Home Blog Page 2037

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బండ్ల గణేష్ కొత్త సినిమా ఓటిటి విడుదల

0

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాత మరియు నటుడు కూడా అయిన బండ్ల గణేష్ ఆయన వ్యక్తిగత పనుల కన్నా పవన్ కళ్యాణ్ అభిమానిగా ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. ఒక రకంగా బండ్ల గణేష్ తనకంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పచ్చు. బండ్ల గణేష్ పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ పై తనకున్న ప్రేమను చాలాసార్లు వ్యక్తం చేశారు. అలాగే ఆయన పవన్ కళ్యాణ్‌ను ఎంతగా ఆరాధిస్తున్నాడనే విషయం చాలా స్పష్టంగా అందరికీ తెలుసు.

అయితే తన అభిమానాన్ని మరోసారి వినూత్నంగా చాటుకున్నారు బండ్ల గణేష్. అదెలా అంటే.. బండ్ల గణేష్ తదుపరి చిత్రం సెప్టెంబర్ 2న అంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓటిటిలో విడుదల కానుంది. తమిళంలో అద్భుతమైన ప్రశంసలతో పాటు అవార్డులను కూడా అందుకున్న ఒత్త సెరుప్పు సైజ్ 7కి రీమేక్ గా తెరకెక్కిన తాజా బండ్ల గణేష్ చిత్రం డేగల బాబ్జీ, రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆహా తెలుగులో ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించబడుతుంది.

ఒత్త సెరుప్పు లాగా డేగల బాబ్జీలో కూడా ఒకే ఒక్క నటుడు ఉంటాడు. ఈ సినిమాలో బండ్ల గణేష్, నటుడిగా తన సత్తా చాటాడని ట్రైలర్ చూస్తేనే స్పష్టంగా అర్థమవుతోంది. వరుస నేరాలు చేసినందుకు పోలీసులచే శిక్షించబడిన ఒక వ్యక్తి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఎందుకు నేరాలు చేశావని పోలీసులు ప్రశ్నించబడినప్పుడు, ప్రధాన పాత్ర అందుకు ఆసక్తికరంగా వివరించే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

ఒత్త సెరుప్పు సైజ్ 7 సినిమా జాతీయ అవార్డులతో సహా అనేక ప్రశంసలను గెలుచుకున్న చిత్రం. తమిళ నటుడు ఆర్ పార్థిబన్ ఈ చిత్రానికి ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా రచన మరియు దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఈ రీమేక్‌ సినిమా పట్ల బండ్ల గణేష్‌ కు భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో ఇది ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.

ఈ సినిమాలో పాత్రధారులలో కేవలం బండ్ల గణేష్ మాత్రమే మనకు కనిపిస్తాడు, ఇతర నటీనటులు కనపడకుండా కేవలం వారి గొంతులు మాత్రమే వినపడతాయి. ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకుడు కాగా స్వాతి ఎస్ నిర్మాత. లైనస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా వ్యవహారించారు. మరి ఈ చిత్రంతో బండ్ల గణేష్ నటుడిగా చక్కని ప్రశంసలు అందుకుంటారని ఆశిద్దాం.

కొత్త నిర్ణయాలు, నిభందనలు ప్రకటించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్

0

గత కొన్ని నెలలుగా, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యలు పరిష్కరించడం కోసం కొన్ని రోజులుగా కొత్త నిభందనలు మరియు మార్గదర్శకాలను తీసుకురావడానికి సన్నాహాలు కూడా చేస్తుంది. కొన్ని వారాల క్రితం పరిశ్రమలో సమస్యలు పరిష్కరించే వరకు సినిమాల షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.తాజాగా ఛాంబర్ మళ్లీ సమావేశమై OTT, శాటిలైట్ డీల్స్‌తో పాటు కళాకారుల పారితోషికానికి సంబంధించి కొన్ని కీలక అంశాల పై చర్చించడం జరిగింది. డా.రామానాయుడు భవనంలోని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలిలో ఈ సమావేశం జరిగింది. ఈ క్రమంలో అందరితోనూ ముఖ్యమైన అంశాలు చర్చించబడ్డాయి. ఈ మేరకు ఛాంబర్ విధించిన నియమాలు ఏవిటంటే..

సినిమాల నిర్మాణం

సినిమాల్లో నటించే ఏ ఆర్టిస్టు లేదా టెక్నీషియన్‌లకు ప్రతి రోజు పారోతోషికం చెల్లించడం ఉండదు. కళాకారులందరి వేతనాలలోనే సిబ్బంది, స్థానిక రవాణా, స్థానిక వసతి మరియు ప్రత్యేక ఆహారంకి సంభందించిన ఖర్చులు కూడా కలిసే ఉంటాయి. కాగా ఆ పారితోషికాన్ని నిర్మాత ముందే ఖరారు చేయాలి.. అలా ఖరారు చేసి పరస్పరం అంగీకరించిన అమౌంట్ నే రెమ్యునరేషన్‌గా ఇవ్వడం జరుగుతుంది తప్ప మళ్ళీ కళాకారుడికి ఎలాంటి ఇతర చెల్లింపు చేయడం జరగదు.

ఛాంబర్‌కి షూటింగ్ ప్రారంభమయ్యే ముందు అన్ని రుసుము వివరాలను నమోదు చేయాలి. ఛాంబర్ ఆ వివరాలను ధృవీకరించిన తర్వాత మాత్రమే షూటింగ్ నిర్వహించాలి. రోజువారీ కాల్ షీట్ సమయాలను కూడా ఖచ్చితంగా అమలు చేయాలి మరియు నిర్మాత ఇవన్నీ సక్రమంగా ఒక నివేదికలో పొందు పరచాలి.

OTT

OTTకి సంబంధించిన కొత్త నిబంధనలతో ఛాంబర్ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ధియేట్రికల్ రిలీజ్ నుంచి ఓటిటి రిలీజ్ కి మధ్య గ్యాప్ లో ఈసారి ఎటువంటి మార్పు ఉండదు. బాక్సాఫీస్ వద్ద సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఫలితంతో సంబంధం లేకుండా OTT విడుదలకు ఖచ్చితంగా 8 వారాల గడువు ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు.

అలాగే ఏ సినిమా కూడా తమ డిజిటల్/శాటిలైట్ పార్టనర్‌ను సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు టైటిల్ కార్డ్‌లో చుపించకూడదని అలాగే థియేట్రికల్ పబ్లిసిటీ కోసం కూడా ఉపయోగించకూడదని ఛాంబర్ చాలా స్పష్టంగా చెప్పింది.

థియేట్రికల్/ఎగ్జిబిషన్

VPF ధరల పై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ విషయం మీద త్వరలో నిర్ణయం తీసుకోబడుతుంది. సెప్టెంబరు 3న ఛాంబర్‌లో ఈ విషయం పైనే చర్చ జరగాల్సి ఉండగా.. దానిని సెప్టెంబర్‌ 6వ తేదీకి వాయిదా వేశారు. ఇక తెలంగాణలో ఇచ్చినట్లే ఆంధ్రా మల్టీప్లెక్స్‌లలో వీపీఎఫ్‌ శాతం ఇవ్వనున్నారు.ఫెడరేషన్దీనిపై ఛాంబర్‌లో ఇంకా చర్చలు జరుగుతున్నాయి, త్వరలోనే ఛాంబర్ తుది నిర్ణయం వెలువడనుంది. ఛాంబర్ ఆమోదించిన, అందరితోనూ చర్చించి ఖరారు చేసిన రేట్ కార్డ్‌లు అతి త్వరలో అన్ని నిర్మాణ సంస్థలకు అందజేయబడతాయి.

OTT: ఆహాలో నేరుగా రిలీజైన రెండు కొత్త తెలుగు సినిమాలు

0

కరోనా వరుస దాడులతో కాస్త ఇరుకున పడ్డ తెలుగు సినిమా పరిశ్రమ మరియు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ మార్కెట్ కూడా మెల్లమెల్లగా పుంజుకుంటున్నా, OTT మార్కెట్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా అందరూ మారాల్సిన అవసరం ఎంతయినా ఉంది. అందుకే ఇప్పుడు ధియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలతో పాటు అక్కడ సరిగ్గా ఆడే అవకాశం లేని కాస్త విభిన్నమైన ప్రయత్నాలు ఓటిటీలో విడుదల అవుతున్నాయి.

అందువల్ల ప్రేక్షకులకు అన్ని రకాల వినోద అంశాలు అందుతుంది.ఆరోగ్యకరమైన వాతావరణంలో అటు ధియేటర్ల వ్యవస్థ, ఇటు ఓటిటి వ్యవస్థ రెండూ కలిసి ముందుకి వెళ్లడం అనేది చాలా మంచిది. ప్రతి సంవత్సరం లెక్కలేనన్ని సినిమాలు వస్తుంటాయి, అలాంటప్పుడు ప్రతి సినిమాను థియేటర్లలో విడుదల చేయలేరు కదా. వెండి తెరపైకి రాలేని కొన్ని సినిమాలు ఇప్పుడు చిన్న తెరపై అంటే ఓటిటిలలో విడుదలై పేరు తెచ్చుకుంటున్నాయి.ఈ క్రమంలో రెండు కొత్త తెలుగు సినిమాలు ఇప్పుడు నేరుగా ఓటిటిలో ప్రసారం అవుతున్నాయి.

అందులో మొదటి సినిమా పెళ్లికూతురు పార్టీ.. అపర్ణ మల్లాది రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ, తన అక్క పెళ్లి నాశనం చేయడానికి ప్రయత్నించే ఒక చెల్లెలు గురించి హాస్యం జోడించి చెప్పే ఒక హాస్య చిత్రం. ఆమెకు ఆ పనిలో అమ్మమ్మ కూడా సహాయం చేస్తుంది. ఈ కథ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తుంది. పెళ్లికూతురు పార్టీ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో చక్కని స్పందన తెచ్చుకుంది. అలాగే చాలా మంది హృదయాలను గెలిచి ప్రశంసలు అందుకుంటున్నది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా తెలుగులో ప్రసారం అవుతోంది.

ఇక ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన మరో సినిమా పంచతంత్ర కథలు. పెళ్లికూతురు పార్టీ చిత్రంతో పోలిస్తే పంచతంత్ర కథలు ఎక్కువగా ప్రాచుర్యం పొందలేదు. ఈ సినిమాకు గంగనమోని శేఖర్ రచనతో పాటు దర్శకత్వం కూడా వహించారు, ఈ చిత్రం సామాజిక సమస్యలను, వాటి పరిష్కారాల గురించి చర్చించే 5 కథల సమూహం. కులం విలువ, సెక్స్, వ్యభిచారం, స్వేచ్ఛ మరియు ప్రేమ అంశాల చుట్టూ తిరుగుతుంది. కేర్ ఆఫ్ కంచరపాలెం స్టైల్‌లో వేరు వేరు కథలతో ఒక సినిమాగా పంచతంత్ర కథలు సినిమాని చిత్రీకరించారు. ఈ సినిమా కూడా ఆహా తెలుగులోనే ప్రసారం అవుతోంది.

రంగ రంగ వైభవంగా – ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాల మొదటి రోజు టాక్

0

గత వారం లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత, ఈరోజు రెండు కొత్త తెలుగు సినిమాలు పెద్ద తెరపైకి వచ్చాయి. మొదటిది ఫస్ట్ డే ఫస్ట్ షో, ఈ చిత్రానికి జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కెవి కథ అందించారు. ఇక రెండో సినిమా వైష్ణవ్ తేజ్ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రంగ రంగ వైభవంగా.రెండు చిత్రాల ప్రీమియర్ షోల నుండి పబ్లిక్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

ఫస్ట్ డే ఫస్ట్ షో చాలా విషయాలను జొప్పించటానికి ప్రయత్నించినప్పటికీ సినిమా తీరు ప్రేక్షకులకు విసుగు పుట్టించేలా తయారైంది. జాతి రత్నాలు సినిమాలో లాగానే కామెడీతో మ్యాజిక్‌ చేసే ప్రయత్నం జరిగింది కానీ ఆ ప్రయత్నంలో చిత్ర బృందం అన్ని రకాలుగా ఘోరంగా విఫలమైంది.

ప్రేక్షకులను నవ్వించే లేదా అలరించే ఏ ఒక్క సన్నివేశం కూడా లేదని వాపోయారు. అనుదీప్ కథ రాసినప్పటికీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది వంశీదర్ గౌడ్, లక్ష్మీనారాయణ. జాతి రత్నాలు సినిమా నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శి వంటి ప్రతిభావంతమైన నటుల వల్ల ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అలాంటి ఆకట్టుకునే మాయాజాలం ప్రదర్శించడంలో విఫలమైంది.

ఇక రంగ రంగ వైభవంగా సినిమా కూడా పెద్దగా గొప్ప టాక్ తెచ్చుకోలేదు. సినిమాలో ఫస్టాప్ వరకూ హీరో – హీరోయిన్ల మధ్య చిలిపి గొడవలు చూపిస్తూ కాస్త సరదాగా సాగినా.. సెకండాఫ్ కి వచ్చేసరికి ఎమోషనల్ సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఏ క్షణంలో కూడా పాత్రలతో, సినిమాతో ప్రేక్షకులు కనెక్ట్ అవకుండా ఉన్న ఈ సినిమా కూడా డిజాస్టర్ దిశగా పయనిస్తోందనే చెప్పాలి.

ఓవరాల్‌గా, ఈ రోజు విడుదలైన రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల పై ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి. అసలు రెండు సినిమాలు విడుదలైన సందడి కూడా చాలా తక్కువగా ఉంది. ఇక ఇలా నెగటివ్ టాక్ రావడంతో రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీసు వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చెప్పినట్టు కంటెంట్ బాగుంటేనే జనాలు థియేటర్లకు వస్తారనే విషయం మరోసారి రుజువైంది.

Powerstar Pawan Kalyan’s Jalsa Special shows Box office collections – All Time record

0

Released on the eve of Powerstar Pawan Kalyan’s birthday, the Jalsa re-release has been a massive success story. The film has shattered the records as far as special shows are concerned and has set a new benchmark in Tollywood.

The gross collections are massive from Nizam and this Pawan Kalyan and Ileana starrer has collected approx Rs 1.2 Cr in this region. Coming to other regions, Uttarandhra stands at Rs26L , Krishna – Rs 21L ,West Godavari Rs14L, Nellore Rs10L.

The total from Telugu states is a whopping 2.35Cr gross and worldwide the gross is around 3 Cr. This is a huge record and a massive milestone in the history of re-releases. The film was released on a massive scale worldwide and the advance bookings already indicated the storm that was to come.

Directed by Trivikram Srinivas, Jalsa became a successful film at the time of release in 2008 Power Star’s style and mannerisms were loved by fans all over.

కార్తికేయ-2 సినిమాతో భారీ స్థాయిలో మొదలైన పోస్ట్ ప్రో డబ్బింగ్ కంపెనీ

0

పోస్ట్ ప్రో అనేది ఒక పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ. ఈ కంపెనీని వసంత్ స్థాపించారు. పోస్ట్ ప్రో కంపెనీ ద్వారానే కార్తికేయ 2 చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ మరియు అన్ని భాషల్లోకి డబ్బింగ్ జరుపుకుంది. తెలుగు సినిమాలను ఇతర భాషల్లో అనువదించే సమయంలో నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని అన్ని భాషల అనువాదాల పనులు కూడా ఒకేసారి హైదరాబాద్ లో జరిగెందుకు వీలుగా పోస్ట్ ప్రో కంపెనీ ఏర్పాటు చేయబడింది.

ఈ సందర్భంగా కార్తీకేయ 2 చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా ఇతర భాషల్లో ఉన్న డబ్బింగ్ కళాకారులతో పాటు రచయితలను కూడా హైదరాబాద్ కు రప్పించి, నిర్మాతల సౌలభ్యం కోసం కార్తికేయ 2 సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను పోస్ట్ ప్రో పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ హైదరాబాద్ లో పూర్తి చేయడం జరిగింది. కార్తికేయ 2 చిత్రానికి హైదరాబాద్ లోనే డబ్బింగ్ పనులు పూర్తి చేయడం ద్వారా మాకు బడ్జెట్ కంట్రోల్ లో ఉండడమే కాకుండా.. దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమా అనువాద కార్యక్రమాలను రోజూ చూసుకొని అవసరమైన మార్పులు చేసుకోనే అవకాశం లభించింది. దాంతో పాటు చాలా సమయం ఆదా అయ్యింది అని కూడా అన్నారు. సినిమా విడుదల చివరి వరకు తమతోనే ఉండి అన్ని రకాలుగా వెన్నుదన్నుగా నిలిచి సహకరించిన పోస్ట్ ప్రో డబ్బింగ్ కంపెనీ వసంత్ గారికి కార్తీకేయ చిత్ర నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు.

కార్తికేయ 2 సినిమాను ఇతర భాషల్లో అనువదించే అవకాశాన్ని ఎంతో నమ్మకంతో పోస్ట్ ప్రో కంపెనీకి అప్పగించిన నిర్మాతలు టీ. జి. విశ్వ ప్రసాద్ గారికి, వివేక్ కుచిబొట్ల గారికి అభిషేక్ అగర్వాల్ గారికి, దర్శకులు చెందు మొండేటి గారికి హీరో నిఖిల్ సిద్ధార్థ్ మొదలగు వారందరికీ పోస్ట్ ప్రో కంపెనీ అధినేత వసంత్ గారు కృతజ్ఞతలు తెలిపారు. కార్తికేయ 2 సినిమానే కాకుండా.. ప్రస్తుతం పోస్ట్ ప్రో కంపెనీ పలు భారీ సినిమాలను కూడా అనువదించే పనిలో ఉందని తెలుస్తోంది.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కార్తీకేయ 2 చిత్రం విశేష స్థాయిలో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించారు. కాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఒక కీలక అతిథి పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలైంది.

Box Office: స్పెషల్ షోలలో అల్ టైం రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ జల్సా

0

టాలీవుడ్ లో ఇటీవలే రి రిలీజ్ ల ట్రెండ్ మొదలైన సంగతి అందరికి తెలిసిందే. ఆ ట్రెండ్ ఏంటంటే స్టార్ హీరోల అభిమానులు.. వారి అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా, ఆ హీరో నటించిన పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయించే ట్రెండ్. ఆగస్టు 9న మహేష్ బాబు పోకిరి సినిమా ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా అత్యధిక స్క్రీన్స్ ల్లో రీ రిలీజ్ చేసిన మహేష్ అభిమానులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు . ఆ క్రమంలో రీ రిలీజ్ షోలు మరియు సంబరాలలో పోకిరి రికార్డు సృష్టించింది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అంతకు మించి అన్నట్లుగా జల్సా సినిమాను రీ రిలీజ్ చేసి తమ సత్తా ఏంటో చూపించారు. 500 షోలు వేసి రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరగగా.. మొత్తం అయ్యేసరికి ఆ సంఖ్య దాదాపు 750 కి పెరగటం విశేషం. ఈ రి రిలీజ్ ను ఒక సవాలుగా తీసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు అడ్వాన్స్ బుకింగ్ మరియు థియేటర్ ల వద్ద సందడిని అసలు ఎవరూ ఊహించని స్థాయిలో జరిపి అందరినీ ముక్కున వేలేసుకునెలా చేసారు అంటే అది అతిశయోక్తి కానే కాదు.

జల్సా సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో అల్లు అరవింద్ నిర్మించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్గా నటించగా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించారు. కమలిని ముఖర్జీ, పార్వతీ మెల్టన్ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో అద్భుతమైన కామెడీతో పాటు అంతర్లీనంగా ప్రధాన పాత్ర అయిన సంజయ్ సాహుకు ఒక భావోద్వేగమైన అంశం కూడా ఉంటుంది. ఇక ఈ సినిమా సెకండాఫ్ లో పవన్ మరియు బ్రహ్మీ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. 2008 సంవత్సరంలో వేసవి కానుకగా విడుదలైన జల్సా సినిమాకు ఆ సమయానికి విశేష స్థాయిలో క్రేజ్ ఉండింది. భారీ అంచనాల నడుమ తొలిరోజు కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ లో మాత్రం దుమ్ము దులిపి తెలుగు సినిమా బాక్స్ ఆఫీసు వద్ద అల్ టైం టాప్ 2 చిత్రంగా నిలిచింది.

ఆ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా అప్పట్లో ఒక ప్రత్యేక అంశంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. ఒక స్టార్ హీరో సినిమాకు మరో స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది సినిమాకి ఒక ప్రత్యేకతను ఆపాదించి పెట్టింది. ఇక పవన్ జల్సా సినిమా రీ రిలీజ్ లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఈ మేరకు పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా స్పెషల్ షోలతో సెన్సేషన్ క్రియేట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు, మొత్తం అన్ని షోలకు కలుపుకుని గ్రాస్ కలెక్షన్స్ ద్వారా నైజాం నుంచి దాదాపు 1.2 కోట్లు, ఉత్తరాంధ్రలో 26 లక్షలు, కృష్ణా – 21 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలలో 14 లక్షలు, నెల్లూరు నుంచి 10 లక్షలు ఇలా మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చిత్రం దాదాపు 2.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ 2.75 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారీ రికార్డ్ నెలకొల్పింది.

KGF2 Telugu Television premiere rating is low and disappointing

0

Rocking Star Yash’s KGF 2 Telugu made its world television premiere on August 21st and the numbers aren’t as per expectations. The film made its way to the small screen on Zee Telugu and it was expected that the TRP ratings would rival Tollywood biggies.

KGF 2 Telugu registered a lackluster TRP of just 9.15 which in no way is a reflection of the blockbuster performance few months ago.

This Prashanth Neel project created a big record theatrically which only 3 Indian films have done so far. It crossed the Rs 1000 crores benchmark at the box office. Only Bahubali 2, Dangal, and RRR have achieved this so far and it is indeed a massive moment for the entire team.

It also became the first film to gross Rs 100 crores + in four languages. This Yash starrer has managed to hit the Rs 100 crore gross mark in Kannada, Telugu, Tamil, and Hindi. No other film has ever done something like this.

The film featured Sanjay Dutt, Raveena Tandon and Sreenidhi Shetty in lead roles. Ravi Basrur composed rocking tunes for this action thriller.

టెలివిజన్ ప్రీమియర్ లో సాధారణ టీఆర్పీ రేటింగ్ తెచ్చుకున్న కేజీఫ్-2

0

కన్నడ స్టార్ యశ్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 2 చిత్రం ఈ ఏడాదిలో భారతీయ సినిమా పరిశ్రమలోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా గత వారం ఈ సినిమా టీవీలో తొలిసారి ప్రసారం అయ్యింది. ఈ సినిమాకు వచ్చిన టీఆర్‌పీ రేటింగ్ ఎంతంటే…

ఈ ఏడాది యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ 2 సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. కన్నడ, తమిళ, హిందీ, తెలుగు ఇలా ప్రతి భాషలోనూ విశేష స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకుని ఈ సంవత్సరం హయ్యెస్ట్ గ్రాసర్ గా కేజీఎఫ్ 2 నిలిచింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించిన ఈ సినిమా ఏకంగా 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం. మొత్తంగా దేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా కేజీఎఫ్ 2 నిలిచింది.

రాకీ భాయ్ పాత్రలో పండిన హీరోయిజం.. ఆ పాత్రలో యశ్ అభినయం అద్భుతంగా ఉండి ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ మాస్ టేకింగ్ కు ప్రేక్షకులు శభాష్ అన్నారు. అయితే థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా బుల్లితెరపై మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఇటీవల జీ తెలుగులో ఈ సినిమా ప్రసారం అయ్యింది. ఇదే తొలి టీవీ ప్రీమియర్ కావడంతో చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోషన్స్ చేసింది. కానీ ఈ సినిమాకు కేవలం 9.15 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇది మొదటి భాగం కంటే తక్కువ అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేజీఎఫ్ పార్ట్ వన్ 11.9 టీఆర్‌పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. అంత భారీ హిట్ అయిన సినిమాకు పార్ట్ వన్ కంటే తక్కువగా టీఆర్‌పీ రేటింగ్స్ రావడం చర్చనీయాంశంగా మారింది.

ఇక మిగతా డబ్బింగ్ సినిమాల టీఆర్పీ రేటింగులు చూస్తే.. రోబో 19.4, బిచ్చగాడు 18.75, కబాలి 14.52 టీఆర్‌పీ రేటింగ్ సాధించాయి. ఆ రకంగా చూస్తే.. రొబో, బిచ్చగాడు సినిమాల్లో సగం టీఆర్‌పీ రేటింగ్ కూడా కేజీఎఫ్ 2కు రాకపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇదిలా ఉండగా . ఆర్ ఆర్ ఆర్ మరియు కేజీఫ్ -2 రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీసు మరియు ఓటిటీలో తలపడిన విషయం తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వద్ద కేజీఫ్-2 పై చేయి సాధించినా.. ఓటీటీ మరియు శాటిలైట్ టెలికాస్ట్ లో మాత్రం ఆర్ ఆర్ ఆర్ కె విజయం లభించింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలు టీఆర్పీ రేటింగ్ 18.36 వచ్చిన సంగతి తెలిసిందే.

Theatre owners are very serious and not happy with Special shows celebrations

0

After Superstar Mahesh Babu’s Pokiri and Megastar Chiranjeevi’s Gharana Mogudu and Pawan Kalyan’s Jalsa were screened in a grand manner for the star’s birthdays. There are also plans of re-releasing Prabhas’ Billa and Chatrapati. However, fans and show organizers are now facing a small issue from theatre owners.

Pokiri and Jalsa special shows got a huge response and the fans are celebrated like never before. Few theatre owners failed to control the audience and the fans in euphoria did a lot of damage. These losses ran into lakhs for many theatres. In many places, chairs and screens were also damaged much to theatre management’s disarray.

In many theatres the entry gates and glasses were broken for Pokiri and the same has been repeated with Jalsa special shows now. Theatre owners are not happy to screen special shows now. Because of this continuous damage, they are planning to take a strong decision.

So now for any special shows, the exhibitors are demanding huge advances and the amount will be returned after the show if there is no damage. The exhibitors don’t want to take any risks now.

This trend of screening fan favourites is indeed a great one and is surely giving an experience that many fans who missed watching these films during their initial screenings. However, fans also need to enjoy in a way that causes no loss to property.