Home Blog Page 2102

Box-office: ది వారియర్ ఫస్ట్ డే రిపోర్ట్ యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకున్న రామ్ సినిమా

0

రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా.. ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్‌గా తెరకెక్కించిన ఈ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహించారు. టీజర్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. ఈ సినిమా ఒకేసారి అమెరికా, ఇండియాలో విడుదల అవటం విశేషం.

ఇక ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి రివ్యూలు, టాక్ ఎలా ఉన్నాయి అంటే.. ట్రైలర్ చూస్తేనే ఇదొక పక్కా రొటీన్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థం అవుతుంది. కాబట్టి కొత్తదనం వంటివి ఆశిస్తే నిరాశ తప్పదు అంటున్నారు విశ్లేషకులు.

డాక్టర్ కం పోలీస్ గా హీరో రామ్ అదరగొట్టారు అని సమాచారం. అలాగే విలన్ పాత్రలో ఆది కూడా ఒదిగిపోయారు అని రివ్యూలలో ఆయన నటనకు మంచి స్పందన వచ్చింది. ఇక లేటెస్ట్ సెన్సెషన్ కృతి శెట్టి పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకున్నా, తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ , డాన్స్ తో ఆకట్టుకుంటుంది అంటున్నారు.

ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే.. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బిజినెస్ జరుపుకుంది ఈ చిత్రం. రిలీజ్ కూడా అత్యధిక థియేటర్లలో చేశారు. అయితే సరిగ్గా సినిమా విడుదల సమయానికి రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం ఒక దెబ్బగా చెప్పుకోవచ్చు. అందుకు తగ్గట్టు గానే ఓపెనింగ్స్ చాలా సాధారణ స్థాయిలో వచ్చాయి.

ది వారియర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవ్వాలి అంటే 44 కోట్ల షేర్ కలెక్షన్లు వసూలు చేయాలి. మరి వారాంతానికి వసూళ్లు పెరగపోతే సినిమా హిట్ స్టేటస్ ను అందుకోవడం కష్టం. భారీగా బిజినెస్ జరిగిన కారణంగా ఈ సినిమా కలెక్షన్లు పెరగాలి అని కోరుకుందాం. ది వారియర్ సినిమా తరువాత హీరో రామ్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. మరి ఈ సినిమా ఫలితం ఆ సినిమా బడ్జెట్, బిజినెస్ మీద ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం లేదు. మరి ది వారియర్ సినిమా చివరికి ఏ ఫలితం చూస్తుంది అనేది చూడాలి.

ఒక మిస్టరీగా నిలిచిన ఆచార్య నష్టాల కథ

0

మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి తెరపై కనిపిస్తే అదొక అరుదైన దృశ్యం. ఆ కలయికను చూడాలి అని ప్రేక్షకులు ఎంతగానో చూశారు ముఖ్యంగా మెగా అభిమానులు అయితే వాళ్ళిద్దరినీ ఒక సినిమాలో చూడటం ఒక కలగా భావించారు. అందరూ ఎదురుచూసిన ఆ సుముహూర్తం రానే వచ్చి చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి “ఆచార్య” సినిమాలో నటించారు.

అయితే కరోనా దెబ్బకు అన్ని సినిమాలకు మల్లే ఆచార్య కూడా బాగా ఆలస్యం అయి ఈ ఏడాది వేసవిలో విడుదల అయింది. ఐతే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే అసలు కథ అక్కడే మొదలయింది.

ఆచార్య సినిమా బాక్స్ ఆఫీసు వద్ద నిరాశపర్చిన తరువాత జరిగిన వ్యవహారం.. ముదిరిన గందరగోళం అంతా ఇంతా కాదు. కొరటాల శివ ఈ చిత్రం తాలూకు వ్యాపార లావాదేవీల్లో భాగం అయ్యారు. ఆయన ఇదివరకు దర్శకత్వం వహించిన సినిమాలకు కూడా అదే తరహాలో చేశారు. అయితే ఆ చిత్రాలేవీ ఫ్లాప్ కాలేదు కాబట్టి పెద్దగా సమస్యలు ఏమీ అవ్వలేదు.

కానీ ఆచార్య సినిమా భారీగా నష్టాలు మూట గట్టుకుంది. దాంతో పంపిణీదారులు అందరూ కొరటాలనే లెక్కలు తేల్చమని తీవ్రంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. అయితే మెగాస్టార్ హీరోగా చేసిన సినిమాకి ఇలా ఒక దర్శకుడిని డబ్బులు అడగటం ఏమిటని ఎన్టీఆర్ అభిమానులు, ఇతర ప్రేక్షకులు సందేహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా, సోషల్ మీడియాలో #Justiceforkoratalashiva అంటూ ట్రెండ్ చేశారు.

ఐతే అసలు చిక్కుముడి అక్కడే ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, అజ్ఞాతవాసి, వినయ విదేయ రామా సినిమాలకు ఇలాంటి సమస్య రాలేదు. ఎందుకంటే వాటికి నష్టాలు తీర్చటానికి నిర్మాతలు ఉన్నారు. ఆచార్య విషయంలో అటు రామ్ చరణ్ కానీ, ఇటు నిర్మాత నిరంజన్ రెడ్డి కానీ పూర్తిగా ఈ వ్యవహారంతో ఎప్పుడో విడిపోయారు. కొరటాల శివ తన సొంత హామీ మేరకు చిత్ర వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. అందుకే బయ్యర్లు ఆయనను లెక్క తేల్చమని అడుగుతున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆచార్య ప్రి రిలీజ్ బిజినెస్ 130 కోట్లకు (valued) జరిగింది. శాటిలైట్ మరియు డిజిటల్ హక్కుల ద్వారా ఎంతలేదన్నా 50 కోట్ల వరకూ గిట్టుబాటు అవుతుంది. సినిమా బడ్జెట్ 150 కోట్లకు మించే ప్రసక్తే లేదు. మరి అవలీలగా పరిష్కరించాల్సిన ఈ వ్యవహారాన్ని ఎందుకు ఇంత లాగుతున్నారో..అసలు ఆ మిగతా డబ్బు ఏమయిందో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.

పుష్ప ఖాతాలో మరో రికార్డు

0

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో బన్ని చెప్పిన ‘తగ్గేదేలే’ డైలాగ్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. ఇక హిందీలో జుకేగా నహీ డైలాగ్ అయితే సోషల్ మీడియాలో రీల్స్, వీడియోల రూపంలో తెగ ఫేమస్ అయింది.ఇలా భాషా భేదం లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులను ఆకట్టుకుని పుష్ప సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును తన ఖాతాలో జమ చేసుకుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’ .. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే వచ్చాయి.

సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ అల్లు అర్జున్ నటనను పెద్ద ఎత్తులో కొనియాడారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మరో రికార్డు నమోదు చేసింది. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బబ్ అన్ని ఏరియాల్లో కలిపి 5 బిలియన్ క్రాస్ చేసింది. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా యూట్యూబ్‌లో 500 కోట్ల వ్యూస్ రాబట్టడం విశేషం. దక్షిణాది లోనే కాదు ఏకంగా భారత దేశంలోనే ఈ స్థాయిలో యూట్యూబ్‌లో వ్యూస్ రాబట్టిన సినిమా ఏదీ లేదు. ఈ రకంగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ మరో రికార్డును నమోదు చేసారు.

తొలి సినిమా గంగోత్రి నుండి నిన్న మొన్న వచ్చిన “అలా వైకుంఠపురములో” వరకూ అల్లు అర్జున్ సినిమాలలో పాటలు బాగా ఉండడం చాలా సాధారణ విషయం. పాటలు, డాన్స్ విషయంలో అల్లు అర్జున్ తీసుకునే ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అందువల్లే ప్రేక్షకులతో విజిల్ వేయించి స్టెప్పులు వేయించే పాటలు ఆయన సినిమాలో ఉంటాయి.

బాలీవుడ్ నటులు, ఇతర పరిశ్రమలో హీరోలు మరియు ప్రముఖులు కూడా పుష్ప సినిమాకు ప్రశంసల వర్షం కురిపించారు. హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఈ సినిమా వల్ల ఎక్కడ లేని క్రేజ్ ను సంపాదించుకుంది. పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో తెరకెక్కించాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తుంది. మొదటి భాగంతో పోలిస్తే పుష్ప 2 కోసం భారీ బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం.

The Warriorr opens with Ordinary Openings and Reviews

0

Ram Pothineni has come before audience with his next movie The Warriorr today. In this movie we can see Ram as a dashing police officer. Krithi Shetty is the lead actress in this movie. The Warriorr was released today and movie opens with very ordinary openings and not so good reviews.

This is the first movie of Ram that did huge business. If the movie goes like this even on weekend, then this will be the huge loss venture. Ram partnered with Tamil director Linguswamy in this movie. The movie is bilingual and this is the debut of both Ram and Krithi into Tamil.

People are discussing about movie on Twitter and many are disappointed with the story line. The most common thing that people are saying is that movie didn’t match their expectations and isn’t something that people will watch in 2022. Aadhi in the antagonist role has shined in the movie whereas the narration fell flat.

Ram as always gave a great performance but apart from that remaining all the factors weren’t that commendable. Devi Sri Prasad’s music was just average. This weekend really tests the movie. We have to see how much movie would be able to pull in the weekend with rain and hiked ticket prices.

మెగాస్టార్ – మాస్ మహారాజ్ జోడీ ఫిక్స్

0

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాని రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాని దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’(rumoured title) సినిమా చేస్తున్నారు. ఇందులో మాస్ రాజా రవితేజ కూడా మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రంలో రవితేజ నటిస్తున్న విషయం ముందునుంచే వార్తల్లో ఉన్నా.. కోన్ని సార్లు అవునని కొన్ని సార్లు లేరని రకరకాలుగా పుకార్లు షికారు చేశాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం రవితేజ ఈ సినిమాలో నటించడం దాదాపు ఖాయం అని అంటున్నారు.

హైదరాబాద్ లో వేసిన ప్రైవేట్ సెట్ లో తన పాత్రకు సంభందించిన షూటింగ్ లో రవితేజ పాల్గొంటారని, అలాగే చిరంజీవితో కాంబినేషన్ సీన్స్ కి కూడా డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి లాగే మాస్ మహరాజ్ రవితేజ కూడా స్వయంకృషితో పరిశ్రమలో ఎదిగారు. మాస్ ప్రేక్షకులలో ఇద్దరికీ మంచి ఆదరణ కూడా ఉంది. ఇక వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రేక్షకులకి కనువిందు అనే చెప్పాలి.

ఇక రవితేజ నటించిన “రామారావు ఆన్ డ్యూటీ” జూలై 29న విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ వారమే ట్రైలర్ కూడా విడుదల కానుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్” చేస్తున్నారు. బాబీ తో సినిమాతో పాటు యువ దర్శకుడు వెంకీ కుడుముల తొనూ ఒక సినిమా చేయనున్నారు.

What Koratala Siva did with Acharya Pre Business Revenue?

0

This is one of the most common questions that are circling in the industry. People are confused about what happened to the revenue that team Acharya generated with the sale of theatrical rights, satellite and digital rights.

Before the release of Acharya, it has been said that the movie did a prebiz sale of more than 130 crores. This is just the theatrical business, there are non-theatrical rights like digital, satellite, songs, etc. which comes around 50 crore. If we calculate all of this together, the prebiz revenue comes around 180+ crore.

The budget of movie is nothing more than 150 crore including Koratala Siva’s remuneration. Either way, he was in table profit already, then from where does the movie incur these many losses? What happened to the prebiz revenue?

Why is Koratala facing these many financial issues? Well, the one answer for this is that the movie released in deficits. There are so many disasters of big heroes in Telugu Film Industry like Spyder , Agnyathavaasi, Brahmotsavam, Naa peru surya , Saaho, Vinaya vidheya rama , Sardaar Gabbar Singh. None of these producers face any financial issues.

There are some who made profits too, then why is Koratala Siva going through this financial crisis. Paying out 100 crores in loss is not an easy task, we have to see what happens further.

మరో హిట్ కొట్టిన సాయి పల్లవి: గార్గి ప్రీమియర్ షో టాక్ సూపర్

0

సహజమైన నటనతో, వైవిద్యభరితమైన పాత్రలతో, సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు సాయి పల్లవి. వెండితెరపై తనదైన అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సాయి పల్లవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లామర్ షో తో కాకుండా, కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు సాయి పల్లవి.

ఆమె నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ పరంగా ఫ్లాప్ అయినా తన నటనకు మాత్రం ప్రేక్ష‌కులు ప్రశంసల జల్లు కురిపించారు. సాయి పల్లవి తాజాగా “గార్గి” చిత్రంలో నటించారు. తమిళ దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో వహించిన ఈ కోర్టు డ్రామా ఈ శుక్రవారం విడుదల అవుతుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అవగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ కు చక్కని స్పందన వచ్చింది. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో దగ్గుబాటి రానా సమర్పిస్తున్నారు. అలాగే తమిళ భాషలో సూర్య – జ్యోతిక సమర్పిస్తున్నారు.

గార్గి సినిమా ఈ శుక్రవారం విడుదల అవుతున్న నేపథ్యంలో తమిళనాడులో విలేఖరుల కోసం ప్రత్యేక ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఆ షో చూసిన విమర్శకులు, సినీ విలేఖరులు సినిమాని, సాయి పల్లవి నటనను ఆకాశానికి ఎత్తేశారు.ఇది ఒక అద్భుతమైన సినిమా అని, ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా ఉందని పేర్కొన్నారు.

ఈ ప్రీమియర్ షో టాక్ మరియు రెస్పాన్స్ వచ్చినట్టు రేపు థియేటర్లలో ప్రేక్షకులు కూడా సినిమాని మెచ్చుకుంటే ఇంక సాయి పల్లవి ఖాతాలో మరో సూపర్ హిట్ చేరినట్టే. మరి ఆ ఊహ నిజం అవ్వాలని, సాయి పల్లవి మరో సూపర్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.

Ravi Teja Joins the Shooting of Megastar’s Mass Film

0

Mass Maharaja Ravi Teja is going to play an important role in Mega Star Chiranjeevi’s 154th film. There have been some rumors stating that he won’t be there in the movie. But they are not true. Ravi Teja is going to join the shoot today for some important scenes in the current schedule.

He will be shooting for some time in the specially erected set. As of now the movie unit are considering the title- Valtire Veerayya. This is coming off as an out and out mass film featuring Chiranjeevi, Shruti Hassan. Devi Sri Prasad is going to be the music director of this movie.

Ever since the announcement, Mega154 has become the most talked about projects among his next for the fans. They are waiting for the updates from movie team and have been discussing about movie on Twitter a lot.

It is expected to release on Sankranti, 2023. We have to wait and see when it will hit the screens. Venky Mama fame Bobby is directing the movie and Mythri Movie Makers are going to produce it. Ravi Teja playing an important role in the movie will surely add some weightage.

Ram’s The Warrior Theatrical Rights Are Revised Because Of Rains

0

Ram Pothineni’s cop drama The Warrior has been subject to hurdles even before the release of the film. Earlier, the theatrical rights of the film were valued at 18 crores for the Andhra region, and 6 crores for Ceeded and Nizam in the range of 12-13 crores.

But, due to the rampant rains in AP and Telangana, the team has been forced to revise the theatrical rights. From 18 crores, the theatrical rights for Andhra Pradesh(6 territories) have been revised to 16 crores.

Other regions in Andhra Pradesh and the main territory Nizam have also been revised. Nizam has been revised from 10% to 15%. With only a day left for the release, the advance bookings for the film have also been shockingly low, and only extremely positive talk can help the film’s business.

The Warrior stars Aadi Pinishetty and Krithi Shetty in crucial roles. N Linguswamy is the director of this bi-lingual film. DSP is the music director of the film.

కొరటాలను వీడని ఆచార్య గాయాలు

0

దర్శకుడు కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రచయితగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ పైన దర్శకుడుగా మారిన ఆయన కెరీర్ లో దాదాపు అన్ని హిట్ సినిమాలే.. ఇటీవల విడుదలైన ఆచార్య సినిమా తప్ప. రచయితగా ‘భద్ర, మున్నా, నిన్న నేడు రేపు, ఒక్కడున్నాడు, సింహా, బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాలకు పని చేసి ‘మిర్చి’తో దర్శకుడుగా మారారు కొరటాల శివ. ఈ సినిమా ఘన విజయం తరువాత ఇక ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది.ఆ తర్వాత ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను’ సినిమాలతో పరిశ్రమలో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఇన్ని విజయాలు ఉన్న కొరటాలను ఒకే ఒక్క సినిమా అటు దర్శకుడు గాను, ఇటు ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బతీసింది. అదే ‘ఆచార్య’.

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన “ఆచార్య” సినిమా నిర్మాణం దాదాపు రెండేళ్ళ పాటు సాగింది. ఇక ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలే కాకుండా వ్యాపార వ్యవహారాల్లో కూడా భాగం అయ్యారు కొరటాల శివ. అదే ఇప్పుడు ఆయన కొంప ముంచింది అంటున్నారు సినీ వర్గాలు.

“ఆచార్య” సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో అతి పెద్ద డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. దీంతో అన్ని ఏరియాల నుంచి పంపిణీదారులు నష్టపోయిన మొత్తాలను చెల్లించాలని కొరటాల పై వత్తిడి తెచ్చారట. ఇక ఈ వ్యవహారాలను తన స్నేహితుడు సుధాకర్ తో కలిసి కొరటాల శివ చాలా వరకు సెటిల్ చేశారని తెలిసింది

అయితే సీడెడ్ ఏరియాకు సంబంధించిన వ్యవహారం మాత్రం ఇంకా పరిష్కారం కాలేదట. తాజాగా ఈ ఏరియాలో పంపిణీ చేసిన అభిషేక్ తో పాటు ఎగ్జిబిటర్స్ తమ డబ్బు చెల్లించాలని కొరటాల ఆఫీస్ కు వెళ్ళి వత్తిడి చేశారట. ఈ విషయంలో కొరటాల సన్నిహితుడు, మరియు మైత్రీ అధినేత నవీన్ సర్దుబాటు చేయాలని ప్రయత్నించినా ఆ చర్చల సఫలం కాలేదట. కొరటాల నేరుగా వచ్చి హామీ ఇస్తే కానీ సమస్య పరిష్కారం కాదంటున్నారు. ఒక వేళ తమకు న్యాయం జరగకుంటే మెగాస్టార్ చిరంజీవి వద్దకు పంచాయితీ తీసుకువెళతామని ఎగ్జిబిటర్లు చెప్పినట్లు సమాచారం. అయితే చివరికి ఈ వ్యవహారం దాదాపు ఆరు కోట్లకు సెటిల్ అయిందని తెలిసింది.

ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. అజ్ఞాతవాసి వంటి భారీ డిజాస్టర్ సినిమాలకు ఆయా నిర్మాతల వద్దకు నష్టపోయిన బయ్యర్లు వెళ్ళారు కానీ హీరో దగ్గరకో లేదా దర్శకుడి దగ్గరకో వెళ్లలేదు. దర్శకులు తమ పని తాము చేసుకుంటే అలాంటి ఇబ్బందులు ఎదురుపడవు. అయితే కొరటాల శివ ఇలా సినిమా వ్యాపార లావాదేవీల్లో భాగం కావడం ఇదేమి కొత్త కాదు. గతంలో మహేష్ బాబు నటించిన “భరత్ అనే నేను” సినిమాకి కూడా ఆయన ఒక ఏరియా డిస్త్రీబ్యూషన్ హక్కులను తన పారితోషికంగా తీసుకున్నారు. ఇక జనతా గారేజ్ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ ను కొరటాల శివ సన్నిహితుడు అయిన సుధాకర్ చూసుకున్నారు.