Home Blog Page 2018

ఆదిపురుష్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముగిసి చాలా నెలలు అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు. కాగా మోషన్ గ్రాఫిక్స్ వర్క్ కు కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లుగా చాలా రోజులుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా విడుదల వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యేలా చిత్ర బృందం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.

అయితే ఈ సినిమా యూనిట్ పై ప్రభాస్ అభిమానులు చాలా రోజులుగా కోపంతో ఉన్నారు. అందుకు కారణం లేకపోలేదు. గత రెండేళ్లుగా ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తునే ఉన్నారు. కానీ సినిమా విడుదలకు చాలా సమయం ఉందంటూ ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదలను ఇన్ని రోజుల వరకూ దర్శకుడు ఓమ్ రౌత్ వాయిదా వేస్తూ వచ్చారు. సినిమా నుంచి కనీసం ఒక పోస్టర్ అయినా విడుదల చేయలేదు అని ప్రభాస్ అభిమానులు చాలా అసహనంతో ఉన్నారు.

ఐతే ఎట్టకేలకు యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు ఒక పెద్ద శుభవార్త రాబోతోంది. ఆదిపురుష్ టీజర్‌ను అక్టోబర్ 3వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అలాగే టీజర్ రిలీజ్ నుంచి జనవరి 12న సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రచార కార్యక్రమాలు విస్తృత స్థాయిలో జరుగుతాయని కూడా ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. ఈ సారి ఢిల్లీలో రావణ దహన కార్యక్రమాన్ని ప్రభాస్ చేతుల మీదుగా జరిపించాలని ఇప్పటికే ఆయనకు ఆహ్వానం కూడా అందింది. రామాయణాన్ని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్‌ సినిమాను తెరకెక్కించారు. శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రాన్ని భారీ ప్యాన్ ఇండియా సినిమా లాగా మాత్రమే కాకుండా.. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో చూడని విజువల్ ఎఫెక్ట్స్ ఇందులో చూపించనున్నట్లు దర్శకుడు ఓం రౌత్ ప్రకటించారు. ఆదిపురుష్ టీజర్ సెప్టెంబర్ చివరి వారంలో రిలీజ్ అవనుందని ఇటీవలే కొందరు పుకార్లు పుట్టించారు. అయితే అక్టోబర్ 3నే టీజర్ రిలీజ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. శ్రీరాముడిగా ప్రభాస్‌ను తప్ప మరే హీరోను ఊహించుకోలేనని దర్శకుడు ఓం రౌత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పెద్ద మనసుతో అందరినీ ఆశ్చర్యపర్చిన ప్రభాస్

0

హీరో ప్రభాస్ కి పెదనాన్న కృష్ణంరాజుతో ఉన్న సాన్నిహిత్యం మరియు అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ప్రభాస్ ని హీరోగా నిలబెట్టి తన కెరీర్ తీర్చిదిద్దిడంలో ఆయన పెదనాన్న కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషించారు. అంచెలంచెలుగా ఎదిగిన ప్రభాస్.. ప్రస్తుతం భారతదేశంలో గొప్ప హీరోలలో ఒకరుగా నిలిచారు. తెలుగు నుంచి తొలి పాన్ ఇండియా స్టార్ గా అగ్ర స్థానంలో ఉన్నారు. ఆయన మీద ఉన్న అభిమానంతో కృష్ణంరాజు గారికి ఉన్న రెబల్ స్టార్ బిరుదునే అభిమానులు ప్రేమతో ప్రభాస్ కి ఇచ్చారు.

కృష్ణంరాజు లేకపోయి ఉంటే ఈ ప్రభాస్ లేడని ఎన్నోసార్లు స్వయంగా చెప్పుకొచ్చారు ప్రభాస్. తన తండ్రి చనిపోయినప్పుడు ప్రభాస్ కృష్ణంరాజును పట్టుకొని ప్రభాస్ చిన్నపిల్లాడిలా ఏడ్చేశారు. కాగా ఆ సమయంలో నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి అన్నీ తానై చూసుకున్నారు కృష్ణంరాజు. అలాంటి పెద్ద దిక్కు హఠాత్తుగా మూగబోవడంతో ప్రభాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

ఇన్ని రోజులూ తనకు అండగా ఉన్న పెద్ద దిక్కు ఇక నుంచి ఉండరని తెలియడంతో ఒక్కసారిగా ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ పరిస్థితిలో కృష్ణంరాజు పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు వచ్చిన వారికి ఎవరికి కూడా ప్రభాస్ ఏడుపును ఆపడం వల్ల కాలేదు. ఎంతమంది వచ్చి ఆయనను ఓదార్చాలని చూసినా ప్రభాస్ కంటి నుంచి కన్నీటి ధార ఆగలేదు.

అయితే ఇంతటి భాధాకరమైన పరిస్థితిలో కూడా ప్రభాస్ తన మంచి మనసుని చాటుకున్నారు. కృష్ణంరాజు గారి పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు ప్రెస్, ప్రజలు మరియు ప్రభాస్ అభిమానులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. మరియు అలాంటి పరిస్థితిలో ప్రభాస్ వారికి ఆహారం ఏర్పాటు చేసారు, ఏర్పాట్లు మాత్రమే కాక ప్రతి ఒక్కరినీ పేరు పేరున భోజనం చేసి వెళ్లమని మరీ మరీ చేప్పారట. ఇది నిజంగా ప్రభాస్ యొక్క మంచి హృదయాన్ని చాటుతుందని, కేవలం పేరులో రాజు ఉండటం కాకుండా ఆయన ప్రవర్తన నిజంగా రాజు తరహాలో ఉందని అందరూ అంటున్నారు. కాగా ఆ సమయంలో అక్కడికి వెళ్ళని వారు.. ఇతరుల ద్వారా ఈ విషయం తెలుసుకుని ప్రభాస్ మనసున్న డార్లింగ్ అని ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు.

ఇక కృష్ణంరాజు మృతి వార్త తెలియగానే సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేసారు. ఆయన పార్థీవ దేహాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తమ ఇంటికి తరలించాక సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సహా పలువురు టాలీవుడ్ అగ్ర హీరోలు సందర్శించారు.

ఆ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి- పవన్ కల్యాణ్- మహేష్- ఎన్టీఆర్- నాని తదితరులు ఉన్నారు. మురళీమోహన్- మోహన్ బాబు- దర్శకులు త్రివిక్రమ్- రాఘవేంద్రరావు తదితరులు కృష్ణంరాజుకు నివాళులర్పించారు. అనంతరం వీరంతా ప్రభాస్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న రష్మిక మందన్న

0

పుష్ప: ది రైజ్ వంటి భారీ ప్యాన్ ఇండియా ఘనవిజయం తర్వాత, రష్మిక మందన్న పేరు ఒక్కసారిగా భారతదేశం అంతటా పాపులార్ అయిపోయింది. దీంతో ఆమె ఇమేజ్ కూడా చాలా ఎత్తుకు ఎదిగింది. పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్రలో ఆమె చేసిన నటన కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలోని ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక పుష్ప తర్వాత, రష్మికకు అన్ని పరిశ్రమల నుండి భారీ ఆఫర్లు రావడం ప్రారంభించాయి. ఆమె ఇప్పటికే అమితాబ్ బచ్చన్‌తో గుడ్‌బై అనే నటించారు, అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాతో కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఇటీవలే రణబీర్ కపూర్‌తో ఒక చిత్రానికి కూడా సంతకం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ చిత్రానికి దర్శకుడు మరెవరో కాదు.. అర్జున్ రెడ్డి వంటి సినిమాతో ఒక్కసారిగా క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా పరిణీతి చోప్రాను అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో రష్మిక వచ్చి చేరారు. ఇక ఈ చిత్రంలో అనిల్ కపూర్ కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.

ఇక తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలు అన్నిట్లోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన తరువాత సహజంగానే, రష్మిక రాబోయే ప్యాన్ – ఇండియన్ చిత్రాలకు తన రెమ్యునరేషన్ పెంచాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆమె ఇకపై తన పాత రెమ్యూనరేషన్‌ ను కొనసాగించకుండా, ఏకంగా 5 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నారట.

5 కోట్లు అనేది ఎంతటి భారీ ఇమేజ్ ఉన్న స్టార్ కి అయినా చాలా పెద్ద మొత్తమనే చెప్పాలి. కేవలం అమౌంట్ పెంచడం మాత్రమే కాకుండా రష్మిక తన రెమ్యునరేషన్‌కు అనుగుణంగా తన ప్రతిభను ప్రదర్శించాల్సి వస్తుంది. ఆమె ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పరచుకున్న అతిపెద్ద పాన్-ఇండియన్ చిత్రం పుష్ప: ది రూల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రేక్షకులలో చాలా ఉత్కంఠ మరియు హైప్ నెలకొంది.

కాగా ఈ చిత్రం షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. షూటింగ్ అధికారికంగా ప్రారంభమైందని, పార్ట్ 2 కోసం టీమ్ అంతా ఉత్సాహంగా ఉన్నారని రష్మిక ధృవీకరించారు.

Rashmika Mandanna Demanding Massive Remuneration For Pan-Indian Biggies

0

After the humungous success of Pushpa: The Rise, Rashmika Mandanna has risen to great heights of popularity all over India. Her role as Srivalli in the film impressed a lot of audiences not only in the Telugu states but also all over India.

After Pushpa, Rashmika also got massive offers from all the industries. She has already shot a film with Amitabh Bachchan titled Goodbye, she has also signed a movie with Siddhart Malhotra as well as a movie with Ranbir Kapoor.

Naturally, after such worldwide recognition, Rashmika has decided to increase her remuneration for upcoming Pan-Indian films. She will no longer be charging her old remuneration and has decided to hike the remuneration to 5 crores.

5 crores is a lot of money for any huge star and she will have to accordingly live up to her remuneration. She will be next seen in perhaps the biggest Pan-Indian film Pushpa: The Rule. There is a lot of excitement and hype regarding the film and the shooting has also just begun recently. Rashmika has confirmed that the shooting has officially started and that the whole team is excited for Part 2.

ఓకే ఒక జీవితం 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు

0

శర్వానంద్, రీతూ వర్మ మరియు అమల అక్కినేని నటించగా . కొత్త దర్శకుడు శ్రీ కార్తిక్ తెరకెక్కించిన టైమ్ ట్రావెల్ ఎమోషనల్ డ్రామా ఒకే ఒక జీవితం సెప్టెంబర్ 9 న విడుదలైంది. మరియు సినీ ప్రేమికుల నుండి మంచి స్పందనను అందుకుంది. తాజా నివేదిక ప్రకారం కలెక్షన్లు ఏ మేరకు వచ్చాయో చూద్దాం.

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ సినిమా ఒకే ఒక జీవితం సినిమా గత వారం విడుదలై అటు ప్రేక్షకులు ఇటు విమర్శకుల నుండి అద్బుతమైన స్పందనను సొంతం చేసుకోగా.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వీకెండ్ వరకూ మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత క్లిష్టమైన సాధారణ రోజులలోకి ప్రవేశించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని ఏకగ్రీవంగా టాక్ చెప్పినప్పటికీ సోమవారం కలెక్షన్లలో కాస్త డ్రాప్ వచ్చిన మాట వాస్తవమే.

సోమవారం మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలలో పెద్దగా కలెక్షన్లు లేని ఈ సినిమా, తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో స్పాట్ బుకింగ్స్ వల్ల మళ్ళీ నిలదొక్కుకుంది. మొత్తం మీద నాలుగవ రోజు బాక్స్ ఆఫీసు వద్ద ట్రేడ్ వర్గాలు ఆశించిన హోల్డ్ ఉన్నప్పటికీ.. సినిమాకు వచ్చిన టాక్ దృశ్యా సినిమా రన్ ఇంకొంచెం బాగా ఉండాల్సిందని అంటున్నారు.

మొత్తానికి తొలిరోజు చాలా స్లో ఓపెనింగ్ తర్వాత ఓకే ఒక జీవితం రెండవ రోజు మరియు మూడవ రోజు నుంచి బాక్స్ ఆఫీసు వద్ద దూసుకుపోయింది. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల తొలి వారాంతంలో మంచి నంబర్‌లను నమోదు చేసింది. ఇక ముందుగానే చెప్పుకున్నట్లు ఈ సినిమా సోమవారం రోజు కూడా బాగానే ఉంది.

ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5 రోజులకు సుమారుగా 10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన ఈ చిత్రం దాదాపు 3.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది , తమిళనాడులో దాదాపు 2.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది , మిగిలిన ఏరియాల గ్రాస్ దాదాపు 1 కోటి వరకూ ఉంటుంది . మొత్తంగా ఒకే ఒక జీవితం సినిమా ఐదు రోజులకు దాదాపు 17 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆకట్టుకుంది.

ఆడవాళ్లు మీకు జోహార్లు, మహాసముద్రం, శ్రీకారం వంటి వరుస పరాజయాలతో ఎలాంటి సినిమా చేయాలో తెలియక సతమతమవుతున్న హీరో శర్వానంద్ కు ‘ఒకే ఒక జీవితం’పెద్ద రిలీఫ్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌తో శర్వా చాలా సంతోషంగా ఉన్నారు.

అల్లు అర్జున్ కోసం అయిదేళ్ళైనా ఎదురు చూస్తా – ఒకే ఒక జీవితం దర్శకుడు శ్రీ కార్తీక్

0

శర్వానంద్ కు ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో చక్కని ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీసు వద్ద హిట్ ఇచ్చారు దర్శకుడు శ్రీ కార్తిక్. ఈ సినిమాకి వచ్చిన టాక్ కు కాస్త తక్కువ కలెక్షన్లు వస్తున్నాయి అనే మాట అటుంచితే.. ఒక మంచి సినిమాగా దాదాపు సినిమా చూసిన వారందరి చేతా ప్రశంసింపబడింది. అమ్మ సెంటిమెంట్ కు సైన్స్ ఫిక్షన్ యాంగిల్ ను జత చేసి ఎక్కడా అనవసరమైన హంగూ ఆర్భాటాలకి పోకుండా ఒక హృద్యమైన అనుభవంలా తీర్చిదిద్దినందుకు దర్శకుడు శ్రీ కార్తిక్ కి మంచి మార్పులు పడ్డాయి.

ఐతే తనకి తన సినిమాకి వస్తున్న ఆదరణకు శ్రీ కార్తిక్ ఖచ్చితంగా అర్హులే. ఎందుకంటే ఇదేదో అషామాషిగా తెరకెక్కిన సినిమా కాదు. ఈ కథని రాయడానికే కార్తిక్ కి రెండేళ్ళు పట్టింది. ఇక కథకు తగ్గ హీరో కుదరడానికి మరో ఏడాదిన్నర పట్టింది. తర్వాత కోవిడ్ వలన అదనంగా రెండేళ్ళ జాప్యం.. ఇలా అన్ని అవాంతరాలు దాటుకుని సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు ఐదేళ్ళు పట్టింది. అయితే ఇన్ని కష్టాలు మరియు ఇన్ని రోజుల నిరీక్షణకు తెరపడిన తర్వాత దర్శకుడు శ్రీ కార్తిక్ కు తగిన ఫలితం దక్కిందనే చెప్పాలి. ప్రేక్షకులకు సినిమా చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమాలోని పాత్రలతో మమేకం అయిపోయి, వాటి తాలూకు భావోద్వేగాలను కూడా తమవే అనుకునే స్థాయిలో సినిమా వాళ్లకు నచ్చింది.

అయితే ఇప్పుడు శ్రీకార్తిక్ గురి ఒక పెద్ద సినిమా మీదకు వెళ్ళింది. తన రెండో సినిమాని అల్లు అర్జున్ తో చేయాలని ప్లాన్ చేస్తున్నారు కార్తిక్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. నా కొత్త సినిమా తెలుగులో ఉండబోతుంది. పెద్ద స్కేల్ లో థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా చేయాలనే ఆలోచన వుంది. ఒక ఫాంటసీ స్క్రిప్ట్ వుంది. రియలిజం ఫాంటసీ కాన్సెప్ట్ తో ఆ సినిమా చాలా క్రేజీగా వుంటుంది. నా రెండో సినిమా అల్లు అర్జున్ గారితో చేయాలని వుంది. ఆయనకి వెళ్లి కథ చెప్పాలి. చెన్నైలో తెలుగు సినిమా అంటే అల్లు అర్జున్ సినిమానే. మా ఫ్యామిలీలో అంతా అల్లు అర్జున్ అభిమానులమే. ఆయనతో సినిమా కోసం ఐదేళ్ళు వెయిట్ చేయడానికి కూడా ఓకే అని చెప్పుకొచ్చారు దర్శకుడు శ్రీకార్తిక్.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయ్యే వరకు ఎంత లేదన్నా మరో రెండేళ్లు పడుతుంది. మరి దర్శకుడు శ్రీ కార్తిక్.. అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి నిజంగానే ఐదేళ్లు ఎదురు చూడాల్సి వస్తుందో లేక ఈలోపే ఆయనకు అల్లు అర్జున్ నుంచి పిలుపు వస్తుందో చూడాలి.

Oke Oka Jeevitham 5 Days Worldwide Box Office Collections

0

Sharawanand’s Oke Oka Jeevitham was released in theatres on 9th September and opened to low numbers at the box office on the opening day. Despite the decent promotions and the special screenings of the film, it failed to make an impact on the opening day.

But the film saw a huge jump on Day 2 and Day 3, posting decent numbers during the weekend. Due to the positive word of mouth from the audience, the film witnessed a surge in numbers at the box office. Oke Oka Jeevitham has proved that as long as the content is good, audiences will come to the theatres.

After a decent opening weekend, the film is holding up well on the weekdays too. Here are the 5 days worldwide box office collections of Oke Oka Jeevitham. The film has collected approximately 10 crores in gross in the Telugu states. The next best performer is the overseas region where the film garnered about 3.5 crores in gross. In Tamil Nadu, the film collected close to 2.5 crores in gross. The Rest Of India’s collections stands at 1 crore. In total, the 5 days worldwide collections of Oke Oka Jeevitham are 17 crores.

Oke Oka Jeevitham has been directed by Shree Karthick. It stars Sharwanad, Priyadarsi, Vennela Kishore, and Amala Akkineni in the lead roles. Jakes Bejoy is the music director and Drewm Warrior Pictures has produced the film.

I Want To Do My Dream Project With Allu Arjun Says Oke Oka Jeevitham Director

0

Director Shree Karthick is currently on cloud nine after the massive success of Oke Oka Jeevitham. The film opened to low numbers on the opening day but picked up pace due to positive word of mouth from the audience. This is also Shree Karthick’s first Telugu film. However, the director has made Tamil films previously.

During an interview, Shree Karthick said his dream project is with Allu Arjun. He expresses his interest in making his second film with Allu Arjun. When asked about the waiting time to make a film with Allu Arjun, he replied, “Allu Arjun is like one of our own in Tamil Nadu. I will wait even 5 years if it is necessary for Allu Arjun.”

He also said that film is a fantasy script that has a lot of realism in it. In addition to that, he stated how Allu Arjun gets a lot of love in Tamil Nadu. “When Allu Arjun’s Telugu movies release here, there is no difference. It is like a Tamil movie itself.”

We have to wait and watch whether his combination will materialize. After all, Allu Arjun will be busy with Pushpa: The Rule, and following that he has expressed his interest to work with directors with a strong market only. But, Allu Arjun has always been supportive of young directors and if the script is written on a large scale, it might definitely work out.

RC-15 – వరిసు సినిమాలతో భారీ ఆఫర్లను పొందుతున్న దిల్ రాజు

0

టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా దిల్ రాజు కు మంచి పేరుంది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ మరియు ఎగ్జిబిటర్ గా ఆయన ఎదుగుదల ఎందరికో ఆదర్శంగా నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పలు రంగాల్లో ఉండి విజయవంతంగా తన ప్రయాణాన్ని సాగిస్తూ వచ్చిన దిల్ రాజు ఇటీవలే పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. తెలుగు సినిమా నిర్మాతల గిల్డ్ తీసుకున్న నిర్ణయాలు వాటిని అమలు చేసిన తీరు కావచ్చు.. లేదా యువ హీరో నిఖిల్ నటించిన తాజా బ్లాక్ బస్టర్ హిట్ ‘కార్తికేయ 2’ రిలీజ్ విషయంలో ఆయన పై వచ్చిన కొన్ని పుకార్లు కావచ్చు.

ఇలా చాలా అనవసరమైన విషయాలలో సంబంధం ఉన్నా లేకున్నా ఆయనను చాలా మంది ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా నిందించారు. అయితే కార్తీకేయ-2 సినిమా సక్సెస్ మీట్ లో ఆయన ఈ పుకార్లన్నటికీ సమాధానం చెప్పారు అనుకోండి. ఇక ఇలాంటి చవకబారు విషయాలను పట్టించుకోకుండా ఆయన తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఆయన ప్రస్తుతం రెండు భారీ సినిమాలను నిర్మిస్తున్నారు.

RC-15 మరియు విజయ్ వరిసు రెండు సినిమాలు కూడా ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమాలు. ఆర్‌సి 15 చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ద్విభాషా చిత్రం వరిసు (తెలుగులో వారసుడు). ఈ రెండు సినిమాల మధ్య ఉండే కామన్ పాయింట్ ఏంటంటే ఈ రెండింటినీ నిర్మిస్తున్నది నిర్మాత దిల్ రాజు.

దిల్ రాజు బిజినెస్ పరంగా ఈ రెండు సినిమాలకు కలిపి ధరలను కోట్ చేస్తున్నారట. అందుకు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ ఒప్పందాల పై చాలా ఆసక్తి చూపుతున్నారనీ, అలాగే దిల్ రాజు చెప్పిన ధరను అందించడానికి సిద్ధంగా ఉన్నారనీ సమాచారం. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో, ఆర్‌సి 15 మరియు వరిసు కలిపి 65 కోట్ల రూపాయల భారీ ధరకు వ్యాపారం జరుపుకుంటున్నాయి. ఒక్కో సినిమాకీ విడివిడిగా చూసుకుంటే రెండు చిత్రాల హక్కులు 32 కోట్లు – 33 కోట్ల ధరలతో ఓకే స్థాయిలో ఉన్నాయి.

దిల్ రాజు అన్ని ప్రాంతాలలో కూడా ఇదే తరహాలో రెండు సినిమాలకు సంబంధించిన వ్యాపారం జరిగేలా చూసుకుంటున్నారు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ రెండు సినిమాలను అన్ని ప్రాంతాలలో అలానే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

RC-15 ఒక సామాజిక సందేశంతో కూడిన రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటించనున్నారు. అవినీతి నిరోధక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శంకర్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. మరోవైపు విజయ్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం వరిసు. ఈ రెండు చిత్రాలకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.

వరిసు జనవరి 2023లో విడుదల కానుండగా, RC 15 వేసవిలో విడుదల అవుతుందని వార్తలు వినిపిస్తున్నా.. ఇంకా అధికారికంగా విడుదల తేదీని ఖరారు చేయలేదు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది.

Mahesh Babu’s fans on cloud nine now with recent announcements

0

Superstar Mahesh babu’s SSMB 28 and SSMB 29 have grabbed everyone’s attention. Heavy expectations are set on both these films and Mahesh Babu fans are understandably on cloud nine because of this excellent lineup of Trivikram and SS Rajamouli.

In addition to this, the recent updates by SSMB 28 team and SS Rajamouli have given massive energy to Mahesh Babu fans. Directed by Trivikram, SSMB 28 shooting announcement video was released yesterday and gave film lovers a glimpse of what to expect. The much-awaited film will release on 28th April 2023. This film will mark the comeback of Mahesh and Trivikram after 12 years.

The team clearly mentioned it will be a high-octane action entertainer. Fans are also eager to catch Mahesh in this genre. Along with this announcement video, SS Rajamouli’s statement on his project with Mahesh created massive hype among the fans.

At a recent event, the visionary director gave a hint about what to expect from the project. “My next film with Mahesh will be a globetrotting action adventure”, said Rajamouli. Needless to say, this confirmation has now set the expectations even higher! Fans and movie lovers across the world are eager to see this much-awaited combination.