Home Blog Page 2117

Pakka Commercial 1st day box office collections and verdict

0

Gopichand and Rashi Khanna starrer Pakka Commercial was released this week amidst poor reviews. The word of mouth has not been as strong as expected, and the film has gotten off to a dull start at the box office. Directed by Maruthi, Pakka Commercial collected Rs 3 crores on its opening day and didn’t meet the expectations set by trade circles.

The buzz among the audience has been very low resulting in poor collections. The audio and trailer failed to create any expectations causing low openings. The theatrical rights are valued at Rs 20Cr and the 2nd-day noon shows have also started on a poor note. Unless the movie sees a massive turnaround in the weekend, the breakeven looks quite tough.

Both Gopichand and Maruthi are in desperate need of hit and had pinned high hopes on this film. Pakka Commercial stars Gopicahand as Lucky, a carefree lawyer who takes illegal means to make money. Sathyaraj featured as Gopichand’s father while Rao Ramesh played the antagonist role. UV Creations and GA2 Arts have bankrolled this film.

Nandamuri Balakrishna locks festival weekend for NBK 107

0

After the massive success of Akhanda last year, fans are eager to see what Balakrishna has in store for them. Following up Akhanda with another mass entertainer, Balayya has teamed up with Gopichand Malineni for NBK 107. This is the first time the actor-director duo will be working together and the movie went on floors a few months ago.

There were a lot of speculations regarding the NBK107 release date. Earlier it was expected that the film will release for Dusshera. However, it has now been pushed from that date and Mythri Movie Makers have decided on another festival date. NBK 107 will now release on 23rd December for the Christmas weekend.

Gopichand Malineni has claimed that this is based on true events. The director has clarified that this is going to be an action entertainer with mass elements to suit Balayya’s image. Gopichand Mallineni has done extensive research for the script and spent a large part of last year in libraries.

Shruti Haasan will star opposite Balakrishna in this project. This will be her third film with the director after Balupu and Krack. Varalaxmi Sarathkumar will also star in this project which will be backed by Mythri Movie Makers.

దేవీశ్రీ ప్రసాద్ వద్దు.. రవి బస్రూర్ యే ముద్దు అంటున్న సల్మాన్ ఖాన్

0

పసందైన బాణీలతో, క్యాచీ లిరిక్స్ తో తనదైన శైలిలో సంగీతం అందించడంలో దేవీశ్రీ ప్రసాద్ కు ఎవరూ సాటి రారు.ఆయన పాటలకు ప్రేక్షకులు ఈలలు వేసి డాన్స్ చేయడం సర్వ సాధారణమైన విషయంగా చెప్పుకోవచ్చు. దేశం మొత్తం వైరల్ అయిన పుష్ప కావచ్చు,లేదా ఈ మధ్య ది వారియర్ చిత్రంలోని రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయిన బుల్లెట్ సాంగ్ కావచ్చు. ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా సంగీతం ఇవడం వల్లే దేవీ కెరీర్ ఇన్ని రోజుల లాంగ్ రన్ వచ్చింది.

ఇప్పటివరకు దేవీ ఎందరో స్టార్ హీరోల సినిమాలకు హిట్ మ్యూజిక్ అందించాడు. అలాగే దేవీ అంటే తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద దర్శకులు,సినిమాలకు పక్కా ఛాయిస్ గా ఉండేవారు. కొరటాల శివ, త్రివిక్రమ్ తో పాటు పలువురు దర్శకులు దేవీ ట్యూన్స్ నే తమ సినిమాలకు కావాలనుకునే వారు.

అలాంటి దేవీ మ్యూజిక్ ఓ స్టార్ కు అస్సలు నచ్చలేదు. దీంతో ఆయనను ఆ సినిమా నుండితొలగించారని తెలుస్తోంది. దేవిశ్రీ అందించిన ట్యూన్స్ పట్ల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారట. కబీ ఈద్ కబీ దివాళి ప్రాజెక్ట్ నుండి దేవినీ తప్పించి కేజీఫ్ తో మంచి పేరు తెచ్చుకున్న రవి బస్రూర్ ను ఎంచుకున్నారని తెలుస్తోంది.అలాగే ఆయన అందించిన టైటిల్ సాంగ్ సల్మాన్ కు విపరీతంగా నచ్చిందట.ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్, టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

నిజానికి గతంలో దేవిశ్రీ అల్లు అర్జున్ కోసం కంపోజ్ చేసిన రింగా రింగా, సిటీ మార్ సిటీ మార్ సాంగ్స్ ట్యూన్స్ ను తన సినిమాలు రెడీ, బాడీగార్డ్ లలో వాడుకోగా అవి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.ఫర్హాద్ సామ్జీ తెరకెక్కిస్తున్న కబీ ఈద్ కబీ దివాళి చిత్రంలో పూజా హెగ్డే, కృతి సనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే ఓ పాట లో రామ్ చరణ్, పూజ, సల్మాన్, వెంకీ కలిసి స్టెప్స్ వేయనున్నారట. ఇక సల్మాన్ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఆయన ఈ మధ్య సౌత్ స్టార్ట్స్ తో ఎక్కువగా టచ్ లో ఉంటున్నారు.

మరోవైపు దేవీ శ్రీ ప్రసాద్ విషయానికి వస్తే 2015 లో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన S/O సత్యమూర్తి సినిమా తరువాత త్రివిక్రమ్ మళ్ళీ దేవితో పని చేయలేదు.అంతకు ముందు త్రివిక్రమ్ ప్రతి సినిమాకు దేవీ యే సంగీతం అందించేవారు. ఇక కొరటాల శివ కెరీర్ తొలి సినిమా నుండి దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు. ఆచార్య విషయానికి వచ్చేసరికి మార్చేశారు. ఆ తరువాత ఎన్టీఆర్ తో చేస్తున్న చిత్రానికి అనిరుధ్ ని ఎంచుకున్నారు. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి పని చేసే ఒకే ఒక స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాత్రమే. సుకుమార్ కి మాత్రం దేవిశ్రీ ఆస్థాన సంగీత దర్శకుడు అని చెప్పాలి. కేవలం సుకుమార్ దర్శకత్వం వహించే సినిమాకు కాకుండా ఆయన అసిస్టెంట్ లు దర్శకులుగా చేసిన సినిమాలకు కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Actor Naresh serious allegations on his wife

0

Actor Naresh might be having a great time professionally with a series of interesting projects. However, it is his personal life that is now mired in controversies. Naresh is having a rather public exchange of words with his third wife Ramya Raghupathi.

The actor spoke to the media and made some shocking accusations about his wife and told the media that she has been mentally harassing him for quite some time now. Naresh also added that he has all the proof of her terrible behaviour and illicit relationships and he will take a legal route if she continues to make any more statements against him.

Naresh also added that Ramya has been trying to extract money from him and he has not been peaceful since she walked into his life. He alleged that his ex-wife tried to extort Rs 50 lakhs from him and he even paid Rs 10 lakhs to get rid of her.

Meanwhile, there are rumours of Actor Naresh marrying actress Pavithra Lokesh. The two have been quite public about their friendship for the past few years. However, the senior actor has maintained that Pavithra is a good friend, philosopher and guide to him.

NBK107: క్రిస్మస్ కానుకగా విడుదల అవుతున్న బాలకృష్ణ – గోపీచంద్ మలినేని

0

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన ‘అఖండ’ సినిమా సూపర్ హిట్ అయి బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. ఆఖండ విజయంతో మంచి జోరు మీద ఉన్న బాలకృష్ణ మరో మాస్ సినిమా చేస్తున్నారు.మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కమిటైన బాలయ్య బాబు NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఓ పవర్ ఫుల్ మాస్ మసాలాగా తెరకెక్కుతున్న ఈ సినిమానిమైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.మొన్నటి వరకూ ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేయాలని భావించినా,షూటింగ్ లో జాప్యం వలన.. ఇటీవలే బాలకృష్ణకు కరోనా సోకడం..విశ్రాంతి తీసుకుని మళ్ళీ రావడం వంటి కారణాల వల్ల రిలీజ్ డేట్ ను డిసెంబర్ 23 తేదీకి మార్చినట్టు తెలిసింది.క్రిస్మస్ సెలవుల సీజన్ లో కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం మెండుగా ఉన్నందున అది మంచి నిర్ణయం అనే చెప్పాలి.

ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఫారిన్ ఫైట్ హైలైట్ కాబోతోందని సమాచారం.ఈ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఖర్చు విషయంలో మైత్రి మేకర్స్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదని సమాచారం. బాలయ్య కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలవాలని భావిస్తున్నారట. ఇకపోతే ఈ సినిమాలో ముఖ్యంగా ఫైట్ సీన్స్ హైలైట్ అయ్యేలా స్క్రిప్ట్ రాసుకున్నారట గోపీచంద్ మలినేని. ఫస్టాఫ్‌లో వచ్చే ఫారిన్ ఫైట్ సినిమాకే హైలైట్ అవుతుందని, అంతేకాదు ఈ ఫైట్ సీన్ నందమూరి అభిమానులకు ఖచ్చితంగా పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు.

అదే విధంగా సెకండాఫ్‌లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ కూడా బాలకృష్ణ గత సినిమాల్లో చూడని విధంగా ఉండబోతోందని గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి జై బాలయ్య అనే పేరు ఖరారు చేశారని, త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుందని అంటున్నారు.అదే గనక నిజం.అయితే నందమూరి అభిమానులు పండగ చేసుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఈ సినిమాలో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదిరిపోయే లెవెల్ లో కనిపించనున్నారటఅలాగే ఓ మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేసిన యూనిట్ ఆ పాట కోసం డస్కి బ్యూటీ డింపుల్ హయతిని ఎంపిక చేసుకున్నారని సమాచారం.

తమ పెళ్ళి పుకార్ల పై స్పందించిన నరేష్ – పవిత్రా లోకేష్

0

తనకి నరేష్ మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదంటూ వీడియో విడుదల చేసింది నటి పవిత్రా లోకేష్.గత కొన్ని రోజులుగా సీనియర్ నటుడు నరేష్ – నటి పవిత్రా లోకేష్ కు పెళ్ళి జరిగింది అని..కాదు సహాజీవనం అని రకరకాలుగా వదంతులు వ్యాపించాయి. ఆ విషయంపై నరేష్ మరియు పవిత్రా లోకేష్ ఇరువురూ వీడియోల ద్వారా వివరణ ఇచ్చారు.

ఈ మేరకు పవిత్రా లోకేష్ మాట్లాడుతూ నరేష్ భార్యకి నిజంగా భర్త కావాలంటే ఇక్కడ హైదరాబాద్‌లో అడిగితే న్యాయం జరుగుతుంది కానీ ఏ సంబంధం లేని బెంగుళూరు వెళ్లి మీడియా ముందు రచ్చ చేయడం వల్ల ఏ ఉపయోగం ఉందని,ఇదంతా తన పేరు చెడ గొట్టడానికిచేస్తుందంటూ తనపై ఆరోపణల్ని ఖండించారు పవిత్రా లోకేష్.


తాను కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినా తెలుగు సినిమాల్లో ఎప్పటి నుండో చాలా ఏళ్లుగా పని చేస్తున్నానని, ప్రేక్షకులకి ఎంతో దగ్గరయ్యాను అందుకే తన సమస్యను చెప్పుకోవడానికి ఇలా మీడియా ముందుకు వచ్చానని చెప్పారు.నరేష్ గారికి తనకు ఉన్న సంబంధం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని.. అలాగే నరేష్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అవసరం కూడా లేదని,నరేష్ గారి భార్యను అంటూ వచ్చిన రమ్య తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని ఆవిడ భాధ పడ్డారు. దయచేసి ఈ విషయంలో తనను,నరేష్ గారిని మద్దతు పలకాలని ఆవిడ అభ్యర్ధించారు.
ఇదే విషయం పై నరేష్ మాట్లాడుతూ తన మాజీ భార్య,మూడో భార్య అయిన రమ్య పై విరుచుకుపడ్డారు. ఆమె డ్రైవర్ తో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా తన కుటుంబాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు.హిందూపూర్ లో ఆమె ఎన్నో ఆర్థిక మోసాలకు పాల్పడిందని, అంతటితో ఆగకుండా హైదరాబాద్ లో కూడా చాలా మోసాలు చేసి కేసుల పాలయిందని, మళ్ళీ బెంగళూరు వచ్చి ఒక బ్లాక్ మెయిల్ ఛానల్ తో కలిసి తన మీద వదంతులు వ్యాపింపజేస్తుంది అని అన్నారు.

అసలు ఆమెకు తనకి ఎనిమిదేళ్ళ క్రితం విడాకులు తీసుకున్నానని,ఇప్పుడు ఈ అసత్య ఆరోపణలతో ఆగకుండా డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ కూడా చేసిందని..ఆమెకు పది లక్షలు ఇవ్వగా, అవి తీసుకుని పెద్ద వాళ్ళ దగ్గరకి వెళ్లి మరో యాభై లక్షలు పీడించి అనేక రకాలుగా గొడవ చేసిందని తెలిపారు. నేను ఆమెకు డైవర్స్ పేపర్స్ పంపించాను. అవి పంపి నెల అవుతుంది. డైవర్స్ పేపర్స్ పంపిన తరువాత నుంచి నాకు పెళ్లైందని.. పెళ్లి కాబోతుందని నాపై తప్పుడు ప్రచారాలు చేస్తుందని నరేష్ వాపోయార.

రమ్య కర్ణాటక వెళ్లి అక్కడ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడుతుందనీ.. అందుకే తాను కర్ణాటక వెళ్లి అన్ని నిజాలను బయటపెట్టగా కర్ణాటక ప్రజలు కూడా ఈ విషయంలో తనకు సపోర్ట్ చేశారని.. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ ఛానల్స్‌లో రచ్చ మొదలుపెట్టిందని ఆయన చేప్తూ 8 ఏళ్లుగా ఆయన పడ్డ హింస.. జరిగిన బ్లాక్ మెయిల్ వల్లే విడాకులు తీసుకుంటున్నానని చెప్పారు.
ఈ విషయంలో అసలు సంబంధం లేని పవిత్రా లోకేష్ ను ఇందులోకి లాగి ఆమెను విడాకులకు కారణంగా చూపించడం చాలా తప్పు అని నరేష్ చెప్పారు.తమ స్నేహం,బంధం తమది అని,తాము ఆ విషయంలో ఎప్పుడూ ముక్కుసూటిగా ఉంటాం అని నరేష్ తెలిపారు.తప్పు చేస్తేనే భయపడాలి కానీ తామేమీ తప్పు చేయలేదని, అన్ని ఆధారాలతో మళ్ళీ మీడియా ముందుకు వస్తానని చెప్తూ..మమ్మల్ని అర్థం చేసుకుని సపోర్ట్ చేయండి అంటూ చేతులు జోడించి మరీ ప్రాధేయపడ్డారు నరేష్.

Kiran Abbavaram has Some Crazy Projects Lined Up

0

Young talented hero, Kiran Abbavaram is proving his worth at box time and again. Recently his movie Sammathame became a decent box office hit. With this he has established himself as a good hero at box office.By the looks of hit, in no time Kiran is going to become a tier-2 hero. As of now Kiran acted in 4 movies and 3 out of them did pretty well.

Raja Varu Rani garu -Hit

SR Kalyana Mandapam- Blockbuster

Sebastian- Flop

Sammathame- Hit

These are just the top cream, apart from these Kiran has also lined up some amazing movies in the second half of this year.

2022 Movie List

His next projects are as follows

– Nenu Meeku Baga kavalsina vadini is a movie Kiran is doing under Kodi Divya productions. The movie is going to hit theaters in August.

– Vinaro Bhagyamu Vishnu Katha is a movie he is doing under the production of Geetha arts. Geetha arts is a renowned production house in the industry and this can be considered as an achievement for Kiran. This movie is coming to theaters in September.

– Another unnamed movie under the production of Mytri movie makers is going for a theatrical release in December.

2023 Movie List

The young hero has a perfectly planned schedule for the upcoming year – 2023 too.

He is going to do 4 movies in next year. The first one is going to be produced under the banner of A.M.Ratnam and is named as Ranjan. After that another movie is under the production of Asian Cinemas. Apart from these he is doing a movie with Prime Show Entertainment and it has been known that this movie is shot with high budget. He is also committed to do another movie with a new production house and that movie is also a big budget film.

All in all, Kiran Abbavaram is knocking it out of the park with some amazing movies lines up. He started his career with a hit and has 3 out of four successful films. By the looks of it, in no time, he is going to be in tier-2.

వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో కిరణ్ అబ్బవరం

0

ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ఎదుగుతున్న హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు.యూత్ ను ఆకట్టుకునేలా పాటలు,డైలాగ్స్, క్యారక్టరైజేషన్ ఉండేలా చూసుకుంటూ వరుస సినిమాలే కాదు వరుస విజయాలతో కూడా అతను దూసుకుపోతున్నాడు. ఇటీవల సమ్మతమే సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో హిట్ అందుకొని తనేంటో మరోసారి నిరూపించుకున్నాడు.

ఈ విజయంతో కిరణ్ అబ్బవరం కూడా మిడియం రేంజ్ హీరో అంటే టైర్ 2 లిస్ట్ లో చాలా తొందరగా చేరిపోయేలా ఉన్నాడు.ఇప్పటివరకు కిరణ్ నాలుగు సినిమాలు చేయగా,అందులో మూడు సినిమాలు హిట్ అవ్వడం విశేషం.

రాజావారు రాణిగారు – హిట్

SR కళ్యాణమండపం – బ్లాక్ బస్టర్ సెబాస్టియన్ – ఫ్లాఫ్ సమ్మతమే – బ్లాక్ బస్టర్

ఇక 2022 అంటే ఈ సంవత్సరంలో ఇప్పటికే రెండు సినిమాలు విడుదల చేసిన కిరణ్ మరిన్ని ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేసాడుఇక కోడి దివ్య ప్రొడక్షన్ లో నేను “మీకు బాగా కావాల్సిన వాడిని “ఆగస్ట్ 18న విడుదల కానుంది. ఆ తరువాత “వినరో భాగ్యము విష్ణు కథ” సినిమా గీతా ఆర్ట్స్ సారథ్యంలో సెప్టెంబర్ 30న రాబోతోంది.

ఇవి కాకుండా మైత్రి మూవీ మేకర్స్ మరియు క్లాప్ బోర్డ్ సంయుక్తంగా నిర్మిస్తున్న మరో సినిమా డిసెంబర్ లో రానుంది.2023లో రాబోయే సినిమాలు:ఎమ్ రత్నం బ్యానర్ లో “రూల్స్ రంజన్” అనే సినిమాతో పాటు ఏషియన్ సినిమాస్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ లో కూడా కిరణ్ మొదటిసారి ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు. అలాగే మరొక న్యూ ప్రొడక్షన్ హౌస్ లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాకు కూడా కమిట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. ఆ సినిమా కూడా భారీ బడ్జెట్ తో రానుందట. మొత్తంగా 2023లో కిరణ్ నాలుగు సినిమాలని విడుదల చేయబోతున్నాడు.

ఈ వివరాలన్నీ చూస్తుంటే కిరణ్ ఆబ్బవరం ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లను పట్టేసినట్లు అనిపిస్తోంది. కెరీర్ మొదట్లోనే వరుసగా హిట్స్ కొడుతూ, మంచి లైనప్ తో ముందుకు సాగుతున్న ఈ టాలెంటెడ్ హీరో టైర్ 2 రేంజ్ కు వెళ్ళడానికి ఎంతో సమయం పట్టెలా లేదని చెప్పవచ్చు.

ది వారియర్ ట్రైలర్ : పక్కా మాస్ ఎంటర్టైనర్ తో వస్తున్న రామ్

0

హీరో రామ్ పోతినేని రెడ్ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ లింగుసామితో “ది వారియర్” అంటూ ఓ పోలీస్ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఇక షూటింగ్ పూర్తి అవ్వడంతో టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనులను కూడా చకచకా జరిగేలా చూస్తున్నారు. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.

హీరో రామ్ ఫస్ట్ లుక్ తో పాటు సినిమా నుండి విడుదలైన రెండు పాటలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కింది. జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతుండడంతో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చిత్ర బృందం. అందులో భాగంగా విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకుల చేత వారెవ్వా అనిపించుకుంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు తెలుగులో దర్శకుడు బోయపాటి గారు రిలీజ్ చేయగా, తమిళ ట్రైలర్ ను ట్విట్టర్ లో తమిళ యువ హీరో శివ కార్తికేయన్ విడుదల చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే..పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ గెటప్ అదిరిపోయింది. “ఒక చెట్టు మీద నలభై పావురాలు ఉంటే అందులో ఒక్క దాన్ని కాలిస్తే అన్నీ ఎగిరిపోతాయి” అంటూ హీరోయిజం ఉట్టిపడే డైలాగ్స్ తో పక్కా మాస్ ఎంటర్టైనర్ లా కనిపిస్తుంది ది వారియర్ సినిమా. ఇక విలన్ పాత్రలో ఆది కూడా రామ్ కు ధీటుగా ఉన్నాడు, వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించేలా ఉన్నాయి. ఇక లేటెస్ట్ సెన్సేషన్ అయిన కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా,హీరో తల్లి పాత్రలో నదియా కనిపించారు

.‘ది వారియర్’ మూవీ సెట్స్ పై ఉండగానే రామ్ మరో సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపోందనుంది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్ విషయమై హై కోర్టు చెక్

0

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. సినిమా టెకెట్ల ఆన్ లైన్ ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ వెబ్సైట్ కు సంభందించిన తదనంతర చర్యలన్నింటినీ ఆపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్ లో విక్రయించేందుకు వీలుగా 2021 డిసెంబర్ 15న తీసుకువచ్చిన సవరణ చట్టాన్ని, టికెట్ల విక్రయ ఫ్లాట్ ఫామ్ నిర్వహణను ఏపి స్టేట్, ఫిల్మ్ టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (ఏపిఎస్ఎఫ్‌టీవీటిడిసీ) అప్పగిస్తూ డిసెంబర్ 17న జారీ చేసిన జీవో ను సవాల్ చేస్తూ బుక్ మై షో సంస్థ, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్ లైన్ వేదిక ద్వారా మాత్రమే ప్రైవేటు సంస్థలను టికెట్ల ను విక్రయించాలని ఒత్తిడి చేయడంపై ప్రధానంగా అభ్యంతరం తెలిపారు.పిటిషనర్ల తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, న్యాయవాదులు అశ్వనీకుమార్, సీవీ మోహన్ రెడ్డిలు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరుపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ భాగస్వాములందరితో చర్చించి ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చిందనీ, ఈ దశలో మళ్ళీ ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదని కోరారు.ఈ నెల 2వ తేదీ నుండి ఏపిలోని థియేటర్ లు అన్నీ ఆన్ లైన్ ద్వారానే టికెట్లు విక్రయించేలా ఒప్పందాలు చేసుకోవాల్సిందేనని ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యాలను నిర్దేశించిన సంగతి తెలిసిందే.

పిటిషన్ల పై ఇరుపక్షాల వాదనలు బుధవారం ముగిశాయి, ప్రధాన వ్యాజ్యాలపై జూలై 27న తుది విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డివీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సదరు జివోపై స్టే విధిస్తూ తదనంతర చర్యలు అన్నింటినీ ఆపేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.