HomeMovie News"జల్సా" స్పెషల్ షోల ద్వారా రూ.1 కోటి కలెక్షన్.. పవన్‌కు విరాళం ఇచ్చిన జనసైనికులు

“జల్సా” స్పెషల్ షోల ద్వారా రూ.1 కోటి కలెక్షన్.. పవన్‌కు విరాళం ఇచ్చిన జనసైనికులు

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో జల్సా ఒకటి. ఈ చిత్రం ఇప్పటికీ అభిమానుల పై భారీ ప్రభావాన్ని చూపుతోంది. ఈ చిత్రం దాని రీరిలీజ్ లో కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి బ్రహ్మాండమైన ప్రతిస్పందనను అందుకుంది మరియు ఈ స్పెషల్ షోల వేడుకలు ఒక భారీ సినిమా కొత్త విడుదలను గుర్తు చేశాయి.

పైన చెప్పినట్లు స్పెషల్ స్క్రీనింగ్స్ ద్వారా వచ్చిన కోటి రూపాయల మొత్తాన్ని ఇప్పుడు జనసేన పార్టీ ‘నా సేన నా వంతు’ కార్యక్రమానికి విరాళంగా అందించారు.

పవన్ కళ్యాణ్ అభిమానులు సాయి రాజేష్, ఎస్కేఎన్, సతీష్ బొట్టా, ధర్మేంద్ర ఈ చెక్కును జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు చేతుల మీదుగా పవన్ కళ్యాణ్‌కి అందజేశారు.

జనసేన అనుచరులు ఆలోచనాత్మకంగా వ్యవహరించారని పవన్ కళ్యాణ్, నాగబాబు అభినందించారు. కార్యకర్తలంతా వృత్తిపరంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నప్పటికీ, జనసేన అభివృద్ధికి పాటుపడాలనే ఆశయంతో ఐక్యంగా ఉన్నామని నాగబాబు స్పష్టం చేశారు.

మెగా అభిమానులు సాధారణంగా రక్తదానం అయినా, నేత్రదానం అయినా సామాజిక సేవ చేయడంలో చురుకుగా ఉంటారు. మెగా హీరోల పుట్టిన రోజు సందర్భంగా జనసేనకు అభిమానులు తమవంతు సహకారం అందించడం కూడా తమ భాధ్యతగా తీసుకున్నారు.

అందుకే మరో అడుగు ముందుకేసి, రీరిలీజ్ లాభాలను జనసేనకు అభిమానులు ఇవ్వడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుత కాలంలో రాజకీయం అనేది ఖరీదైన వ్యవహారం, సినిమాల రీరిలీజ్ ద్వారా అభిమానులు ఇంత భారీ మొత్తాన్ని సమీకరించడం అనేది మంచిదే అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories