Home Blog Page 2108

ది వారియర్ టీమ్ తప్పు చేస్తుందా?

0

కరోనా తర్వాత ప్రేక్షకులు చాలా మారిపోయారు. వాళ్లను థియేటర్ల వద్దకు రప్పించాలి అంటే సినిమా వాళ్ళు ఏదైనా అద్భుతం చేయాలి. అది చేయడంలో చాలా మటుకు విఫలం అవుతున్నారు మన దర్శకులు, నిర్మాతలు. తెలుగు ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా పెరిగిన టికెట్ రేట్ల గురించి జరిగిన చర్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పెద్ద సినిమాలకు అడ్డూ అదుపూ లేకుండా టికెట్ రేట్లు పెంచారంటూ చిత్ర సీమ పై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. టికెట్ రేట్లు పెంచినప్పటికీ ఆ సినిమాల ఫలితాలు దారుణంగా రావడంతో, నిజంగానే టికెట్ రేట్లు పెరగడం వల్లే ప్రేక్షకులు థియేటర్ల వద్దకు రావడం లేదు అని అందరూ అనుకున్నారు.

కానీ అందులో ఎలాంటి నిజం లేదని.. టికెట్ రేట్ల ప్రభావం కొంత ఉన్నా, సరైన కంటెంట్ లేని సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదనే విషయం గత కొన్ని రోజులుగా వస్తున్న సినిమాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది.

దానికి ఉదాహరణగా ఇటీవల విడుదలైన సినిమాల ఫలితాలు చూస్తే .. జూన్ లో విడుదలైన మేజర్, విక్రమ్ చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేశాయి, సినిమాతో ముడిపడ్డ అన్ని వర్గాల వారికీ లాభాలు తెచ్చి పెట్టాయి. అయితే గమనించాల్సిన ఏంటంటే మేజర్ సినిమాకి టికెట్ రేట్లు తగ్గించగా, విక్రమ్ చిత్రానికి మాత్రం జీవో (సింగిల్ స్క్రీన్ – 175 మల్టీప్లెక్స్ – 295) రేట్లు అమలు చేశారు.

ఇక తరువాత విడుదలైన అంటే సుందరానికీ, విరాట పర్వం సినిమాలు మాత్రం ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యాయి. ఆ రెండు సినిమాలకూ విక్రమ్ కి ఉన్న టికెట్ రేట్లే ఉన్నాయి. అంటే ఇక్కడ సినిమా కంటెంట్ అనేది ప్రేక్షకులను ఆకట్టుకుంటే టికెట్ రేట్లతో పని లేదు.. ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాని ఆదరిస్తారు.సినిమాలో సరైన విషయం లేకుంటే పక్కా కమర్షియల్ లాంటి సినిమాకి టికెట్ రేట్లు తగ్గించ్చినా ప్రేక్షకులు ఆ సినిమాని తిప్పికొట్టారు.

ఇక ఇటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా తమ కష్టాలను గట్టేక్కిస్తుంది అని నమ్మకంతో ఉన్న “ది వారియర్” చిత్రం ఈ 14న విడుదల అవుతుంది.ఆ సినిమాకి కూడా సింగిల్ స్క్రీన్ – 175 మల్టీప్లెక్స్ – 295 రేట్లు అమలు చేస్తున్నారని తెలిసింది. ఒక మీడియం బడ్జెట్ సినిమాకి ఇది ఖచ్చితంగా ఎక్కువ రేటు గా చెప్పుకోవచ్చు. ఇది సినిమాకి నెగటివ్ గా పని చేసే అవకాశం ఉందని సినీ ఔత్సాహికులు, ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.

ఏదేమైనా ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు ఇలా రేట్లు ఎక్కువ, తక్కువ అంటూ అది ఒక ప్రచార సాధనంగా కాకుండా ఇప్పటికైనా పెద్ద సినిమాలకు ఇంతా, చిన్న సినిమాలకు ఇంతా అని ఒక నిర్ధారిత టికెట్ రేట్లు నిర్ణయించుకుని అవి అన్ని సినిమాలకు అమలు అయ్యేలా చూస్తే అందరికీ మంచిది.

కొత్త లుక్ లో ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన రష్మిక

0

నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోరు రోజు రోజుకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో, విజయాలతో దూసుకుపోతున్న ఈ కన్నడ భామ మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. పాత్రల ఎంపికలో ఆమె చూపించే ప్రత్యేకత వల్లే ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ముందుకు వెళ్లడం సాధ్య పడుతుంది.

ఇది వరకే అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో శ్రీవల్లిగా నటించి మెప్పించడమే కాకుండా ఆ పైన బాలీవుడ్ లో సిద్ధార్థ మల్హోత్రా సరసన యాక్షన్ క్వీన్ పాత్రతో అలరించబోతున్నారు. అమితాబ్ బచ్చన్ కు కూతురు గానూ నటిస్తున్నారు. ఇంతలోనే రష్మిక మరో వైవిధ్యమైన పాత్రలో, కొత్త గెటప్ లో కనిపించి ప్రేక్షకులకు తీయని షాక్ ఇచ్చారు.

దుల్కర్ సల్మాన్ -మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న “సీతారామం” లో రష్మిక మందన్న ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రాముడి గా దుల్కర్ సల్మాన్, సీతగా మృణాల్ ఠాకూర్ కనిపించనుండగా.. హనుమంతుని పాత్రలో రష్మిక నటించడం విశేషం.ఈ మేరకు నేడు రష్మిక పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన తాజా ఫోటోలో ఒక ముస్లిమ్ యువతిగా హిజాబ్ ధరించి కనిపించారు. ఈ కొత్త లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ ఏడాది ఏప్రిల్ 10న శ్రీరామ నవమి రోజున విడుదల చేసిన సీతారామం లుక్ లోనే ఈ విషయం గురించి చిత్ర యూనిట్ ప్రకటించారు.ఇప్పుడు ఈద్ ఉల్-అధా పేరుతో ఒక ప్రత్యేక పోస్టర్ ని చిత్రబృందం రిలీజ్ చేయగా , ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.రష్మికది ఇందులో చాలా కీలకమైన పాత్ర అని సమాచారం. ఆమె కాశ్మీరీ ముస్లిం అమ్మాయిగా కనిపించనున్నారు.

ఇక ఈ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ ఒక కీలక పాత్ర పోషిస్తుండగా, ఆ పాత్రకు సంభందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలైంది.

సీతారామం సినిమాని స్వప్న సినిమాస్ పతాకం పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థగా పేరు గాంచిన వైజయంతీ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని సమర్పిస్తోంది. దీనికి పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు. తెలుగు- తమిళం- మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పవిత్ర లోకేష్ పై తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ భర్త

0

గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడు నరేష్, కన్నడ నుంచి వచ్చిన సీనియర్ నటి పవిత్రా లోకేష్ మధ్య ఉన్న సంబంధం గురించి పలు పుకార్లు షికార్లు చేసి వివాదాస్పదమయిన విషయం విదితమే. ముందుగా ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రావడంతో నరేష్ మూడో భార్య రమ్య మీడియా ముందుకు వచ్చి.. తన భర్త తనకు విడాకులు ఇవ్వకుండా నాలుగో పెళ్లి ఎలా చేసుకుంటాడంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం దుమారం రేపింది.

ఇక మరో పక్క తన భార్య మంచిది కాదని, అందుకే ఆమెను వదిలేసినట్లు నరేష్ మీడియా ముఖంగా తెగేసి చెప్పుకొచ్చారు. పరస్పర వాదనలు, ఆరోపణలతో ఆగకుండా.. బెంగళూరు లో ఒక హోటల్ లో నరేష్, పవిత్ర లని నరేష్. భార్య రమ్య కొట్టాలని చూడటం, పెద్ద గొడవ చేయటంతో ఈ విషయం ఎంతకీ తెగని వ్యవహారంలా తయారు అయింది.

ఇక ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం లోకి పవిత్రా లోకేష్ మాజీ భర్త సూచేంద్ర ప్రసాద్ దూసుకువచ్చారు. పవిత్రకు అక్రమ సంబంధాలు కొత్తేమీ కాదు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. నరేష్, పవిత్రా మాత్రం తాము స్నేహతులమని, ఒకరికొకరు తోడుగా ఉంటున్నామని చెప్పుకొచ్చారు. ఇక పవిత్రా విడాకుల విషయం గురించి మాట్లాడుతూ.. సూచేంద్ర తో తనకు పెళ్లే కాలేదని చెప్పుకురావడం గమనార్హం.

ఈ క్రమంలోనే సూచేంద్ర శనివారం విలేకర్ల సమావేశంలో పవిత్ర పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ” పవిత్రకు నాకు పెళ్లి అయ్యింది.. మేము ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. కానీ మా మ్యారేజ్ సర్టిఫికెట్ మాత్రం లేదు. కావాలనే మేము ఆ సర్టిఫికెట్ ను తీసుకోలేదు. ఎందుకంటే మేము ఇద్దరం విదేశీ విధానాలకు విరుద్ధం. మ్యారేజ్ సర్టిఫికెట్ విదేశీ సంస్కృతికి నిదర్శనమని భావించి తీసుకోలేదు. అయితే పవిత్ర నా భార్య అని నిరూపించడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. నా పాస్ పోర్టు, ఆధార్ కార్డు గమనిస్తే ఆమె నా భార్యే అని ఉంటుంది. మేము ఇద్దరం కలిసి చాలా ఫంక్షన్స్ కూడా వెళ్ళాం” అంటూ చెప్పుకొచ్చారు.

సూచేంద్ర వ్యాఖ్యలతో మళ్ళీ ఈ వివాదం మొదటికి వచ్చింది. నిజానికి ఇలాంటి గొడవలు లేదా సమస్యలు నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలి. లేదా కోర్టులో న్యాయపరంగా వాద ప్రతివాదనలు జరిపి తమ నిజాయితీని నిరూపించుకోవాలి. ఇలా రోడ్డుకెక్కి రచ్చ చేసుకుంటే ఆయా వ్యక్తుల గౌరవానికి భంగం కలగడం తప్ప ఏ లాభం లేదు.

ఇండస్ట్రీని ది వారియర్ కాపాడుతుందా?

0

ది వారియ‌ర్ చిత్రం జులై 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్,కృతిశెట్టి జంట‌గా న‌టించ‌నున్నారు. త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ది వారియ‌ర్ త‌మిళ వెర్ష‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఇటీవలే ఐకానిక్ స‌త్యం సినిమాస్‌ లో ప్లాన్ చేశారు.

ఈ ఈవెంట్‌కు త‌మిళ ఇండ‌స్ట్రీ నుంచి 28 మంది సెల‌బ్రిటీలు ముఖ్య అతిథులుగా హాజరు అవటం  విశేషం.  మ‌ణిర‌త్నం, శంక‌ర్‌, విట్రిమార‌న్, భార‌తీరాజా, గౌత‌మ్ మీన‌న్, ఎస్‌జే సూర్య‌, భార‌తీరాజా, లోకేశ్ క‌న‌గ‌రాజ్, హెచ్ వినోథ్‌, శ‌శి, కార్తీక్ సుబ్బ‌రాజు, పీఎస్ మిత్ర‌న్‌, విక్ర‌మ్ ఫ్రభు, శివ‌, పార్థీబ‌న్‌ కార్తీ, విశాల్‌, కీర్తి సురేశ్‌ తో పాటు ప‌లువురు నటీన‌టులు చీఫ్ గెస్టులుగా వచ్చారు. ఇక తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం 6 గంటలకు ఫిల్మ్ నగర్ లోని JRC కన్వెన్షన్ లో జరగనుంది.

ఈ ఏడాది ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ హిట్ తరువాత స్ట్రెయిట్ తెలుగు సినిమా ఏదీ హిట్ గా నిలిచింది లేదు. సర్కారు వారి పాట, ఫ్3 చిత్రాలు పరవాలేదు అనిపించాయి. అలాగే అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి చిన్న సినిమా కూడా ఉన్నంతలో బాగానే ఉంది అన్న పేరు తెచ్చి పెట్టుకుంది. అయితే గట్టిగా బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేసిన సినిమా ఏదీ లేదు అనే చెప్పాలి.


వరుస పెట్టి సినిమాలు రావడం వల్ల ప్రేక్షకులకు సినిమా అంటే మొహం మొత్తిన పరిస్థితి ఏర్పడింది. రెండు రాష్ట్రాల లోని చాలా ధియేటర్లు రోజు వారీ నష్టాలతో నడుస్తున్నాయి. ఈ దశలో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ది వారియర్ సినిమా అయినా తమ కష్టాలను కడతేరుస్తుంది అని డిస్ట్రిబ్యూటర్ లు ఆశతో ఉన్నారు.


ఇప్పటికే ఈ సినిమాలో బుల్లెట్టు పాట బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సోషల్ మీడియాలో ఆ పాట హవా మామూలుగా లేదు. మిగతా పాటలకు కూడా మంచి స్పందనే వచ్చింది. ఇక ట్రైలర్ కూడా బాగుండటంతో సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులకు కూడా వచ్చింది. మరి అందరి నమ్మకాన్ని ది వారియర్ సినిమా నిలబెడుతుందా? లేదా? తెలియాలి అంటే మరో వారం ఆగాల్సిందే.

Venkat Prabhu signs back 2 back films with Akkineni family

0

In pursuit of bringing freshness to their films, the trend of Tollywood and Kollywood directors working in opposite industries has picked up of late. Director Lingusamy is working with Ram for ‘The Warrior’ while Vamsi Paidipally is directing Vijay for ‘Varisu’. Similarly, Sekhar Kammula will direct Dhanush up next. Keeping this trend alive, Venkat Prabhu has signed 2 back to back films with Telugu heroes.

Venkat Prabhu has officially announced a project with Naga Chaitanya and pre-production works are going on. The film will be a bilingual one and will release in Tamil and Telugu. Srinivasa Chitturi will produce NC22 under the Sreenivasa Silver Screen banner and will go on floors soon. Naga Chaitanya is currently awaiting the release of his Bollywood debut Lal Singh Chaddha and Vikram Kumar’s Thank You.

Incidentally, he is in talks with Nagarjuna for his next project and will be quite busy in Tollywood now. The script for this film has been finalised.

Venkat Prabhu is riding high on the success of his last film ‘ Maanadu’. The 2021 film ended up being a blockbuster and brought much-needed success to Simbu and the director himself. It will be interesting to see how Venkat Prabhu’s journey with Telugu heroes goes ahead.

ఉత్కంఠభరితంగా ఉన్న నాగార్జున ఘోస్ట్ (Ghost) టీజర్

0

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ్ నుండి సినిమా వచ్చి చాలా రోజులు అవుతుండటంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకోవాలని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్నారు. సరికొత్త కథలతో.. వినూత్నమైన ఆలోచనలతో సినిమాలు తీసే ఆయన ఈ చిత్రానికి దర్శకుడు కావడంతోఈ సినిమా పై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమాలో నాగార్జున పోషిస్తున్న పాత్ర చాలా విలక్షణంగా ఉంటుందట. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఆసక్తి రేకెత్తెలా ఉండగా, ఈరోజు జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్ లో ఈ చిత్రం తాలూకు టీజర్ ను విడుదల చేశారు.

టీజర్ లో కత్తి పట్టుకుని నాగార్జున చేసిన ఫైట్ అబ్బురపరిచేలా ఉండగా.. కెమెరా మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉత్కంఠభరితంగా ఉండి టీజర్ కు తమ సహాకారం అందించాయి. ఇక టీజర్ చివరలో చిత్రాన్ని అక్టోబర్ 5న అంటే దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ధృవీకరించారు.

ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటించాల్సింది. కానీ ఆమె గర్భవతి కావడంతో ఈమె స్థానంలో సోనాల్‌ చౌహాన్‌ను తీసుకున్నారు. ఇక ఇప్పటికే దుబాయ్‌లో సోనాల్ చౌహాన్‌, నాగార్జునలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

గరుడ వేగ హిట్ చిత్రం తర్వాత ప్రవీణ్ సత్తారు… బంగార్రాజు వంటి హిట్ సినిమాల తర్వాత ఇద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రం పై అటు ఇండస్ట్రీలో ఇటు అక్కినేని అభిమానుల్లోభారీ అంచనాలే ఉన్నాయి. నాగార్జున రా ఏజెంట్ గా నటిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కే నారంగ్, రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Wild Dog is not a flop: Nagarjuna

0

At the teaser launch event of his upcoming film The Ghost, Nagarjuna along with the entire unit of the movie had a candid chat with the media. Nagarjuna responded to a number of questions regarding ‘The Ghost’ as well as his recent movies.

Answering one question about why Officer and Wild Dog didn’t work out as expected, the senior actor was quick to jump to the defense of Wild Dog and said that the movie was not unsuccessful.

“Due to the Delta variant, the theatres were avoided by the people. So theatrically the movie might have not worked out as expected. But when the same movie was released on Netflix, it stayed in the No.1 trending position not just in India but wold over for 10 weeks. How can you call it an unsuccessful movie then?” questioned Nagarjuna.

Regarding Officer, you have to as Ram Gopal Varma as he’s the one who directed it said the actor. Nagarjuna added that there is no way to find out which movie will work and which movie won’t hence it is best to movies that your heart approves.

The Ghost will release on 5th October and Praveen Sattaru will direct this film. Nagarjuna, along with Sonal Chauhan will be seen as Interpol officers and it will be an action-packed film.

Chiyaan Vikram is fully recovered and discharged from the hospital

0

Tamil actor Vikram suffered mild chest discomfort on Friday and was rushed to the Kauvery Hospital in Chennai. The actor has now completely recovered and has been discharged from the hospital. As per the official statement released by the Hospital, it was just chest uneasiness and not a heart attack as being claimed by the media.

“Popular Tamil Actor Mr Vikram has been admitted in Kauvery Hospital with complaints of chest discomfort. He was evaluated and treated by our team of specialist doctors. He did not have cardiac arrest. He is currently clinically stable and will be discharged from the hospital soon.” said the hospital in the medical update.

Vikram’s son Dhruv also took to social media to inform the fans on Vikram’s health. He urged them not to believe in any rumours.

“Dear fans and well-wishers, Chiyaan Vikram had mild chest discomfort and is being treated for the same. He DID NOT have a heart attack as reports falsely claim. We are pained to hear rumours to this effect,” said Dhruv in a statement.

Vikram was supposed to attend his upcoming film Ponniyin Selvan’s teaser launch when he had to be hospitalized. Directed by Mani Ratnam, this historical action-adventure film stars Karthi, Aishwarya Rai, Trisha, Jayam Ravi along with several other noted actors.

The Ghost is a Full-length action entertainer,’ says Nagarjuna

0

Nagarjuna’s The Ghost teaser was revealed yesterday at an event in Hyderabad. The teaser features the senior star in an action-packed mode with a sword in each hand. The teaser has impressed one and all and the brief action episode has heightened the expectations on the film.

Praveen Sattaru is directing this action thriller which will see Nagarjuna in the role of an Interpol officer. Speaking to the media at the event, the senior actor said that The Ghost will be a full-length action entertainer and we’ll get to see him in an out-and-out fight mode.

“The major highlight of the film will be the action episodes and Praveen has captured them brilliantly. Even I trained for these sequences and had a great time performing. I’ve personally never done such action scenes,” said Nagarjuna at the event.

The film will feature Sonal Chauhan opposite Nagarjuna in the lead role opposite Nagarjuna. Narayan Das K Narang, Puskur Ram Mohan Rao, and Sharrath Marar are producing the film on Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment Banners.

Gul Panag and Anikha Surendran are the other prominent cast of the film which is currently being shot in Hyderabad

సమ్మర్ రిలీజ్ కన్ఫర్మ్ అంటున్న సూపర్ స్టార్

0

కరోనా పాండేమిక్ వల్ల ఒక్క హీరో అని కాదు అందరి హీరోల సినిమాలు ఆలస్యం అయ్యాయి. ఇండస్ట్రీలకి అతీతంగా ఈ ఇబ్బందులు ఎదురుకున్నారు. ఆ కారణంగా ప్రతీ స్టార్ హీరో సినిమా థియేటర్లలో విడుదల చేయడానికి సమయం పట్టింది. అందరిలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కూడా థియేటర్లలోకి రావడానికి రెండేళ్లు పట్టింది. ఆయన నటించిన `సర్కారు వారి పాట` ఈ ఏడాది మేలో విడుదల అయిన సంగతి తెలిసిందే. తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా, కలెక్షన్లు మాత్రం ఓవరాల్ గా పరవాలేదు అనిపించాయి. పెట్ల పరశురామ్ ఈ సినిమాని రూపొందించారు.

ఈ దశలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమా పై సూపర్ స్టార్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు 12 ఏళ్ల విరామం తరువాత మహేష్ – త్రివిక్రమ్ ల కలయికలో రాబోతున్న సినిమా కావడంతో సహజంగానే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏర్పడ్డాయి.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నారు. ప్రాజెక్ట్ ప్రకటించి ఏడాది కావస్తున్నా వివిధ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అనుకున్న దాని కంటే ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈరోజు ఈ సినిమా షూటింగ్ తాలూకు సమాచారం అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ తమ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.

https://twitter.com/haarikahassine/status/1545643162319785984?t=1AyS0hHBnmtY2h3jFkZEow&s=19

అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న కాంబినేషన్ కి రంగం సిద్ధం అయింది. భారీ స్థాయిలో ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి అని ఈ మేరకు నిర్మాతలు తెలిపారు. ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2023 వేసవిలో రానుందని, భారీ విస్ఫోటనం కు సిద్ధంగా ఉండండి అంటూ అభిమానులను ఉత్తేజ పరిచే విధంగా ప్రకటించారు నిర్మాతలు.