Home Blog Page 2109

Dil Raju In Plans To Fulfil His Dream Project With Star Hero

0

Dil Raju is one of if not the most influential producers of the Telugu Film Industry. He has banked some of the most successful as well as commercial projects in Telugu cinema. He has established himself as the go-to producer when it comes to box office success.

Owing to his reputation, he has worked with some of the finest actors in the Telugu Film Industry. He has worked with all the top-tier heroes like Allu Arjun, Jr.NTR, Ram Charan, and Prabhas. He fulfilled his dream of working with Power Star Pawan Kalyan in Vakeel Saab.

Now there is only one star left to complete this illustrious list, the Megastar. Dil Raju is making plans to fulfill his dream project with Megastar Chiranjeevi. He is currently busy with the script works of the film. He is planning to meet Chiranjeevi with 2-3 script lines.

As of now, the producer is busy with the production work of Thalapathy Vijay’s next bilingual movie, Varisu. It is being directed by Vamshi Paidipally.

Mahesh Babu – Trivikram’s film pre-production works begins, release time announced

0

Haarika and Haasine Creations, the makers of Superstar Mahesh Babu and Trivikram’s upcoming film SSMB28 have given a massive update to the eager fans. The film’s shoot will start in August and they are looking to release the film in the Summer of 2023.

Haarika and Haasine Creations made this announcement on Twitter just like the film announcement they made last year.

https://twitter.com/haarikahassine/status/1545643162319785984?s=21&t=8HCDAIzW5zkHOe91DsOeHQ

This will be the third film in Superstar Mahesh Babu and Trivikram’s combination after Athadu and Khaleja. Both these films have a special place in film lovers’ hearts and the fans are expecting something much bigger this time around.

The film was officially launched earlier this year and Pooja Hegde will play the lead role opposite Mahesh Babu. This will be the second film in Mahesh and Pooja combination after Maharshi. Recently Trivikram narrated the full script to Mahesh babu. But as per the sources Mahesh is still not satisfied with the script. So latest info is that Mahesh babu asked Trivikram to make some changes in the script. Now Trivikram is busy with the script changes.

మెగాస్టార్ కోసం దిల్ రాజు గాలం

0

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లకు ఉన్న స్టార్ ఇమేజ్ గురించీ, వారి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కొల్లగొట్టిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి కొత్త దర్శకుడి అభిమాన హీరోల లిస్ట్ లో వాళ్లిద్దరూ ప్రథమ స్థానంలో ఉంటారనేది అతిశయోక్తి కాదు.

ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా పాపులర్ అయిన దిల్ రాజుకే పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టింది. ఎన్నో సంవత్సరాల పాటు వేచి చూసిన ఆయనకు ‘వకీల్ సాబ్’ సినిమాతో నిర్మించే అవకాశం దక్కింది. ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల సమయంలో దిల్ రాజు ఒక అగ్ర నిర్మాతగా కాకుండా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ప్రవర్తించారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి తో పని చేసే అవకాశం మాత్రం ఇంకా దిల్ రాజు కు దక్కలేదు. దాదాపు పదేళ్ల పాటు చిరంజీవి సినిమాలకు దూరంగా ఉండటం ఒక కారణం అయితే, 2017 లో ఖైదీ.నో.150 తో తిరిగి వచ్చిన తరువాత ఆయన ఎక్కువగా సొంత నిర్మాణంలో.. లేదా అనుబంధ సంస్థల తోనే పని చేయడం మరో కారణం.ఇక ఇన్ని రోజులు ఓపికగా ఎదురు చేసిన దిల్ రాజు.. ఎలాగైనా మెగాస్టార్ తో సినిమా తీయాలని ఏకంగా చిరంజీవి కోసం ఆరు కథలు సిద్ధం చేసుకుని పెట్టారట.

ప్రస్తుతానికి చిరంజీవి షెడ్యూల్ బీజీగా ఉంది. 2024 వరకూ ఆయన క్యాలెండర్ ఫుల్ గా ఉన్నా కూడా దిల్ రాజు తన ప్రయత్నాలు మాత్రం గట్టిగా చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఆరు కథల్ని సిద్దం చేయించి వాటిని చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారట. వాటిలో ఏ కథ నచ్చితే ఆ కథతో వెంటనే సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి దిల్ రాజు ఆశని మెగాస్టార్ చిరంజీవి నేరవేరుస్తారా లేరా తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

తగ్గేదెలే అంటున్న రష్మిక మందన్న

0

ఛలో సినిమాతో అందరినీ తన దృష్టికి తిప్పుకున్న హీరోయిన్ రష్మిక మందన్న. అంతకు ముందే కన్నడ చిత్రం కిరిక్ పార్టీ తోనే ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక తెలుగులో తొలి సినిమా విజయం సాధించిన తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ ఇలా వరుస విజయాలతో దూసుకుపోయారు. మధ్యలో డియర్ కామ్రేడ్ ఆశించినంత విజయం సాధించక పోయినా, ఆమె నటనకు చక్కని ప్రశంసలు అందుకున్నారు.

ఇక గతేడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేసిన పుష్ప తరువాత ఈ నేషనల్ క్రష్ జోరుకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఆ క్రేజ్ తో బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లని సొంతం చేసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటికే మూడు భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న రష్మిక మందన్న తాజాగా మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

రష్మిక నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా `మిషన్ మజ్ను`. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సిద్ధార్ధ్ మల్హొత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమాని శంతను బగ్చి రూపొందిస్తున్నారు.పాకిస్థాన్ నేపథ్యంలో సాగే సీక్రెట్ ఆపరేషన్ కథతో ఈ మూవీని తెరకెక్కించారని సమాచారం. భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా, కరోనా కారణంగా రిలీజ్ లేట్ అవుతూ వస్తుందట.

ఇక అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న `గుడ్ బై`లో నటించే అవకాశం కూడా రష్మిక ను వరించింది. ఇటీవలే ఈ సినిమాలో తన పాత్రకు సంభందించిన షూటింగ్ కూడా పూర్తి చేసేసినట్టు తెలుస్తుంది. దీని తరువాత రణ్ బీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగా కలయికలో రాబోతున్న ‘యానిమల్`లో నటించే అవకాశాన్ని కూడా రష్మిక దక్కించుకున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో వుండగానే రష్మిక మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకోవడం విశేషం. టైగర్ ష్రాఫ్ హీరోగా శశాంక్ ఖేతాన్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక వచ్చే ఏడాది పుష్ప 2 రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే, ఆ సినిమా రిలీజ్ తరువాత మన నేషనల్ క్రష్ కి ఇంకెన్ని అవకాశాలు వస్తాయో.. ఇంకెంత క్రేజ్ ను పెంచుకుంటుందో చూడాలి.

Can Ram’s The Warrior revive the Telugu cinema and exhibitors

0

Energetic Star Ram’s The Warrior is up for release on 14th July and Ram, as well as director Lingusamy, are confident of the final product. The movie has created significant buzz in the trade circles and has done a record pre-release business making it the highest of Ram’s career.

Theatrical rights for Ceeded have fetched the makers Rs 6 crores while the Andhra region has been sold for a massive Rs 18 crores. Nizam region has been acquired in the Rs 12-13 crores range. The Telugu version rights will be in the range of Rs 40 crores making it the best theatrical business in Ram’s career.

The distributors and exhibitors are hoping that the film will be able to pull Telugu cinema out of the slump it is currently facing. The small and medium films that have released in June have suffered a terrible fate.

All these films including Ante Sundaraniki and Pakka Commercial faced huge losses as the audience is not interested to watch these movies in theatres because of OTT. Adding to this, back-to-back biggies in the first half of the year have added fatigue for the film lovers and they are now only interested in quality content.

Now the trade circles have pinned hopes on Ram’s The Warrior and are praying this film will bring the audience to theatres and will open big at the box office

Ponniyan Selvan Teaser: మణిరత్నం తెరకెక్కించిన మరో అద్భుతం

0

అగ్ర దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్‌’ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల తరువాత మణిరత్నం నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా భారీ క్యాస్టింగ్‌తో కూడా రూపొందుతోంది.. విక్రమ్‌, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వర్య రాయ్‌, త్రిష వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా పార్ట్1 ను సెప్టెంబర్ 30న భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే విక్రమ్, కార్తి, ఐశ్వర్య, త్రిష లకు సంభందించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసారు. దశల వారీగా సినిమా పై ప్రేక్షకులకి మరింత ఆసక్తిని కలిగేలా చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు టీజర్ కూడా విడుదల చేశారు.

తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు పొన్నియన్ సెల్వన్-1 టీజర్‌ను లాంచ్ చేస్తూ,చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక తమిళ భాషలో స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు. అలాగే మలయాళ టీజర్‌ను మోహన్ లాల్, కన్నడ టీజర్‌‌ను రక్షిత్ శెట్టి.. హిందీ టీజర్‌ను అమితాబ్ బచ్చన్ రిలీజ్ చేశారు. ఆ రకంగా చూస్తే చిత్ర యూనిట్ పబ్లిసిటీ భారీగానే ప్లాన్ చేశారు.ఇక టీజర్ విజయానికి వస్తే.. ” ఈ కల్లు, రక్తం, పోరాటం అంతా దాన్ని మర్చిపోవడానికే.. ఆమెను మర్చిపోవడానికే.. నన్ను నేను మర్చి పోవడానికే” అంటూ విక్రమ్ పలికిన డైలాగుల వెనుక ఆంతర్యం ఏమిటో అని ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా టీజర్ ఉంది.

చోళ రాజ్యం నేపథ్యంలో సాగే ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్ధాయిలో విడుదల కానుంది. బాహుబలి సీరీస్ లాగా PS-1 కూడా రెండు భాగాల్లో రానుండటం విశేషం. ఈ చిత్రానికి మణిరత్నం సినిమాలకు ఆస్థాన సంగీత దర్శకుడు అయిన ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.

అలాంటిి పాత్రల పై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్న సాయి పల్లవి

0

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఫిదా’తో తెలుగు సినీ పరిశ్రమ లోకి అడుగు పెట్టిన సాయి పల్లవి. తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులకు చేరువై ఊహించని రీతిలో క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసిన సాయి పల్లవి.. అందం.. అభినయం, అంతకు మించి పని పట్ల ఉన్న అంకిత భావంతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.

ఇక ఇటీవల విడుదలైన ‘లవ్ స్టోరీ’ ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలు హిట్ అవ్వడమే కాక సాయి పల్లవికి ఎంతగానో పేరు తెచ్చి పెట్టాయి. తాజాగా విడుదలైన విరాట పర్వం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచినా ఆ సినిమాలో కూడా సాయి పల్లవి నటనకు అద్భుతంగా ఉందని పేరు వచ్చింది.

ఇదిలా ఉండగా సాయి పల్లవి హిట్ అయిన చిత్రాలు చూస్తే ఒక విషయం అర్థం అవుతుంది. అదేంటంటే హుషారుగా, యువతకు నచ్చేలా పాత్ర చిత్రణ ఉంటూ అక్కడక్కడా కాస్త బలమైన సంభాషణలు ఉండే పాత్రల్లో సాయి పల్లవిని ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడుతున్నారు.

అయితే తనకి ఉన్న స్టార్ ఇమేజ్ వల్ల కావచ్చు, లేదా స్వతహాగా సీరియస్ పాత్రల పై ఇష్టం కావచ్చు ఆ తరహా చిత్రాల్లో సాయి పల్లవి పని చేస్తున్నారు. గతంలో ఆమె నటించిన కణం, ఇటీవల విడుదలైన విరాట పర్వం సినిమాల్లో సాయి పల్లవి పాత్రలో హుషారు తక్కువ, గాఢత ఎక్కువ. అయితే అలాంటి పాత్రల్లో సాయి పల్లవిని చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడటం లేదు అని ఆయా చిత్రాల ఫలితాలే నిదర్శనం.

ప్రస్తుతం సాయి పల్లవి మరోసారి అలాంటి సీరియస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆ. సినిమా పేరే గార్గి. గార్గి చిత్రాన్ని బ్లాకీ జనీ & మై ఫుట్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రవి చంద్రన్ రామచంద్రన్ – ఐశ్వర్య లక్ష్మీ – థామస్ జార్జ్ – గౌతమ్ రామచంద్రన్ (దర్శకుడు కూడా) సంయుక్తంగా నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రానా దగ్గుబాటి ఈ సినిమాని తెలుగులో సమర్పిస్తున్నారు. తమిళంలో సూర్య,జ్యోతిక సమర్పిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జూలై 15న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో అయినా సాయి పల్లవి ఇష్టపడే సీరియస్ పాత్రలో అటు నటనకు ప్రశంసలతో పాటు ఇటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా విజయం సాధించాలని కోరుకుందాం.

చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్న రవితేజ?

0

మెగాస్టార్ చిరంజీవి – బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ  చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారనే వార్త ఎప్పటి నుంచో అనధికారికంగా చక్కర్లు కొడుతుంది.

దర్శకుడు బాబీ.. రవితేజ హీరోగా నటించిన ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. అలాగే రవితేజ నటించిన మరో చిత్రం బలుపు కు కథను కూడా అందించారు బాబీ. ఇక మెగాస్టార్ చిరంజీవితో బాబీ తీయబోయే సినిమాలో కథ ప్రకారం మరో హీరోకు అవకాశం ఉందట. ఆ పాత్రను రవితేజతో  చేయిస్తే  బాగుంటుందనే ఉద్దేశ్యంతో బాబీ ఈ సినిమా కోసం కలిసారట. పైగా చిరంజీవి హీరో కావడంతో రవితేజ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారని, ఆయనకు భారీ పారితోషికం కూడా అందనుందని ప్రచారం కూడా జరిగింది.

అయితే ఇటీవలే తెలిసిన సమాచారం ప్రకారం రవితేజ ఈ సినిమా నుండి తప్పుకున్నారు అని తెలుస్తుంది. అసలు కారణం ఎంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అందువల్ల రవితేజ పాత్రలో నటించడానికి వేరే హీరోని వెతుకుతున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.ఇది ఖచ్చితంగా ప్రేక్షకులను నిరాశ పరిచే విషయమే. మరి రవితేజ పాత్రలో వేరే హీరో నటిస్తారో లేదా ఆయనే మళ్ళీ ఈ సినిమాలో భాగం అవుతారో చూడాలి.

ఇక చిరంజీవి విషయానికి వస్తే మలయాళ సినిమా లూసిఫర్ రీమేక్ అయిన “గాడ్ ఫాదర్” ఈ దసరాకి విడుదలకు సిద్ధం అవగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలు పాత్రలో కనిపించనుంది. అలాగే తమన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమాలో నాగ శౌర్య  కీర్తి సురేష్ భర్త పాత్రలో నటిస్తున్నట్లు  సమాచారం.

Modern love hyderabad web series: అభినందించదగ్గ ప్రయత్నమే అయినప్పటికీ …

0

న్యూయార్క్ టైమ్స్ లో ప్రచురితమైన కథనాల స్ఫూర్తితో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ”మోడ్రన్ లవ్ హైదరాబాద్” సిరీస్ ను రూపొందించిందని తెలుస్తోంది. సుహాసిని మణిరత్నం – రేవతి – ఆది పినిశెట్టి – నిత్యా మీనన్ -రీతూ వర్మ – మాళవిక నాయర్ – అభిజిత్ దుద్దాల -రేవతి – నరేష్ – నరేష్ అగస్త్య – కోమలీ ప్రసాద్ -ఉల్కా గుప్తా తదితరులు ప్రధాన పాత్రల్లో ఈ సిరీస్ తెరకెక్కింది.ఈ వెబ్ సీరీస్ కు మొత్తం ఆరు ఎపిసోడ్ లు ఉండగా నలుగురు దర్శకులు పని చేశారు.

Episode 1 – My Unlikely Pandemic Partner.

ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ తెరకెక్కించిన ఈ కథలో సీనియర్ నటి రేవతి, వర్ధమాన నటి నిత్య మీనన్ తల్లీ కూతుళ్ళుగా నటించారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కారణంగా కూతురు ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఆరేళ్ల తరువాత భర్తను పోగొట్టుకున్న తల్లి లాక్ డౌన్ సమయంలో కూతురు పంచన చేరుతుంది..ఆ సమయంలో ఇద్దరూ పరస్పరం గొడవ పడుతూనే ఎలా మళ్ళీ దగ్గరయ్యారు అనేది కథ. రేవతి, నిత్య మీనన్ ఇద్దరూ నటన పరంగా తమ పాత్రలను రక్తి కట్టించే ప్రయత్నం చేసినా కథలో, పాత్ర చిత్రణలో బలం లేకుండా పోవడం వల్ల ఏమాత్రం ప్రభావం లేకుండా పోయింది.

Episode 2 – Fuzzy, Purple and full of thorns.

ఈ కథకు కూడా నగేష్ కుకునూర్ యే దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, రీతు వర్మ నటించిన ఈ కథలో లివ్ ఇన్ రిలేషన్షిప్ నేపథ్యంలో కాస్త కాంటెంపరరీ గా ఉన్నా.. ఇద్దరు మధ్య సంఘర్షణకు ఎంచుకున్న కారణం చాలా సిల్లీగా ఉంటుంది. ఆది, రీతు ఇద్దరు బాగానే చేశారు, వివేక్ సాగర్ సంగీతం బాగుంది.

Episode 3 – Why did she leave me there.

ఈ కథకు కూడా నగేష్ కుకునూర్ తెరకెక్కించారు. సుహాసిని, నరేష్ అగస్త్య ముఖ్య పాత్రల్లో నటించిన ఈ కథలో భావోద్వేగాలను పండించడంలో నగేష్ సఫలం అయ్యారు. తన మంచి కోసం తనను అనాధ ఆశ్రమంలో వదిలేసి వెళ్లిన అమ్మమ్మ కి మనవడికి జరిగే ఈ కథలో ఈ మధ్య సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో ఎదుగుతున్న నటుడు నరేష్ అగస్త్య ఆకట్టుకోగా, సుహాసిని తెలంగాణ యాసలో మాట్లాడే పాత్రలో ఇట్టే ఇమిడిపోయింది.

Episode 4 – What clown wrote this script.

బిగ్ బాస్ 4 సీజన్ విజేతగా నిలిచిన అభిజీత్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ కథను ఉదయ్ గుర్రాల తెరకెక్కించారు. స్టాండ్ అప్ కామెడీ మరియు టెలివిజన్ బ్యాక్ డ్రాప్ లో.జరిగే కథలో మాళవిక నాయర్ నటన తప్ప పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేవు. కెరీర్ కి ప్రేమకి. మధ్య జరిగే సంఘర్షణ లాగా అనిపించినా అది కేవలం పై పైన టచ్ చేసినట్టు ఉందే తప్ప ఎక్కడా పాత్రలతో మనం కనెక్ట్ అయ్యే విధంగా ప్రభావితం చేయడంలో దర్శకుడు విఫలం అయ్యారు అనే చెప్పాలి.

Episode 5 – About that rustle in the bushes.

తండ్రీ కూతుళ్ళ మధ్య జరిగే ఈ కథను దేవికా బహుమానం తెరకెక్కించారు. తన కూతురు పెళ్ళి చూపులు చూసే యువకులని ఫాలో అయ్యే తండ్రి పాత్రలో నరేష్ నటన అద్భుతంగా ఉంది. అలాగే చేదు గతం నుంచి బయట పడాలని ప్రయత్నించే అమ్మాయిగా ఉల్కా గుప్తా కూడా బాగానే నటించారు. మొదట్లో గమ్మత్తుగా ఉండి నవ్వించే నరేష్ పాత్ర చివరలో గుండె బరువెక్కి ఏడ్చెలా చేస్తుంది.

Episode 6 – Finding your Penguin

C/O కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా ఈ కథకు దర్శకత్వం వహించారు. తాజాగా బ్రేకప్ జరిగి, సరైన జీవిత భాగస్వామి కోసం తపించే అమ్మాయి కథగా అసక్తికరంగానే మొదలైనా, మాటి మాటికీ వచ్చే animal planet analogy ఏమాత్రం ప్రభావం చూపకపోగా చిరాకు తెప్పిస్తుంది. అయితే ముఖ్య పాత్రలో నటించిన కోమలి ప్రసాద్, ఆమెకు స్నేహితురాలి గా నటించిన భావనా సాగి నటన పరంగా తమ ముద్రను వేశారు అని చెప్పాలి. దర్శకుడిగా వెంకటేష్ మహా మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు.

మొత్తంగా చూసుకుంటే ఈ వెబ్ సిరీస్ అభినందించదగ్గ ప్రయత్నమే అయినప్పటికీ ఆచరణ మరింత బలంగా, ప్రభావ వంతంగా ఉండాల్సింది.

Big Shock To Sai Pallavi; High Court Cancelled Her Petition

0

During the promotions of her latest film Virata Parvam, Sai Pallavi made an erratic statement regarding Kashmir Files and the Gorakshas. She said that there is no difference between what happened to the Hindu Pandits in Kashmir Files and the Muslim driver who was beaten for carrying cows in a truck.

This sparked outrage on social media, with many people upset with her statement. A case was filed against Sai Pallavi in Sultan Bazaar Police station on the complaint of a Bajrang Dal member. The case was filed on the grounds of hurting religious sentiments.

With this, the police issued a notice to Sai Pallavi on June 21st. In this order, she approached the Telangana High Court seeking cancellation of the police notices. However, the High Court rejected Sai Pallavi’s plea and dismissed her petition for the same.

Sai Pallavi also clarified the context behind her statement and apologized to the people. On the other hand, Sai Pallavi is now busy with the promotions of her next movie, titled Gargi. Sai Pallavi also clarified the context behind her statement and apologized to the people.