Home Blog Page 2099

సౌత్ ఇండియన్ సినిమాకి ఐకాన్ గా నిలిచిన అల్లు అర్జున్

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు…. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. అంతకంటే ముందు అతను తెలుగు సినిమా పరిశ్రమతో పాటు మలయాళ పరిశ్రమలో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నో ఏళ్ళు కష్టపడి.ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చి తనదైన నటన, స్టైల్ మరియు డాన్స్ లతో ప్రాంతాలకు.. భాషలకు అతీతంగా ఇమేజ్ ను, స్టార్డం ను పెంచుకుంటూ వచ్చారు అల్లు అర్జున్.

ఇక గత ఏడాది విడుదలైన “పుష్ప” చిత్రంతో అల్లు అర్జున్ తొలిసారి పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. ఈ సినిమా హిందీ ప్రేక్షకులను విపరీతంగా అలరించి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అలాగే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. సామీ సామీ, ఊ అంటావా ఉ ఊ ఊ అంటావా పాటలు సోషల్ మీడియాలో సాధారణ ప్రేక్షకుల నుండి సెలబ్రిటీల దాకా అత్యంత విశేష స్థాయిలో ఆదరణ పొందాయి.

ఇప్పుడు ప్రేక్షకులు, ట్రేడ్ మరియు ఇండస్ట్రీ వర్గాలు “పుష్ప -2” కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇన్ని భారీ అంచనాల మధ్య సినిమా వస్తుండటం వల్ల మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని మరింత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించబోతున్నారు.

ఇదిలా ఉంటే… ఇవాళ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాలు, అందరి ప్రేక్షకుల దృష్టి దక్షిణ భారతీయ సినిమా పైనే ఉంది. కేవలం తెలుగు సినిమానే కాకుండా ఇప్పుడు పెద్ద హీరోలు చిన్న హీరోలు అని తేడా లేకుండా అందరూ ద్విభాషా చిత్రాలు, పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తెరకెక్కిస్తున్నారు.

ఈ విషయం పైనే ప్రముఖ వార పత్రిక ‘ఇండియా టు డే’ ఒక కవర్ స్టోరీని ప్రచురించింది. తాజా ఇష్యూ కవర్ పేజీగా అల్లు అర్జున్ స్టిల్ ను ప్రచురించడం విశేషం. తొలి పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’తోనే అల్లు అర్జున్ అపారమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు.

ఆ చిత్రంలోని “తగ్గేదేలే” అనే మ్యానరిజం ఇవాళ ప్రతి ప్రేక్షకుడు అలవాటు చేసుకున్నాడు అంటే అది అతిశయోక్తి కాదు. ఇండియా టుడే పత్రిక బన్నీ కవర్ పేజీగా అల్లు అర్జున్ స్టిల్ ను ప్రచురించడంతో.. ఆయన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఐకాన్ గా నిలిచారు అని అభిమానగణం తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.ఈ కవర్ పేజీ ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Mega – 154: మెగాస్టార్ – మాస్ మహరాజ్ కాంబో కన్ఫర్మ్

0

మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు అని మొదటినుంచి వార్తలు వస్తున్నాయి. గతంలో అన్నయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా నటించిన రవితేజ.. తాజాగా మరోసారి మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ అనధికారికంగా ప్రచారంలో ఉంది.

ఇక ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో గురువారం రవితేజ అడుగుపెట్టారని సమాచారం. చిరంజీవి తమ్ముడిగా రవితేజ కనిపిస్తున్నారని రకరకాల పుకార్లు మరియు ఊహగానాలు వస్తున్నాయి. అన్నయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా మెప్పించిన మాస్ మహారాజా.. శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఓ పాటలో కూడా కనిపించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మెగాస్టార్‌తో నటించబోతుండడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. వీరిద్దరి కలిస్తే ఆ దృశ్యం ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో రవితేజ నటిస్తున్న విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా.. ఎట్టకేలకు ఈరోజు ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ధృవీకరించింది.

https://twitter.com/MythriOfficial/status/1548254915964719106?t=A2eHiPc2s8nJDL9Ah_eG_w&s=19

ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక పోస్టర్ మరియు వీడియోను విడుదల చేసింది. మెగాస్టార్ మరియు మాస్ మహరాజ్ చేతులు కలిసిన పోస్టర్ చాలా బాగుంది.

ఇక వీడియోలో రవితేజ కార్ దిగే ఘట్టాన్ని ఒక సినిమాలో సీన్ లాగా ఎలివేట్ చేశారు. మాస్ తో పెట్టుకుంటే మడతడి పొద్ది పాట రీమిక్స్ లాగా బ్యాక్ గ్రౌండ్ లో వస్తూ ఎంట్రీ ఇచ్చిన రవితేజ. “అన్నయ్యా “అంటూ మెగాస్టార్ కారావాన్ డోర్ తెరవడం.. దానికి శంకర్ దాదా మ్యూజిక్ తో చిరంజీవి వెల్కమ్ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడం చూస్తేనే ఒక రకమైన చక్కని అనుభూతి కలుగుతుంటే.. ఇక వెండితెరపై వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటుంది అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించేలా విడియో అద్భుతంగా ఉంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. గాడ్ ఫాదర్, భోళాశంకర్, మెగా 154 చిత్రాలను చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నారు వీటిలో ముందుగా గాడ్ ఫాదర్ సినిమా రానుంది. మోహన్ రాజా దర్శకత్వంతో మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్‌కు రీమెక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమా కూడా చేస్తున్నారు.ఇక రవితేజ రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధంగా ఉంది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సముద్రఖని విలన్ గా నటిస్తుండగా.. 9 ఏళ్ళ తరువాత హీరో వేణు ఈ సినిమలో ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తుందటం విశేషం.

రామారావు అన్ డ్యూటీ ట్రైలర్: సీరియస్ రోల్ లో రవితేజ

0

మాస్ మహారాజ్ రవితేజ .. వయసు పైబడుతున్నా, వరుస సినిమాలతో యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఏకబిగిన సినిమా చేయడమే పనిగా పెట్టుకున్నారు . ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఉన్న రవితేజ.. తాజాగా నటించిన సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు చిత్ర బృందం. ఇందులో భాగంగా ఒక్కో అప్‌డేట్ వదులుతూ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను జులై 16న విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపారు.

ఇక ఈరోజు కాస్త ఆలస్యంగా విడుదలైంది ట్రైలర్. ట్రైలర్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే రవితేజ ఈ సినిమాలో డిప్యూటీ కలెక్టర్ గా కనిపించటం విశేషం. తప్పిపోయిన కొందరు వ్యక్తులను వెతకడం ఆయన బాధ్యతగా తీసుకున్నట్లు అర్థం అవుతుంది. మొదట్లో కాస్త సాత్వికంగా ఉండి.. ఆ తరువాత దూకుడుగా మారే హీరో పాత్రలో రవితేజ కనిపిస్తున్నారు. అలాగే ట్రైలర్ లో ఒకప్పటి హీరో వేణు కూడా కనిపించారు. అయితే మాస్ మహారాజ్ నుంచి ప్రేక్షకులు కోరుకునే ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ ఈ ట్రైలర్ లో అసలు కనపడక పోవటం గమనార్హం.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్స్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూలై 29న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. 1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేణు తొట్టెంపూడి చాలా గ్యాప్ తర్వాత ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

నయనతార – విఘ్నేష్ శివన్ ల వివాహ ఒప్పందాన్ని రద్దు చేసిన నెట్ఫ్లిక్స్ ?

0

తెలుగు,తమిళ, మలయాళ భాషల్లో నటించి తనదైన శైలిలో ఇమేజ్ ను స్టార్డం ను సంపాదించుకున్నారు నయనతార. ప్రాంతాలకి అతీతంగా ఒక వెలుగు వెలిగిన ఆమె కేవలం ఒక సాధారణ హీరోయిన్ గానే కాదు.. మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మార్కెట్ తెచ్చిపెట్టిన హీరోయిన్ గా తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకుని లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు.

ఇక ఇటీవలే నయనతార వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ – నయనతార చాలా కాలంగా ప్రేమించుకుని ఇటీవలే పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి పెళ్ళికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

వీరి జంటను ఆశీర్వదించేందుకు అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు, బంధు మిత్రులు హాజరయ్యారు.చెన్నై సమీపంలోని మహాబలేశ్వరంలో ఒక ప్రైవేట్ రిసార్ట్ లో వీరి విహహం జరిగింది. ఈ వివాహ వేడుకను తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ మీనన్ ఒక సినిమా తెరకెక్కించిన స్థాయిలో షూట్ చేయడం విశేషం. ఈ పెళ్లి వేడుకకు సంభందించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏవీ బయటకు రాలేదు.నయన్, విఘ్నేష్ తో కొంత మంది సినీ ప్రముఖులు దిగిన ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి.

మిగతా ఫోటోలు, వీడియోలు బయటకి రాలేదు. ఎందుకంటే ఈ పెళ్ళి వేడుక ప్రసార హక్కులను ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి కొనుగోలు చేయడమే అందుకు కారణం. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆ ఒప్పందాన్ని నెట్ఫ్లిక్స్ సంస్థ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అందుకు నయన్ – విఘ్నేష్ శివన్ లే కారణం అట. వివాహం జరిగి నెల రోజులు అయిన తరువాత దంపతులు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అలా ఫోటోలు షేర్ చేయడం నెట్ఫ్లిక్స్ ఒప్పందానికి విరుద్ధం అట. నిభందనలు ఉల్లంఘించిన కారణంగా నెట్ఫ్లిక్స్ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ విషయంపై అటు నయనతార దంపతులు కానీ.. నెట్ఫ్లిక్స్ సంస్థ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి నిజం ఏదో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగక తప్పదు.

అమీర్ ఖాన్ సినిమాను తెలుగులో సమర్పించనున్న మెగాస్టార్ చిరంజీవి

0

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోంది. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో అమీర్‌ఖాన్‌ హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ప్రత్యేకంగా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ ప్రివ్యూ షోకు అమీర్‌ఖాన్, చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, సుకుమార్‌ కూడా హాజరయ్యారు.

ఈ సినిమా వీక్షించిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్, నాగచైతన్య నటనను ఆయన ఎంతగానో ప్రశంసించారు. ఇది అమీర్ డ్రీమ్ ప్రాజెక్టు అని.. ఇంత అద్భుతమైన సినిమాను వీక్షించే అవకాశం ఇచ్చినందుకు బదులుగా ధన్యవాదాలు కూడా తెలియజేశారు.

అయితే లాల్‌సింగ్ చద్దా సినిమా తెలుగులో కూడా విడుదలవుతోంది. తెలుగు వెర్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యహరిస్తున్నారు. ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సందర్భంగా ‘లాల్ సింగ్ చద్దా’ తెలుగు పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. తన ఆప్తమిత్రుడు అమీర్ ఖాన్ నటించిన ఎమోషనల్ చిత్రాన్ని తెలుగులో సమర్పించాడన్ని అదృష్టంగా భావిస్తున్నానని చిరు తెలిపారు. అమీర్‌ను మరోసారి తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని కూడా పేర్కొన్నారు.

“లాల్ సింగ్ చద్దా” హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కింది. ఆ చిత్రం ఆస్కార్ అవార్డులు కూడా గెలుచుకోవడం విశేషం. అమీర్ ఖాన్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు ఈ చిత్ర విజయం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కరీనా కపూర్, మోనా సింగ్, మానవ్ విజ్, ఆర్యా శర్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ తో కలిసి వయాకామ్18 స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Producers Guild: తెలుగు సినిమా నిర్మాతల సంచలన నిర్ణయం?

0

కరోనా పాన్డేమిక్ తరువాత సినిమాల బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. దానిక తగ్గట్టే నటీనటుల పారితోషికాలు కూడా పెంచేశారు. ఇటు పక్కా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా భారీగా రెమ్యునరేషన్ లని పెంచేశారని సమాచారం . అలాగే ఇటీవల 24 క్రాప్ట్స్ కి చెందిన టెక్నిషయన్స్, జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా తమ కనీస వేతనాలు పెంచాల్సిందే అంటూ మెరుపు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

ఇలా ప్రతీ విషయంలోనూ సినిమాల నిర్మాణం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో తెలుగు సినిమా నిర్మాతల మండలి (Producers guild) ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసింది.

ఈ మేరకు గిల్డ్ సభ్యులైన నిర్మాతలు శనివారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారట. ఆ సమావేశంలోనే సంచలన నిర్ణయానికి సిద్ధం అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఓ పక్క స్టార్ హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల వరకు..మరియు రోజు కూలీలతో పాటు 24 క్రాఫ్ట్ లకు చెందిన వారంతా ఒకేసారి పారితోషికాలు పెంచేయడంతో సినిమాలు నిర్మించలేని స్థితిలో వున్నామని సమావేశంలో నిర్మాతలు వాపోతున్నారని తెలిసింది.

ఈ సమావేశంలో పారితోషికాల విషయంలో సమ్మెకు దిగుతూ కొంత మంది సినిమాల షూటింగ్ లని ఆపడానికి ప్రయత్నించిన విషయం..మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్టుల ఫైవ్ స్టార్ భోజన ఖర్చులతో పాటు కొంత మంది రోజుల వారిగా.. గంటల వారిగా రెమ్యునరేషన్ లని డిమాండ్ చేస్తున్న విషయం కూడా చర్చకు వచ్చినట్టుగా చెబుతున్నారు.

ఇలాగే వుంటే పరిస్థితి తమ చేయిదాటి పోతుందని..ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వైపు పెరిగిన నిర్మాణ వ్యయాన్ని అదుపు చేయలేక, మరోవైపు థియేటర్లకు ప్రేక్షకులు రాక.. ఇలా నానా కష్టాలు పడే కంటే ఈ సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చాకే సినిమాల షూటింగ్ లని తిరిగి ప్రారంభిస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అంత వరకూ కొత్తగా ప్రారంభమయ్యే సినిమాల షూటింగ్ లని నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట.

మరి ఈ నిర్ణయం నిజంగా అమలు జరుగుతుందా, లేక ఇలా పుకార్ల వరకే పరిమితం అవుతుందా అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగక తప్పదు. ఎందుకంటే మరో రెండు మూడు రోజుల్లో షూటింగ్ల నిలుపుదలపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధికారిక ప్రకటన చేయనుందని తెలిసింది. మరి ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందో చూద్దాం.

చంద్రముఖి-2: రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్న రాఘవ లారెన్స్

0

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హిట్ సినిమాలలో ‘చంద్రముఖి’ కి ప్రత్యెక స్థానం ఉంటుంది. బాబా లాంటి అతి పెద్ద డిజాస్టర్ తరువాత ఆయన కెరీర్ మరియు స్టార్డం ను అందరూ ప్రశ్నించిన సమయంలో.. చాలా లో ప్రొఫైల్ లో మొదలై అంత హైప్ కూడా లేకుండా రిలీజ్ అయి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా “చంద్రముఖి”.

హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తమిళనాటనే కాకుండా తెలుగులో కూడా ఘన విజయం సాధించింది. సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహించారు. 2005 లో వచ్చిన ఈ చిత్రం కన్నడ “ఆప్తమిత్ర” చిత్రానికి రీమేక్. ఆ తరువాత కన్నడలో ఆ చిత్రానికి సీక్వెల్ కూడా తెరకెక్కింది. తమిళ భాషలోనూ సీక్వెల్ కు ప్రయత్నాలు జరిగినా.. కోన్ని కారణాల వల్ల అది రూపు దాల్చలేదు. అయితే ఆ కన్నడ వెర్షన్ ను తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా తెలుగులో “నాగవల్లి” గా తెరకెక్కించారు. ఆ సినిమా అంచనాలను అందుకోలేక పోయినా, బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది.

అయితే తమిళ భాషలో “చంద్రముఖి” చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌ రానుంది. అయితే ఇందులో రజనీకాంత్ నటించటం లేదు. ఆయన వీరాభిమాని.. డాన్స్ కొరియోగ్రాఫర్ మరియు నటుడు, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి మైసూర్‌లో మొదలైంది.

అయితే తన గురువు నటించిన సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న సందర్భంగా లారెన్స్.. సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోయే ముందు రజనీకాంత్ ఆశీస్సులు అందుకున్నారు. సోషల్ మీడియాలో రజనీకాంత్‌ను తను కలిసిన ఫోటోలను షేర్ చేస్తూ ‘హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్ చంద్రముఖి 2 షూటింగ్ నా తలైవర్ రజనీకాంత్ ఆశీస్సులతో ప్రారంభమవుతుంది. మీ అందరి ఆదరణ నాకు దక్కాలి’ అని లారెన్స్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వడివేలు ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు ఆర్‌డి రాజశేఖర్ కెమెరామేన్ గా, తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది.

https://twitter.com/offl_Lawrence/status/1547791027477422087?t=BWc1mEVS9kom_elcNEgFBA&s=19

Tamil directors failing continuously to give straight hit films in Telugu

0

For the past several years, a number of Tamil films have done well at the Telugu box office. Actors like Suriya, Karthi, and Vikram have earned tremendous stardom in Telugu states because of these films. This is why for a lot of Tamil directors there was a huge market in Telugu states. Even Tamil directors like Shankar, AR Murugadoss, Hari enjoyed great success in Telugu through dubbed films.

Seeing the market in Telugu states a number of Tamil directors have been showing interest in direct Telugu films. Similarly, lot of Telugu stars have started working with Tamil directors in recent times to expand their markets.

However, much to everyone’s disappointment, these films are failing miserably at the box office. The latest film to enter this club is Ram’s The Warrior. Directed by Lingusamy, this bilingual film is heading towards being a huge disaster.

It now needs to be seen how Venkat Prabhu and Samuthirakani perform with their films with Naga Chaitanya and Pawan Kalyan respectively

The film did a massive business of 35 crores in theatrical rights but the first day collections of the film are a meager Rs 6 crores in share. It has only recovered 17% of its money back. Day 2 is even worse as the film has seen a massive drop in collections on day 2. The same trend continued on Day 3 as well.

DSP has given fantastic BGM for the Mega Mass combo announcement

0

The Mega Mass combo has excited the whole industry and film lovers. Directed by KS Ravindra, the Mega 154 will star Megastar Chiranjeevi and Mass Maharaja together after more than 2 decades.

Ravi Teja will reportedly have a 40-minute role in the film. It is not sure what character he will be playing in the movie. But sources tell us that he will play the role of Chiranjeevi’s brother. Ravi Teja had earlier played Chiru’s brother in the 2000 film Annayya.

The announcement video of this Mega Mass combo was released by Mythri Movie Makers earlier today. It featured Ravi Teja entering Chiranjeevi’s caravan and also featured director Bobby. The highlight of the video was the BGM by Devi Sri Prasad. It was a rendition of his hit songs ‘Mass tho Pettukunte’ and ‘Shankar Dada MBBS’

After the debacle of Khiladi, Ravi Teja has shifted his complete focus to Ramarao On Duty where he will be seen as a Deputy Collector. Meanwhile, Chiranjeevi will be next seen in ‘Godfather’ directed by Mohan Raja

Stylish Star Allu Arjun Is The ICON Of South Indian Cinema

0

Allu Arjun’s rise to stardom has truly been exceptional. From being dismissed in his early days, to ruling the South Indian cinema, he has come a long way. When he first debuted with Gangotri, people were quick to point out his unconventional looks and called the actor “ugly”.

But, over time, Allu Arjun has shut every hater down with his performances on the screen. In 2004, it was Arya that showed people that he was capable of giving a convincing performance. He consequently followed this with movies like Parugu, Arya 2, and Julai.

There is no doubt that Allu Arjun has had a strong advantage due to being born into an influential family. But, there is no doubt that the actor is where he is solely due to his hard work. Whether it be the ripped physique in Desamuduru or the soldier training for Naa Pera Surya, he has never faked hard work.

But it was only in 2020, with Ala Vaikunthapurramaloo that sparked the fire which we see as a volcano today. Despite being a regional movie, the movie broke multiple records and became the highest-grossing film for Allu Arjun at the time. It also became a Non-Baahubali industry hit at the time.

With Pushpa: The Rise, however, Allu Arjun firmly set his foot on the map and announced his entry to India. The success of Pushpa was unanimous all over India, and Allu Arjun generated a crossover value with just one Pan-Indian release.

The actor was featured on the India Today Magazine cover page, representing the South Swag. This clearly shows the dominance of the Icon Star. The best part is that this is just the beginning. With the excitement of Pushpa: The Rise fresh in our heads, Pushpa: The Rule will shatter every record there is.