Home Blog Page 2070

బాలయ్యతో సినిమా చేయబోతున్న బింబిసారుడి దర్శకుడు

0

కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన చిత్రం ‘ బింబిసార’. కేథరిన్‌, సంయుక్తా మేనన్‌ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే అద్భుతమైన స్పందనను మరియు విశేష స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

హీరో గతం నుంచి ప్రస్తుతానికి రావడం.. మరియు కర్మ సిద్ధాంతం పై ఆధారపడి సాగే కథతో వచ్చిన చిత్రం బింబిసార. రావణాసురుడు, కీచకుడు, భకాసురుడు లాంటి రాక్షసులను మించిన రాక్షసుడైన బింబిసారుడు.. చివరికి ఒక మహోన్నత వ్యక్తిగా ఎలా మారాడన్నది ఇందులో కథాంశం. కాగా ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌ రెండు భిన్నమైన పార్శ్వాలు ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు.

500 ఏళ్ల క్రితం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిగర్తల అనే సామ్రాజ్యాన్ని దర్శకుడు సృష్టించిన తీరుకు ప్రేక్షకులు ఎంతగానో ప్రభావితం అయ్యారు. ఆ కాలానికి తగ్గ సెట్స్, గ్రాఫిక్స్‌ తో చక్కని అనుభూతి కలిగించడంలో దర్శకుడు సఫలం అయ్యారు. అయితే ప్రేక్షకులను ఇంతగా ఆకట్టుకున్న దర్శకుడు మల్లిడి వశిష్ట మరో అరుదైన అవకాశం అందుకున్నారు అని సమాచారం.

నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఆసక్తికరమైన కాంబినేషన్లో వస్తున్న సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక నటసింహ నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుంచో ‘ఆదిత్య 369’ కి సీక్వెల్ తీయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సార్లు పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. ఓ సందర్భంలో ” సింగీతం గారు కథ సిద్ధం చేస్తే నేనూ సిద్దంగానే ఉన్నాను” అని బాలయ్య ఓపెన్ గానే చెప్పారు.

బాలకృష్ణ -ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావు కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆదిత్య 369’ 1991 లో విడుదలై తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప సినిమాలలో ఒకటిగా నిలిచింది. అప్పటి కాలానికి ఎంతో ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించి ఆకట్టుకున్నారు దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు.

ఇక బింబిసార చిత్రాన్ని తరువాత సీక్వెల్ గా రెండు మూడు భాగాలుగా తీస్తున్నట్లుగా కళ్యాణ్ రామ్ – దర్శకుడు వశిష్ట ఇది వరకే చెప్పారు. మరి బాలకృష్ణతో చేయబోయే సినిమా బింబిసార యూనివర్స్ లో భాగంగా ఉంటుందా లేక వేరే ప్రత్యేకమైన సినిమాగా తీస్తారా అన్నది వేచి చూడాలి.

హ్యాపీ బర్త్ డే ఓటిటి రిలీజ్ ఈరోజే

0

ఇటివల తెలుగు సినిమాలలో విడుదల అవుతున్న సినిమాలన్నీ థియేటర్ లలో నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కి స్వల్ప సమయంలోనే సిద్ధం అయిపోతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచిన సినిమాలు.. లేదా కాస్త లాంగ్ రన్ వచ్చిన సినిమాలు అయితే ఓటిటిలోకి రావడానికి కొంత ఎక్కువ సమయం తీసుకుంటున్నారు కానీ.. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచి నిరాశపరిచిన సినిమాలు మాత్రం నాలుగు వారాల లోపే ఓటిటి వేదికల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి.

ఈ విధంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు నెల రోజులు లేదా రెండు వారాలకు కూడా ఓటిటిలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇటీవల థియేటర్లో రిలీజ్ అయినటువంటి మరో తెలుగు సినిమా ఓటిటి రిలీజ్ కి సిద్ధమైంది.

హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో ‘మత్తు వదలరా’ ఫేమ్ డైరెక్టర్ రితీష్ రానా తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. ఇటీవల జూలై 8న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక ఫ్లాప్ గా నిలచింది. అయితే సినిమాలో ఉన్న కామెడీని ఒక వర్గం ప్రేక్షకులు మెచ్చుకున్నారు.

ఇక ఈ చిత్రం థియేటర్ లో విడుదలైన నెలకు అంటే.. ఈరోజు ఆగస్ట్ 8న నెట్ ఫ్లిక్స్ వేదికగా హ్యాపీ బర్త్ డే సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.ఈ విషయాన్ని స్వయంగా నెట్ ఫ్లిక్స్ వారే అధికారికంగా ప్రకటించారు.

అయితే కామెడీ ఎంటర్టైనర్ గా మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. హాలీవుడ్ తరహా విభిన్నమైన కామెడీగా వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్ మెంట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక మొత్తానికి నెల రోజులకే ఓటిటిలో రిలీజ్ కాబోతున్న ‘హ్యాపీ బర్త్ డే’ సినిమాలో ఉన్న కంటెంట్ ఓటిటీలో వీక్షకులకి ఆకట్టుకునే అవకాశాలు లేకపోలేదు. మరి ఓటిటి రిలీజ్ లో హ్యపీ బర్త్ డే చిత్రం..దర్శకుడు రితీష్ రాణా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా చూద్దాం.

సీతగా మారలేక పోయిన పూజా హెగ్డే

0

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుత పరిస్తితిలో హీరోయిన్ల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తొలి చిత్రం సీతారామంతో అద్భుతమైన స్పందనను అందుకుంది. ఈ సినిమా విజయంతో ఇప్పుడు మృణాల్ తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది అని చెప్పవచ్చు.

ఒక్కోసారి సినిమా పరిశ్రమలో కేవలం ఒకే ఒక సినిమాతో దశ తిరిగి పోతుంది. స్టార్ స్టేటస్ దక్కాలి అంటే కొన్ని సార్లు ఒక్క సినిమా సరైన విధంగా ప్రభావం చూపితే చాలు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ విషయంలో అదే జరిగింది.

దుల్కర్ సల్మాన్ తో కలిసి ఆమె చేసిన సీతారామం సినిమా అన్ని భాషల్లో కూడా మంచి స్పందనను సొంతం చేసుకుంటుంది. అంతే కాకుండా ఈ సినిమాలో ఆమె దుల్కర్ సల్మాన్ తో సమానంగా నటించింది అని చెప్పవచ్చు. ఆ పాత్రకు తగ్గట్టుగా మృణాల్ ఠాగూర్ నటించి ప్రేక్షకులు మరియు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

హీరో దుల్కర్ కూడా సీత పాత్రకి మృణాల్ తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరు అని కూడా అన్నారు. అయితే ఈ పాత్ర కోసం మొదట కొంతమంది హీరోయిన్లను సంప్రదించారట. కానీ రకరకాల కారణాల వలన ఆ హీరోయిన్లు ఎవరు కూడా ఈ పాత్రలో నటించడం కుదరలేదట. అయితే ఆ లిస్ట్ లో ప్రస్తుత నంబర్ వన్ హీరోయిన్ పూజా హెగ్డే పేరు వినిపిస్తుండటం విశేషం.

సీతా రామం సినిమాలో పూజా హెగ్డేను నటింప జేసెందుకు దర్శక నిర్మాతలు చాలా ప్రయత్నాలు చేశారట. అయితే కరోనా వేవ్ ల నేపథ్యంలో ఇతర సినిమాల షూటింగులు డేట్స్ తో బిజీగా ఉండటంతో పూజ హెగ్డే ఈ పాత్రను చేయలేక పోయారట. డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడం వల్ల ఈ అవకాశాన్ని వదులుకోవల్సి వచ్చిందట.

అయితే సీతారామం సినిమాలో నటించిన మృణాల్ ఠాగూర్ మాత్రం సీత పాత్రకు 100% న్యాయం చేసి తన ప్రతిభను నిరూపించుకుంది.. మరి ఈ క్రమంలోనే చక్కని ఆరంభాన్ని సద్వినియోగం చేసుకుని స్టార్ హీరోలతో కూడా నటించే అవకాశాలు దక్కించుకోవాలి అని కోరుకుందాం.

సాలార్ క్లైమాక్స్ లో ట్విస్ట్?

0

యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా సాలార్. ఈ సినిమా కంటే ముందే ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ అనే సినిమా విడుదల కానుంది. సంక్రాంతికి రాబోయే ఆ సినిమా పై కూడా ప్రేక్షకులలో భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నప్పటికీ.. అందరి దృష్టి అయితే ఎక్కువగా సాలార్ సినిమా పైనే ఉందని చెప్పాలి.

ఎందుకంటే ఆ సినిమాకి దర్శకుడు ప్రశాంత్ నీల్ కావడమే. కేజీఎఫ్ సీరీస్ వంటి మాస్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్న సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్ లాంటి మాస్ హీరోను ఇంకెంత స్థాయిలో చూపిస్తాడో.. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఇంకెంత అద్భుతంగా ఉంటాయో అని వేయి ఆశలతో ఉన్నారు. అయితే ప్రభాస్ నటించిన చివరి రెండు సినిమాలైన సాహో, రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాధే శ్యామ్ సినిమా అయితే భారీ స్థాయిలో డిజాస్టర్ అయింది.

అందువల్ల ప్రభాస్ అభిమానులు తమ ఆశలన్నీ సాలార్ పైనే పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ ఖచ్చితంగా తమ హీరోకి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమా చివర్లో ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్ట్ ఉండబోతుందట. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన కమల్ హాసన్ ‘ విక్రమ్ ‘ తరహాలోనే సాలార్ లో కూడా ముగింపు దశలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో చివరి పది నిమిషాల్లో సూర్య నటించిన రోలెక్స్ పాత్ర ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విక్రమ్ సినిమాకి ఆ పాత్ర మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఆ సన్నివేశం థియేటర్ లో వచ్చినపుడు ప్రేక్షకుల స్పందన అంతా ఇంతా కాదు.

అయితే సాలార్ సినిమాలో కూడా అదే తరహాలో క్లైమాక్స్ లో అందరినీ ఆశ్చర్య పరిచే ట్విస్ట్ ఉంటుందని సమాచారం. ఆ పాత్ర ఒక స్టార్ హీరో చేస్తాడని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇదివరకు సాలార్ సినిమాకి సంబందించిన పుకార్లలో కేజిఎఫ్ నుంచి రాకీ భాయ్ ఆ చిత్రంలో కనిపిస్తారు అని గట్టిగా వినిపించినా.. వాటి పై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.

మరి ఇప్పుడు ఈ పాత్రను యాష్ చేస్తాడో లేక మరో స్టార్ హీరో చేస్తాడో చూడాలి. . ఇక సాలార్ సినిమాని ఇదివరకు 2023 వేసవిలో విడుదల చేద్దామనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నా.. షూటింగ్ అనుకున్నంత త్వరగా అవకపోవడం వంటి కొన్ని కారణాల వలన దసరా కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు అని తెలుస్తోంది. ఈ విషయం పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Box-Office: US లో హాఫ్ మిలియన్ డాలర్ల మార్కు దాటిన సీతారామం

0

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘సీతారామం’. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుని అటు విమర్శకుల ప్రశంసలు, ఇటు బాక్స్ ఆఫీస్ వద్ద చక్కని కలెక్షన్లు రాబడుతోంది.

దుల్కర్ సల్మాన్.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దుల్కర్ ఇది వరకే తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సావిత్రి బయోపిక్‌ మహానటిలో నటించారు. ఈ సినిమాలో ఆయన జెమిని గణేషన్‌ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఇక సీతా రామంతో మరో చక్కని సినిమాను తన ఖాతాలో జమ చేసుకున్నారు.

హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఒక దృశ్య కావ్యంలా మలచబడింది. నటీనటుల ప్రతిభతో పాటు అహ్లాదకరమైన విజువల్స్, వీనుల విందైన సంగీతం తోడై ఈ సినిమాని క్లాసిక్ స్థాయిలో నిలబెట్టాయి.’ యుద్ధంతో రాసిన ప్రేమకథ` అని ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాని వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అగ్ర నిర్మాత నిర్మాత సి. అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలీవుడ్ నటి/మోడల్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం కాగా.. కీలక పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే మంచి టాక్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.

ప్రతి షోకి ప్రతి రోజుకూ కలెక్షన్ల పరంగా ఎదుగుదలను కొనసాగిస్తూ విజయపథంలో దూసుకు పోతున్న ఈ సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. క్లాస్ సినిమాలకు పెద్ద పీట వేసే US బాక్స్ ఆఫీస్ వద్ద హాఫ్ మిలియన్ డాలర్ల ($500k) మార్కును దాటింది. ఈ చిత్రంతో పాటు రిలీజ్ అయిన బింబిసార కంటే యూఎస్ లో అధికంగా వసూళ్లు కొల్లగొట్టింది సీతా రామం. నాని నటించిన అంటే సుందరానికీ.చిత్రం తరువాత ఈ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది.

Box-Office: కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచిన బింబిసార

0

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ఫాంటసీ కమ్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ సినిమా ఎన్నో అంచనాల మధ్య ఈ వారం విడుదల అయి అధ్భుతమైన స్పందనను రబట్టుకుంది.

బాక్సాఫీస్ వద్ద తనదైన ఆధిపత్యాన్ని చూపిస్తూ.. తిరుగులేని రారాజు తరహాలో నిలిచింది. గత కొంత కాలంగా సరైన విజయం లేకుండా తెలుగు సినీ పరిశ్రమ చాలా కష్ట కాలంలో ఉన్న పరిస్థితుల్లో.. బింబిసార అసలు సిసలైన బ్లాక్ బస్టర్ ను అందించింది. అటు క్లాస్ ప్రేక్షకులు ఇటు మాస్ ప్రేక్షకులు, మరియు ఫ్యామిలీ ప్రేక్షకులు అందరూ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఆన్లైన్ టికెటింగ్, భారీ రిలీజ్ ల వల్ల థియేటర్ల వద్ద హౌజ్ ఫుల్ బోర్డులు పెట్టడం పెద్ద సినిమాలకే తొలి రోజు తప్ప పెద్దగా సాధ్య పడట్లేదు. అలాంటిది బింబిసార చిత్రం రెండో రోజు, మూడో రోజు కూడా థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు ఉంచే స్థాయిలో ఆడుతుంది. ఇది కేవలం ఎగ్జిబిటర్లకే కాదు సినీ ప్రేమికులకు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం.

అందరికీ లాభాలు అందించే దిశగా పయనిస్తున్న ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కును దాటి ప్రాఫిట్ జోన్‌ లోకి ఎంటర్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఈ సినిమా వల్ల సంతోషంగా ఉన్నారు. అంతే కాదు… నిర్మాత హరికృష్ణ .కె, హీరోను కలిసి ఒక విందు ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారట.తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ అంటే సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ‘బింబిసార’ 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం విశేషం. ఈ సినిమాకి జరిగిన బిజినెస్ కూడా అంతే. అంటే ఇప్పటికే పెట్టుబడిని తెచ్చేసినట్లు.. ఇకపై వచ్చేవి అన్నీ లాభాలే.

100 శాతం రికవరీ చేసిన బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా చూస్తే… ఇంతకు ముందు ఆయనకు అత్యుత్తమ విజయం అందించిన పటాస్ సినిమాని దాటేసి ఆయన కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. కల్యాణ్ రామ్ బాక్సాఫీస్ వద్ద ఇంత భారీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా పంపిణీదారులు మరియు సినీ ప్రేమికులు, పరిశ్రమ వర్గాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.

Prabhas Fans Scolding Radhakrishna After Watching Sita Ramam

0

During the release of Radhe Shyam, director Radha Krishna made a lot of statements about the film. Before the release, he called Radhe Shyam an epic love story and said that it is a classic that will be remembered for ages.

But after the release, it is very clear that Radhe Shyam was neither an epic nor a classic. It was a very forgettable story in the end. Prabhas fans were furious with the director as they expected a lot from the movie.

Even after the release of the film, Radha Krishna kept praising his own film, calling it an epic love story and that the audiences did not understand the emotions. But as always, content is king and if the content is bad, the film will suffer a terrible fate.

Just a few days ago, Sita Ramam was released in theatres and has obtained immense love from audiences. Everyone that has seen the film are calling it an epic love story and a timeless classic. After watching the film, Prabhas fans are scolding director Radha Krishna for his Radhe Shyam promise.

Some fans took to Twitter to say that Sita Ramam is an example of how to make an epic.

Kalyan Ram’s Bimbisara 3 Days Worldwide Box-office Collections

Kalyan Ram’s Bimbisara which released on last Friday opened up with good reports and excellent numbers at the Box-office. The film has an extraordinary 1st weekend and has recovered the theatrical business. Exhibitors and distributors are in cheers as it’s been long time since a solid success film for them. Theatrical business is around 15Crs and the film has collected a share of 17Crs. Here’s Kalyan Ram’s Bimbisara 3 Days Worldwide Box-office Collections.


Kalyan Ram’s Bimbisara 3 Days Worldwide Box-office Collections

AREA SHARE GROSS
Nizam₹ 5.6 Cr₹ --
Ceded₹ 3.41 Cr₹ --
Uttarandhra₹ 1.95 Cr₹ --
Guntur₹ 1.27 Cr₹ --
East Godavari₹ 1.02 Cr₹ --
West Godavari₹ 0.74 Cr₹ --
Krishna₹ 0.88 Cr₹ --
Nellore₹ 0.49 Cr₹ --
AP/TS₹ 15.36 Cr₹ --
ROW₹ 2.2 Cr₹ --
Worldwide₹ 17.56 Cr₹ --

tracktollywood.com
/TrackTwood   /TrackTollywood   /tracktollywood   /track.tollywood

** Blockbuster

► Download Collection Report


Disclaimer: The box office figures are compiled from various sources. The figures can be approximate and TrackTollywood does not make any claims about the authenticity of the data. However they are adequately indicative of the box-office performance of the film(s).


Bimbisara Director Vasishta In Plans To Direct His Next Film With Balakrishna

0

Director Vasishta is currently on cloud nine with the success of Bimbisara. It is highly impressive for a debutant director to execute such an intricate story on a huge canvas. It has been made on a relatively low budget of 40 crores but that is still a huge number for a debutant.

Bimbisara is being appreciated by all sections of the Telugu Film Industry. Many actors, directors and technicians have come forward to appreciate the project, especially the vision of a young director like Vasishta.

After the mammoth success of Bimbisara, Vasishta is now planning to do another film with the Nandamuri family. This time, he is planning on working with Nandamuri Balakrishna. It is also being reported that Geetha Arts will produce the film. Geetha Arts have always been wanting to produce a film for Balakrishna.

This is the perfect opportunity as Balayya is also in top form at the moment. After the success of Akhanda, he has been truly unstoppable. He is currently shooting for his next film with Gopichand Malineni. After which he will join the shooting of his film with director Anil Ravipudi.

It will take some time for this project to materialize. But a young director can surely utilize Balakrishna in a new way no one has seen before.

Full Length Entertainer Happy Birthday Is Now Streaming On OTT

0

After the unexpected success of Mathu Vadalara, a lot of people were eagerly awaiting the release of director Ritesh Rana’s next film. Mathu Vadalara was a quirky, engaging crime comedy that was thoroughly enjoyed by all types of audiences .

Naturally, when Ritesh Rana announced his next titled Happy Birthday, people expected a laugh riot like his previous film. Even the first look posters, teaser and the trailer were promising but sadly, the film showed no promise whatsover.

Happy Birthday was released in theatres on 8th July and was immediately dismissed. The movie opened to very low numbers and the negative reviews did not help the film either. It crashed on the opening day itself and never recovered from that.

Happy Birthday is finally releasing on the small screens. It is streaming exclusively on Netflix. Happy Birthday stars Lavanya Tripathi, Vennela Kishore, Satya, Naresh Agastya and a bunch of others. Mythri Movies have produced this project. Kala Bhairava is the music director.