Home Blog Page 882

Chiranjeevi Counters Mohan Babu

0

Megastar Chiranjeevi recently received the prestigious ANR Award, presented by Amitabh Bachchan, at an event hosted by Nagarjuna. Chiranjeevi expressed profound joy and gratitude, highlighting the unique significance of this award. While he has previously been honored with accolades like the Padma Bhushan and Padma Vibhushan, he emphasized that the ANR Award feels especially personal, likening it to winning at “home” in the Telugu Film Industry.

He shared an emotional connection to the award, referencing the Telugu phrase “Inta Gelichi Racha Gelavatam,” meaning “conquering at home before conquering elsewhere.”

Reflecting on a memorable yet controversial moment, Chiranjeevi mentioned the 2007 Vajrotsavam event, where he was initially awarded the Legendary Award. Although honored, he declined to accept it then, feeling that it had caused division within the industry. To symbolize his commitment, he pledged to place that award in a time capsule until he truly earned the industry’s unified appreciation.

Now, years later, Chiranjeevi feels his journey has come full circle with the ANR Award, which he considers a heartfelt acknowledgement from his peers. Receiving it from Amitabh Bachchan, with Nagarjuna by his side, has given him a deep sense of fulfillment. Chiranjeevi’s heartfelt speech resonated with attendees and fans, as he finally put the Vajrotsavam controversy to rest, honoring both his legacy and the love of his home industry.

KA Movie Budget, Business Details

0

In an exclusive interaction with Track Tollywood, Kiran Abbavaram revealed the total budget for the KA movie is 15 Cr, excluding Kiran Abbavaram’s team remuneration. He also added that Chinta Gopala Krishna Reddy produced the overall film, his production house KA Productions has executed the film on the planned budget.

He also added that Vamsi has bought the total Telugu theatrical rights for 12 Cr. Due to the recent fall of the non-theatrical business, the KA non-theatrical is still not closed. Discussions are ongoing, and they will be closed this week.

KA Telugu is releasing on 31 October with premiers planned for tomorrow night. The other languages will be released next week. Directed by debutant duo Sujith-Sandeep, KA is a period film set in the 1980s, with Kiran Abbavaram playing a postman. The film will feature Nayan Sarika and Tanvi Ram in prominent roles, besides featuring Ajay and Saranya Pradeep in the supporting cast

Citadel Honey Bunny Streaming details Out

0

Varun Dhawan and Samantha starrer Citadel: Honey Bunny is slated to release on Amazon Prime Video on November 7. Directed by Raj and DK, this Indian adaptation of American spy-action drama will see the release of its second trailer today.

‘Citadel: Honey Bunny’ directed by Raj & DK, also stars Varun Dhawan in a lead role. The web series is a spin-off of the American spy action series ‘Citadel’, which stars Priyanka Chopra and Richard Madden. In ‘Citadel: Honey Bunny’, Varun stars as Bunny, a talented stuntman, alongside Samantha, who portrays a cunning spy.

The show also features Kay Kay Menon, Simran, Saqib Saleem, Sikandar Kher, Soham Majumdar, Shivankit Parihar, and Kashvi Majmundar. Fans have been buzzing since the teaser’s release, and now the trailer has only increased excitement, especially among those following the larger Citadel universe.

Produced by D2R Films and Amazon MGM Studios, with AGBO (the Russo Brothers’ studio) backing the series, Citadel: Honey Bunny marks the return of Raj & DK’s after massively successful Amazon Web Series Family Man 1& 2 and Farzi.

Diwali Special Pooja Hegde Shines in New Photoshoot

0

Pooja Hegde shines in yet another diwali special photoshoot. The ever gorgeous beauty posted her diwali look in her Instagram account. She looks absolutely stunning.

Mahesh Babu as Lord Shri Krishna ఆ మూవీలో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు స్పెషల్ రోల్ ?

0

టాలీవుడ్ స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నారు. దీని అనంతరం త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 చేసేందుకు సిద్ధమవుతున్నారు మహేష్. ఈ మూవీ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరిలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి పట్టాలెక్కనుంది. త్వరలో దీనికి సంబందించి అనౌన్స్ మెంట్ రానుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవకీ నందన వాసుదేవ. ఈ మూవీకి హను మాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ కథని అందించగా సామినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా టీజర్, సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీ నవంబర్ 14న ఆడియన్స్ ముందుకి రానుంది.

విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క క్లైమాక్స్ లో వచ్చే ఒక కీలక సన్నివేశంలో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకృష్ణుడి పాత్రలో కొన్ని క్షణాలు కనిపించనున్నారని అంటున్నారు. అయితే ఈ విషయమై మహేష్ నటించనున్నారని వార్తలు వస్తున్నప్పటికీ, ఆయన పాత్రని విఎఫ్ఎక్స్ లో చూపించనున్నారని మరికొందరు అంటున్నారు. అయితే దీని పై దేవకీ నందన వాసుదేవ యూనిట్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే కనుక నిజం అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగే అని చెప్పాలి.

Kanguva Telugu High chances for 100 crore club ‘కంగువ’ : తెలుగులో 100 కోట్ల క్లబ్ లో చేరుతుందా ?

0

కోలీవుడ్ వెర్సటైల్ సెన్సేషనల్ యాక్టర్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కంగువ. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్, పోస్టర్స్ అన్ని కూడా మరింతగా హైప్ ఏర్పరిచాయి.

అయితే నవంబర్ 14న తెలుగు, తమిళ్ తో పాటు పలు భాషల ఆడియన్స్ ముందుకి రానున్న తమ హీరో కంగువ సూపర్ హిట్ ఖాయం అని సూర్య ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా వెట్రి పళనిస్వామి ఫోటోగ్రఫి అందించారు. కాగా మ్యాటర్ ఏమిటంటే, కంగువ మూవీ తెలుగులో రూ. 100 కోట్ల మేర షేర్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నాయి సినీ వర్గాలు.

దానికి కారణం సూర్యకి తెలుగులో మంచి క్రేజ్ ఉండడంతో పాటు ఈ మూవీ బాగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోవడం. గతంలో రజినీకాంత్ 2.0, జైలర్, వంటి సినిమాలు భారీగా కలెక్షన్ అందుకున్నాయి. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ రూ. 100 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. ఆ విధంగా కంగువ లో కంటెంట్ కరెక్ట్ గా ఉండి అంచనాలు అందుకుంటే తప్పకుండా అది కూడా ఈ ఫీట్ ని చేరుకునే ఛాన్స్ కనపడుతోంది. మరి కంగువ ఆ స్థాయికి చేరుకుంటుందా లేదా అనేది చూడాలి.

Vishwambhara Releases on that Special Day స్పెషల్ డే నాడు రిలీజ్ కానున్న ‘విశ్వంభర’ ?

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా కీలకపాత్రల్లో సురభి, మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్, ఇషా చావ్లా తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వాస్తవానికి 2025 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉంది, కానీ అదే సమయానికి మెగా పవర్ స్టార్ రాంచరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ ఉండడంతో విశ్వంభరని కొన్నాళ్ల పాటు వాయిదా వేశారు.

ఇక లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాని వచ్చే ఏడాది మే 9న ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. నిజానికి ఇదే డేట్ న మెగాస్టార్ చిరంజీవి ఒకప్పటి బ్లాక్ బస్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా రిలీజ్ అయింది. అందుకే ఈ స్పెషల్ డేట్ రోజునే తమ మూవీ రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయిందట విశ్వంభర టీమ్. యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లింక్స్ టీజర్ మిక్స్డ్ రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చోటా కె నాయుడు ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీ తప్పకుండా అందరి అంచనాలు అందుకుని బాక్సాఫీస్ వద్ద విజయం ఖాయమని మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Boycott Calls on Sai Pallavi బ్యాన్ సాయి పల్లవి హ్యాష్ ట్యాగ్ వైరల్

0

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లో కూడా యువ నటిగా మంచి అవకాశాలతో కొనసాగుతున్నారు సాయి పల్లవి. కెరీర్ పరంగా మంచి సక్సెస్ లతో కొనసాగుతున్న సాయి పల్లవి తాజాగా శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్న సినిమా అమరన్. ఈ సినిమాపై అందరిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన అమరన్ టీజర్, ట్రైలర్ అలానే సాంగ్స్ తో పాటు ఇతర ప్రమోషన్లన్నీ కూడా సినిమాపై మరింతగా అంచనాలు ఏర్పరిచాయి.

మరోవైపు తెలుగు ప్రమోషన్స్ లో కూడా అమరన్ టీం సందడి చేస్తోంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 31న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది. అసలు విషయం ఏమిటంటే సాయి పల్లవిని బ్యాన్ చేయాలంటూ ఒక హ్యాష్ ట్యాగ్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పాకిస్థాన్ సైనికులు భారత సైన్యాన్ని ఉగ్రవాద గ్రూపుగా భావిస్తున్నారని, మన వైపు కూడా అదే జరుగుతుందని సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు. అయితే ఇది వారి అవగాహనపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

సాయి పల్లవి భారత సైన్యాన్ని కించపరిచారని అందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆమె ఎవరినీ అవమానించలేదని, సైన్యం ఎలా పనిచేస్తుందో తెలియజేస్తోందని భావించిన వారు కూడా ఉన్నారు. మరి దీనిపై రాబోయే రోజుల్లో ఏవిధంగా చర్చ నడుస్తుందో చూడాలి. ఇక అమరన్ తప్పకుండా విజయవంతం అవుతుందని ఇప్పటికే ఇటు తెలుగులో కూడా ప్రమోషన్స్ చేస్తూ ఉండటంతో ఇక్కడ కూడా ఈ సినిమా మంచి అవకాశం అందుకున్న అవకాశం అందుకుని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Pawan Kalyan congratulates Vijay విజయ్ కి పవన్ అభినందనలు

0

తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన ఇలయదళపతి విజయ్ హీరోగా ఇటీవల వెంకట్ ప్రభు దర్శకత్వంలో తరకెక్కిన తాజా సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. ఈ సినిమాలో స్నేహ మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా కీలకపాత్రల్లో ప్రభుదేవా, ప్రశాంత్, లైలా, మోహన్ నటించారు. మొత్తంగా అందరి అంచనాలు అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇక దీని అనంతరం ఇప్పటికే తన కెరీర్ ఆఖరి సినిమా అనగా 69వ సినిమాని యువ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో అనౌన్స్ చేశారు విజయ్.

ఈ సినిమాపై అందరిలో భారీస్థాయి అంచనాలు ఉండగా దీనిని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయనున్నారు. ఇకపోతే అసలు విషయం ఏమిటంటే ఇప్పటికే తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం ని అనౌన్స్ చేశారు విజయ్. నిన్నటి ఆ పార్టీ భారీ బహిరంగ సభకు దాదాపుగా కొన్ని లక్షల మంది విచ్చేసి విజయ్ ఆశీర్వదించారు. ఇక విజయ్ కూడా తన అభిమానులు అందర్నీ ఆకట్టుకునే అద్భుతమైన ప్రసంగం చేశారు.

అసలు విషయం ఏమిటంటే కొద్దిసేపటికి టాలీవుడ్ పవర్ స్టార్ మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తన ట్విట్టర్ వేదికగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై శుభాభినందనలు తెలియజేశారు. విజయ్ రాజకీయాల్లో మరింతగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పవన్ అభినందనలు తెలిపిన ట్విట్టర్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి విజయ్ రాబోయే తమిళనాడు ఎన్నికల్లో ఎంతమేరకు విజయ బావుటా ఎగురవేస్తారో చూడాలి.

Jai Hanuman Lord Rama’s Reveal for Diwali ‘జై హనుమాన్’ : రాముడి పాత్రధారి అనౌన్స్ మెంట్ ఆ రోజునే ? 

0

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో హనుమాన్ పెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే. యువ నటుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తలకెక్కిన హనుమాన్ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషించగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. కోలీవుడ్ నటుడు వినయ్ రాయ్ విలన్ గా కనిపించిన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది.

ఇక దీనికి సీక్వెల్ గా త్వరలో జై హనుమాన్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. దీనిపై కూడా అందరిలో మరింత భారీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో కీలకమైన హనుమంతుని పాత్రలో నటించేందుకు కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ రానుంది. మరోవైపు లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ అప్డేట్ ప్రకారం జై హనుమాన్ మూవీలో రాముడు పాత్రధారి యొక్క అనౌన్స్ మెంట్ ని రానున్న దీపావళి రోజున ప్రకటించనున్నారట.

ఇక ఈ సినిమాను కూడా గ్రాండియర్ గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో మైథాలజీ యాక్షన్ మూవీగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నారు. కాగా త్వరలో ఈ మూవీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా టీమ్ నుండి అధికారికంగా వెల్లడి కానున్నాయి.