Home Blog Page 1997

మళ్ళీ కొరటాల శివని నిందించిన మెగాస్టార్ చిరంజీవి

0

ఆచార్య సినిమా విడుదలై ఆరు నెలలు కావస్తున్నా.. ఇంకా ఆ సినిమా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎందుకంటే వివాదాలు ఆ సినిమాని వదిలివెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. తాజాగా తెలుగు సినీ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల పై చేసిన వ్యాఖ్యల వల్ల మరోసారి ఆచార్య చిత్రం తెర పైకి వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో ముఖ్య పాత్రలో నటించగా.. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా కొరటాల కెరీర్ లోనే వరస్ట్ సినిమాగా నిలిచింది. చిరంజీవి పాత్ర కానీ, రామ్ చరణ్ పాత్ర కానీ ఏదీ ప్రేక్షకులని ఆకట్టుకోలేదు. జీవం లేని కదా, పాత్రల సమూహంలా ఉన్న ఆచార్య.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. రెండో రోజే థియేటర్స్ నుండి వెళ్ళిపోయిన ఈ సినిమా భారీ నష్టాలు మిగిల్చింది.

ఇక ఆ తరువాత “ఆచార్య నష్టాలు” అనే సినిమా తీసినట్లుగా ఆ సినిమాని కొన్న బయ్యర్లు వారి నష్టాల తాలూకు కథ నడిచింది. ఈ క్రమంలో నష్టాలు భర్తీ చేయాలని కొంత మందు ఆందోళనకు దిగడం. మెగాస్టార్ చిరంజీవి భాధ్యత తీసుకోవాలి అని కొంత మంది, ఆయనకు బిజినెస్ తో సంబంధం లేదు ఈ సినిమా ఆర్థిక లావాదేవిలలో తలదూర్చిన కొరటాలనే ఆ భాధ్యత తీసుకోవాలి అని మరి కొందరు వాదించారు.

మొత్తానికి నిజానిజాలు ఎవరికీ తెలియదు కానీ ఆ ఆచార్య సినిమా వల్ల కొరటాల అందరికంటే ఎక్కువ నష్టపోయారనే వార్త ఇప్పటికీ బాగా ప్రచారంలో ఉంది. ఇక చిరంజీవి ఆచార్య సినిమా ఫలితంతో బాగా నిరాశ చెందినట్లు ఆయన ఇటీవలే చేసిన, చేస్తున్న వ్యాఖ్యల ద్వారా అందరికీ అర్థం అవుతుంది.

గతంలో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమాకి సంబందించిన ఫంక్షన్లో, అప్పుడప్పుడు పరిస్థితులు నా చేతిలో ఉండవు. వాటి గురించి అడగకండి అని ఆయన అన్న మాటలు పరోక్షంగా ఆచార్య గురించే అని అందరూ గ్రహించారు. అంతే కాకుండా సెట్స్ లో కొందరు దర్శకులు అప్పటికప్పుడు డైలాగ్స్ రాసి ఇస్తూ ఉంటారు. ఇడ్లీ వేడివేడిగా ఇవ్వాలి కానీ డైలాగ్స్ కాదు. ఈ విషయంలో టాలీవుడ్ దర్శకులు మారాలి అని కూడా అన్నారు.

ఇప్పుడు ఆయన తాజాగా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ విమర్శకురాలు అనుపమ చోప్రాతో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆచార్య గురించి ప్రస్తావిస్తూ.. దర్శకుడు చెప్పింది మాత్రమే చేశామని, కానీ సినిమా పోయింది అన్నట్లు మాట్లాడారు. ఇది చిరంజీవికి ఏమాత్రం భావ్యం కాదు.

ఒక సినిమా విజయం సాధించినా, లేదా అపజయం పాలైనా అందులో అందరికీ భాగం ఉంటుంది. చిరంజీవి అనవసరంగా ప్రతిసారీ కొరటాల శివ పై నిందలు వేయడం ఏమాత్రం సరి కాదు.

ఆచార్య ఫలితం వల్ల చిరంజీవి బాధ పడి ఉండచ్చు, కానీ అపజయాన్ని కూడా స్వీకరించి ముందుకు వెళ్లాలి కానీ ఇలా మరొకరి మీద భారం వేయడం మాత్రం ఆయన స్థాయికి తగ్గ పని కాదు. ఇకనైనా చిరంజీవి ఆచార్య సినిమా విషయంలో ఆత్మ వంచన మాని ఆత్మ పరిశీలన చేసుకుని, కొరటాల శివ పై నిందలు వేయకుండా ఉంటే మంచిది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ లుక్ అదుర్స్

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో.. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హరి హర వీరమల్లు. అంతే కాకుండా ఈ చిత్రం పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియా సినిమా కావడం మరో విశేషం. ఈ చిత్రాన్ని నిర్మాత ఏ.ఎం.రత్నం మరియు ఏ. దయాకర్ రావు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందించబడిన ఈ చిత్రం 17వ శతాబ్దం నేపథ్యంలో, మొఘల్ సామ్రాజ్య కాలం నాటి కథగా తెరకెక్కుతుంది.

కాగా ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక బందిపోటు దొంగ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. భారీ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ సినిమా అన్ని విధాలుగా సరిగ్గా వచ్చేలా చిత్ర బృందం చాలా శ్రద్ధ వహిస్తూ పని చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా పై పలు రకాల పుకార్లు షికార్లు చేశాయి. సినిమా ఉంటుందో లేదో తెలీదని, దర్శకుడికి పవన్ కి మధ్య విభేదాలు వచ్చాయని ఏవేవో వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా చిత్ర బృందం శుక్రవారం తదుపరి షెడ్యూల్ కి సంబంధించిన ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ కు సంబంధించిన వీడియోని విడుదల చేసి సినిమా పట్ల ఉన్న అనుమానాలు అన్నిటినీ పటా పంచలు చేసింది. తదుపరి షెడ్యూల్ లో పాల్గొనే ప్రధాన నటీనటులతో పాటు మరి కొంత మంది సాంకేతిక నిపుణులతో ఈ ప్రి షెడ్యూల్ వర్క్ షాప్ ని నిర్వహించినట్లు తెలుస్తోంది.

కాగా ఈ వర్క్ షాప్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లుక్ అభిమానులకు ఎంతగానో నచ్చింది. ఈ లుక్ చూసి వారు ఒక్కసారిగా ఖుషి సినిమా రోజుల దగ్గరకి వెళ్ళిపోయారు అంటే అది అతిశయోక్తి కాదు. అసలు ఇంత యంగ్ గా పవన్ ఈ సినిమా కోసం మారిపోవడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

ఇక ఈ వర్క్ షాప్ లో పవన్ దర్శకుడు క్రిష్ లతో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొనడం విశేషం. ఈ ప్రీ వర్క్ షాప్ లో పవన్ కల్యాణ్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్, సునీల్, సుబ్బరాజు, రఘు బాబు మరియు హైపర్ ఆది పాల్గొన్నారు. ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాతలు ఏ.ఎం. రత్నం, ఏ. దయాకర్ రావు, సినిమాటోగ్రాఫర్ వి.ఎస్. జ్ఞానశేఖర్, విజయ్ అడారియా తదితరులు పాల్గొన్నారు.

అక్టోబర్ రెండవ వారం నుంచి ఈ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం.

తెలుగు – తమిళ ప్రేక్షకుల మధ్య ట్విట్టర్లో యుద్ధం

0

దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ చరిత్రాత్మక చిత్రం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 30న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రాన్ని తీసిన దర్శకుడు కావచ్చు, నటించిన నటీనటులు, ఇతర తమిళ పరిశ్రమ వర్గాలు, ప్రముఖ విశ్లేషకులు అలాగే తమిళ ప్రేక్షకులు అందరూ పొన్నియిన్ సెల్వన్‌ని తమిళ సినిమా గర్వకారణంగా ప్రచారం చేసి భారీ స్థాయిలో ఈ సినిమా పై అంచనాలు పెట్టుకున్నారు. ఈరోజు ఉదయం విడుదలైన దగ్గరనుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ ప్రేక్షకులు మరియు అభిమానులు ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఇది ఒక అద్భుతమైన సినిమాగా పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే సినిమా చూసి ఎలా ఉంది అని చెప్పే కంటే పొన్నియిన్ సెల్వన్‌ని ఒక పండగలా జరుపుకోవాలి అనే లక్ష్యంతో ఉన్నారు. వారి అభిమానికి ఈ చిత్ర బృందం నిజంగా సంతోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఈ చిత్రాన్ని చూసిన ఒక వర్గం తెలుగు ప్రేక్షకులు మాత్రం పొన్నియిన్ సెల్వన్‌ని ప్రభాస్ మరియు రానా దగ్గుబాటి నటించగా.. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో పోల్చారు. ఇది చాలా మంది తమిళ ప్రేక్షకులకు కోపం తెప్పించింది, దీంతో ట్విట్టర్‌లో PS-1ని బాహుబలితో పోల్చిన వ్యక్తుల పై వారు ట్వీట్ల ద్వారా యుద్ధం చేశారనే చెప్పాలి.

బాహుబలి ఒక ఫాంటసీ చిత్రం అని, పొన్నియిన్ సెల్వన్ చారిత్రక కల్పన అని, అలాంటపుడు ఈ రెండు చిత్రాలను ఎలా పోల్చి చూస్తారని వారు తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు రకరకాల ట్రోల్స్ కూడా చేసుకున్నారు.

https://twitter.com/kumaran1597/status/1575750114395959296?t=t8eBMwWS-rJ_0Tv0NTYqMw&s=19

తమిళ ప్రేక్షకుల తర్కించే విధానంలోనూ న్యాయం ఉంది. మణిరత్నం శైలి, రాజమౌళి శైలి పూర్తిగా వేరుగా ఉంటాయి. అలాంటప్పుడు మణిరత్నం సినిమాల్లో ఉన్నట్లు నెమ్మదిగా, చాలా సాధారణంగా డైలాగులు రాజమౌళి సినిమాల్లో కనిపించవు. అలాగే రాజమౌళి సినిమాల్లో ఉండే ఉర్రూతలూగించే సన్నివేశాలు మణిరత్నం సినిమాల్లో ఉండవు.

ఇలా పొన్నియిన్ సెల్వన్ విడుదలైన రోజే బాహుబలి ట్విట్టర్‌లో ట్రెండ్ అవడానికి కారణం ఒక రకంగా తెలుగు, తమిళ ఇరు వర్గాల ప్రేక్షకుల అత్యుత్సాహం ఒక కారణం అయితే మరో రకంగా చూసుకుంటే ఇలాంటి సినిమాలను తెరకెక్కించాలంటే రాజమౌళి మాత్రమే తీయగలడు అనేలా ఆయన బాహుబలి సీరీస్ తో ప్రేక్షకుల పై ముద్ర వేసిన విషయం స్పష్టం అవుతుంది.

ఇక ఈరోజు విడుదలైన పొన్నియిన్ సెల్వన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ చిత్రం అన్ని భాషలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని అంటున్నారు.

Karthikeya 2 grand 50 days Celebrations for the first time in USA

0

Nikhil’s Karthikeya 2 is continuing the dream run at the box office. The film is did extremely well not just in Telugu states but also in the Hindi belts and overseas. Karthikeya 2’ has emerged as a mega blockbuster in the USA with minting more than 2 million dollars.

The film recently completed a successful 50-day run, and for the first time, 50-day celebrations were held in the United States. Producer TG Vishwa Prasad attended the celebrations and thanked the audience for making the film a huge hit.Karthikeya 2′ is the highest-grossing Telugu film in terms of return on investment in the United States. And the creators continue to be lauded and appreciated by all.

For their dedication and vision, the film team deserves all of these collections, appreciation, and accolades.‘Karthikeya 2’, the sequel to the 2014 film Karthikeya is a supernatural mystery thriller film. Directed and written by Chandoo Mondeti, Produced by TG Vishwa Prasad and Abhishek Agarwal, Karthikeya 2 is also backed by stellar performances from Anupama Parameswaran, Srinivas Reddy, and Harsha. Anupam Kher’s divine performance cannot be disregarded for the success of the Hindi version of the film also. Kaala Bhairavaa is the music director.

టీఆర్పీ రేటింగ్లలో నిరాశ పరిచిన F3

0

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా, తమన్నా భాటియా, మెహ్రిన్ కౌర్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్ టైనర్ ఎఫ్3. ఈ చిత్రం థియేటర్లలో విడుదలయి కాస్త నెగటివ్ టాక్ తెచ్చుకున్నా, బాక్స్ ఆఫీస్ వద్ద ఏబొవ్ యావరేజ్ గా నిలిచింది.

వీరి కాంబినేషన్లో ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మొదటి చిత్రం ఎఫ్‌2 ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించి ఆ సీజన్ లో బిగ్గెస్ట్ హిట్ అవడంతో పాటు ఆ సంవత్సరంలో కూడా భారీ విజయం సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది.

కానీ ఎఫ్3 సినిమా మాత్రం ప్రేక్షకులను అదే స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలం అయింది. కేవలం కొన్ని చోట్ల కామెడీ సన్నివేశాలు తప్ప సినిమాలో సరైన విషయం లేదని ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే సీక్వెల్ క్రేజ్ మరియు సమ్మర్ రిలీజ్ అవడం వల్ల కలెక్షన్ల విషయంలో మాత్రం పరవాలేదు అనిపించుకుంది.

ఇక తాజాగా ఫ్3 చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రసారం అయిన సంగతి తెలిసిందే. గత ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కాగా.. బుల్లితెర పై ఈ చిత్రం ప్రేక్షకులని అలరించ లేకపోయింది. గమ్మత్తైన విషయం ఏమిటంటే, F2 చిత్రం తన మొదటి టెలివిజన్ ప్రీమియర్ lo 17.2 రేటింగ్ ను పొందగా F3 చిత్రం అందులో సగం రేటింగ్ సాధించింది. కాగా అర్బన్ టీఆర్పీ రేటింగ్లో 8.26, అర్బన్ + రూరల్ రేటింగ్లో 6.62 రేటింగ్ వచ్చింది.

సినిమాలకు టీఆర్పీ రేటింగ్లు తక్కువ రావడం ఈ మధ్య ఎక్కువ సినిమాలకు జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ప్రేక్షకుడు కేవలం ధియేటర్ లేదా టివిలో సినిమాలను చూసే అవకాశం ఉండేది. కానీ గత కొన్నేళ్లలో వచ్చిన ఓటిటి విప్లవం వల్ల ఇప్పుడు మొబైల్ ఫోన్లలోనే సినిమాలు వీక్షించే అవకాశం ఉండడం వల్ల టివిలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించడం లేదు.

మిశ్రమ స్పందన తెచ్చుకున్న ప్రభాస్ ఆదిపురుష్ ఫస్ట్ లుక్

0

కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా భారతదేశ సినీ ప్రేక్షకులు అందరూ ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా `ఆదిపురుష్`. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ లేదా టీజర్ ఇలా ఏదో ఒక అప్ డేట్ కోసం చాలా రోజులుగా ఆసక్తితో ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాముడి గెటప్ లో ప్రభాస్ ఎలా ఉంటారు.. రాముడిగా అందరినీ మెప్పిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.

కాగా ఈ చిత్రం టీజర్ అక్టోబర్ రెండో తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక టీజర్ కి ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే అభిమానులకు ఓం రౌత్ టీజర్ రిలీజ్ తాలూకు సర్ప్రైజ్ ఇచ్చారు.

“మా ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరు భాగం కండి. ఉత్తరప్రదేశ్ రాష్ర్టం ఆయోధ్యలో సరయు నది ఒడ్డున జరగనున్న ఆదిపురుష్ టీజర్ లాంచ్ లో పాల్గొనండి. అక్టోబర్ 2 రాత్రి 7.11 గంటలకు టీజర్ విడుదల చేస్తున్నాం” అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

ఆ రకంగా ఆదిపురుష్ చిత్రం నుంచి తొలిసారిగా ప్రభాస్ పోస్టర్ ను అధికారికంగా విడుదల చేశారు. ఎట్టకేలకు తాము ఎదురు చూసిన పోస్టర్ వచ్చినందుకు ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఆనందించారు.

రాముడి ఆహార్యం కోసం వినియోగించిన కాస్ట్యూమ్స్ అవీ బాగున్నా.. ఈ పోస్టర్ చూసిన ప్రభాస్ అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు మరియు సాధారణ ప్రేక్షకులు కూడా పెదవి విరిచారు. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులకి ఈ లుక్ ఏమాత్రం నచ్చలేదు. అయితే ఇది కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ కాబట్టి, ఎల్లుండి వచ్చే టీజర్ తో ఆదిపురుష్ చిత్ర బృందం ప్రేక్షకులని ఆకట్టుకునే అవకాశం లేకపోలేదని మరి కొందరు అంటున్నారు. మరి టీజర్ తో నిజంగానే ఆదిపురుష్ టీమ్ అందరినీ ఆకట్టుకుంటారు అని ఆశిద్దాం.

ఆదిపురుష్ చిత్రాన్ని రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాముడిగా.. ఆయనకు జోడీగా కృతిసనన్ సీత పాత్రలో నటిస్తున్నారు. రావణాసురిడి పాత్రలో సైఫ్ అలీఖాన్..లక్ష్మణుడి పాత్రలో సన్నీసింగ్ నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

సమ్మర్ 2023కు వాయిదా పడ్డ బాలకృష్ణ సినిమా NBK107 విడుదల ?

0

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న NBK 107 ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి. అఖండ సినిమా ఘనవిజయంతో బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లోనే అత్యుత్తమ దశలో ఉన్నారు. అదే విధంగా, గోపీచంద్ మలినేని కూడా ఇటీవలే మాస్ మహారాజా రవితేజతో క్రాక్‌ వంటి సూపర్ హిట్ ను అందించి మంచి ఊపు మీద ఉన్నారు. ఈ రెండు సినిమాలు 2021లో విడుదలయ్యాయి. కాగా NBK107 పై అంచనాలను భారీగా పెంచేశాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల తేదీని సరిగా నిర్ణయించడంలో వారు ప్రస్తుతం ఇబ్బందులని ఎదుర్కొంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో చిరు154 ఒకటి కాగా మరో సినిమా NBK107. చిరంజీవి – బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాను ఇదివరకే 2023 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే బాలకృష్ణ కూడా తన చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని భావించారట. ఈ పోటీ ఇరు హీరోల అభిమానులకు ఆనందాన్ని ఇచ్చేదే, ఎందుకంటే ఎప్పటి నుంచో మెగా – నందమూరి హీరోలు మరియు అభిమానుల మధ్య ఉన్న వృత్తి పరమైన పోరు తెలిసిందే కదా. అయితే ఈ రెండు సినిమాలని ఒకేసారి విడుదల చేస్తే ఖచ్చితంగా ఒకరీ లాభాలను మరొకరు తగ్గించే అవకాశం ఎంతైనా ఉంది.

అందుకే NBK107 సినిమాని సమ్మర్ 2023కి వాయిదా వేయాలని మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తున్నారట. ఈ విషయమై బాలయ్యను ఒప్పించాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కాగా మైత్రీ వారు డిసెంబర్ 23 లేదా వేసవి ప్రారంభంలో (మార్చి 2023) సినిమాని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

అయితే, డిసెంబర్ 23 తేదీన హాలీవుడ్ నుండి అత్యంత భారీ ప్రతిష్ఠాత్మక సినిమా అయిన అవతార్ 2 విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అందువల్ల అదే తేదీకి బాలకృష్ణ సినిమాని విడుదల చేయడం అంత సబబు కాదనే వాదన బలంగా వినిపిస్తుంది. ఈ వాదనలో ఖచ్చితంగా నిజం ఉంది.

అంత భారీ సినిమాతో పోటీ పడే కంటే.. కుదిరితే సంక్రాంతికి లేదా మార్చిలో సినిమాని విడుదల చేయడమే మంచిదనే భావనలో మైత్రీ మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి చివరికి ఏ తేదీని నిర్ణయిస్తారో చూడాలి.

Balakrishna’s NBK107 release postponed to summer 2023?

0

Balakrishna’s NBK 107 under Gopichand Malineni’s direction is one of the most awaited combinations of Tollywood at the moment. Balakrishna is in top form with the massive success of Akhanda. Similarly, Gopichand Malineni is also on a high after delivering superhit Krack. Both these movies were released in 2021 and have heightened expectations on NBK 107.

Mythri Movie Makers have bankrolled this project and they have been facing a dilemma over scheduling a release date for this film. Mythri movie makers have locked the release of Chiru 154 to Sankranthi 2023. Even Balakrishna also wants to release this film for Sankranthi. While the clash will be a great sight for the fans, it might lead to both NBK 107 and Chiru 154 cutting into each other’s profits.

This is why the production house is trying to convince Balayya for a summer 2023 release. Mythri has even said that they can come on December 23 or early summer (March 2023). However, December 23 looks unsafe as Avatar2 is releasing at that time which will NBK 107 . If not Sankranthi March release will better option according to the makers.

పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్

0

సినీ ప్రేమికులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్యాన్ ఇండియా సినిమా పొన్నియిన్ సెల్వ‌న్. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్కుతుండ‌గా.. పొన్నియిన్ సెల్వ‌న్-1 సెప్టెంబ‌ర్ 30న అంటే నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌ అయింది. ఇప్పటికే ఈ సినిమా టికెట్స్ బుకింగ్ అన్ని చోట్లా అద్భుతంగా ఉండగా ప్రీమియర్ షోల నుండి స్పందన ఎలా ఉందో చూద్దాం.

అంతా ఊహించినట్టుగానే పోన్నియిన్ సెల్వన్ చిత్రానికి తమిళ ప్రేక్షకుల నుండి అద్భుతమైన టాక్ వచ్చింది. అక్కడ పొన్నియిన్ సెల్వన్ నవల అనేది ఎన్నో ఏళ్లుగా ప్రసిద్ధి గాంచింది. ఆ నవల మీద సినిమా అనగానే వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు వచ్చారు. పైగా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కడంతో తమిళ నాట ఈ సినిమాని అక్కున చేర్చుకున్నారు. అందుకే అక్కడి విమర్శకులు, మరియు సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి ఈ సినిమాకి చాలా మంచి స్పందన వస్తోంది. అక్కడ ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద భారీ రికార్డులు సృష్టించే అవకాశాలు చాలానే ఉన్నాయి.

ఇక తెలుగు ప్రేక్షకుల నుండి మాత్రం కాస్త మిశ్రమ స్పందన వస్తోంది. ఎందుకంటే బేసిక్ గా ఈ చిత్రం తమిళ రాజుల నేపథ్యంలో రూపొందినది కావడంతో అక్కడి ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువ. మన తెలుగు ప్రేక్షకుల నుంచి మాత్రం సినిమా కాస్త నిదానంగా సాగుతుంది అనే టాక్ వస్తుంది. మరి ఈ టాక్ ఇతర రెగ్యులర్ షోల తర్వాత మారుతుందో లేదో చూడాలి.

బాక్సాఫీస్ వద్ద ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ చిత్రం అన్ని భాషలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని అంటున్నారు.

పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్టుగా తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో తెరకెక్కిన ఈ ప్రాజెక్టులో విక్ర‌మ్‌, కార్తీ, జ‌యం ర‌వి, శ‌ర‌త్‌కుమార్‌, జ‌య‌రామ్‌, విక్ర‌మ్ ప్ర‌భు, పార్థీబన్‌, ప్ర‌కాశ్ రాజ్‌, అర‌వింద్ స్వామి, ఐశ్వ‌ర్యా రాయ్‌, త్రిష‌, శోభితా ధూళిపాళ, కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఈ చిత్రాన్ని మ‌ద్రాస్ టాకీస్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు అద్బుత‌మైన స్పంద‌న వచ్చింది.

Ponniyin Selvan #PS1 FDFS public talk, reviews and box office expectations

0

Mani Ratnam’s magnum opus Ponniyin Selvan has released worldwide and fans are eager to catch what the master storyteller has in store for them. The film features an interesting star cast of Vikram, Aishwarya Rai, Trisha, Karthi, Jayam Ravi, and others. The team has been touring across India and extensively promoting this action adventure film based on the Chola dynasty.

The film has received positive talk from Tamil early shows but from a Telugu audience, it’s receiving mixed response. The Telugu audience felt the movie has slow and not engaging whereas the Tamil audience looks connected because of the nativity. We have to wait and see how this will go for other shows in other regions as well.

The box office expectations are massive for the film. It is expected to collect more than 80Cr gross worldwide on day1 for all languages. Rajinikanth’s 2.0 and Kabali are the top 2 openers with 95 crores and 90 crores respectively and if Ponniyin Selvan gets great word of mouth all over, then the coming shows will contribute heavily to crossing this mark.