Home Blog Page 2134

రామ్ చరణ్ ఈ కారణం వల్లే విరాట పర్వం ఈవెంట్ కి రాలేక పోయారు

0

నిన్న రాత్రి  హైదరాబాద్ లో విరాట పర్వం ప్రి రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులు గా విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ వస్తారు అని సినిమా టీమ్ ప్రకటించారు.

వేణు ఊడుగుల డైరెక్షన్‌ లో రానా దగ్గుబాటి, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ‘విరాట పర్వం’ సినిమాను 1990 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించటం జరిగింది. కాగా ఈ సినిమాలో కామ్రేడ్ రవన్నగా రానా, వెన్నెలగా సాయిపల్లవి సందడి నటించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు చక్కని స్పందన రావడంతో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 17న విడుదల కానుంది. ఈ నేపథ్యం లోనే బుధవారం ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌ ను హైదబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

అయితే ముందుగా చెప్పుకున్నట్టు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు అని తెలిసి మెగా అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఇక ఫంక్షన్ మొదలు అయ్యాక మిగతా అతిథులు మాట్లాడటం మొదలైనా ఇంకా రామ్ చరణ్ రాలేదు, చివరికి హీరో హీరోయిన్ ల స్పీచ్ సమయానికి కూడా అభిమానుల ఎదురు చూపులు ఫలించలేదు.

ఇక రానా స్పీచ్ సమయంలో అసలు సంగతి బయట పడింది. ఫ్లైట్ లేట్ అవటం వలన రామ్ చరణ్ ఈవెంట్ కి రాలేక పోయారు అని, ఆయన తరపున రానా చరణ్ అభిమానులకి క్షమాపణ చెప్పారు. అయితే ఇదే ఈవెంట్ కి రావాల్సిన మరో అతిధి సుకుమార్ ఎందుకు రాలేదో ఎలాంటి వివరాలు తెలియలేదు.

మైత్రి మేకర్స్ ను ఇబ్బంది పెడుతున్న సుకుమార్

0

పుష్ప 2 షూటింగ్ ఆలస్యం అవుతూనే వస్తుంది. ఇటీవల దర్శకుడు సుకుమార్ ఆరోగ్యం కాస్త బాగోక పోవడంతో స్క్రిప్ట్ వర్క్, ఇతర ప్రి ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి అని తెలిసింది.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తలు ఏంటంటే సుకుమార్ పని తీరు వల్ల మైత్రి మూవీ మేకర్స్ కాస్త ఇబ్బందులు ఎదురుకుంటున్నారు అట. తొలుత జూన్ లో షూటింగ్ అనుకుని మళ్ళీ ఆగస్ట్ కి పోస్ట్ పొన్ చేయాల్సి వచ్చింది. ఇలా మాటి మాటికీ నటీనటుల కాల్ షీట్స్ బుక్ చేసి పెట్టడం నిర్మాతలకు బాగా ఖర్చుతో కూడుకున్న పని.

సుకుమార్ తో పని చేసిన యే ప్రొడక్షన్ టీం అయినా ఇలాంటి ఇబ్బందులు ఎదురుకోవలసిందే. ఎందుకంటే సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ కి ఇంకా షూట్ స్టార్ట్ అయిన తరువాత చేసే మార్పులకు ఎక్కువ సమయం తీసుకుంటాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్.

అయితే క్రియేటివ్ జీనియస్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సుకుమార్ కి ఆ పేరు వల్లే ఇలాంటి సమస్యలను తట్టుకుని మరీ నిర్మాతలు ఆయనతో సినిమాలు తీయడానికి ముందుకు వస్తున్నారు.

ప్రత్యేకించి మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ తో ఇదివరకే రెండు సినిమాలు తీశారు కాబట్టి ఆయన వర్కింగ్ స్టైల్ వాళ్ళకి బాగా తెలుసు. ఆల్రెడీ రెండు బ్లాక్ బస్టర్ లు అందించిన అనుభవం ఉండటంతో పాటు ఇప్పుడు పుష్ప 2 పాన్ ఇండియా రేంజ్ లో క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఎలా అయినా తాము పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది అని మైత్రి గ్రూప్ కి తెలుసు. అందుకే సుకుమార్ ఓకే చెప్పిన తరువాతే వాళ్ళు షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక పై పక్కా కమర్షియల్ అంటున్న రానా

0

తెలుగు సినిమా పరిశ్రమ లోని పెద్ద కుటుంబాల్లో ఒకటైన దగ్గుబాటి కుటుంబం వారసుడిగా ప్రేక్షకులకి పరిచయమైన రానా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు.
తొలి చిత్రం నుండి వినూత్నమైన కధలు, మరియు పాత్రలనే ఎంపిక చేసుకుంటూ వచ్చాడు రానా. కమర్షియల్ సినిమాలు తక్కువే చేసినా ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటూ క్రేజ్ ను ఎక్కడా తగ్గనివ్వలేదు.

కేవలం హీరో గానే చేస్తాను అని గిరి గీసుకుని కూర్చోకుండా విలన్ పాత్రలు,లేదా ప్రత్యేక పాత్రలు కూడా చేయడం వల్ల ఎలాంటి ఇమేజ్ చట్రం లో ఇరుక్కుపోకుండా ఉండటం రానాకు సాధ్య పడింది.

ఇక బాహుబలి లో భల్లాలదేవుని పాత్రలో అద్భుతంగా నటించి ప్రభాస్ కు ధీటుగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం నటుడి గానే కాక బాహుబలి కి ప్రచార కార్యక్రమాలలో చురుకుగా వ్యవహారించి ఆకట్టుకున్నాడు. 

నాలుగేళ్ల క్రితం ఆరోగ్య పరంగా గట్టి ఎదురుదెబ్బ ను ఎదురుకున్నా, ఏమాత్రం నిరాశ పడకుండా చాలా తక్కువ సమయం లోనే కోలుకుని ఔరా అనిపించటమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు రానా.

అయితే ముందుగా చెప్పుకున్నట్టు ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినా ఎప్పుడూ స్టార్ హీరో అవ్వాలి అని, అలాంటి భారీ చిత్రాలు చేయాలి అని కానీ ఎప్పుడు ప్రయత్నించని రానా ఇప్పుడు ఇక తన పంథా మార్చుకునే ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం.

విరాట పర్వం అనేది తన చివరి ప్రయోగాత్మక చిత్రం అనీ, ఇక మీదట ఫ్యాన్స్ కి నచ్చే కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తాను అని చెప్పినట్టు తెలుస్తోంది. మరి రానా తీసుకున్న కొత్త నిర్ణయం యే రకంగా తన కెరీర్ ను మార్చబోతుందో చూద్దాం. 

The cinema industry needs to change its plans says Dil Raju

0

Dil Raju is a big name in Tollywood as a producer and also yields a strong control of the Nizam region as a distributor. He has been a strong force behind a number of Tollywood biggies for close to the last two decades. In fact, if he is not involved with a big-ticket film as a producer, the chances are high of him being involved in the distribution of the same film.

He has been involved with biggies like RRR Radhe Shyam and Bheemla Nayak as a distributor and F3 came out of his own production house Sri Venkateswara Films. Needless to say, Dil Raju has had quite a roller coaster ride this year. The ace producer has now given a piece of advice for the filmmakers releasing movies post-pandemic.

He said that the audience’s way of watching movies has now changed. A lot of the movies coming out nowadays have become only weekend films. The interest in these films is there only till the weekend and once weekdays start, movies start seeing massive dips in collections as well as audience interest levels. With the popularity and comfort of OTT picking up, He advised the makers of upcoming films to plan their movies accordingly.

ఓటీటీ ఆ ధియేటర్లా ఎవరిది తప్పు?

0

గత నాలుగేళ్లుగా ఓటీటీ ఇండస్ట్రీ ఎలా వ్యాప్తి చెందింది అనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.ముఖ్యంగా కరోనా వల్ల ధియేటర్ లు మూతబడటం వలన అమెజాన్ ప్రైమ్,. నెట్ ఫ్లిక్స్, జీ 5, మరియు తొలి తెలుగు ఓటీటీ యాప్ గా వచ్చిన ఆహా ఇలా చాలా ఆప్షన్ లు ప్రేక్షకులకి దగ్గరయ్యాయి.

కొన్ని పెద్ద సినిమాలతో పాటు, చాలా చిన్న సినిమాలు ఓటీటీ లలో విడుదల అయి తమ నష్టాలను కాస్త తగ్గించుకున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కరెంట్ పోయినపుడు కొవ్వొత్తి వెలుగు సహాయం చేసింది అని ఎల్లకాలం ఆ వెలుగులోనే ఉండలేము కదా.ఇప్పుడు అదే పరిస్తితి తెలుగు సినీ నిర్మాతలకు వచ్చి పడింది.

ధియేటర్ లలో సినిమాలు చూడటం అనే అలవాటు తప్పడంతో ఫ్యామిలి ప్రేక్షకులు అంత సులభంగా ధియేటర్ లకు రావట్లేదు ఇప్పుడు. కేవలం హీరోల అభిమానులు లేదా సినీ ప్రేమికులు మాత్రమే ధియేటర్ లకు తరలి వస్తున్నారు.అయితే ఇక్కడ తప్పు ఒప్పులు లెక్కించే బదులు ఏం చేస్తే ప్రేక్షకులు ధియేటర్ ల వద్దకు వస్తారో అలోచించి, ఆ దిశగా ప్రణాళికలు గనక సినిమా నిర్మాతలు కలిసి నిర్దేశిస్తూ నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది.

ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ అయి ముందుకు వెళ్తేనే యే ఇండస్ట్రీ అయినా సక్సెస్ అవుతుంది. ఓటీటీ వచ్చిన కొత్తలో తెలుగు సినిమా నిర్మాతలు అందరూ దాదాపు ఒక మాట మీద ఉండి ధియేటర్ రిలీజ్ కీ, ఓటీటీ రిలీజ్ కి మధ్య యాభై రోజులు, లేదా కనీసం ఆరు వారాలు అయినా గ్యాప్ ఉండేలా చూసుకున్నారు.

కానీ ఇప్పుడు ఆ పరిస్తితి లేదు, కేవలం నాలుగు వారాల లోపే పెద్ద సినిమాలు ఫోన్ లలోకి వచ్చేస్తుంటే ఎంత మంది ఆ సినిమాలను చూడటానికి ధియేటర్ కు వస్తారు? కొన్ని సినిమాలు అయితే మరీ అన్యాయంగా 3 వారాల లోపే ఓటీటీ లోకి వచ్చేశాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన సినిమాలు అలా తొందరగా ఓటీటీ లలో వచ్చాయి అంటే ఒక అర్థం ఉంది కానీ హిట్ సినిమాలు కూడా అలా చేస్తే ఏమాత్రం మంచి పద్ధతి కాదు.

ఇక టికెట్ హైక్ ల సంగతి సరే సరి. ప్రభుత్వం వారు అత్యవర పరిస్థితిలో ఫలానా ధరకు పెంచుకోవచ్చు అని అనుమతి ఇస్తే ఆ టికెట్ రేట్లనే రెగ్యులర్ చేసేసి, ఆ రేట్ ల మీద మరో యాభై రూపాయల వరకూ పెంచుకోవటానికి ప్రత్యేక అనుమతి తెచ్చుకోవడం విడ్డూరం.కాబట్టి అటు ఎక్జిబిటర్ ల తో పాటు, పెద్ద నిర్మాతలు, పంపిణీ దారులు ఒక మాట పై ఉండి, యే సినిమాలకు ఎంత రేట్ అనేది చర్చించుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే వారికే మంచిది.

రూల్స్ రంజన్ తో రాధిక

0

లేటెస్ట్ హీరోయిన్స్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న అప్ కమింగ్ హీరోయిన్ గా నేహా శెట్టి పేరును చెప్పుకోవచ్చు.

సందీప్ కిషన్ హీరోగా చేసిన గల్లీ రౌడీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ భామ, ఆ తరువాత సిద్ధు జొన్నలగడ్డ తో నటించిన డీజే టిల్లు తో ఒక్కసారిగా యూత్ హార్ట్ త్రోబ్ గా మారిపోయింది. పట్టాసు పిల్లా పాటలో తన గ్లామర్ తో కుర్రకారు మతి పోగొట్టడమే కాక బ్లాక్ సారీలో హాట్ గా కనిపించి కనులవిందు చేసింది.

చక్కని ఫిజిక్, హాట్ ఎక్స్ప్రెషన్స్ తో పాటు క్యూట్ ఫేస్ తో ఆడియెన్స్ ను ఇట్టే ఆకర్షించిన నేహా తదుపరి సినిమాగా యువ హీరో కిరణ్ అబ్బవరం తో జత కట్టనుంది.రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రూల్స్ రంజన్ అనే పేరును ఖరారు చేసారు.

ఇక హీరో కిరణ్ అబ్బవరం కూడా అతి కొద్ది కాలం లోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.తొలి చిత్రం రాజా వారు రాణి గారు తోనే తన నటనకు చక్కని ప్రశంసలు లభించగా, ఆ పై చేసిన రెండో సినిమా ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా కూడా యూత్ ఫుల్ ఎంట్టైన్మెంట్ తో పాటు సెంటిమెంట్ రంగరించి హిట్ కొట్టాడు. ఆ సినిమాకి కథకుడిగా కూడా కిరణ్ పనిచేయడం విశేషం.

సో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో, హీరోయిన్ కలిసి నటిస్తున్న ఈ సినిమా మంచి హిట్ గా నిలిచి ఇద్దరికీ మంచి పేరు తీసుకు వస్తుందని ఆశిద్దాం.

Brahmastra trailer failed to reach the expectations and create the buzz

0

Brahmastra Part One: Shiva trailer released today. The Trailer starts with action and progresses onto megastar Chiranjeevi’s voiceover. Trailer is packed with grand visuals and over the top VFX effects. Brahmastra is projected to be the much awaited project from Bollywood.

This big budget fictional drama has huge casting. Along with Ranbir Kapoor and Alia Bhat, Amitabh Bachan, Akkineni Nagarjuna, Mouni Roy, Dimple Kapadia are playing key roles. As per reports Shahrukh Khan is playing cameo as Lord Shiva. This pan India fantasy adventure directed by Ayan Mukerji will release on 9th September,2022. S S Rajamouli is presenting the movie in Telugu.

The much hyped Brahmastra trailer failed to create the expected buzz. The trailer cut is very bad and mainly the graphics are very low and looks very odd on screen. Audience feel that the VFX didn’t help to connect the content with the audience. Even the bgm is mediocre as it failed to bring the needed impact. The trailer is receiving mixed response from all over the country. So let’s wait for few days to see if it can help to create the buzz.

Kamal Haasan says Vikram clears all his debts and loans

0

Kamal Haasan is the happiest man now in the film Industry. Vikram gave him all the obvious reasons to be happy. Vikram is creating sensation at the box office and running successfully. Director Lokesh Kanagaraj became a star with Vikram. Vikram getting applause not only from the critics but from the theatre audience is well. So producer is minting money who is none other than Kamal Haasan again.

Kamal is expressing his happiness in different ways. He gifted Lexus car to Lokesh Kanagaraj and also gifted rolex watch to the Suriya. He also conveyed his thanks to Telugu audience by making a video byte. Kamal Haasan met megastar Chiranjeevi and Bollywood star Salman khan as a part of Vikram’s Success. The star actor is busy meeting vips and attending events.

Kamal Haasan attended the blood donation camp in chennai. Talking to the media Kamal Haasan said that people didn’t believe him when he said he can earn make in less time. But now that became true with Vikram’s success. The profitable producer want to repay all his debts with the money. He told that he will eat the food he likes. He want to give the money to his family and friends who needs financial help. Kamal felt that he has no need to act like he is helping by taking money from others. He want to be a good human being he concluded.

12 Days Box-Office: బ్లాక్ బస్టర్ మేజర్

0

అడివి శేష్ హీరోగా నటించి, సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమా చక్కని ప్రశంస లతో పాటు కలెక్షన్ లు కూడా రాబట్టుకుంటుంది.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాకి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. అటు మేజర్ జీవితంలో జరిగిన నిజమైన సంఘటనల తో పాటు సినిమాకి అవసరమైన నాటకీయత కూడా జోడించి అందరినీ మెప్పించింది మేజర్ టీమ్.

తెలుగుతో పాటు హిందీ లోనూ విడుదల అయినా మేజర్ అక్కడ కూడా బాగానే కలెక్షన్ లు రాబట్టినా, సరైన విధంగా ప్రచారం చేసి ఉంటే మరింత ఎక్కువ ప్రేక్షకులకి చేరుకునేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడ్డాయి.

అయితే మొత్తంగా 50 కోట్ల వరకూ గ్రాస్ కలెక్ట్ చేసిన మేజర్ చిత్రం ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల వరకూ వస్తే రెండు వారాల్లో 23 కోట్ల షేర్ సాధించి అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మొత్తానికి విమర్శకుల నుంచి అభినందనల తో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన మేజర్ చిత్రం ఈ సంవత్సరంలో మన తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి వెలువడ్డ అతి తక్కువ హిట్స్ లో ఒకటి. ఇలాంటి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అయితే మరిన్ని కొత్త ప్రయత్నాలు చేయడానికి నవతరం దర్శకులు ముందుకు వస్తారు.

బ్రహ్మాస్త్ర ట్రైలర్ ఎలా ఉందంటే

0

బాహుబలి సిరీస్ తర్వాత ప్రతి ఇండస్ట్రీ లోనూ అలాంటి సినిమా తీయాలి అన్న తపన, ప్రయత్నాలు ఎక్కువ అయ్యాయి.అలాంటి ప్రయత్నాల్లో ఒక్కటి బ్రహ్మస్త్ర.

బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బ్రహ్మాస్త్ర ట్రెయిలర్ ఈరోజు విడుదల అయింది. పాన్ ఇండియా రిలీజ్ కానున్న ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తుండగా ముఖ్య పాత్రలో అమితాబ్ బచ్చన్, మరో అతిధి పాత్రలో కింగ్ నాగార్జున కనిపించబోతున్నాడు.

ఈ చిత్రానికి తెలుగులో రాజమౌళి విరివిగా ప్రచారం చేసారు. స్క్రిప్ట్ లో కొన్ని అదనపు అంశాలు ఆయన పరిశీలించినట్లు తెలుస్తుంది. కాగా తెలుగు ట్రైలర్ లో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో విశేషం.ఇక ట్రైలర్ విషయానికి వస్తే, సృష్టిలో కొన్ని అద్భుతాలలో మనకే తెలియని ఒక ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

అగ్ని,వాయువు,నీరు ఇలా పంచ తంత్రాలతో కూడుకున్న అంశాలు ఉండగా, అదే సమయంలో వీటికి ఏ మాత్రం సంబంధం లేని సాధారణ వ్యక్తి అయిన శివ (రణ్బీర్ కపూర్) ఎలా తనకి ఉన్న అతీంద్రియ శక్తులను కనుగొన్నాడు, వాటితో అతను చేయాల్సిన కార్యాలు ఎంటి అనే ఆసక్తి పెంచేలా ట్రైలర్ ను కట్ చేయడం జరిగింది.

అయితే అనుకోవడానికి పాయింట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, ఫాంటసీ చిత్రానికి ఉండాల్సిన క్వాలిటీ మిస్ అయిందీ ట్రైలర్ లో. మరీ ముఖ్యంగా గ్రాఫిక్స్ సాధారణ స్థాయిలో ఉండి నిరాశ పరిచాయి.

హిందీ ప్రేక్షకులకి ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు అరుదు గనక వారికి ఈ ట్రైలర్ ఆకట్టుకుని ఉండచ్చు. కానీ ఇతర భాషల్లో బ్రహ్మస్త్ర జెండా ఎగర వేయాలంటేమరింత కసరత్తు చేయక తప్పదు.ఎందుకంటే ఇలాంటి ఫాంటసీ సినిమాల నుండి సాంకేతికంగా చాలా ఉన్నతమైన ప్రమాణాలు ఆశిస్తారు ప్రేక్షకులు. వాళ్ళ అంచనాలను అందుకొలేని పక్షంలో ఎంత భారీ బడ్జెట్ అయినా, ఎంతమంది తారలు ఉన్నా సినిమా పరాజయం పాలవకుండా ఆపలేరు.