HomeMovie NewsED విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ

ED విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ

- Advertisement -

నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల విడుదలైన ‘లైగర్’ చిత్రానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) హైదరాబాద్‌లోని వారి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

తెలంగాణకు చెందిన ఓ అగ్ర రాజకీయ నాయకుడు విదేశాల నుంచి వచ్చిన కోట్లాది డబ్బును ఈ సినిమాలో పెట్టుబడిగా పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

‘లైగర్’ సినిమాలో హవాలా డబ్బుతో సహా విదేశీ నిధులు పెట్టుబడిగా పెట్టారని ఫిర్యాదు అందడంతో ఇటీవలే ED నటి మరియు నిర్మాత ఛార్మీ కౌర్ మరియు దర్శకుడు పూరీ జగన్నాథ్ లకు కూడా ED సమన్లు ​​పంపింది.

ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ లను కొన్ని రోజుల క్రితమే ఈడీ ప్రశ్నించింది. కాగా ఈరోజు నటుడు విజయ్ దేవరకొండ కూడా విచారణ కోసం ఈడీ కార్యాలయానికి వచ్చారు.

పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ చిత్రం ఆగష్టు 25న విడుదలైంది. రూ. 90 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ నటించిన ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రచారంలో ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

లైగర్ బాక్స్ ఆఫీస్ వద్ద దుర్భరమైన ప్రదర్శన కారణంగా ప్రాజెక్ట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఒక పీడకలగా మారింది అని చెప్పుకోవాలి. మనకు తెలిసినట్లుగా, లైగర్ ఒక పెద్ద విపత్తుగా మారి రిలీజ్ కు ముందు చేసిన వ్యాపారంలో 30% కూడా వసూలు చేయడంలో విఫలమైంది.

ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపరిహారం అడగడం.. పూరీ ఇంటి ముందు ధర్నాకు దిగడం.. ఆనక పూరీ వారందరి పై పోలీస్ కేస్ పెట్టడం మొదలగు వివాదం అంతా ఇటీవల సంచలన వార్తలను సృష్టించింది.

కాగా లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలు పోషించారు. రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, అలీ మరియు మకరంద్ దేశ్‌పాండే ఈ చిత్రంలో సహాయక పాత్రలు పోషించారు. లైగర్‌ను పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు.

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories