Home Blog Page 1998

Special premiere shows for Bellamkonda Ganesh’s Swathimuthyam

0

Bellamkonda Ganesh is soon going to make his Tollywood debut with Swathimuthyam. Sitara Entertainments is bankrolling this project which is directed by debutant Lakshman K Krishna. Varsha Bollamma will star opposite the debutant hero.

The team of Swathimuthyam is planning Premier shows on 4th October across both Telugu States in selected theatres. After launching his elder son Sai Srinivas with Alludu Seenu back in 2014, senior producer Bellamkonda Suresh is leaving no stone unturned to ensure his younger one gets a big launch.

The trailer of this romantic drama was released earlier this week and it looks like a feel-good film with a good dose of comedy.

Suryaa has handled the cinematography of the project, while Mahati Swara Sagar has composed the tunes. Naga Vamsi is backing the film under Sithara Entertainment and if the word of mouth works out, Swathimuthyam has a good chance at the box office.

సాహసం చేస్తున్న స్వాతి ముత్యం టీమ్

0

దసరా కానుకగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5వ తారీకున రాబోతున్న గాడ్ ఫాదర్ సినిమాకు పోటీగా నాగార్జున ది ఘోస్ట్ సినిమా కూడా విడుదల అవుతుంది. ఇలా ఇద్దరూ అగ్ర హీరోల రెండు సినిమాలు ఒకే రోజు విడుదల చేయడం ద్వారా రెండు సినిమాలకు ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం వాటిల్లుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి.

అయితే ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా అదే రోజు దసరా సందర్భంగా బెల్లంకొండ సాయి గణేష్ నటించిన మొదటి సినిమా స్వాతి ముత్యం చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతున్న సమయంలో ఇలా చిన్న సినిమా కేవలం తేదీని ప్రకటించొచ్చు కానీ సినిమా నిజంగా విడుదల అవటం కష్టమని, వాయిదా పడుతుందని చాలా మంది భావించారు.

అయితే స్వాతి ముత్యం చిత్రం విడుదల తప్పకుండా దసరాకే ఉంటుందని చిత్ర నిర్మాత అయిన సూర్య దేవర నాగవంశీ తాజాగా ప్రెస్ మీట్లో చెప్పారు. చిరంజీవి, నాగార్జున వంటి హీరోల సినిమాలకు పోటీగా విడుదల చేస్తున్నారు కదా అని అడిగిన ప్రశ్నకు బదులుగా నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ… స్వాతి ముత్యం మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కనుకనే దసరా పండగ సరైన విడుదల తేదీగా భావించి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

అంతే కాకుండా గాడ్ ఫాదర్ సినిమా ను మార్నింగ్ షో… ది ఘోస్ట్ సినిమాను మ్యాట్నీ షో చూసిన ప్రేక్షకులు ఫస్ట్ షో కి స్వాతి ముత్యం కూడా చూస్తారనే నమ్మకాన్ని నిర్మాత నాగవంశీ వ్యక్తం చేశారు. అలాగే తమకు ఉన్న బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వాల్ల సినిమాకు థియేటర్ల కొరత కూడా ఉండదని, సినిమా చిన్నదైనా నిర్మాణ సంస్థ పెద్దది కాబట్టి విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదని ఆయన అన్నారు.

నాగ వంశీ మాటల్లో ఉన్న ఆత్మ విశ్వాసం, సినిమా విజయం పట్ల ఆయన వ్యక్తం చేసిన ధీమాను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎంటి సినిమా అంతా బాగుంటుందా అని ఆలోచనల్లో పడ్డారు. అయితే తాజాగా స్వాతి ముత్యం చిత్ర బృందం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 5న సినిమా విడుదలకు సిద్దం అవుతుండగా, అక్టోబర్ 4న తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ధియేటర్లలో ఈ చిత్రానికి ప్రీమియర్ షోలు వేయాలని సన్నాహాలు చేస్తున్నారు అని తెలియ వచ్చింది.

ఇటివలే ఇలాంటి ప్రీమియర్ షోలు అడివి శేష్ మేజర్ సినిమాకు ప్రదర్శించారు. మరి స్వాతిముత్యం వంటి చిన్న సినిమాకు ఈ ప్రచార వ్యూహం ఫలిస్తుందా లేదా నెగటివ్ టాక్ వచ్చి మొదటికే మోసం వస్తుందా అనేది చూడాలి.

బ్రహ్మస్త్ర సీక్వెల్స్ విజయం సాధిస్తాయా?

0

రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం సెప్టెంబర్ 9న విడుదలైంది. కాగా ఈ చిత్రం ఇప్పటివరకు మంచి లాంగ్ రన్ తెచ్చుకుని లాభసాటి వ్యాపారం జరుపుకుంది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక హైప్ తో వచ్చిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం అద్భుతమైన VFX మరియు నిర్మాణ విలువలకు ఎంతగానో ప్రశంసించబడింది. అయితే తొలి రోజు ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను పొందినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ ఓపెనింగ్ తో పాటు అనేక రికార్డులను సృష్టించింది.

ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో నడుస్తుండగా, దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి పార్ట్ 2 మరియు పార్ట్ 3 విడుదల ఎప్పుడనేది వెల్లడించారు. పార్ట్ 2 ను దీవాలి 2025 సందర్భంగా, పార్ట్ 3 ను క్రిస్టమస్ 2026 సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇవి కేవలం అంచనాలు మాత్రమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమాలకు చిత్రీకరణ దశలో కాస్త జాప్యం జరగడం మామూలే.

హాలీవుడ్‌లో ట్రయాలజీ చిత్రాలకి అయితే ఇంత భారీ గ్యాప్ చాలా సాధారణమైన విషయం. కానీ బాలీవుడ్‌లో ఈ వ్యూహం పని చేస్తుందా లేదా అనే దాని పై ఇప్పుడు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

మూడు భాగాల మధ్య గ్యాప్ బాగా ఎక్కువగా ఉంది. ఇక బ్రహ్మాస్త్ర పార్ట్ 1 బాహుబలి లేదా KGF సినిమాల లాగా పెద్ద బ్లాక్ బస్టర్ కూడా కాదు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద మంచి విజయం మాత్రం సాధించింది. మరి ఈ ప్లానింగ్ తో ఈ ఫ్రాంచైజీ పట్ల ప్రేక్షకులలో ఆసక్తి ఉండేలా చేయడంలో చిత్ర బృందం సఫలమవుతారో లేదో చూడాలి.

బ్రహ్మాస్త్ర చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున మరియు మౌని రాయ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి రచయితతో పాటు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Brahmastra makers announce the release dates of the next parts, will work at the box office?

0

Ranbir Kapoor’s Brahmastra was released earlier this month and has done decent business so far. The much-hyped Bollywood fantasy adventure film was well appreciated for its VFX and production values. While the film got mixed reviews, its box office opening created several records.

While the film is still running in theatres, Ayan Mukherjee has now revealed the release day for part 2 and part 3 as well. While such a massive gap for a trilogy is quite common in Hollywood, many people are now concerned if this strategy will work in Bollywood or not.

There is a huge gap between the three parts and Part1 is not a big blockbuster like Baahubali or KGF. Brahmastra Part 1 is just decent at success at the box office. We have to see how they will make this franchise successful with this planning.

Brahmastra stars Ranbir Kapoor, Alia Bhatt, Amitabh Bachchan, Nagarjuna, and Mouni Roy in the lead roles. Ayan Mukherji is the writer as well as the director of the film. Karan Johar has produced the film under the Dharma Productions banner.

Everyone shocked with Prabhas’ generosity in Mogalturu

0

Krishnam Raju’s death has left Tollywood fans and film lovers in grief. The veteran actor left the world for his heavenly abode on 11 September. Earlier today, a condolence meet was held in his village named Mogalturu. At this ceremony, arrangements for about 75,000 to 1 lakh people were made.

Prabhas’ generosity and hospitality in these times of grief have shocked many. He greeted all the fans and arranged the food for almost 1 lakh people today on the occasion of Krishnam Raju gari Samsmarana Sabha.

The items Dhupudu Gorri palav, Royyala Palav, Mutton curry, Netthalu fry, Sandhuva fry, Hyderabadi chicken, etc. were prepared in massive quantities for fans and well-wishers who thronged to Mogalturu for the occasion.

In a career spanning more than five decades, Krishnam Raju featured in more than 180 films. He established himself as the most dynamic and ferocious actor in Tollywood and was particularly known for his great screen presence and intense roles.

The ‘Rebel Star’ made his debut in 1966 in Chilaka Gorinka. He was last seen on the big screen in Prabhas’ Radhe Shyam earlier this year.

బాలీవుడ్ కు తిరిగి పూర్వ వైభవం తిరిగి వస్తుందా?

0

బాలీవుడ్ పరిశ్రమ గత కొన్ని రోజులుగా సరైన విజయాలు లేక వెలవెల బోతున్న సంగతి తెలిసిందే. నిజానికి కోవిడ్ పాండేమిక్ దాడుల తర్వాత అన్ని సినిమా పరిశ్రమలు కూడా కుదేలైన మాట వాస్తవమే. కానీ మిగతా అన్ని పరిశ్రమలు మొదట్లో ఇబ్బందులని ఎదురుకున్నా.. తరువాత ఎలాగోలా నిలదొక్కుకున్నాయి. కానీ హిందీ పరిశ్రమకు మాత్రం ఒకటి రెండు సినిమాలు తప్ప సరైన విజయం దక్కలేదు. ముఖ్యంగా బాలీవుడ్ ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న విషయం ఏమిటంటే స్టార్ హీరోల సినిమాలు వారి స్థాయిలో బాక్స్ ఆఫీసు వద్ద తమ ప్రభావాన్ని చూపించలేకపోవటమే.

చాలా రోజుల తర్వాత ఇటీవల విడుదలైన ‘బ్రహ్మాస్ర్త’ సినిమా మాత్రమే భారీ ఓపెనింగ్స్ ను సాధించగలిగింది. అయితే అందుకు కారణం లేకపోలేదు. బ్రహ్మస్త్ర చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కటమే కాకుండా బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ ప్రచారంతో రావడం వల్ల ఆ సినిమాకి ఎక్కడ లేని హైప్ వచ్చింది. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ ను, ఆ తర్వాత కూడా ఒక 10 రోజుల వరకూ నిలకడగా వసూళ్లను తెచ్చుకుంది. అయితే బ్రహ్మస్త్ర సినిమా మినహా మరే హిందీ స్టార్ హీరో చిత్రం కూడా సరైన ఓపెనింగ్స్ ను తెచ్చుకోలేదు.

అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా , అక్షయ్ కుమార్ యొక్క రక్షా బంధన్ వంటి సినిమాలకు కూడా చాలా సాధారణ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను తెచ్చుకున్నారు. సరే వారి సినిమాలకు ఇతర వివాదాలతో పాటు ఆయా సినిమాల పై ప్రేక్షకులకి సరైన ఆసక్తి లేదని చెప్పుకోవచ్చు. కానీ హృతిక్ రోషన్ కు ఎలాంటి వివాదంతోనూ సంబంధం లేదు. పైగా ఆయన నటించిన చివరి చిత్రం విడుదలై 3 సంవత్సరాలు అవుతుంది.

2019లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన వార్ సినిమా తరవాత ఇన్ని రోజులకు ఆయన నటించిన తాజా చిత్రం విక్రమ్ వేదా విడుదలవుతోంది, కానీ ఆశ్చర్యకరంగా ఈ చిత్రం కూడా భారీ స్థాయిలో ఓపెనింగ్ నంబర్లను తెచ్చుకోవడంతో విఫలమైనట్లే కనిపిస్తుంది. ఈ చిత్రం తాలూకు ప్రీ బుకింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఈ పరిస్థితిని చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు మరియు ట్రేడ్ వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. ఇక బాలీవుడ్‌లో స్టార్‌ల శకం ముగిసినట్లేనని, అక్కడి ప్రేక్షకులకి ఇప్పుడు కేవలం కంటెంట్ మాత్రమే ముఖ్యమని కొందరు విశ్లేషకులు అంటున్నారు.

అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. విక్రమ్ వేద స్ట్రెయిట్ హిందీ సినిమా కాదు. తమిళ భాషలో అదే పేరుతో వచ్చిన చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ఓటిటి యుగంలో రీమేక్ చిత్రాల పై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించడం లేదు. అందువల్ల కూడా విక్రమ్ వేద సినిమా ఆశించిన స్థాయిలో బుకింగ్స్ పొందలేదని ఒక వాదన వినిపిస్తోంది. అందులోనూ నిజం లేకపోలేదు.

అయితే తాజాగా విక్రమ్ వేద సినిమా స్పెషల్ ప్రీమియర్ షో చూసిన అక్కడి ప్రముఖ రివ్యూయర్లు మాత్రం సినిమా అద్భుతంగా ఉందని కితాబులివ్వడం విశేషం. మరి ఈ టాక్ నిజమై విక్రమ్ వేద సినిమా ఓపెనింగ్ షోల తర్వాత కలెక్షన్లు పెంచుకుని బాలీవుడ్ కి అవసరమైన బ్లాక్ బస్టర్ సినిమాని అందిస్తుంది అని ఆశిద్దాం.

Chiranjeevi confident of Godfather, promises his fans he won’t disappoint

0

Megastar Chiranjeevi was charged up during the Godfather pre-release event held on Wednesday. He appeared confident about the film and has declared openly that fans won’t be disappointed this time.

“I have a pain in my heart because of Acharya’s failure but I am promising Godfather will definitely impress you,” stated a confident Megastar. He further added that Ram Charan was the main reason for him choosing to do this film.

“Charan suggested this film to me and said it will be very suitable for my image,” revealed Chiranjeevi. Mohan Raja has directed this remake of the Malayalam blockbuster ‘Lucifer’. The original starred Mohanlal and Prithviraj played a cameo. Nayantara will be seen in a key role alongside Satyadev and Malayalam actor Indrajith Sukumaran. Salman Khan is playing an extended cameo in this project.

Godfather will release on 5th October and it has done a good pre-release business so far. The digital rights have also been picked up for Rs 57 crores by Netflix. This film will release in dubbed versions in Malayalam and Hindi as well.

తన మంచి మనసుని మరోసారి చాటుకున్న ప్రభాస్

0

తెలుగు సినిమా పరిశ్రమలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్థానం ప్రత్యేకం. నటుడిగా, స్టార్ హీరోగా ఎలా ఐతే ఒక్కో మెట్టూ ఎదిగాడో, మంచి మనిషిగా కూడా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు వర్ధమాన నటుడుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే నానుడికి అద్దం పట్టే విధంగా ప్రభాస్ ప్రవర్తన ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా ప్రభాస్ పెదనాన్న, తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడు మరియు సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. అయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. అలాగే తన తండ్రి తర్వాత తండ్రి లాంటి మనిషిని కోల్పోవడం ప్రభాస్ కు కూడా చాలా బాధాకరమైన విషయం. అయితే అంత బాధలోనూ.. కృష్ణంరాజు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వచ్చిన తన అభిమానులకు భోజనం ఏర్పాటు చేసి అందరి మనసులని గెలుచుకున్నారు ప్రభాస్. తాజాగా మరోసారి ప్రభాస్ అలాంటి ప్రవర్తనతో అందరి ఆదరణను చూరగొన్నారు.

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ సంద‌ర్భంగా 12 ఏళ్ల త‌ర్వాత ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, తన సొంత ఊరు అయిన మొగల్తూరు కి వెళ్ళారు. ఈ విషయం విన్న స్థానికులు మరియు ప్రభాస్ అభిమానులు ఆయన ఇంటి వ‌ద్ద‌కు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ప్ర‌భాస్ వ‌స్తున్నారన్న వార్త ఒక్కసారిగా అందరిలోనూ మారు మ్రోగింది. కేవలం స్థానికులే కాక చుట్టు పక్కన ఉన్న గ్రామస్థులు ప్రభాస్ కంటే ముందుగానే ఆయన నివాస స‌మీప ప్రాంతానికి చేరుకోవడం విశేషం.

ఇలా ఒక భారీ జన సందోహం ప్ర‌భాస్ ని చూసేందుకు వెళ్లారు. తాజాగా ప్ర‌భాస్ ఇంటి నుంచి ప్రేక్ష‌కాభిమానుల‌కు అభివాదం చేస్తోన్న ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప్ర‌భాస్ ని చూడ‌గానే అభిమానులు ఈల‌లు.. కేరింత‌ల‌కి అడ్డే లేకుండా పోయింది. ఆ త‌ర్వాత కృష్ణంరాజు భార్య‌..పెద్ద‌మ్మ శ్యామ‌లా దేవి అభిమానుల‌కు అభివాదం చేసారు. ఈ క్ర‌మంలోనే శ్యామ‌లా దేవి క‌న్నీటి ప‌ర్యంతం చెందారు.

ఇక అభిమానుల కోసం ప్ర‌భాస్ భారీ స్థాయిలో విందుని ఏర్పాటు చేశారు. నోరూరించే వంట‌కాలు చేశారు. ఏకంగా ల‌క్ష మందికి వెజ్-నాన్ వెజ్ వంట‌కాలను తయారు చేయడం విశేషం.

6 టన్నుల మటన్ కర్రీ , 6 టన్నుల బిర్యానీ మటన్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు,1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు , 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 1 టన్ను పండుగప్ప కర్రీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై వంటి వంటకాలు ఆ భోజనం లిస్ట్ లో ఉన్నాయి.

ఇలా దాదాపు 20 ర‌కాల ప్ర‌త్యేక వంట‌కాలు అభిమానుల‌కు రుచి చూపించిన‌ట్లు తెలుస్తోంది. త‌మ సంప్ర‌దాయ ప్ర‌కారం సంస్మ‌ర‌ణ స‌భ‌ని ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన వారంతా ప్రభాస్ ఈ స్థాయిలో భోజనాన్ని ఏర్పాటు చేయడం చూసి ఆశ్చర్య పోవడంతో పాటు ఎంతగానో పొగిడారు.

గాడ్ ఫాదర్ ఒక నిశ్శబ్ద విస్ఫోటనం – మెగాస్టార్ చిరంజీవి

0

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ”గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 5న అంగరంగ వైభవంగా రిలీజ్ కు సిద్ధం అవుతుంది. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నా.. సరైన విధంగా ప్రచారం చేయట్లేదు అనే భావన నిన్న మొన్నటి వరకూ మెగా అభిమానుల్లో ఉండింది. అయితే గత వారం నుంచి గాడ్ ఫాదర్ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇటివలే తార్ మార్ తక్కర్ మార్ పాటని విడుదల చేసిన తర్వాత తాజాగా నజబజజజర పాటని కూడా విడుదల చేశారు.

ఇక నిన్న ‘ గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో చిరు స్పీచ్ హైలెట్ గా నిలిచింది. వర్షం వల్ల అంతరాయం కలిగినప్పటికీ చిరంజీవి అభిమానుల కోసం నిలబడి ఇరవై నిమిషాలకు పైగానే మాట్లాడటం విశేషం. ఈ ఈవెంట్ లో ఎప్పటిలాగానే ఆయన సినిమాకు సంబంధించిన అన్ని విషయాల గురించి మాట్లాడారు.

ఆచార్య సినిమా పరాజయం పట్ల తనకు నాకు చాలా బాధగా ఉందని, అయితే గాడ్ ఫాదర్ ప్రేక్షకులని తప్పకుండా ఆకట్టుకుంటుందని, ఈ సినిమా ఒక నిశ్శబ్ద విస్ఫోటనం అని గట్టిగా చెప్పారు. మరియు ఈ సినిమా చేయడానికి రామ్‌చరణ్ ప్రధాన కారణం అని కూడా చెప్పారు, ఈ సినిమా తన ఇమేజ్‌కి సరిపోతుందని చరణ్ సూచించినట్లు చిరంజీవి తెలిపారు.

ఇక సినిమాలో మాతృకతో పోలిస్తే మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశామని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు. దర్శకుడు మోహన్ రాజా హీరోయిజాన్ని చాలా కొత్తగా చూపించారని ఆయన అన్నారు. ఇక సంగీత దర్శకుడు తమన్ ను అయితే చిరంజీవి ఆకాశానికి ఎత్తేశారు. తమన్ ఈ సినిమాకి ఆరో ప్రాణంగా నిలిచారని, అద్భుతమైన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని చిరంజీవి పొగిడారు.

ఇక ఈవెంట్‌కు చిరంజీవి చాలా ఆలస్యంగా వచ్చారు. వర్షం, ట్రాఫిక్‌ తదితర కారణాల వల్ల ఆయన ఆలస్యమయ్యారు. ఈ విషయం అభిమానులకు అర్థమయ్యేలా చెప్పారు చిరంజీవి. అభిమానులు వర్షంలో తడుస్తూ.. తన కోసం కార్యక్రమంలో ఉంటే.. తాను గొడుగుల కింద నిలబడి మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. ఇండస్ట్రీకి ఏ గాడ్ ఫాదర్ లేకుండా వచ్చానని తన గురించి చెప్తారని, కానీ తన అభిమానులే తనకు గాడ్ ఫాదర్లు అని చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు.

అక్టోబరు 5న దసరా కానుకగా తెలుగులో మూడు సినిమాలు వస్తున్నాయి. ‘గాడ్‌ఫాదర్‌’తోపాటు నాగార్జున ‘ఘోస్ట్’, బెల్లంకొండ గణేష్‌ ‘స్వాతిముత్యం’ కూడా వస్తున్నాయి. చిరంజీవి తన ప్రసంగంలో తన సినిమా గురించి మాత్రమే చెప్పుకోకుండా ‘ఘోస్ట్‌’ సినిమా గురించి కూడా చెప్పారు. తన మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన నాగార్జున సినిమా విజయం సాధించాలని ఆయన అన్నారు.

అలాగే ‘స్వాతిముత్యం’ గురించి కూడా ప్రస్తావించారు. పెద్ద సినిమాలతోపాటు చిన్న సినిమాలు కూడా ఆడితేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది అంటూ తన మంచితనాన్ని మరోసారి చాటుకున్నారు.

Allu Sirish’ Urvashivo Rakshashivo enthralling teaser is out now

0

Allu Sirish and Anu Emmanuel are ready to entertain the audience in a modern-day romantic drama. The film, previously titled ‘Prema Kadanta’ is now coming out as ‘Urvasivo Rakshasivo’.

Well, a few days back, the makers of this film said that they were going to release the film on November 4th. So, a month prior to that, the makers made themselves busy in the promotion of the film. The promotions of the movie started with the fun filled and romantic teaser.

The teaser showed Allu Sirish in a completely new view, balancing his romantic life while posing as a good boy at home. This romantic story begins suddenly, and then the twist occurs, as Anu Immanuel is not ready for a relationship.The teaser has everyone intrigued with its comedy punches from Sunil and Vennala Kishore and Allu Sirish’s magical chemistry with Anu Immanuel. The rich visuals and background score by Achu Rajamani impressed.

The film is directed by Rakesh Sashii. The makers of the film are now planning to release the film on November 4. Renowned Producer Allu Aravind presenting the film while Dheeraj Mogilineni producing it. GA 2 pictures bankrolled the film in association with Shri Tirumala Production Private Ltd banner. Achu Rajamani composed the music. Tanveer handling the cinematography while editing is done by Karthika Srinivas.