్ షేక్, జస్మిత్ రీన్

నిర్మాతలు: గౌరీ ఖాన్, ఆలియా భట్, గౌరవ్ వర్మ

సినిమాటోగ్రఫి: అనిల్ మెహతా

ఎడిటింగ్: నితిన్ బేద్

సంగీతం: ప్రశాంత్ పిళ్లై, విశాల్ భరద్వాజ్

బ్యానర్: రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్

ఓటిటి ప్లాట్ ఫామ్: నెట్‌ఫ్లిక్స్

రేటింగ్: 3/5

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తాజాగా నటించిన సినిమా “డార్లింగ్స్”. నెట్ ఫ్లిక్స్ లో.డైరెక్ట్ గా విడుదలైన ఈ సినిమా వీక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం.

ఈ సినిమా ద్వారా అలియా భట్ మగ వాళ్ళ మీద జరిగే హింసను ప్రోత్సహిస్తుంది అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెగటివ్ పబ్లిసిటీ చేశారు.అయితే సినిమాలో చూపించే హింసకు ఒక బలమైన కారణం మరియు నేపథ్యంతో పాటు చిత్ర బృందం ఉద్దేశ్యం మంచిదైతే.. అందులో ఏమాత్రం తప్పు లేదు.

ఇక ‘డార్లింగ్స్’ కథ విషయానికి వస్తే…. బద్రున్నిసా (అలియాభట్), హమ్జా అబ్దుల్ షేక్ (విజయ్ వర్మ) ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. హమ్జా రైల్వే టీసీగా పనిచేస్తుంటాడు. పెళ్ళైన మూడేళ్ళకే అతను మద్యానికి బానిస అవుతాడు. రాత్రి అయితే చాలు తాగి, భార్య బద్రును కొట్టి హింసిస్తూ.. తెల్లవారగానే మత్తు దిగిపోయి మంచి వాడిలా ఆమెను బ్రతిమలాడుతాడు. బద్రు తల్లి షంషున్నీసా (షఫాలీ షా) కూడా తాను ఉండే పాత అపార్ట్ మెంట్ లో ఉంటుంది. ఇటు తల్లి, అటు కూతురు ఎదురుబొదురు ఫ్లాట్స్ లో నివసిస్తుంటారు. కళ్ళముందే కూతురును అల్లుడు కొడుతుంటే షంషూ భరించలేకపోతుంది. భర్తకు విడాకులిచ్చేసి, తన దగ్గరకు వచ్చేయమని కూతురుకు చెప్తూ ఉంటుంది. కానీ భర్త మీద ప్రేమతో బద్రు ఆ పని చేయలేకపోతుంది. అయితే ఎంతో సహనం మరియు భర్త పై ప్రేమ ఉన్న బద్రు.. ఓ దారుణమైన సంఘటనతో మనసు విరిగి భర్తకు బుద్ధి చెప్పాలనే నిర్ణయం తీసుకుంటుంది. అందుకు తల్లి సాయం కూడా తీసుకుంటుంది. దాంతో పాటు వాళ్ళిద్దరికీ స్నేహితుడైన జుల్ఫీ (రోషన్ మాథ్యూ) వీళ్ళకు ఏ విధంగా సహాయపడ్డాడు? భార్యలో వచ్చిన మార్పుని చూసైనా హమ్జా మారాడా? లేదా? అనేది మిగతా కథ.

భార్యా భర్తలు అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకుని మెలగాలి, అంతే కానీ భర్త అన్న హక్కు అహంకారంతో హద్దు మీరి హింసిస్తే.. అందుకు పర్యావసానం చాలా దారుణంగా ఉంటుందని దర్శకురాలు జస్మిత్ కె రీన్ ‘డార్లింగ్స్ ‘ ద్వారా చెప్పాలనుకున్నారు. గతంలో ఈ తరహా కథతో వచ్చిన సినిమాల్లో సాధారణంగా అయితే మహిళా పాత్రల తాలూకు తిరుగుబాటును ముగింపు సన్నివేశంలో చూపించడం రివాజుగా వచ్చింది. అయితే ఈ బ్లాక్ కామెడీ డ్రామాలో మధ్యలో నుండే భర్త మీద భార్య పగ తీర్చుకోవడమనే అంశాన్ని చూపించారు.

మద్యానికి బానిసైన వ్యక్తి తేలు వంటి వాడని, అలాంటి మనిషిలో మార్పు అంత త్వరగా రాదని బద్రు తల్లి ఆమెతో ఎప్పుడు చెబుతూ.. అందుకు ఉదాహరణగా ఓ కథ కూడా చెబుతుంది. అయితే తల్లి మాటను వింటూనే, బద్రు తన నైజాన్ని వదులుకోకుండా మనిషిగా ప్రవర్తించే క్లయిమాక్స్ లో ఆమె పాత్రలోని గొప్పతనం ప్రేక్షకుల చేత సెల్యూట్ కొట్టిస్తుంది. అలానే… హమ్జా చేసిన దారుణానికి, తప్పు ఒప్పుకుని మనిషిగా మారలేని అతని కుంచిత మనస్తత్వానికి తగిన ముగింపు ఇచ్చి దర్శకురాలు ఆకట్టుకుంటారు.

డార్లింగ్స్’ సినిమాలో మొత్తం నాలుగు పాత్రలు. అందులో ప్రధానమైన బద్రు పాత్రలో నటించిన అలియా భట్ ఒక మధ్య తరగతి ముస్లిం మహిళ పాత్రలో చక్కగా నటించారు. భర్త మీద ఉన్న ప్రేమతో, అతను ఎప్పటికైనా మారతాడు అనే ఆశతో అతని బలహీనతలను సైతం ఓర్పుగా భరించే మహిళ తిరగబడితే ఎలా ఉంటుందో అద్భుతంగా చూపించి మెప్పించారు. ఆమె తల్లిగా ‘సత్య’ ఫేమ్ షఫాలీ షా తనదైన శైలిలో నటించడమే కాక అందరిలోనూ తన ప్రత్యేకంగా నిలిచారు. ఒక రకంగా చెప్పాలంటే అలియా భట్ పాత్ర కన్న ఈమె పాత్రలోనే భిన్న పార్శ్వాలు ఉండటం విశేషం.

ఇక తెలుగు వాడైన విజయ్ వర్మ బాలీవుడ్ లో తనదైన నటన, పాత్రలతో అటు సినిమాల్లోనూ, ఇటు వెబ్ సీరిస్ ల లోనూ రాణిస్తున్నారు. గతంలో ఆయన తెలుగులో నాని ‘ఎంసీఎ’ సినిమాలో విలన్ పాత్రను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హమ్జా పాత్రకు ప్రాణం పోశారు. కొన్ని సన్నివేశాల్లో ఆయనని చంపెంత కోపం వచ్చేలా ఆ పాత్రలో క్రూరత్వాన్ని పండించారు. తల్లీకూతుళ్ళకు అండగా నిలిచే జుల్ఫీ పాత్రలో రోషన్ మాథ్యు ఆకట్టుకుంటారు.ఇతర ప్రధాన పాత్రలలో కిరణ్ కర్మార్కర్, విజయ్ మౌర్య, రాజేశ్‌ శర్మ, సంతోష్‌ జువేకర్ తదితరులు పరవాలేదు.

ప్రశాంత్ పిళ్ళై నేపథ్య సంగీతం బాగుంది. సినిమాలో మూడు పాటలు ఉండగా అవి సాధారణ స్థాయిలో ఉన్నాయి. అనీల్ మెహతా కెమెరా పనితనం కూడా బాగుంది. విజయ్ మౌర్య, పర్వేజ్ షేక్, జస్మిత్ కె రీన్ రాసిన సంభాషణలు సినిమా మూడ్ కు తగ్గట్టుగా ఉన్నాయి.

రెండు గంటల పద్నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో మధ్య దశలో చాలా సన్నివేశాలు రిపీట్ అవడం వల్ల బోర్ కొట్టిన మాట వాస్తవం. అలానే ఆ సమయంలో కథనం కూడా సాదాసీదాగా సాగడంతో ఒక దశలో సినిమా ఎటు వెళుతుందో అర్థం కాదు. అయితే బద్రు పాత్రలో చలనం వచ్చిన తరువాత ‘డార్లింగ్స్’ సినిమా ఊపు అందుకుంటుంది.

గృహహింస వంటి సమాజంలో ఉన్న ఒక తీవ్రమైన సమస్యను దర్శకురాలు ప్రధాన కథా వస్తువుగా తెరకెక్కించడం నిజంగా అభినందించదగ్గ విషయం.

150 special shows for Pokiri, A new milestone for Tollywood

0

Superstar Mahesh Babu’s birthday on 9th August is going to be a special one not just for fans but the entire industry and all the movie lovers. To mark this occasion, as many as 150 special shows of the iconic film Pokiri will be screened across Telugu states. Here’s a breakdown of shows planned so far:

AP: 60
Telangana: 42
Other cities & Overseas: 33 with more to be added

Needless to say, the craze for Pokiri is outstanding and the movie screenings got filled up just in minutes. This will be a new benchmark for Tollywood in terms of special shows on birthdays and is indeed a trendsetting event. Recently Okkadu special shows were also organized which were a massive success as well.

Meanwhile, Superstar Mahesh Babu is gearing up for the release of his next project SSMB 28. The film will go on sets next month and the unit is looking to release this film on 6th January 2023. SS Thaman will compose the music for this massive project.

As per reports, Mahesh will play the role of a politician in this much-awaited project. This will be the second time Superstar will be seen in a political role after Bharat Ane Nenu. Pooja Hegde will be paired opposite Mahesh in this project which will mark his third collaboration with Trivikram after Athadu and Khaleja.

కార్తికేయ – 2 ట్రైలర్: చరిత్రకి ఇతిహాసానికీ మధ్య యుద్ధం

0

చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో యువ హీరో నిఖిల్ హీరోగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ట్రైలర్1 కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్ర నిర్మాణ బాధ్యతను పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణ త్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ ఆసక్తికరమైన డైలాగ్స్ తో సాగిన ట్రెయిలర్ 1 ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను ఆగస్ట్ 6న విడుదల చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. మరి ఈరోజు విడుదలైన ఈ ట్రైలర్ ఎలా ఉందంటే ..

“అయిదు సహస్రాల ముందు పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం.. పరిష్కారం లిఖితం అంటూ ఆసక్తికరంగా మొదలైన ట్రైలర్ అబ్బురపరిచే విజువల్స్ మరియు కట్టిపడేసే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకుంది. “నా వరకు వచ్చేవరకే అది సమస్య.. నా వరకు వచ్చాక అది సమాధానం” అంటూ హీరో నిఖిల్ ఈసారి కృష్ణ భగవానుడి గురించి ఏదో రహస్యాన్ని చేధించే పనిలో పడ్డట్టు స్పష్టంగా అర్ధం అవుతుంది. ఈ ట్రైలర్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో పాటు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, మరియు మలయాళ తెలుగు నటుడు ఆదిత్య మీనన్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు.

కార్తికేయ2 చిత్రం విడుదల తేదీ విషయంలో పలు మార్లు మార్పు జరిగిన విషయం తెలిసిందే. మొదట జూలై 22న విడుదల కావాల్సిన సినిమా ఆగస్ట్ 5న విడుదల అవుతుందని పుకార్లు వినిపించాయి. అయితే మళ్ళీ అధికారికంగా ఆగస్ట్ 12న విడుదల అవుతుందని చిత్ర బృందం ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో మళ్ళీ కాస్త అపశృతి దొర్లినట్లుగా ఆగస్ట్ 13కు మార్చబడింది.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌ రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 12న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. కార్తికేయ సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకులు ఈ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఈ సీక్వల్ అంచనాలు అందుకుంటోందో లేదో.

దిల్ రాజును నిందిస్తున్న ఇతర నిర్మాతలు

0

కరోనా పాండమిక్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఏ విధంగా మార్పులు వచ్చాయో.. ప్రేక్షకుల అభిరుచి మరియు ఆలోచనా విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. కరోనా సమయంలో ఓటీటీలకు అలవాటు పడిపోవటం వల్ల ఇప్పుడు చాలా జాగర్తగా ఎంచుకుని అసక్తి కలిగించిన సినిమాలనే థియేటర్లలో వచ్చి చూస్తున్నారు.

ప్రచారం సమయంలో సినిమాలో ఏదో ఆసక్తికరమైన విషయం ఉంది అన్న భావన ప్రేక్షకులకు కలిగించక పోతే వాళ్ళు ఏమాత్రం అసక్తి చూపటం లేదు. చక్కని ప్రచార కార్యక్రమాలకు తోడు మంచి మంచి ఆడియో కూడా ఉండి ఈ సినిమా తప్పకుండా చూడాలి అనిపించేలా ఉంటే తప్ప ప్రేక్షకులు థియేటర్ల వైపు కదలట్లేదు. అయితే అంతగా ప్రచారం చేసినా సినిమాలో విషయం లేకపోతే మాత్రం మొదటి ఆట నుంచే ప్రేక్షకులు నిరభ్యంతరంగా తిరస్కరిస్తున్నారు.

అయితే సినిమాలు చూడాలనే విషయంలో ప్రేక్షకులకి ఇన్న క్లారిటీ ఇండస్ట్రీ వర్గాలకు మాత్రం ఉండట్లేదు అనే చెప్పాలి. గత కొన్ని నెలలుగా తెలుగు సినిమా పరిశ్రమకు ఒక్క విజయం కూడా దక్కలేదు, అయితే అందుకు కారణం సినిమాల్లో తగ్గుతున్న ప్రమాణాలు అనే విషయం గుర్తించకుండా దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత రకరకాల అర్థం లేని నిర్ణయాలు లేదా ఆలోచనలు చేశారు.సినిమా బడ్జెట్ లు తగ్గించాలని.. నటీనటుల పారితోషికాలు తగ్గించడం మొదలు పెట్టాలని, ఓటిటి గడువు పెంచాలని ఇలా అన్ని రకాల నిర్ణయాలకి నిర్మాత దిల్ రాజు ముందుండి నడిపించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయంలో ఇతర నిర్మాతలు ఆయనతో ఏకిభావించలేదు. ఈ వారం విడుదలైన రెండు చిత్రాల ఫలితాలతో వారి వాదనకు బలం చేకూరింది.

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ చిత్రం అన్ని ఏరియాల్లో విశేష స్పందన తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా మాస్ ప్రేక్షకులని ఈ చిత్రం బాగా ఆకర్షిస్తోంది. విడుదలకు ముందు ఆన్లైన్ బుకింగ్స్ పర్వాలేదననే స్థాయిలో ఉన్నా.. మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో ధియేటర్ల వద్ద ప్రేక్షకుల రద్దీ పెరిగింది. అసలు ఎన్నో రోజులకు ఒక సినిమాకు చాలా ధియేటర్లలో హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించటం అందరినీ ఎంతో ఆనందానికి గురి చేసింది. విడుదల అయిన మూడు రోజులకే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసే దిశలో దూసుకుపోతుంది.

మరో వైపు వైజయంతీ మూవీస్ బ్యానర్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘సీతా రామం’ సినిమా కూడా పాజిటివ్ టాక్ తో మొదలయింది. ఎ సెంటర్స్ మరియు మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా చక్కని ఆదరణకు నోచుకోని ప్రతి షోకు కలెక్షన్లలో ఎదుగుదలను చూపిస్తుంది. యూత్ మరియు.ఫ్యామిలీ వర్గం ప్రేక్షకులు ఈ సినిమా పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

‘బింబిసార’ మరియు ‘సీతా రామం’ చిత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ఏలోనూ మంచి వసూళ్ళు రాబడుతుండటం పట్ల ట్రేడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.. ఇది ఖచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో ఊరటనిచ్చే విషయంగా చెప్పుకోవాలి.

ఈ క్రమంలో ఇతర నిర్మాతలు మరియు ట్రేడ్ వర్గాలు ఈ రెండు చిత్రాల ఫలితాన్ని, ప్రదర్శనను ఉదాహరణగా చూపించి ఇతర నిర్మాతలు దిల్ రాజును తప్పు పడుతున్నారు. మంచి కంటెంట్ తో పాటు ఆసక్తికరమైన కథలతో సరైన విధంగా ప్రచారం చేస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని వారు అంటున్నారు. మూస కథలను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఏమాత్రం సిద్ధంగా లేరని.. నిర్మాతలు మరియు దర్శకులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తే పరిశ్రమకు అన్ని రోజులూ మంచి రోజులే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

బింబిసార చిత్రాన్ని మెచ్చిన అల్లు అర్జున్

0

బింబిసార విజయం తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో ఆనందాన్ని మరియు ఉత్సాహాన్ని నింపింది. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో ప్రశంసించారు. ఇటివలే మెగాస్టార్ చిరంజీవి బింబిసార మరియు సీతా రామం చిత్రాలను పొగుడుతూ ట్వీట్ చేశారు.

ఆయన తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా బింబిసార సినిమా విజయం పై కళ్యాణ్ రామ్ మరియు మల్లిడి వశిష్టను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

బింబిసార చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. ఇది ఎంతో ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన ఫాంటసీ చిత్రం అని చెబుతూ.. కళ్యాణ్ రామ్ గారు తన ప్రభావవంతమైన ఉనికిని చాటుకుంటూ ఎప్పుడూ ప్రతిభావంతులైన వారిని పరిశ్రమలోకి తీసుకు వచ్చి కొత్త తరహా సినిమాలను ట్రై చేస్తున్నందుకు ఆయనంటే ఎంతో గౌరవం ఉందని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

అలాగే ఈ చిత్రాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించిన దర్శకుడు వశిష్టను కూడా ఆయన అభినందించారు. దాంతో పాటు సినిమాకు పని చేసిన ఇతర సాంకేతిక నిపుణులకు, ఆర్టిస్టులందరికీ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ఇక ఈ చిత్రానికి నేపథ్య సంగీతంతో వెన్నెముకలా నిలిచిన కీరవాణి గారికి.. హీరోయిన్లు క్యాథరీన్ త్రెసా, సంయుక్త మీనన్ లను కూడా అల్లు అర్జున్ అభినందించారు.

అల్లు అర్జున్ తో పాటు దర్శకులు కె. రాఘవేంద్రరావు, బాబీ కూడా ఈ సినిమాకి తమ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఇక బింబిసార సినిమా.. గత కొంతకాలంగా కష్టాల్లో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమకు చలనం తెస్తూ, అన్ని వయసుల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తొలి రోజు నుంచీ ఈ చిత్రం అన్ని సెంటర్లలో నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు వసూళ్లు సాధించింది. ఇప్పటికే చాలా ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్ సాధించి లాభాల్లోకి దూసుకుపోతోంది.

ఈ వసూళ్లతో చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజుతో దాదాపు బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసిన బింబిసార.. మరి తన దూకుడును ఎంత కాలం కొనసాగించి పంపిణీదారుల పెట్టుబడికి ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి.

ఘన విజయం దిశగా అడుగులు వేస్తున్న సీతారామం

0

దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా నటించగా . హను రాఘవపూడి దర్శకత్వంలో స్వప్న సినిమా పతాకం పై నిర్మించిన “సీతా రామం” చిత్రం ఘన విజయం దిశగా పయనిస్తుంది.

ఒక క్లాసికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన సీతారామం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తొలిరోజు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన లభించింది. ఆ మౌత్ టాక్ ప్రభావం రెండో రోజు నుంచి అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది.

కాగా ఈ చిత్రం శనివారం దాదాపు అన్ని ఏరియాల్లో హౌస్‌ఫుల్‌ బోర్డులు నమోదు చేయగా, చాలా ఏరియాల్లో అదనపు థియేటర్లు జోడించబడ్డాయి. మల్టీప్లెక్స్‌లు, ఎ సెంటర్లతో పాటు శనివారం బి, సి సెంటర్లలో కూడా ఈ సినిమా చాలా మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఈరోజు ఆదివారం, ఈ చిత్రానికి కలెక్షన్ల పరంగా అత్యధిక వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా.

ఇక US బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ప్రీమియర్స్ + డే 1 కంటే రెండవ రోజు ఎక్కువ వసూలు చేయడం మరో విశేషం. ఇప్పటికే $400K మార్కును చేరుకున్న సీతారామం ఈ రోజుతో హాఫ్ మిలియన్ డాలర్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరనుంది.

యధార్థ సంఘటనల ఆధారంగా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందించిన ఈ సినిమాని ప్రేక్షకులు మరియు విమర్శకులు ఎంతో ఇష్ట పడుతున్నారు. యుద్ధం రాసిన ప్రేమకథ అంటూ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాలో భావోద్వేగాలకు ప్రేక్షకులు ఎంతగానో ప్రభావితం అయ్యారు.

హీరో హీరోయిన్లు దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ లు వారి పాత్రల్లో ఎంతో చక్కగా నటించడమే కాకుండా వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా పండించారు. ఇక దర్శకుడు హను రాఘవపూడి తనదైన పాత్ర చిత్రణలతో, ఫీల్ తో ఈ చిత్రాన్ని ఒక దృశ్య కావ్యంగా మలిచారు. కాగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం చిత్రానికి ప్రాణంగా నిలిచింది. పి.ఎస్.వినోద్ అద్భుతమైన విజువల్స్ ఎంతో ఆహ్లాదకరంగా ఉండి ఆకట్టుకున్నాయి.

ఇక నిర్మాణ విలువల పరంగా స్వప్న సినిమా – వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇలా అన్ని రకాల వనరులు ఈ సినిమాను ఒక అందమైన అనుభూతిని కలిగించే విధంగా నడిపించాయి.

అటు అద్భుతమైన రివ్యూలతో పాటు ఇటు కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్ వైపు పరుగులు తీస్తుంది.ఇటీవల మంచి ప్రచారంతో వచ్చిన పక్కా కమర్షియల్, థాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ వంటి చిత్రాల కంటే సీతా రామం కలెక్షన్లు ఎక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్య పరిచింది. తెలుగు హీరో కాకుండా ఒక మలయాళ హీరో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడం ఎంతో అభినందనీయం.

Prabhas’ Salaar Makers In Talks To Change Release Plans

0

Prabhas’ Salaar has been generating a lot of hype ever since the first announcement of the film. There are plenty of reasons to be excited about this project but the most exciting aspect is the combination of Prabhas and director Prashant Neel.

After the monstrous success of KGF 2, there have been a lot of theories floating around about the involvement of Salaar in the KGF universe. This has only further the expectations of film fans as seeing Prabhas and Yash in the same frame will surely be a treat for sore eyes.

All of this hype will have to wait as there is still some time left till Salaar hits the theatres. In fact, it has been pushed further later than before. A couple of months ago producer Vijay Kirangadur announced that Salaar will release during the Summer of 2023. But now, there seems to be a change in plans.

The makers are planning on releasing the film for Dasara 2023. There still seems to be quite some time left for the shooting process. Prabhas is also busy with the shooting of Project K. But one can be sure that it will definitely be worth the wait.

Salaar also stars Shruthi Haasan, Jagapathi Babu and Prithviraj Sukumaran in important roles. Bhuvan Gowda who is the cinematographer of KGF 1 and 2, will also be shooting Salaar. Ravi Basrur will also work with Prashant once again after the KGF franchise.

The Costliest Mistake Of Kalyan Ram Makes Him Lose Crores

0

Kalyan Ram’s magnum opus Bimbisara was released in theatres on August 5th and has opened to extraordinary numbers at the box office. The talk has been mostly positive and this has immensely helped in attracting the Telugu audiences to the big screens.

Bimbisara has been shot on a budget of 40 crores but the theatricals have been sold for a 15 crores ratio. The business has been done on an NRA basis. The film is doing exceptionally well and it is expected to achieve breakeven already with Sunday’s matinee shows.

Bimbisara has been a jackpot for distributors and exhibitors but the main man, Kalyan Ram has committed a blunder. It was very clear from the promotions of the film that Kalyan Ram was confident in Bimbisara. But it is unknown why he sold the film for such a low price. This proved to be a huge mistake on his part.

If he released the movie on his own in all territories, he could have easily recovered 75 % of the budget with theatricals alone. Taking into account the non-theatrical aspect as well, he may end up with handsome profits also. This wrong movie has cost him crores of money.