Home Blog Page 2127

అన్‌స్టాపబుల్ 2 లో మెగాస్టార్?

0

నందమూరి బాలకృష్ణ గత యేడాది ఆహా ఓటీటీ వేదికగా అన్స్తాపబుల్ షో తో హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. “నేను మీకు తెలుసు..నా స్థానం మీ మనసు”అంటూ హోస్ట్‌గా తనదైన శైలిలో అన్‌స్టాపబుల్ షోను రక్తి కట్టించారు. మోహన్ బాబు తో మొదటి ఎపిసోడ్ చేయగా చివరి ఎపిసోడ్ మహేష్ బాబుతో చేయడం జరిగింది. ఈ షో కారణంగా ఆహా ఓటీటీకి సబ్‌స్క్రైబర్స్‌కు భారీగా పెరిగారని కూడా తెలిసింది.

ఈ షో సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం సినిమాల్లో ఎక్కువగా గంభీరంగా,భారీ సంభాషణలు పలికే బాలకృష్ణ షోలో మాత్రం సరదాగా గెస్ట్ లతో జోక్ లు వేస్తూ మధ్యలో తన మీద కూడా జోక్ లు వేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ యాంగిల్ బాలయ్యలో మునుపెన్నడూ చూడలేదే అని ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు.

అలాగే తన మీద వచ్చే రూమర్ లు వగైరాల మీద కూడా వివరణ ఇచ్చుకోవడం చేసి బాలకృష్ణ శభాష్ అనిపించుకున్నారు. ముఖ్యంగా తనకు రవితేజ మధ్య గొడవ అయ్యిందని దశాబ్దం క్రితం నుంచి ఉన్న రూమర్లకు బాలయ్య చెక్ పెట్టారు.స్వయంగా రవితేజతోనే క్లారిటీ ఇప్పించడం ఆయనకే చెల్లింది.

కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ప్రతి ఎపిసోడ్ లో సమాజంలో కష్టాలు ఎదురీదుతున్న వారిని పరిచయం చేసి వాళ్ళకి చేతనైన సహాయం చేయడం కూడా షోకు మంచి పేరు తీసుకువచ్చింది.సరదాగా మాట్లాడుతూనే గెస్ట్ లను ఎమోషనల్ జర్నీలో తీసుకెళ్లడంలో బాలకృష్ణ సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. జనవరిలో అన్‌స్టాపబుల్ మొదటి సీజన్ చివరి ఎపిసోడ్ ప్రసారం అయింది, అప్పట్నుంచి సీజన్ 2 ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు, మొత్తానికి వారి ఎదురుచూపులు ఫలించాయి.

అన్‌స్టాపబుల్ సీజన్ 2 తొందరలోనే మొదలవుతుందని, ఆ సీజన్ మొట్టమొదటి గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే గనుక నిజం అయితే టీఆర్పిల రికార్డ్ మోగిపోయే ఎపిసోడ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.మెగా – నందమూరి కలయిక ఎలా ఉండబోతుందో త్వరలోనే చూడబోతున్నాం.

మహేష్ బాబు తో సందీప్ రెడ్డి వంగా

0

అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత సందీప్ వంగా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. అప్పట్లో దాదాపు ప్రముఖ హీరోలందరి నుంచి ఆయనకు కాల్ వచ్చింది. అందులో మహేష్ కూడా ఉన్నాడు.తన కోసం మంచి సబ్జెక్టు రెడీ చేయాలని మహేష్ కోరినట్టు లోగడ ఒకసారి సందీప్ చెప్పడం జరిగింది.

ఈ సంగతులని సందీప్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో జరిగిన స్పేస్ లో చెప్పారుమహేష్ బాబుతో చాలా రోజుల క్రితమే సినిమా చేయాల్సింది. తాను మహేష్ ను బయట నాలుగైదు సార్లు కలిశానని, కోన్ని ఇంట్రెస్టింగ్ లైన్స్ కూడా వినిపించానని సందీప్ చెప్పుకొచ్చారు.

మహేష్ కి ఆ కథలు నచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రూపు దాల్చలేదని సమాచారంఆ తరువాత మహేష్ తో సందీప్ కొన్ని యాడ్ షూట్ కొరకు పనిచేశారు. ఇంతవరకు సినిమాల్లో మహేష్ బాబుని మనం చూసింది 25 శాతం మాత్రమే.75 శాతం మహేష్ బయట పడనేలేదని ముందుగా చెప్పుకున్నట్టు ఫ్యాన్స్ స్పేస్ లో సందీప్ చెప్పారు.

అంటే మహేష్ బాబు సత్తాని ఫిలిం మేకర్స్ ఇప్పటి వరకు 25 శాతం మాత్రమే ఉపయోగించుకున్నారు అని సందీప్ పరోక్షంగా తెలిపారు.ఇక ఆ 75 శాతం మహేష్ ను తెరపై చూపించే అవకాశం వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా ఆ పైన రాజమౌళితో సినిమా అయ్యాక మహేష్ సందీప్ దర్శకత్వంలో నటించేందుకు ఉత్సాహంగా ఉన్నారు అని తెలుస్తుంది. ఇది నిజం అయితే అటు మహేష్ ఫ్యాన్స్ కు ఇటు మూవీ లవర్స్ కు పండగనే చెప్పాలి. మోస్ట్ అవెయిటడ్ కాంబో అయిన ఈ కలయిక వీలయినంత త్వరగా ప్రకటిస్తారని ఆశిద్దాం.

ఆ విషయంలో పరశురాందే తప్పు అంటున్న మహేష్ ఫ్యాన్స్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు పెట్లా పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన “సర్కారు వారి పాట” రేపటి నుండి అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఇక కొత్త వివాదం తెర మీదకు వచ్చింది.సినిమా ధియేటర్ లలో విడుదలైన రోజే ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా తమన్ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తన స్థాయిలో ఇవ్వలేదని చెప్పడం జరిగింది. అలాగే ట్విట్టర్ లో మహేష్ ఫ్యాన్స్ తమన్ ను ట్రాల్ చేయడం కూడా జరిగింది.

ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సంగీత దర్శకుడు తమన్ ఒక ఆసక్తికర విషయం చెప్పారు.అదేంటంటే సర్కారు వారి పాట సినిమా ఇంటర్వల్ ముందు వచ్చే బీచ్ సీన్ కి వచ్చే నేపథ్య సంగీతం (background score) ముందు అనుకున్నది కాదట, ఆ సీన్ తో పాటుగా విలన్ సముద్రఖని ఒక పూజ/హోమం చేసే సీన్ కూడా సమాంతరంగా నడిపి ఆ దశలో వచ్చే మంత్రాలతో సన్నివేశాన్ని రక్తికట్టించారట. అయితే ఎడిటింగ్ సమయంలో ఆ హోమం సన్నివేశం తీసివేశారని,అందువల్ల వేరే మ్యూజిక్ మళ్ళీ ఇవ్వాల్సి వచ్చిందని, అంతకు ముందు పడ్డ కష్టం అంతా వృధా అయిపోయిందని తమన్ చెప్పుకొచ్చారు. సినిమాల విషయంలో ఇది సహజంగా జరిగేదే. ఒక్కోసారి సన్నివేశాలు,పాటలు ,పాత్రలనే మార్చడం లేదా తీసి వేయడం జరుగుతుంది.

అయితే ఈ విషయం తెలిసిన మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు దర్శకుడు పరశురాం మీద కాస్త కోపం గానే ఉన్నారు.మంచి ఊపుని ఇచ్చే సన్నివేశం ఎందుకు తీసేశారు అని విరుచుకుపడుతున్నారు.అయినా సినిమా ముందు వరకు ఫలానా దర్శకుడిని ఆకాశానికి ఎత్తేసి రిలీజ్ తరువాత మళ్ళీ తప్పుబట్టడం తెలుగు సినిమా అభిమానులకు అలవాటుగా మారింది. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ కి, ఇంతకు ముందు మహేష్ బాబు తో సినిమాలు చేసిన వంశీ పైడిపల్లి,అనీల్ రావిపూడి ఇప్పుడు పరశురాం పెట్లా. దర్శకుడు మారినా అభిమానుల తీరు మారదు ఎందుకంటే వాళ్ళకి అభిమాన హీరో సినిమా అంటే అన్ని అంచనాలు ఉంటాయి.

Kamal Haasan’s Vikram beats Prabhas Baahubali 2 in Tamilnadu

0

The latest movie ‘Vikram’ starring Ulaga Nayagan Kamal Haasan which is shaking the box office. After a very long time, an out-and-out action movie came out from Kamal sir. With such a good movie coming out of Kamal in recent times, his fans have been eager to see this movie over and over again. Which is why it is creating new records at the box office. The film was released on June 3 and got positive talk from the very first show. The entire unit is rejoicing as the film has recently surpassed the Rs 300cr club at World box office. And in this order, another good news came to the unit. This film made another sensational record. Vikram has surpassed the lifetime collections of Visual Wonder Baahubali 2, which is a record.

It is a well-known fact that Baahubali 2 is the highest-grossing film in Indian cinema and also at Tamil Nadu box office. For the past 5 years it’s record was unbeaten. But now, the latest reports says that ‘Vikram’ has surpassed the collection of ‘Baahubali 2. This film collected around Rs 155crs gross in Tamil Nadu and remained as the top-grosser of the state for 5 years.

‘Vikram’ has finally broken the 5-year-old record of it by collecting around Rs 160 crores in Tamil Nadu alone. It is notable that Vikram has surpassed Baahubali 2’s lifetime collection in just fifteen days. It has also broken box office records in other regions.

Vikram also defeated Superstar Rajinikanth’s 2.0 and become the high-grossing Tamil film in Australia. It is the third highest-grossing Tamil film in the USA behind 2.0 and ‘Kabali’. The actors like Vijay Sethupathi, Fahadh Faasil and Suriya have played prominent roles in ‘Vikram’.

New release date for Siva Karthikeyan Prince

0

Prince Siva Karthikeyan is in full form. Currently, he is enjoying his peak stage in his career. His previous films Doctor and Don, both did phenomenon business at the box office. Doctor film directed by Nelson was the first 100cr film for the hero. And the recently released movie Don starring Siva Karthikeyan became a blockbuster hit, grossing over Rs 120 crore. The film was directed by CB Chakravarti. His films helped to make a brand for himself, not only the youth but the senior citizens also started to enjoy his comic timing. His film Romeo, which starred Keerthy Suresh helped him to open the market in Telugu states. For increasing his market more to the core, he roped the Director Anudeep K.V.

Anudeep K.V has a unique comedy time, he already proved this with his first film. Jathiratnalu is one of the kinds of a film which never get bored. Now it’s a great thing that the Hero and Director, who has a great talent joined hands together. They are doing a film titled Prince, under Suresh productions. The film is in a full swing. Recently the crew announced a new release date through a video.

The release date of Prince starring Siva Karthikeyan has been changed and the crew has announced that the film will be released for the Diwali festival. Prince is a film which is directed by Jathiratnalu fame Anudeep K.V. Ukrainian actress Maria is paired with Siva Karthikeyan. This Romantic comedy film is Telugu-Tamil bilingual film, which is set to be released on Vinayakachaviti. The crew of this film has officially announced the release date. For this, a video has been released in which Siva Karthikeyan, Sathyaraj, actress Maria and the director discuss comically.

సినీ కార్మికుల సమ్మె పై స్పందించిన నరేష్

0

వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమ లోని కార్మికులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.అయితే సినీ కార్మికులు చేస్తున్న ఈ సమ్మె పై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు.కరోనా వల్ల గత కొన్నేళ్లుగా సినిమా పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుందని, కాస్త బాగుపడే లోగా ఇలాంటి నిర్ణయాల వల్ల మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ విషయం పైనే ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విడియోలు షేర్ చేసారు. నిన్నటి నుంచి టీవీలలో షూటింగ్ లు ఆగిపోతాయి అని ఒకటే వార్తలు మారుమోగిపోతున్నాయి అని ఆయన బాధ పడ్డారు. యూనియన్ కార్మికుల కోరికలు తీరేలా పరిశ్రమ పెద్దలు కలిసి సరైన నిర్ణయాలు తీసుకోవాలి అని,ఖచ్చితంగా తీసుకుంటారు అని ఆయన చెప్పారు.గత మూడు సంవత్సరాలుగా అన్ని పరిశ్రమల లాగే సినిమా ఇండస్ట్రీ కూడా దెబ్బతింది అని,ఆ దశలో కార్మికులు,చిన్న చిన్న ఆర్టిస్టులు తిండికి డబ్బులేక ఇబ్బందులతో పాటు వైద్యం చేయించుకోవడానికి వీలు లేక ప్రాణాలు సైతం కోల్పోయారు. పరిస్థితిలో ఈ మధ్యనే మార్పు వస్తుంది, మన తెలుగు సినిమా పరిశ్రమ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు.మనందరి దగ్గర డబ్బులు దండిగా లేకున్నా,కనీసం కడుపు నిండుతుంది కదా అని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ సమ్మె గురించి నిర్మాతలు,దర్శకులు ఆయనకు ఫోన్ చేశారని నరేష్ చెప్పారు.ఇప్పటికే కరోనా వల్ల నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు అని,వడ్డీలు కట్టలేని పరిస్తితి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారని,ఇలాంటి సమయంలో తొందర పడకుండా ఫెడరేషన్,నిర్మాతలు ఒక వారం లేదా పది రోజులలో కలిసి నిర్ణయానికి రావడం పెద్ద కష్టమేమీ కాదని, చివరిగా ఒక ఇండస్ట్రీ బిడ్డగా తను ఈ సమస్య పరిష్కారం కొరకు ఏం చేయడానికి అయినా సిద్ధమని, మనం దరం కలిస్తేనే ఒక కుటుంబం అని, సినీ పరిశ్రమ మళ్ళీ అంధకారం లోకి వెళ్లకుండా పెద్దలందరూ కలిసి మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని నరేష్ అభిప్రాయపడ్డారు.

నారప్ప తో ఖిలాడి అంటున్న అడ్డాల

0

2008 లో వచ్చిన “కొత్త బంగారు లోకం”తో ప్రేక్షకులకి పరిచయమైన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. తొలి చిత్రంతోనే చక్కని అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అడ్డాల ఆ తరువాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ల కలయికలో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం తో ఆశ్చర్య పరిచాడు.ఇద్దరు స్టార్ హీరోలతో చాలా సున్నితమైన కుటుంబ కథా చిత్రం తీసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. మాస్ ఎలిమెంట్స్ ఏవీ లేకపోయినా మహేష్ క్యారెక్టర్ ను ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దిన విధానం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు మరోసారి శ్రీకాంత్ అడ్డాల ఇద్దరు హీరోలతో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.విక్టరీ వెంకటేష్ – మాస్ రాజా రవితేజల కలయికలో ఆ సినిమా వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్,ఇతర సాంకేతిక వర్గం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇప్పుడు తరువాత నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ ను పరిచయం చేస్తూ తీసిన “ముకుంద” సినిమా అనుకున్నంత స్థాయిలో ఆదరణ పొందకపోయినా, పాటలు మరియు కొన్ని సంభాషణలకు పేరు వచ్చింది.ఆ తరువాత మహేష్ బాబు తోనే మళ్ళీ జోడీ కట్టి తీసిన “బ్రహ్మోత్సవం” తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. కేవలం బాక్స్ ఆఫీస్ కాకుండా సినిమాలో ఉన్న పాత్రలు,సంభాషణలు, కథ,కథనం ఏవీ ప్రేక్షకులకు నచ్చకపోగా చాలా వరకు అసలు అర్థం కాకుండా సినిమా ఉందనే టాక్ ను తెచ్చుకుంది.

స్వతహాగా సాప్ట్ నేచర్ ఉండే పాత్రలు, నేపథ్యాలు ఎంచుకునే అడ్డాల కి గ్రామీణ వాతావరణం ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల యాస,అక్కడి మనుషుల మీద మంచి అవగాహన ఉంది. అయితే ఒక దర్శకుడుగా అవి మాత్రమే సరిపోవు కదా. సినిమాలో బలమైన కథ లేదా పాత్రలు ఉంటేనే అది ప్రేక్షకులను ఆకట్టుకునే వీలుంటుంది. తన అభిరుచుల తో పాటు దర్శకుడిగా సినిమా,రచన పై ఉండాల్సిన పట్టు కోల్పోవడం వల్ల అడ్డాల ఆ తరువాత చాలా రోజులు సినిమాకే దూరమయ్యారు.ఆరేళ్ల తరువాత అడ్డాల దర్శకత్వం వహించిన సినిమా “నారప్ప”, ఇది తమిళంలో వచ్చిన “అసురన్” కు రీమేక్. కరోనా వల్ల ఓటిటిలో విడుదల అయిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. దీంతో ఇంక అడ్డాల మళ్ళీ ఫామ్ అందుకోవటం కష్టమే అనే అభిప్రాయం ఏర్పడింది.ఇప్పుడు తాజాగా ఇద్దరు హీరోలను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అడ్డాల ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

NTR Koratala film is delayed again

0

It is known that a movie (NTR30) is coming in the combination of NTR and Koratala Siva. The film coming out on a pan-India level. Fans have been eagerly waiting for the movie to hit the sets from time to time. However, it seems that the film may not go on the sets as soon as possible.

In the past, the film Janata Garage came in a combination of these two and had success. This is the second collaboration after the Janata garage. So the fans are dying to see their demigod in a new avatar. After the RRR’s success, NTR is very careful about the stories and the scenes. So the team wants to go to the sets only after the script correction. In this order, it seems that the film is likely to go on the sets in August. It is known that the team has recently released a special video for the film on the occasion of NTR’s birthday. The video impressed netizens. The dialogues in this video are interspersed.

Until recently, there was a talk that Alia Bhatt would be the heroine. However, she is currently married to her boyfriend and is quite busy. With this, the team is approaching Rashmika Mandanna in her place. An official announcement will be made soon. Leading Tamil music director Anirudh Ravichander is composing the music for this film. NTR Arts and Yuvasudha Arts will co-produce the film. Mikkilineni Sudhakar is becoming a producer with this film.

The film will be followed by another Pan Indian project with Prashanth Neel. The film will be produced by Mythri Movie Makers. Currently, Prashant is busy with Salaar.

Three Festivals three releases is Chiranjeevi’s plan and strategy

0

Megastar Chiranjeevi returned to films with Khaidi 150 in 2017 again as a full fledged hero. Fans celebrated his re entry in a gran way. Then Chiranjeevi worked on periodic film Sye raa Narasimha Reddy with director Surender Reddy. The film released in 2019. Later due to Covid his film with Koratala Siva delayed and released in 2022. So the pace is slow after reentry due to covid and other reasons. But now Chiranjeevi have three films in hand getting ready for release.

Chiranjeevi is working on three movies now. His film with Mohan Raja “Godfather” has completed it’s shoot and in post production works. With director KS Ravindra Waltair veerayya is on floors now. After many rumours his film with Meher Ramesh Bhola Shankar is also in shooting stage.

Totally Chiranjeevi has 3 movies lining up for release. Megastar is planning to release the three for the three upcoming festivals. His next is planning for Dussera this year and one for Sankranthi next year and one for Ugadi next year. But the order is not decided yet. Chiranjeevi is still thinking about which film has to release first and plan the other two. Let’s wait for Chiru’s triple bonanza. 

మూడు పండగలకు మూడు సినిమాలు అంటున్న మెగాస్టార్

0

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఇక ప్రస్తుతం మెగా అభిమానులందరూ మెగాస్టార్ తదుపరి సినిమాల పైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.

మోహన్ రాజా డైరెక్షన్లో చిరంజీవి గాడ్ ఫాదర్ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ అనే సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించనున్నారు అని వినికిడి,అలాగే ఒరిజినల్ లో పృథ్వీరాజ్ పోషించిన పాత్రను తెలుగులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. చిరంజీవి,సల్మాన్ ఖాన్ పై ఒక అద్భుతమైన డాన్స్ నంబర్ సినిమాలో ఉంటుంది అని గట్టి ప్రచారం జరిగింది, అయితే ఆ పాటకు సంభందించిన షూటింగ్ ఇంకా జరగలేదు.

ఇక మరో సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో రానున్న భోళా శంకర్. ఇది తమిళ చిత్రం వేదాలమ్ (2015) కి రీమేక్. ఇందులో హీరోయిన్ గా తమన్నా, చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు.మరో చిత్రం బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా. అధికారికంగా ఈ చిత్రానికి టైటిల్ ఏదీ ఖరారు కానప్పటికీ “వాల్తేరు వీరయ్య” అనే టైటిల్ ప్రచారంలో ఉంది.ఈ మూడు సినిమాల్లో దాదాపు షూటింగ్ అంతా పూర్తి అయిన సినిమా గాడ్ ఫాదర్, ముందుగా చెప్పుకున్నట్టు కేవలం ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉంది. ఇక భోళా శంకర్, వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు కూడా యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.

ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే వీటిలో గాడ్ ఫాదర్ మొదటి సినిమాగా రిలీజ్ అయి, సంక్రాంతికి భోళా శంకర్, ఆ తరువాత వేసవి కాలంలో వాల్తేరు వీరయ్య రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అని వినిపించింది.అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం తన ఆలోచనలు చిరంజీవి మార్చుకున్నట్లు తెలుస్తుంది. స్ట్రెయిట్ సినిమా అయిన వాల్తేరు వీరయ్య ను దసరా కానుకగా విడుదల చేసి, గాడ్ ఫాదర్ ను సంక్రాంతికి, ఆ పై ఉగాదికి భోళా శంకర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇవేవీ కూడా అధికారికంగా ప్రకటించలేదు, వీటిలో మళ్ళీ ఒక సినిమా అటు ఒక సినిమా ఇటు అయ్యే అవకాశాలూ లేకపోలేదు అంటున్నారు. మరి మెగాస్టార్ తన అభిమానులకి ఏ పండగకి ఏ సినిమా అందిస్తారో తొందరలోనే తేలిపోతుంది.