Home Blog Page 2133

Details about Much awaited Akhil akkineni’s Agent teaser

0

Akkineni Akhil is yet to deliver a solid hit. And so he is up now with a super solid film. All the Akkineni fans are waiting eagerly for an action film from the youngster. The first look posters of Akhil’s next Agent created sensation. Akhil’s transformation made fans happy and the expectations are raised.

Agent is a big budget entertainer in the direction of the stylish director Surender Reddy. AK entertainments and Surender 2 cinema are making this film on a record budget for a non top hero. As enough hype has created, fans are waiting for the update from the film from a very long time.

Finally there is some happy news for the Akkineni fans from the Agent team. It is heard that the teaser cut is ready and the makers are extremely happy with teaser output. The team is planning to release the teaser shortly. The makers are planning for Dussera release. So let’s cross our fingers for the teaser.

A Producer Blackmailed me and my family says Chandini Chowdary

0

Colour Photo fame Chandini Chowdary is coming now with Sammathame. Kiran Abbavaram is playing the lead role while chandini is playing his love interest on the film. The romantic entertainer is all set to hit the theatres on 24th June. So the hero and heroine are busy with the movie promotions.

As part of promotions, Chandini Chowdhary and Kiran Abbavaram  were present in Ali tho Saradaga talk show. In the talk show the upcoming actress shared some interesting events. Chandini revealed that a producer warned her by saying that if she does not listen to him, he will spoil her career in Tollywood. The actress revealed that the producer threatened her family too.

When asked why she hasn’t approached any biggies in the industry for help. The young actress told that she is not from any powerful place. The actress also feared that as she don’t have any backup she felt that they can destroy her in a blink. Audience are curious to know about the name of the producer while the actress chose not to reveal.

ఆకట్టుకున్న సమ్మతమే ట్రైలర్

0

కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి నటిస్తున్న “సమ్మతమే” ట్రైలర్ ఈరోజే విడుదల అయింది. ఈ ట్రైలర్ ను తెలంగాణ ఐటి శాఖ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు.ట్రైలర్ హీరో చిన్ననాటి సన్నివేశాలు చూపిస్తూ ప్రారంభం అవుతుంది.

బాల్యం లోనే తల్లిని కోల్పోయిన హీరో, ఇంట్లొ తనను చూసుకునే ఆడవాళ్ళు ఉన్నప్పుడే జీవితానికి అర్థం ఉంటుంది అన్న తండ్రి మాటలను మెదడులో మనసులో ముద్రించుకుని మంచి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని,అదే జీవితాశయంగా బతకాలని డిసైడ్ అయిపోతాడు.

అతనికి ఆధునిక భావాలు గల చాందినీ చౌదరి పరిచయం అవుతుంది. ఆమె ఆలోచనలు, భావాలు అతనికి విరుద్ధంగా ఉన్నా పరస్పరం ఆకర్షితులు అవుతారు. ప్రేమను తెలుపుకుని సంతోషంగా ఉన్న సమయంలో కొన్ని విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయినట్టు చూపించారు ట్రైలర్ లో.మరి ఆ విభేదాలు తొలగి ఇద్దరు మళ్ళీ కలుసుకున్నారా లేదా తెలియాలి అంటే 24న విడుదల అయ్యే సినిమా చూడాల్సింది. మొత్తం మీద అటు యూత్ తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తుంది.శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ ను చక్కగా ఎలివెట్ చేయగా, సతీష్ మాసం కెమెరా పనితనం కూడా బాగుంది.

సమ్మతమే థియేట్రికల్ ట్రైలర్

జూన్ 24న విడుదల అవుతున్న సమ్మతమే ప్రపంచ వ్యాప్తంగా నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తరపున విడుదల కానుంది. యుజి ప్రొడక్షన్స్ పతాకం పై ప్రవీణ కంకణాల ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

అఖిల్ అక్కినేని ఏజెంట్ టీజర్ అదుర్స్ అంటున్న టీమ్

0

అక్కినేని వారసుడు యంగ్ అండ్ హ్యాండ్సం హీరో అఖిల్ నుండి తదుపరి రాబోయే సినిమా “ఎజెంట్”. ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని కసి మీదున్న ఈ హీరో డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ఆ భాద్యతగా అప్పగించాడు.

ఇది వరకే ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల అయి అందరినీ ఆకట్టుకుంది. డాషింగ్ లుక్ లో అఖిల్ అదిరిపోయాడు. వాటితో పాటు షూటింగ్ నుండి లీక్ అయిన కొన్ని పిక్ లే కాక, అఫిషియల్ గా అఖిల్ పోస్ట్ చేసిన సిక్స్ ప్యాక్ లుక్ కూడా సూపర్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. 

ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు, ఈసారి తమ అభిమాన హీరో టార్గెట్ మిస్ అవ్వడు అనే గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాలి అంటే టీజర్ వచ్చే దాకా ఆగక తప్పదు. మొదట ఎజెంట్ టీజర్ మేలో వస్తుంది అన్న వార్తలు వచ్చాయి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం జూన్ నెల అఖరిలో ఏజెంట్ టీజర్ ను తీసుకు రావడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తుంది. ఇక టీజర్ మాత్రం అద్భుతంగా వచ్చిందని, టీమ్ మొత్తం ఔట్ పుట్ తో చాలా ఆనందంగా ఉందని తెలుస్తుంది. శరవేగంగా పనులు పూర్తి చేసుకుని సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు అని సమాచారం.

అఖిల్ సరసన హీరోయిన్ హా సాక్షి వైద్య నటిస్తున్న ఈ సినిమాలో మలయాళం అగ్ర హీరో మమ్ముట్టి ముఖ్య పాత్రలో నటిస్తుండగా, రచయిత వక్కంతం వంశీ కధను అందించనున్నారు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ సంగీతం ఇస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ 2 సినిమా బ్యానర్ తో పాటు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్  సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రఘల్ హేరియన్ ధరుమన్ కెమెరామెన్ గా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ జిల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

తొలి చిత్రం అఖిల్ భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ అవడంతోటే నిరాశ పడకుండా రెట్టించిన ఉత్సాహంతో హలో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్. ఆ సినిమా కాస్త పరవాలేదు అనిపించగా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం మళ్ళీ నిరాశే మిగిలింది. ఆ తరువాత వచ్చిన మిస్టర్ మజ్ను కూడా పరాజయం పాలయ్యింది. పోయిన దసరాకి వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ డీసెంట్ హిట్ గా నిలవడంతో అఖిల్ మరింత అత్న విశ్వాసంతో ఎజెంట్ సినిమాతో మళ్లీ అలరించేందుకు వస్తున్నాడు. 

Double burden for Mythri movie makers Becuase of Sukumar

0

Director Sukumar is known for giving sensational blockbusters. He created his trademark in writing and gave some wonderful movie to Tollywood. His last outing Pushpa created sensation not only in Tollywood but all over the country. Now all the eyes on his Pushpa 2.

Makers planned to start the shoot of Pushpa 2 in April. But due to various reasons, it is postponed to June. And as the June is nearing to end, still there is no sign of starting the shoot. So latest info is that Pushpa 2 shoot is again postponed to august.

Sukumar is know for his creativity and this creative director will take more time to lock the script. So it is a burden to the producers. The Mythri team is continuously blocking the dates of cast and crew which is costing them a lot. Even the producers will have to pay salaries to the direction department and other crew members that costs lot too.

In fact Mythri makers are not in any hurry. Though the cost of production is increasing, they are not pressurising Sukumar. Becuase they know Sukumar’s working style and also the creative director delivered two blockbusters for them. Also pushpa 2 is the craziest project in Indian cinema right now. So they are fine with double burden as they know they can recover any amount with the craze of Pushpa.

హ్యాట్సాఫ్ డార్లింగ్ అనిపించుకున్న ప్రభాస్

0

తొలి పాన్ ఇండియా స్టార్ గా అందరి చేతా మన్ననలు అందుకున్న ప్రభాస్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు.

స్క్రీన్ మీద వీరోచిత పోరాటాలు, బాహుబలి లాంటి లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు, పాత్రలతో ఆకట్టుకునే ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ చిన్నా పెద్దా అందరి చేతా ముద్దుగా డార్లింగ్ అని పిలిపించుకుంటాడు. అందుకు కల్మషం లేని తన మనసు, ప్రవర్తనే కారణం.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ భారీ సినిమా ప్రాజెక్ట్ కే చేస్తున్న సంగతి తెలిసిందే..అందులో హీరోయిన్ గా దీపికా పదుకునే, మరో ముఖ్య పాత్రలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. ఇటీవల దీపికా స్వల్ప అనారోగ్యం పాలైన మాట వాస్తవం.

ఆ విషయం మీద పలు రకాల పుకార్లు వినిపించినా, చిత్ర బృందం అలాంటిదేమీ లేదని, దీపికా ఆరోగ్యం కుదుట పడింది అన్న విషయాన్ని ధృవీకరించారు. షూటింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగేందుకు దీపికా అందుబాటులో కూడా ఉన్నా, ప్రభాస్ నిర్మాతలను షూటింగ్ పోస్ట్ పోన్ చేయమని సూచించినట్టు తెలుస్తుంది.

నిజానికి ప్రభాస్, దీపికా ల మధ్య ముఖ్యమైన సన్నివేషాలు తీయాల్సి ఉండింది అట ఈ షెడ్యుల్ లో. అయితే దీపికా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆమె తనంతట తాను పూర్తిగా సిద్ధం అయ్యాకే మళ్ళీ షూటింగ్ చేయవచ్చు అని ప్రభాస్ చెప్పినట్టు తెలుస్తోంది. 

హార్ట్ రేట్ లో హెచ్చు తగ్గుల వల్ల దీపికా ఇబ్బంది పడగా ఆమెను కామినేని హాస్పిటల్స్ లో జాయిన్ చేయగా, చికిత్స తరువాత దీపికా పరిస్తితి మెరుగు పడిందని సమాచారం. అయితే ఇక మీదట ఇలాంటి ఇబ్బందులు మళ్ళీ తలెత్తకుండాసహానటి గురించి ఇంతగా అలోచించి నిర్ణయం తీసుకున్న ప్రభాస్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మరి.

ఆ ప్రొడ్యూసర్ నన్ను బ్లాక్ మెయిల్ చేసాడు – చాందినీ చౌదరి

0

తెలుగు సినిమా పరిశ్రమలో సాధారణంగా హీరోయిన్ ల కొరత ఎపుడ ఉంటుంది. మరీ ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు అయితే చాలా తక్కువ. అలాంటి అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్ లలో ఒకరు చాందిని చౌదరి.

యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న చాందినికి ఆ తరువాత కలర్ ఫోటో చిత్రం ద్వారా బ్రేక్ లభించింది. అందులో ఆమె నటనకు మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆమె కిరణ్ అబ్బవరం తో జోడీగా “సమ్మతమే” చిత్రంలో నటిస్తుంది. వచ్చే వారం అంటే జూన్ 24న ఆ సినిమా విడుదల అవ్వబోతుంది.

ప్రచార కార్యక్రమాలలో భాగంగా కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి “ఆలీతో సరదాగా” ప్రోగ్రాం కి వచ్చినపుడు ఆలీ చాందినీ ను కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో ఒక ప్రొడ్యూసర్ కావాలని చాందినీతో సినిమా తీయకుండా, అదే సమయంలో మరే ఇతర సినిమాలో తను నటించకుండా బ్లాక్ మెయిల్ చేసిన ఉదంతం బయట పడింది.

సదరు ప్రొడ్యూసర్ తనని, తన కుటుంబాన్నీ కనిపించకుండా చేస్తాను అని బెదిరించినట్లుగా చాందినీ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో చాలా భయపడిన విషయం కూడా చెప్పింది. అయితే ఇంత పెద్ద సమస్య వచ్చినపుడు ఎందుకని ఇతర ఇండస్ట్రీ పెద్దలను సంప్రదించలేదు అని ఆలీ అడగగా, ఆ సమయంలో ఎవరి దగ్గరకెళ్ళి ఏం చెప్పుకోవాలో తెలియలేదు అని, తనను తాను సమర్డించుకోడానికి తన దగ్గర సరైన ఆధారాలు లేకపోయాయి అని చాందినీ వివరించింది. చివరికి ఆ ప్రొడ్యూసర్ దగ్గరున్న కాంట్రాక్ట్ చెల్లదు అని తెలిసిన తరువాత విషయం ఒక కొలిక్కి వచ్చిందట.

ఇండస్ట్రీలో రంగుల ప్రపంచంతో పాటు ఇలాంటి చెడు సంఘటనలను జరుగుతూనే ఉంటాయి. గతంలో కూడా చాలా మంది హీరోయిన్ లు లైంగికంగా, మరో రకంగా భాదింపబడ్డారు. అన్ని సమస్యలను ఎదుర్కుని నిలబడటం అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటేనే ఇండస్ట్రీకి మంచిది.

Samantha’s massive Instagram deals bring in big money!

0

Samantha’s popularity is rising day by day and she has now become a national brand. The actress has crossed the regional barrier and has now gone beyond Telugu and Tamil films in which she primarily acts. She received widespread acclaim for her role in Family Man 2 last year and also received a great following after her special song in Pushpa: The Rise. Post this she recently joined the cast of acclaimed director Philip John’s international film ‘Arrangements of Love

Her popularity across industries is bringing the actress multiple brand deals and promotions on Instagram. Samantha currently has 24 million-plus followers on social media making her one of the most followed South Indian actresses.

As per reports, Samantha is currently receiving around Rs 3 crores monthly from brand deals and promotions on Instagram. This is truly an indicator of her rising popularity not just in the South but in Bollywood as well.

The star actress on the other hand has wrapped up the shoot for Shaakuntalam. She also recently completed the first schedule of Kushi in Kashmir alongside Vijay Deverakonda. Recently, the first look of her sci-fi thriller Yashoda was also released and was well appreciated. Looking at the projects in her hand, Samantha’s fans are surely in for a treat in 2022 and 2023.

మహేష్ బాబు థియేటర్ లో సర్కారు వారి పాట రికార్డ్

0

మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” చిత్రం గత నెల మే 12 న విడుదల అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ హాఫ్ లో ఉన్న వినోదం సెకండాఫ్ లో లేదని ప్రేక్షకులు కాస్త నిరాశ పడినా, బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ లపై మాత్రం పెద్దగా తేడా రానివ్వలేదు సూపర్ స్టార్ మహేష్.

గత వారం పే పర్ వ్యూ మోడ్ లో అమెజాన్ ప్రైమ్ విడుదల అయిన ఈ చిత్రం వచ్చే వారం అంటే జూన్ 23వ తేదీ నుండి అందరి సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులోకి రానుంది. అయితే ఓటీటీ లో విడుదలైన తరువాత కూడా సర్కారు వారి పాట రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉంది.

మహేష్ బాబు హైద్రాబాద్ గచ్చిబౌలి లో AMB సినిమాస్ పేరిట ఒక భారీ షాపింగ్ మాల్ మరియు మల్టీప్లెక్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ధియేటర్ లో సర్కారు వారి పాట ఒక అరుదైన రికార్డు దక్కించుకుంది.

అదేంటంటే AMB ధియేటర్ లో 2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన తొలి ప్రాంతీయ చిత్రంగా నిలిచిందీ సర్కారు వారి పాట. ఇక అన్ని భాషలు కలిపి 4.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన రికార్డ్ మాత్రం ఆర్ ఆర్ ఆర్ పేరిట ఉంది. ఇక మహేష్ బాబు తదుపరి చేయబోయే సినిమాలు ఒకటి త్రివిక్రమ్ తో ఇంకోటి రాజమౌళి తో. ఆ చిత్రాలతో ప్రాంతీయ రికార్డు లే కాక పాన్ ఇండియా మరియు అంతర్జాతీయ రికార్డులు కొల్లగొడతాడు అని ఆశిద్దాం. 

అక్షయ్ కుమార్ తో నటించనున్న సూర్య

0

ఇటీవల విడుదల అయిన సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రం సక్సెస్ తో మంచి ఊపు మీదున్న అక్షయ్ కుమార్, తన తదుపరి చిత్రం సూర్య నటించిన సూరరై పొట్రు రీమేక్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుండి ఇందులో సూర్య అతిధి పాత్రలో కనిపిస్తారు అని గట్టి ప్రచారమే జరిగింది. ఇప్పుడు ఆ విషయాన్ని స్వయంగా సూర్య తన ఇన్స్తాగ్రామ్ లో వెల్లడించారు.

సూర్య, అక్షయ్ కుమార్ కలిసి ఉన్న పిక్ ను షేర్ చేస్తూ సూర్య తన ఆనందాన్ని పంచుకున్నారు. తన పాత్రలో అక్షయ్ కుమార్ ను చూడబోతుండటం చాలా ఆనందంగా ఉందనీ, సుధ కొంగర మరోసారి అదే కధను సజీవంగా తెరకెక్కించగలదు అని సూర్య అన్నారు. ఆ వెంటనే ఆ పోస్ట్ కి రిప్లై గా అక్షయ్ కుమార్ స్పందించారు. సూరరై పోట్రు లాంటి స్ఫూర్తి దాయకమైన సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందనీ, కెప్టెన్ సుధ కొంగర ఆధ్వర్యం లో చెన్నై లో షూటింగ్ జరుగుతుందని సెలవిచ్చారు. 

2020 లో ఓటీటీ లో విడుదల అయిన సూరరై పొట్రు విమర్శకులతో పాటు ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ చిత్రంలో సూర్య మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి నేదుమారన్ రాజంగం (మారా)గా కనిపించారు. 

తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధ కొంగర ఇప్పుడు హిందీ రీమేక్ భాధ్యత కూడా తీసుకున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన రాధికా మదన్ నటిస్తుండగా, పరేష్ రావల్ కూడా ఒరిజినల్ లో చేసిన పాత్రలో మళ్ళీ నటించనున్నారు. ఏప్రిల్ లో షూటింగ్ మొదలైన ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.