Home Blog Page 2050

SSMB28: రిలీజ్ డేట్ పై సంతోషంగా లేని మహేష్ అభిమానులు

0

సూపర్ స్టార్ మహేష్ – త్రివిక్రమ్‌ కాంబినేషన్లో మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం (SSMB 28) విడుదల తేదీని నిన్ననే ప్రకటించారు. ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిందనే చెప్పాలి. దీంతో చాలా మంది మహేష్ అభిమానులు చిత్ర యూనిట్ అందించిన కొత్త అప్‌డేట్ తో సంతోషిస్తున్నప్పటికీ, అదే స్థాయిలో కొంతమంది మహేష్ బాబు అభిమానులు SSMB28 విడుదల తేదీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు.

ఈ చిత్రం విడుదల తేదీని ఏప్రిల్ 28, 2023గా చిత్ర బృందం ప్రకటించింది, అయితే కొంతమంది అభిమానులు ఈ విడుదల తేదీ పట్ల ఏమాత్రం సంతోషించలేదు. ఇంతకన్నా మంచి విడుదల తేదీలు, హాలీడే అడ్వాంటేజితో అందుబాటులో ఉండటమే దీనికి కారణం. అలాంటపుడు అనవసరంగా ఈ విడుదల తేదీని ఎందుకు ఎంచుకున్నారో అని అభిమానులు కాస్త గందరగోళంలో ఉన్నారు.

సరే అవన్నీ పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ కూడా అంత తొందరగా అయిపోతుందా అనేది అసలు సమస్య. ఇటీవల తెలుగు సినీ నిర్మాతల గిల్డ్ షూటింగ్ల పై నిషేధం విధించి, మూడు వారాల్లో ఆ నిషేధం ఎత్తివేసీన విషయం తెలిసిందే. ఆ క్రణలో షూటింగ్ లు మొదలైన రోజు నుంచే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళినా..ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 28 కల్లా అన్ని పనులూ పూర్తి చేసుకుంటుందా అనేది అనుమానమే.

కేవలం హీరో దర్శకుడు అనే వృత్తి పరమైన సంబంధం మాత్రమే కాకుండా మహేష్ మరియు త్రివిక్రమ్ లు వ్యక్తిగతంగా గొప్ప అనుబంధాన్ని కలిగి ఉన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఖలేజా మరియు అతడు వంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఆ కోవలో ఈ చిత్రం కూడా చేరిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

SSMB28లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించినున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అలా వైకుంఠపురములో సినిమాకి థమన్ సంగీతం ఎంతగా ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఈ చిత్రానికి కూడా థమన్ అలాంటి సంగీతం ఇస్తారని ఆశిద్దాం.

ఆగస్ట్ 25న విడుదల కానున్న నాగార్జున ది ఘోస్ట్ ట్రైలర్

0

అక్కినేని నాగార్జున- ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ఘోస్ట్’. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి- నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ మరియు ఇటీవలే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో నాగార్జున ఒక ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని అక్టోబర్ 5 న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను మమ్మురం చేసిందీ చిత్ర బృందం. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ కు ముహూర్తం ఖరారు చేశారు.

https://twitter.com/iamnagarjuna/status/1561264272239431682?t=BRNf0328jjYJz75gc5Jd6g&s=19

ఆగస్టు 25 న ది ఘోస్ట్ ట్రైలర్ రాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపారు. అంతే కాకుండా ఆ విషయాన్ని ధృవీకరిస్తూ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఒక పక్క భారీ యాక్షన్ నేపథ్యంతో చేతుల్లో గన్స్ పట్టుకుని నాగార్జున ఉండగా.. మరో పక్క నాగార్జునను సోనాల్ కౌగిలించుకోడం మనం చూడచ్చు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

కమర్షియల్ సినిమాలే కాకుండా కొత్తదనం కోసం తపిస్తూ ఉంటారు నాగార్జున. ఆఫీసర్ వంటి డిజాస్టర్ తో కాస్త వెనకబడ్డ కింగ్, గత సంవత్సరం వైల్డ్ డాగ్ సినిమాలో నటించారు. ఆ చిత్రంతో నటుడిగా చక్కని ప్రశంసలు దక్కినా..బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేక పోయింది. అయితే వ్రతం చెడ్డా ఫలితం దక్కింది అన్నట్లుగా.. వైల్డ్ డాగ్ విమర్శకులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. ఆ తరువాత ఈ ఏడాది సంక్రాంతికి కొడుకు నాగ చైతన్యతో కలిసి `బంగార్రాజు` చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించారు. లడ్డుండ.. అంటూ పండగకు సరైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించారు.

కాగా బంగార్రాజు సినిమా, 2016 లో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనాకి సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.ప్రస్తుతం కింగ్ నాగార్జున నటిస్తోన్న `ది ఘోస్ట్` రోల్ కూడా ఎలా ఉంటుందో అన్న ఆసక్తిని ప్రేక్షకుల్లో రేకెత్తిస్తుంది.

ఇలా నాగార్జున అటు కమర్షియల్ సినిమాలతో పాటు కొత్తదనం ఉన్న సినిమాలు చేస్తున్నారు. మరి ఆయన ప్రయత్నాలు అలా కొనసాగాలి అంటే ఘోస్ట్ వంటి సినిమాలు భారీ విజయం సాధించాలి.

Box-Office: ఓవర్సీస్ లోనూ అదరగొడుతున్న కార్తికేయ-2

0

2014లో విడుదలై సూపర్ హిట్ సినిమాగా నిలిచింది “కార్తికేయ”. కేవలం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లను మాత్రమే కాకుండా.. ఒక వినూత్న ప్రయత్నంగా కూడా మంచి ప్రశంశలు అందుకుంది. అలాంటి విజయవంతమైన సినిమాకి సీక్వెల్ గా నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా గత వారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా “కార్తికేయ 2”. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. భారీ అంచనాలతో పాటు విడుదల తేదీకి సంభందించిన వాయిదాల మధ్య.. ఆగస్ట్ 13న విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు చేస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

తెలుగులో మాత్రమే కాక హిందీలో కూడా ఈ సినిమా అనూహ్యంగా విజయాన్ని సాధించి అందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సినిమా విడుదలైన మొదటి రోజు “కార్తికేయ 2” కేవలం 7 లక్షలు మాత్రమే కలెక్షన్లు నమోదు చేసుకుంది. హిందీలో పెద్దగా ప్రచారం లేకపోవడం, అలాగే ధియేటర్లు కూడా చాలా తక్కువ అవడంతో మొదటి రోజు నామమాత్రపు కలెక్షన్లు వచ్చాయి. కానీ విడుదలైన మొదటి రోజు నుంచి సినిమాకి అద్భుతమైన టాక్ రావడం, అంతే కాక సినిమాలో హీరో నిఖిల్ తో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా సినిమాకి ధియేటర్లు పెంచాలంటూ డిమాండ్ చేశారు. దాంతో రెండవ రోజు నుంచి సినిమా కలెక్షన్లు మరియు స్క్రీన్లు అలా పెరుగుతూ వచ్చాయి. ఇక ఈ శుక్రవారం జన్మాష్టమి సందర్భంగా కలెక్షన్లు బాగుంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

నిజానికి ఏ సినిమా అయినా విడుదలైన మొదటి రోజు నుంచి కలెక్షన్లు తగ్గుతూ వస్తాయి. కానీ “కార్తికేయ 2” విషయంలో అది రివర్స్ అయింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ వారం కార్తీకేయ 2 కలెక్షన్లు పెరిగాయి. విడుదలైన ఆరు రోజులకు అంటే గురువారం వరకు సినిమా 5.75 కోట్లను నెట్ కలెక్షన్లు సంపాదించింది. ఇక శుక్రవారం 2.46 కోట్లను నమోదు చేయగా, నిన్న శనివారం ఏకంగా 3.04 కోట్ల నెట్ రాబట్టడం విశేషం. బాలీవుడ్ సినిమాలు లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ వంటి సినిమాల కంటే ఇది రెట్టింపు కావడం మరో విశేషంగా చెప్పుకోవాలి.

ఇటు మన తెలుగు రాష్ట్రాలు, అటు ఉత్తరాది ప్రేక్షకుల ఆదరణతో పాటు ఓవర్సీస్ లో కూడా విజయ ఢంకా మోగిస్తోంది కార్తికేయ 2 చిత్రం. శనివారం దాదాపు $150K కలెక్ట్ చేసిన కార్తికేయ 2, మొత్తంగా ఒక వారం నాటికి ఓవర్సీస్ లో $915k నంబర్ ను క్రాస్ చేసింది, ఇంకా కొన్ని లోకేషన్ల నుంచి కలేక్షన్ల వివరాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆదివారం వన్ మిలియన్ (1M) ఫిగర్ ను సాధిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. అంతే కాకుండా ఈ ఏడాది (2022)లో రెండవ శనివారం అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో RRR($705k) మొదటి స్థానంలో ఉండగా, కార్తికేయ 2 సినిమా రెండవ స్థానంలో నిలిచింది.

తొమ్మిదేళ్ళ తరువాత వస్తున్న సూర్య – దేవిశ్రీప్రసాద్ కాంబో

0

తమిళ స్టార్ హీరో సూర్య, మ్యూజికల్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. వీరిద్దరూ ఇప్పటి వరకు కలిసి చేసిన సినిమాలు మాయావి, ఆరు, సింగం 1 మరియు సింగం 2. ఆ సినిమాలన్నీ భారీగా విజయవంతం అవడంతో పాటు పాటలు కూడా చక్కని జనాదరణ పొందాయి. అంతే కాకుండా ఈ సినిమాలు సూర్య కెరీర్‌లో మరపురాని చిత్రాలుగా నిలిచాయి. ఆ హవాలో తమిళ మార్కెట్‌లో దేవిశ్రీప్రసాద్ ను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాయి. సూర్య – దేవిశ్రీప్రసాద్ ల కాంబినేషన్ సింగం 2 తరువాత మళ్ళీ రిపీట్ అవలేదు.

అయితే, తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం , వీరిద్దరూ మళ్ళీ కలిసి పని చేయడానికి సిద్ధం అవుతున్నారు. కమర్షియల్ సినిమాలు తీయడంలో తనదైన ముద్ర వేసిన తమిళ దర్శకుడు సిరుతై శివతో సూర్య చేయబోయే చిత్రం కోసం సూర్య – దేవీ మళ్లీ కలవనున్నారు. సూర్య ఇటీవల జై భీమ్ మరియు సూరరై పొట్రు వంటి సందేశాత్మక చిత్రాలలో తన నటనకు ఎనలేని ప్రశంసలు అందుకున్నారు. అయితే, ఆ రెండూ కూడా ధియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదలైన సినిమాలు. ఆ రెండు చిత్రాల తరువాత సూర్య నటించిన ET ( ఎవ్వరికీ తల వంచడు) థియేటర్లలో విడులైంది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుందని సూర్య ఆశించారు కానీ అది కూడా జరగలేదు. ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించి, బాక్స్ ఆఫీస్ వద్ద కమ్ బ్యాక్ ఇద్దామన్న సూర్య ఆశ నెరవేరలేదు.

పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ET సినిమా ప్రధాన కదా లైంగిక వేధింపుల నేపథ్యంలో తెరకెక్కినది. ఈ చిత్రంలో సూర్య మరోసారి లాయర్ పాత్రలో మెప్పించారు. కమర్షియల్ గా విజయం సాధింలేకపోయినా నటుడిగా మాత్రం మరోసారి సూర్య ఆకట్టుకున్నారు.

ఇక సిరుతై శివతో తీయబోతున్న సినిమాలో ఈ తమిళ స్టార్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని సమాచారం. అంతే కాకుండా ఈ చిత్రాన్ని ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా నిర్మిస్తారని కూడా కథనాలు సూచిస్తున్నాయి. బాలీవుడ్ భామ దిశా పటాని కథానాయికగా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

OTT: హైవే రివ్యూ

0

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ, మానస రాధాకృష్ణన్, సయామీ ఖేర్, సురేఖవాణి తదితరులు.

దర్శకత్వం కేవీ గుహన్

నిర్మాత: వెంకట్ తలారి

మ్యూజిక్: సైమన్ కే కింగ్

సినిమాటోగ్రఫి: కేవీ గుహన్

ఎడిటర్: తమ్మిరాజు

ఒటిటీ ప్లాట్ ఫామ్: ఆహా

రేటింగ్: 2.5/5

విజయ్ దేవరకొండ తమ్ముడుగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఆనంద్ దేవరకొండ.. కొత్త రకమైన ప్రయత్నాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కెమెరా మెన్ గా పరిశ్రమలో ఒక వెలుగు వెలిగి.. 2020లో కళ్యాణ్ రామ్ తో 118 వంటి హిట్ సినిమాని అందించిన కేవి గుహాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

కథ:

హైద‌రాబాద్ సిటీలో ఓ సైకో కిల్ల‌ర్ దాస్ (అభిషేక్ బెనర్జీ) ఒంటిరిగా అమ్మాయి కనపడితే నిర్మాన్యుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి అతి క్రూరంగా చంపేస్తుంటాడు. ఐదు హత్యలు చేసిన ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకునేందుకు ఏసీపి ఆశా భరత్(సయామీ ఖేర్) ప్ర‌య‌త్నిస్తుంటుంది. మ‌రోవైపు ఫొటోగ్రాఫ‌ర్‌ విష్ణు (ఆనంద్ దేవరకొండ) ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ప్రెండ్ స‌ముద్రం (సత్య) తో క‌లిసి వైజాగ్ నుండి బెంగ‌ళూరు హైవేలో బ‌య‌లుదేరుతాడు. మంగ‌ళూరులో ఉన్న తండ్రిని క‌లుసుకోవ‌డానికి తుల‌సి (మానస రాధాకృష్ణన్) ఒంట‌రిగా బ‌య‌లుదేరుతుంది. మ‌ధ్యలో బ‌స్ మిస్ కావ‌డంతో ఆమెకు విష్ణు లిఫ్ట్ ఇస్తాడు. ఆ పరిచయం ఎక్కడికి దారి తీసింది?తులసి, విష్ణులకు ఆ సైకో కిల్లర్ ఎదురైతే అప్పుడు ఏమౌతుంది…విష్ణు అతన్ని ఎలా ఎదురుకుంటాడు అనేది మిగతా కథ.

విశ్లేషణ:

రెగ్యులర్ గా సైకో కిల్లర్ చిత్రాలు ఒక ఫార్ములా ప్రకారం నడుస్తూ ఉంటాయి. ఓ సీరియల్ కిల్లర్ వరస హత్యలు చేయడం.. అతన్ని పట్టుకోవటానికి పోలీస్ లు ప్రయత్నించడం.. ఈలోగా హీరోయిన్ ఆ కిల్లర్ చేతిలో చిక్కడం, చివరికి హీరో ఆ సైకో కిల్లర్ నుంచి హీరోయిన్ ను రక్షించడం ఇలా సాగుతూంటాయి. ఈ సినిమాలో తూచ తప్పకుండా అదే వ్యవహారం నడిచింది. మచ్చుకైనా ఒక్కటంటే ఒక్క దగరైనా ప్రేక్షకుడి ఊహకి అందని విధంగా సినిమా ఉండదు. ఏదో అలా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి మలుపులు లేదా అడ్డంకులు లేకుండా హైవే పై అలా తాపీగా ప్రయాణం చేసినట్లు కథనం సాగుతుంది. ఇలాంటి జానర్ సినిమాలలో ఏదో ఒక కొత్త దనం చూపితే కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం వీలు కాదు. ఈ సినిమాలో అసలు ప్రేక్షకులని షాక్ కు గురి చేసే అంశాలు ఏమాత్రం కనపడవు. అలాగే సైకో కిల్లర్ పాత్ర ఏమయినా ఆసక్తికరంగా ఉంటుందా అంటే అదీ లేదు. ఒక థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన స్పీడ్, టెన్షన్ ఏది లేదు. క్లైమాక్స్ లో వచ్చే పులి ఎపిసోడ్ అయితే మరీ దారుణంగా ఉందని చెప్పచ్చు.

ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. సైమన్ కే కింగ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు సరిగ్గా సరిపోయింది. పాటలు ఈ సినిమాలో అనవసరం అని చెప్పచ్చు. సినిమాటోగ్రఫీతో పాటు దర్శకత్వం కూడా చేసిన కేవీ గుహన్ కెమెరా వర్క్ వరకూ బాగా పనితనం చూపించినా.. దర్శకుడుగా మాత్రం అనుకున్నంత స్థాయిలో ప్రతిభను చూపలేకపోయారు. ఎడిటింగ్ కూడా ఇంకా బాగుండాల్సింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ , హీరోయిన్ మానస రాధా కృష్ణన్ ఇద్దరూ మంచి నటనను కనబరిచారు. సైకో కిల్లర్ పాత్రలో అభిషేక్ బెనర్జీ బాగా చేశారు. సయామీ ఖేర్ పోలీస్ పాత్రకు సెట్ అయ్యింది. అయితే ఆమె పాత్ర చిత్రణ ఇంకాస్త బాగుండాల్సింది. మిగతా నటీనటులు పరవాలేదు.

చివరిగా.. మంచి థ్రిల్లర్ కి కావాల్సిన అన్ని అంశాలు ఉన్నప్పటికీ.. తెరకెక్కించడంలో లోపాల వలన ఒక రొటీన్ థ్రిల్లర్ మిగిలింది హైవే.

The hit combination is back, Will it be a much-needed blockbuster for Suriya?

0

Suriya and Devi Sri Prasad combination has been quite a successful one. The actor-director combo has so far given massively successful albums and films like Mayavi, Aaru, Singam 1, and Singam 2. These films have been quite monumental in Suriya’s career and also established DSP as one of the top composers in the Tamil market.

Now, as per reports, the duo will be reuniting for Suriya’s upcoming film with Siva. Suriya received a lot of acclaim for his recent performances in Jai Bheem and Soorarai Pottru. However, he needs massive commercial success now. He was hoping that ET would be a massive success but that didn’t happen as well. The movie was a commercial success but it wasn’t the blockbuster that everyone hoped it would be.

Etharkkum Thunindhavan’s (ET) plot revolves around a sexual assault case. Suriya once again impressed in the role of a lawyer.

The big ticket film will reportedly have the Tamil star appear in the dual role, and the sources hint that it could be billed as a pan-Indian project. Disha Patni is rumoured to be playing the female lead and it will go on floors pretty soon.

రణ్బీర్ కపూర్ షంషేరా OTT స్ట్రీమింగ్ డీటైల్స్

0

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించగా తాజాగా విడుదలైన పీరియాడిక్ యాక్షన్ డ్రామా షంషేరా ఇప్పుడు OTTలో ప్రసారం అవుతోంది. ఈ చిత్రం గత నెలలో విడుదల అయిన ఈ చిత్రం అత్యంత పేలవమైన సమీక్షలను తెచ్చుకుంది. ఇటీవల అన్ని బాలీవుడ్ సినిమాల లాగే మరో భారీ బడ్జెట్ వైఫల్యంగా నిలిచింది. బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు మరియు భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ వరుసగా వైఫల్యం చెందుతున్న విషయం తెలిసిందే.

షంషేరా సినిమాలో వాణి కపూర్ హీరోయిన్ గా మరియు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించారు. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన షంషేరా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ, తెలుగు మరియు తమిళంలో ప్రసారం కాబడుతోంది. యష్ రాజ్ ప్రొడక్షన్స్ ఈ అత్యంత ప్రతిష్టాత్మక సినిమాని భారీ స్థాయిలో నిర్మించింది. సినిమాలో ఉన్న స్టార్‌ కాస్ట్, ఎంచుకున్న సబ్జెక్ట్‌ను పరిగణనలోకి తీసుకుంటే బాక్సాఫీస్ వద్ద తీసుకుంటే ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తుందని అందరూ అనుకున్నారు.

అయితే ఈ చిత్రం విడుదల రోజునే దారుణమైన స్పందనను సొంతం చేసుకుని బాలీవుడ్ వర్గాలను షాక్ కు గురి చేసింది. రివ్యూస్ లో ఈ సినిమాని విమర్శకులు అందరూ ఏకి పారేశారు. ఈ చిత్రం 1800ల నాటి నేపథ్యంతో రూపొందించబడింది. బ్రిటీష్ ప్రభుత్వం నుండి స్వాతంత్ర్యం కోసం చేసిన ఒక దోపిడీదారుల తెగకు సంభందించిన కథను ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణబీర్ కపూర్ ఈ చిత్రంలో షంషేరా (ఒక గిరిజన తెగ నాయకుడు) మరియు అతని కుమారుడు బాలి (అల్లరి దొంగ) గా ద్విపాత్రాభినయం చేశారు.

నాలుగు సంవత్సరాల తర్వాత రణ్ బీర్ కపూర్ హీరోగా చేసిన సినిమా విడుదల రావడం, అలాగే దర్శకుడు కరణ్ మల్హోత్రా ఏడు సంవత్సరాల తర్వాత దర్శకత్వం వహించడం వలన ఈ సినిమా పై అటు ఇండస్ట్రీ వర్గాలలో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాని మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు.

Box-Office: కార్తీకేయ-2 7 డేస్ హిందీ కలెక్షన్స్

0

యువ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద తన అద్భుతమయిన రన్ ను కొనసాగిస్తుంది. థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి ఎక్కడ చూసినా సినిమా గురించే చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ముందు నుంచే ఈ సినిమా పట్ల ప్రేక్షకులు అమితమైన ఆసక్తిని కనబరిచారు. అందువల్ల తెలుగులో విజయం సాధించడం అర్థం చేసుకోవచ్చు. కానీ హిందీ వెర్షన్ ఘన విజయం సాధించడం మాత్రం ఎవరూ ఊహించి ఉండరు.

కార్తికేయ 2 హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు 7 లక్షల నెట్ తో మొదలైంది. కానీ సినిమా చూసిన ఉత్తరాది ప్రేక్షకులు సూపర్ టాక్ ఇచ్చారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి ధియేటర్లు మరియు షోలు పెంచాలంటూ సినిమాకి మద్దతు పలికారు. దాంతో రోజు రోజుకూ కార్తీకేయ 2 సినిమాకి స్క్రీన్ లతో పాటు కలెక్షన్లు పెరిగాయి.

అలా సినిమా చుట్టూ ఉన్న పాజిటివ్ బజ్ కారణంగా, చిత్రం రెండవ రోజు కలెక్షన్ల 28 లక్షలకు చేరుకుంది.మూడవ రోజు 1.10 కోట్లకు చేరుకోగా, నాలుగో రోజు 1.28 కోట్లను రాబట్టింది. మామూలుగా అయితే రోజులు గడుస్తున్న కొద్దీ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవుతాయి కానీ కార్తికేయ 2 మాత్రం అందుకు విరుద్ధంగా రోజు రోజుకూ కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. ఇంక పెరిగిన స్క్రీన్స్ సహాయంతో అయిదవ రోజు 1.38 కోట్లతో నిలిచింది. ఆ పైన ఆరవ రోజు 1.68 కోట్లను సంపాదించుకుంది.

7వ రోజు శ్రీ కృష్ణ జన్మాష్టమి అవడంతో మంచి వసూళ్లు రాబట్టింది. జన్మాష్టమి పండుగ మరియు హాలిడే అడ్వాంటేజ్ కారణంగా, కార్తికేయ 2 సినిమా ఈ ఒక్క రోజే 2.46 కోట్ల వసూళ్లు రాబట్టింది. అదే జోరును కొనసాగిస్తూ రెండో వారాంతంలో మొదటి మూడు రోజుల కంటే 4-5 రెట్లు ఎక్కువ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మొత్తంగా కార్తికేయ 2 7 రోజుల తర్వాత 8.21 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించడం విశేషం. మొత్తంగా విడుదలకు ముందు అనిశ్చితిని కలిగి ఉన్న కార్తీకేయ 2 చిత్రం ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం అందరికీ ఆనందాన్ని ఇచ్చింది.

Ranbir Kapoor’s Shamshera Telugu Version OTT streaming details

0

Ranbir Kapoor’s recent action drama Shamshera is now streaming on OTT. The film was released last month amidst poor reviews and ended up as yet another Bollywood big-budget failure. Shamshera starred Vaani Kapoor and Sanjay Dutt in key roles.

Directed by Karan Malhotra, Shamshera is now streaming in Hindi, Telugu and Tamil on Amazon Prime Video. Yash Raj Productions bankrolled this highly ambitious project which was expected to do well at the box- office considering the starcast and fresh subject.

The film however received terrible word of mouth right on the release day. The movie is set in 1800s and follows the life story of a dacoit tribe and their fight for independence from the Britishers. Ranbir Kapoor played a double role in this film as Shamshera ( a tribal chief) and his son Bali (a decoit).

There were massive expectations on the project as it marked Ranbir Kapoor’s return after 4 years and director Karan Malhotra was returning to direction after 7 years. You can watch the film here.

Anand Deverakonda’s film is directly streaming on OTT now

0

After the debacle of his previous film Pushpaka Vimanam, the makers of Anand Deverakonda’s Highway have opted for a rather safe option. The film has gone for a direct OTT release and is streaming on Aha now.

The film released yesterday to mostly negative reviews. Highway revolves around Vishnu (Anand Deverakonda), a photographer who travels to Bengaluru and meets a woman Tulasi (Manasa Radhakrishnan) on the way.

The two become friends soon. However, the story takes a dark turn when they come across a serial killer who is baying for their blood.

Cinematographer turned director KV Guhan who earlier directed Kalyan Ram starter thriller 118 has directed this film as well. Highaway also stars Saiyami Kher, Satya, Abhishek Banerjee and John Vijay in key roles.

Venkat Talari has produced the film while Simon. K. King has composed the music for this horror thriller.