Home Blog Page 2129

Pawan Kalyan’s Pan India movie Hari Hara Veera Mallu shelved ?

0

Pawan Kalyan and Krish bounded together for a periodic action adventure film Hari Hara Veera Mallu. The renowned producer AM Ratnam took up this prestigious project. The film began its production in September 2020. Initially scheduled for release on 29 April 2022 in Telugu, Tamil, Malayalam and Hindi languages. The film was postponed due to the Covid.  The production also experienced delays due to Kalyan’s other film and political commitments.

Hari hara veera mallu is a huge budget and a pan india film. AM Ratnam has already spent huge money on it. Still half of the film’s shoot is yet to complete. The producer already brought a lot of money from the financiers. And now he is not getting a single rupee from the financiers due to various reasons. AM Ratnam is in very difficult situation and he is not finding any way to get out of this.

The film’s shoot is on hold due to financial reasons. Now it looks like there is no possibility of going forward. But the only question is how AM Ratnam will compensate the financiers. In the industry circles the rumours that the movie is shelved has been circulating. Pawan Kalyan has already announced that he will be with the people from Dussera. This will be the most difficult situation for any producer . We have to see how AM Ratnam will come safe out of this situation.

సుడల్ (వెబ్ సీరీస్) : ఆసక్తికరమైన అంశాలతో పాటు ఆలోచింపజేసే ప్రయత్నం

0

విక్రమ్ వేద వంటి అద్భుతమైన సినిమా తీసిన పుష్కర్ గాయత్రి ద్వయం రచించిన వెబ్ సీరీస్ “సుడల్ – The Vortex”. బ్రహ్మ, అనుచరణ్ లు దర్శకత్వం వహించగా,ఐశ్వర్య రాజేష్, పార్థిబన్, శ్రేయా రెడ్డి, కథిర్,హరీష్ ఉత్తమన్ తదితరులు నటించిన ఈ వెబ్ సీరీస్ ఈ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది.

ఈ సీరీస్ కథ తమిళనాడులో జరుగుతుంది. సాంబలూరు అనే చిన్న గ్రామంలో సిమెంట్ ఫ్యాక్టరీ మీద అక్కడి జనాలు ఆదారపడి బతుకుతుంటారు. ఆ ఫ్యాక్టరీ ప్రారంభించిన సమయంలో అమ్మని అనే అమ్మాయి కనిపించకుండాపోతుంది. దాదాపు పాతికేళ్ల తరువాత ఫ్యాక్టరీ తగులబడుతుంది. ఆ రోజే నీల అనే అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఆ ఫ్యాక్టరీ యూనియన్ లీడర్ షణ్ముఖం (పార్థిబన్) కూతురే నీల. అదే ఊర్లో సీఐ అయిన రెజీనా (శ్రియా రెడ్డి)కి, షణ్ముఖంకు ఒకరంటే ఒకరికి పడదు. ఇక ఫ్యాక్టరీ తగలబడి పోవడానికి కారణం షణ్ముఖం యే కారణం అని నింద పడగా, మరో వైపు నీల ఒకరోజు కనిపించకుండా పోతుంది. నీల అదృశ్యం వెనుక రెజీనా కొడుకు అతిశయం హస్తం ఉందా?,ఫ్యాక్టరీ తగలబడి పోవడం వెనుక అసలు రహస్యం ఎంటి? ఈ సంఘటనలతో అంకాలమ్మ జాతర మయన్ కొళ్లైకి సంబంధం ఏమైనా ఉందా అన్న ప్రశ్నలకు సమాధానం పూర్తి వెబ్ సీరీస్ లో దొరుకుతుంది.

వెబ్ సీరీస్ మొదలైన కాసేపు మామూలుగానే ఉంటుంది, సినిమా కంటే వెబ్ సీరీస్ కి నిడివి విషయంలో కాస్త వెసులుబాటు ఉంటుంది కాబట్టి మొదటి ఎపిసోడ్ ల వరకు పాత్రల పరిచయం చేస్తూ కాస్త నెమ్మదిగానే సాగినా ఆ తరువాత అసలు విషయం వైపు కథనం పరుగులు తీస్తుంది.ఒక గ్రామంలో ఉండే వాతావరణాన్ని చాలా వరకు సహజంగా ఉండేలా చూసుకున్నారు ఈ సిరీస్ లో. ప్రారంభంలో ఇదేదో దృశ్యం సినిమాకి దగ్గరగా ఉన్న మరో థ్రిల్లర్ అనుకుంటాం కానీ చాలా తొందరగానే ఆ శైలి నుండి తనదైన బాణీలో వెళుతుంది ఈ సీరీస్ కథనం. ఎన్నో పాత్రలు ఒక్కో పాత్రకి ఒక్కో బలహీనత (flawed characters) ఆయా బలహీనతల వల్ల ఒక్కొక్కరి జీవితంలో తలెత్తిన సమస్యల్ని చాలా అర్థవంతంగా భావోద్వేగాలను కలిపి చూపించారు.ఒక్కో ట్విస్ట్ వస్తున్న కొద్దీ క్రమంగా ఆసక్తి పెరుగుతూ అసలు ఎలా అన్నిటినీ ఒక దగ్గరకి చేర్చి ముగిస్తారా అని చూసేలా చేయడంలో దర్శకులు సక్సెస్ అయ్యారు. ఒక్కో ఎపిసోడ్ దాదాపు యాభై నిమిషాలు లేదా గంట సమయం ఉన్నా ఎక్కడా పట్టు తప్పకుండా, వీక్షకులు ఆసక్తి తగ్గకుండా తీశారు.తల్లిదండ్రులు చేసిన తప్పులు పిల్లల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, ఎదుగుతున్న వయసులోనే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్న యువత ఎలాంటి విషాదకరమైన సంఘటనలు ఎదురుకుంటారు అనే విషయాలను చక్కగా చూపించారు. అలాగే సమాజంలో మంచి వాళ్ళుగా, అమాయకులుగా నడుచుకునే వాళ్ళలో ఎవ్వరికీ తెలియని దుర్మార్గులు దాగి ఉంటారో, బాల్య వయసులో లైంగిక వేదింపుల వల్ల ఆమ్మాయిలు ఎలాంటి మానసిక సంఘర్షణకు గురవుతారు అనే అంశాలను ఆలోచింప చేసెలా తెరకెక్కించారు.పోలీస్ పాత్రధారి కథీర్ ద్వారా ఊరి గురించి, మనుషుల మధ్య వైరుధ్యం గూర్చి వచ్చే సంభాషణలు ప్రభావితం చేస్తాయి.

నటీనటుల్లో ఐశ్వర్య రాజేష్ మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకొగా, పోలీస్ గాకథిర్ కూడా ఆకట్టుకుంటాడు. శ్రేయా రెడీ చాలా రోజులకు కనిపిస్తుంది, పోలీస్ అధికారి పాత్రలో ఆవిడ కూడా బాగా చేసింది. ఇక పార్థిబన్ తన అనుభవంతో పాత్రను పోషించారు. హరీష్ ఉత్తమన్ పాత్రోచితంగా నటించారు. నివేదితా సతీష్ తదితరులు పర్వాలేదు.

హరిహర వీరమల్లు ఆగిపోయిందా?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో ఏ ఎం రత్నం నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం “హారి హర వీర మల్లు”. సెప్టెంబర్ 2020 లో మొదలైన ఈ సినిమా మొదట ఏప్రిల్ 29 2022 న విడుదల తేదీగా ప్రకటించారు. అయితే కరోనా వల్ల అన్ని సినిమాల లాగే ఈ సినిమా కూడా వాయిదాల వల్ల ఆలస్యం అయింది.

నిజానికి భీమ్లా నాయక్ చిత్రం కంటే ముందే హారి హర వీర మల్లు రావాల్సి ఉన్నా, రీమేక్ సినిమా కాబట్టి ముందుగా భీమ్లా నాయక్ పూర్తి చేశారు తొందరగా. ఇక తరువాత అయినా ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది అనుకుంటే కాస్టింగ్ లో మార్పులు అని కొన్ని రోజులు, స్క్రిప్ట్ లో మార్పులు అని మరి కొన్ని రోజులు ఇలా ఏదో ఒక కారణం వలన షూటింగ్ ఆలస్యం అవుతునే ఉంది.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తుంది. చారిత్రక నేపథ్యం గనుక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేసి ఇప్పటికే నిర్మాత ఏ ఎం రత్నం బాగా ఖర్చు పెట్టేశారు. ఫైనాన్స్ నుంచి ఇప్పుడు డబ్బులు వచ్చేలా లేవు. ఫైనాన్స్ ఇబ్బందుల వల్లే ఈ సినిమా షూటింగ్ జరగట్లేదు అనే పుకారు కూడా ఉంది. నిజంగానేషూటింగ్ ఆగిపోతే ఇప్పుడు ఫైనాన్సియర్ లకు డబ్బులు తిరిగి ఇవ్వడం నిర్మాత వల్ల అవని పని,పీకల లోతు కష్టాల్లో కూరుకుపోతాడు.

ఎందుకంటే దసరా నుంచి ప్రజల్లోకి వస్తాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది.పార్టీ పనుల్లో ఆయన బిజీగా ఉండే దశలో ఇంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి అవుతుందా అంటే అని అనుమానమే.ఏదేమైనా నిర్మాత ఏ ఎం రత్నంకు ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి అనే చెప్పాలి. మరి ఏం చేసి ఆయన ఈ మొత్తం వ్యవహారం నుంచి బయట పడతారో చూడాలి.

నాగ చైతన్య మీద ఆగని పుకార్లు

0

హీరో నాగ చైతన్య – సమంత ల జోడీ మొదటి చిత్రం “ఏ మాయ చేసావే” నుండి చక్కని జోడీగా పేరు తెచ్చుకుని ఆ తరువాత కొన్ని సంత్సరాల పాటు ప్రేమాయణం నడిపి 2017 అక్టోబరులో పెళ్ళి చేసుకున్నారు.చూడముచ్చటగా ఉన్న ఈ జంటను చూసి అభిమానులు మురిసిపోయారు. ఎప్పటికప్పుడు వారి సోషల్ మీడియా హ్యాండిల్ లలో ఇద్దరి పట్ల వారి ప్రేమను తెలుపుతూ ఆనందించారు. అయితే పెళ్ళైన నాలుగేళ్లకి అక్టోబరు 2021 లో అందరికీ షాక్ ను ఇస్తూ నాగ చైతన్య – సమంత లు తమ వివాహబంధం నుంచి విడిపోతున్నాము అని ప్రకటించారు.

అయితే విడాకుల తరువాత అటు నాగ చైతన్య కానీ ఇటు సమంత కానీ ఆ విషయం గూర్చి ఎక్కడా ప్రస్తావించకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇదిలా ఉండగా కొంత సమయం నుంచి నాగ చైతన్య మీద పుకార్లు రావడం కాస్త ఎక్కువ అయ్యింది.

ఫలానా నటితో చైతన్యకు ఎఫైర్ ఉంది అని లేదా డేటింగ్ చేస్తున్నారు అని ఇది వరకు కొన్ని సార్లు పుకార్లు రాగా అవి ఏవీ నిజం కాలేదు. తాజాగా మరోసారి ఒక హీరోయిన్ తో చైతన్య పేరు మళ్ళీ వచ్చింది. చైతన్య ఇప్పుడప్పుడే మళ్ళీ పెళ్ళి చేసుకునే ఉద్దేశంలో లేడని,ప్రస్తుతం తన దృష్టి అంతా తన కెరీర్ మీదే ఉంది అని అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

అయినా ఇలా వ్యక్తిగత జీవితంలోకి చొరబడి అనవసరమైన పుకార్లు లేవదీయడం ఎంత మాత్రం సబబు కాదు. ఈ ఎడతెరిపి లేనిపుకార్లు అన్నీ స్వతహాగా సినిమా ఇండస్ట్రీ లోని వార్తలు లాగా వస్తున్నాయా లేదా ఎవరో వెనక నుంచి ఇదంతా నడిపిస్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.అది నిజం అయినా కాకపోయినా ఇలాంటి వ్యక్తిగత ఖననం ఎవరు చేసినా తప్పే.

Super star Mahesh babu still not satisfied with Trivikram’s full script

0

Superstar Mahesh babu’s next is SSMB28 with Trivikram Srinivas. The project was officially launched with a Pooja ceremony on 3rd February,2022. From then the pre production works were started and are going on a brisk pace. Meanwhile it is heard that Trivikram didn’t complete the story. Even the team didn’t release any update on superstar Krishna’s birthday which made fans angry.

Recently Trivikram narrated full script to Mahesh babu. But as per the sources Mahesh is still not satisfied with the script. So latest info is that Mahesh babu asked Trivikram to make some changes in the script. Now Trivikram is busy in the script changes.

The makers have scheduled the start of shoot in July. But now it looks like the shoot will postpone from July. Superstar fans are expecting the film to complete fast so that Mahesh can start his next with S S Rajamouli. With the pace the things are going on SSMB28 shoot might start in August.

The agenda based rumours still continuing for Naga Chaitanya

0

Naga Chaitanya is in the news for quite some time now. Let it be his professional or personal life, a fresh piece of news comes every now and then. In the professional front he is enjoying his success spree. He scored hits with his last outings say Love story and Bangarraju.

He has interesting line up as well upfront. His Bollywood debut Laal Singh Chaddha along with Aamir khan is in post production works now. His Telugu movie Thank you is also completing it’s post production. And his Telugu – Tamil bilingual with director Venkatesh Prabhu is in filming stage. So all is well with his professional life and Naga chaitanya is hearing all good things.

Coming to his personal life, a lot of rumours have been doing rounds in industry. Especially after divorce with Samantha, many speculations been made on Naga Chaitanya. It is rumoured that he is dating his co-actress which led to divorce. After the divorce too some other actress name came out as Naga Chaitanya love interest. And Now one more actress’ name is added in the list.

Till now no rumour has proved true. It is heard from his close circle that Naga Chaitanya is very happy now. And he is not in mood to make any commitments for now. Fans believe that someone or some team is doing all this with certain agenda. 

సంతకం చేయాల్సిందే – ఏపీ ధియేటర్లకు రెవెన్యూ అధికారుల హుకుం

0

ఆంధ్రప్రదేశ్ లో ముగిసిపోయింది అనుకున్న టికెట్ రేట్ల సమస్య తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో వల్ల మళ్ళీ మొదటికి వచ్చింది.ప్రభుత్వం జారీ చేసిన జీవోకి కట్టుబడి థియేటర్ యాజమాన్యాలు ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకోవాలని కలెక్టర్ల ద్వారా ఒత్తిడి తీసుకు వస్తూ ఉండడంతో అందుకు వారు ఒప్పుకోవడం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లకు సంభందించిన మార్గదర్శకాలను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బుక్ మై షో, పే వంటి ఆన్లైన్ టికెట్ పోర్టల్ ల ద్వారా టికెట్ అమ్మకాలను నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్లు ఇక మీదట నుంచి నోడల్ ఏజెన్సీ నిర్వహించే గేట్ వే ద్వారానే టికెట్లను 2% సర్వీస్ చార్జీలతో తమ వ్యాపారాన్ని నడిపించాలి. ఇక ఈ ఉత్తర్వుల ప్రకారం అన్ని థియేటర్ లు నడుచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఆ దశలోనే ఈ ఒప్పందానికి థియేటర్ల యాజమాన్యాల సమ్మతి కోసం రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో తమ అంగీకారం తెలపాల్సిందేనని లేని పక్షంలో థియేటర్లు సీజ్ చేస్తామని హెచ్చరించినట్టు సమాచారం. సత్తెనపల్లి,నరసరావుపేట,పిడుగురాళ్ల,వినుకొండ, చిలకలూరిపేటలో థియేటర్ల యాజమాన్యాలు తమ నిర్ణయం చెప్పేటందుకు కొంత గడువు కోరారు అని తెలియవచ్చింది.

ఏదేమైనా ఈ వ్యవహారం మొత్తం ఒక కొలిక్కి వచ్చే వరకూ పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ కొత్త విధానంలో టికెట్ అమ్మకాల ద్వారా తమ వాటా డబ్బులు తిరిగి వస్తాయా లేదా అన్న విషయంలో థియేటర్ల యాజమాన్యాల భయం సమంజసమే.అందుకే పూర్తి నమ్మకం,పారదర్శకత ఉన్నప్పుడే వారు తమ నిర్ణయం తీసుకునేలా పరిస్తితి కనపడుతుంది. ఈ విషయం పై పరిశ్రమ పెద్దలు ఇంకా ఏమీ మాట్లాడలేదు. మరి వారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త టికెటింగ్ పోర్టల్ నిర్ణయం ఎన్ని మలుపులు తిరిగి ఎక్కడ ఆగుతుందో వేచి చూడాలి.

లేేడీ పవర్ స్టార్ అని పిలవద్దు – సాయి పల్లవి

0

సాయి పల్లవి…ఈ తరం కథానాయికల్లో చాలా ప్రత్యేకమైన ఇమేజ్, స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న అమ్మాయి. సాయి పల్లవికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నాయి. ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా వేడుకలో దర్శకుడు సుకుమార్ ఆమెను ‘లేడీ పవర్ స్టార్’ అని పేర్కొనడం ఆ ఫంక్షన్ కే హైలైట్ గా నిలించింది.

ఇక ‘విరాట పర్వం’ ప్రీ రిలీజ్ వేడుకలో ఏకంగా సాయి పల్లవికి చెందిన ఏవీ లోనే లేడీ పవర్స్టార్ అనే టాగ్ వేయడం జరిగింది.ఈ కొత్త టాగ్ వ్యవహారం మీద సాయి పల్లవి స్పందించారు. అలాంటి టాగ్ లు తనకి వద్దని, అలా పిలవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని,అలాంటి వాటి వల్ల తన మీద అదనపు భారం పడుతుందని సాయి పల్లవి అభిప్రాయం. ప్రేక్షకులు చూపించే అభిమానం,ప్రేమని మాత్రమే స్వీకరించాలని, అందుకని పాత్రల ఎంపిక విషయంలో జాగర్తగా ఉంటానని,ఇతరత్రా టాగ్ లు వంటివి పట్టించుకుంటే తన పై ఒత్తిడి పెరుగుతుంది అని ఆవిడ చెప్పడం జరిగింది.

ఇదిలా ఉండగా ఇదివరకు సాయి పల్లవికి మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం రాగా ఆవిడ తిరస్కరించింది. ఇదే విషయం పై మాట్లాడుతూ, ఒక తమిళ సినిమా రీమేక్ ఆఫర్ తన దగ్గరకి వచ్చిందని, రీమేక్ లు అంటే స్వతహాగా భయం అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. ఆల్రెడీ ఒకరు చేసిన పాత్రను తాను చేయాలి అంటే ఆ ఒత్తిడి తట్టుకోలేనని, అందుకే ఆ పాత్ర చేయలేదని చెప్పారు. అయితే చిరంజీవి గారి లాంటి యాక్టర్ తో సినిమా ఛాన్స్ రావడం నిజంగా అదృష్టం అని ఆ సినిమా చేయలేక పోయినందుకు తాను చాలా బాధ పడ్డానని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. చిరంజీవి గారు ఎంతో పెద్ద మనసుతో తను ఆఫర్ ను వద్దన్నా స్పోర్టివ్ గా తీసుకున్నారు అని భవిష్యత్తులో అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనతో సినిమా చేస్తానని సాయి పల్లవి చెప్పారు.సాయి పల్లవి కోరిక త్వరలోనే తీరాలి అని కోరుకుందాం.

Box-office : ఈ వారం సినిమాల రిపోర్ట్

0

ఈ వారం విడుదలైన చిత్రాలు విరాట పర్వం, గాడ్సే.సత్యదేవ్ నటించిన గాడ్సే టీజర్,ట్రెయిలర్ లో సమకాలీన రాజకీయాలపై ఉన్న డైలాగ్స్ కి చక్కని స్పందన లభించింది. అయితే లేటెస్ట్ సెన్సేషన్ సాయి పల్లవి నటించడంతో విరాట పర్వం సినిమా పై ప్రేక్షకులు మంచి ఆసక్తిని కనబర్చారు.

సోషల్ మీడియా వరకు రానా, సాయి పల్లవి కాంబినేషన్ వల్ల ఆసక్తి పెరిగినా, ఇతర ప్రేక్షకులకు అంతగా పట్టించుకోలేదు. దాని ఫలితంగా చాలా దారుణమైన ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.కనీసం సాధారణ స్థాయిలో కూడా రాకపోవడం విచిత్రం. ఇక గాడ్సే విషయానికి వస్తే తొలి ఆట నుంచే సినిమాని ప్రేక్షకులు తిరస్కరించారు.

విరాట పర్వం వారంతానికి 2.5 కోట్ల షేర్ సాధించి అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. గాడ్సే కు అసలు షేర్ యే రాలేదు. ఈ సినిమాల ఫలితాన్ని అంటే సుందరానికీ ఏమైనా ఉపయోగించుకుంటుంది అనుకుంటే అదీ జరగలేదు.విక్రమ్ సినిమా ఈ వారం కూడా మంచి కలెక్షన్లు రాబట్టగా, మేజర్ కూడా పరవాలేదు అనిపించింది.

ఏదేమైనా వరుస సినిమాలతో కళకళలాడాల్సిన సినిమా ఇండస్ట్రీ వరుస పరాజయాలను చవి చూస్తుంది. కనీసం వచ్చే నెలలో రిలీజ్ అయ్యే పక్కా కమర్షియల్, థాంక్యూ, వారియర్ చిత్రాలు విజయం సాధించి మళ్ళీ ఇండస్ట్రీని ట్రాక్ మీదకి తీసుకు వస్తాయి అని ఆశిద్దాం.

త్రివిక్రమ్ చెప్పిన కథ మెచ్చని మహేష్

0

తెలుగు సినిమా పరిశ్రమలోకెల్లా ఆసక్తికరమైన కాంబినేషన్ లలో ఒకటి మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా అతడుకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఇప్పటికి టీవీలలో ప్రేక్షకులతో రిపీట్ షోలు వేయించుకుంటుంది. ఇక 2010లో వచ్చిన ఖలేజా బాక్స్ ఆఫీసు వద్ద నిరాశ పరిచినా మహేష్ నటనకు, క్యారెక్టర్ కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు.

మహేష్ – త్రివిక్రమ్ కలిసి సినిమా చేసి పదేళ్లు పైనే అయిపొయింది. వాస్తవానికి 2016 లోనే వీరిద్దరి మూడో సినిమా రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. మళ్ళీ ఇన్నేళ్లకి ఈ కాంబోలో సినిమా అనౌన్స్ చేయటం జరిగింది.హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ లీలా మరో హీరోయిన్ గా నటిస్తుందంటూ ప్రచారం జరిగినా అధికారికంగా ప్రకటన ఏదీ రాలేదు.అలాగే సినిమాలో మరో ముఖ్యమైన పాత్రకు మలయాళ నటుడు పృథ్వీరాజ్ తో సహా పలు పర భాషా నటుల పేర్లు వినిపించాయి వాటికి యే రుజువు లేదు.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇటీవలే మహేష్ కు త్రివిక్రమ్ ఫుల్ స్క్రిప్ట్ నేరెట్ చేసారు అని, దానికి మహేష్ కొన్ని మార్పులు సూచించినట్టు తెలుస్తుంది. ఆయా మార్పులు అన్నీ తొందరగా కానిచ్చి, ఆగస్ట్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో త్రివిక్రమ్ టీమ్ ఉన్నట్టు తెలుస్తుంది. ముచ్చటగా మూడోసారి కలవనున్న ఈ మాటల మాంత్రికుడు మరియు సూపర్స్టార్ కలిసి ప్రేక్షకులకి అతి పెద్ద బ్లాక్ బస్టర్ అందిస్తారని ఆశిద్దాం.