Home Blog Page 2091

లైగర్ ప్రి రిలీజ్ బిజినెస్: రికార్డు స్థాయిలో బిజినెస్ జరుపుకున్న లైగర్

0

క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, లేటెస్ట్ సెన్సెషన్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తుంది. కేవలం ట్రైలర్ లాంచ్ నే ఒక విజయ సభ స్థాయిలో జరుపుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

లైగర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతున్నదంటే..లైగర్ థియేట్రికల్ ప్రి రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు నైజాం హక్కులు ఏకంగా 72 కోట్ల మేరకు జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇది అసలు టైర్ 2 హీరోల లీగ్ లోనే అల్ టైం రికార్డ్ గా చెప్పుకోవచ్చు.

ఇక ఉత్తరాదిలో హిందీ వెర్షన్ తాలూకు హక్కులు కూడా భారీ రేటుకే అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ఈ సినిమా హిందీ హక్కులు 25 కోట్ల వరకూ అమ్ముడు పోయిందని ట్రేడ్ వర్గాల భోగట్టా. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కెరీర్‌ లోనే ఈ బిజినెస్ ఓ రికార్డుగా అనుకోవచ్చు. ఈ సినిమాకి జరుగుతున్న బిజినెస్ చూసి ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అయ్యాయట.

ఇక మిగతా దక్షిణ రాష్ట్రాలైన కర్ణాటక, తమిళ నాడు మరియు కేరళ హక్కులు కలిపి దాదాపు 15 కోట్లకు అమ్ముడవగా, ఆ పైన ఓవర్సీస్ హక్కులు 10 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ సినిమా ఓవరాల్‌ బిజినెస్ 100 కోట్ల మ్యాజిక్ ఫిగర్ గా నమోదైంది. ఇదీ ఒక రికార్డుగా చెప్పుకుంటున్నారు.

ఇక లైగర్ ఓటీటీకి సంబంధించిన హక్కులు కూడా భారీ రేట్లకు ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.ఈ సినిమా డిజిటిల్ రైట్స్‌ను 65 కోట్ల భారీ ధరకు డిస్నీ+హాట్‌స్టార్ దక్కించుకుందట. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం యొక్క హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడు పోవడం ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక శాటిలైట్ హక్కులను తెలుగు టివిలో టాప్ ఛానెల్ గా ఉన్న స్టార్ మా సొంతం చేసుకున్నట్లు సమచారం.

భారీ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ జరుపుకున్న లైగర్ సినిమా బ్రేక్ ఈవెన్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలవాలి అంటే దాదాపు 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద లక్ష్యం అయినా, ఈ సినిమాపై భారీ అంచనాలు మరియు క్రేజ్ ఉండటం, అలాగే ప్యాన్ ఇండియా రిలీజ్ కానుండటం వల్ల ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఆ పైన లాంగ్ రన్ రావాలి అంటే టాక్ బాగుండాలి. ఆగస్ట్ 25న విడుదల కాబోతున్న ఈ సినిమా.విడుదల తరువాత ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Thank You Movie Planning Paid Premieres In Main Stations

0

With only one day left for the release of Naga Chaitanya’s Thank You movie, there seems to be a minimal buzz for the film. As of now, the advance bookings are weak in most territories including the overseas regions.

The team is planning to conduct early premiere shows in the main stations to spread the word of mouth from the audiences. This is an excellent promotional strategy by the makers as the bookings are very low currently. If the word of mouth is good from the Thursday premieres, a good opening day is on the cards.

The makers have planned for premiere shows in the main regions. They will be showcasing the film in Vizag, Rajahmundry, and Vijayawada today night. If the movie strikes the right chord with audiences, then word of mouth will ensure that the movie gets a solid opening weekend run.

Naga Chaitanya has been doing experimental roles lately and Thank You is no exception. It is clear from the trailer that Thank You is not a regular commercial drama. It is a story about the self-discovery of a man.

Thank You also stars Raashi Khanna, Malavika Nair and Avika Gor in lead roles. Vikram K Kumar is the director of the movie and Dil Raju is the producer of the film. Thaman S is the music director of the film. It is releasing in theatres on 22nd July.

More Than 10 Crores Loss Just Because Of Megastar Chiranjeevi’s One Wrong Decision

0

In the past, we have seen how movies get totally sidetracked just because of the involvement of a star actor. Once the actor demands for changes in the script, the director has no option but to agree. But nowadays, this trend has changed and actors usually don’t make changes.

Before the commencement of Acharya’s shooting, Koratala had made it very clear. He told Chiranjeevi about the script of Acharya very clearly. He said that there will be no heroine for Chiru as well. But, Chiranjeevi was adamant on having a heroine and brought in Kajal. He even wrote a few scenes for Kajal and him.

Owing to the changes made by Chiranjeevi, the team agreed to the non-theatrical rights keeping Kajal in mind as the main lead actress. But after watching the rushes of the scenes with Kajal and Chiranjeevi, Koratala was extremely unhappy with the output and decided to remove her character completely.

Perhaps that was the best decision but due to the theatrical failure of Acharya, the non-theatrical rights have now been affected. The buyers started reducing the amount stating that the rights were bought keeping Kajal in mind. Due to Chiranjeevi’s decision, more than 10 crores have been lost.

Liger Trailer Launch Event: India Will Shake On August 25th Says Vijay Deverakonda

0

The trailer of Vijay Deverakonda’s Liger was launched in a grand manner today at Hyderabad’s Sudarshan theatre, with thousands of Vijay fans gracing the event. The trailer of Liger has blown up on the internet and has amassed 3M+ views in just 1 hour across all languages.

Vijay said that even though he is an outsider in the film industry, the audiences have showered him with love. He also spoke about how he still receives support from his fans even though his last venture World Famous Lover was a failure at the box office. “You guys are celebrating the launch of the Liger trailer like a festival,” he added.

“All I can say is I.. I.. Love… You, I… Love… You. As I promised earlier, India will shake on August 25th” he concluded. It is common for heroes to make huge promises and talk about their fans during such events but this alone is not enough.

The trailer of Liger has been getting mixed responses, if not negative. There seem to be more negatives than positives in the film. Vijay looks amazing in the trailer and his body is ripped but, is that enough?

The dialogues in the film seem lazy, the stammering seems unnatural and most of the scenes come across as unnecessarily loud. In addition to that, director Puri Jagannadh is not in the best of form. His only hit in the last decade is Ismart Shankar, which was critically bashed as well.

However, this is just the trailer and one cannot judge a book by its cover. The film also stars Ananya Pandey, Ramya Krishna, and Mike Tyson in a cameo. Puri Jagannadh has also produced the project along with Karan Johar and Hiroo Yash Johar.

Liger Business Is Shaking The Industry Heroes And Trade

0

Vijay Deverakonda’s Liger is a month away from release and is already stirring up the industry and trade circles. Day by day the hype about the film is increasing to greater heights. Just today, the trailer of the film was launched in a grand manner at Sudarshan theatre in Hyderabad with thousands of fans attending the event.

Liger’s business is shaking the industry heroes and the trade circles. Liger’s Telugu version business has been closed at a whopping 72 crores. It is also important to mention that this is only in India. The overseas business will add a lot more revenue. It is also being reported that the Telugu version has been bought by a very notable distributor.

However, the agreements have not been done yet and they will be completed in the coming days. A few terms and conditions still need to be added to the agreement. This is an all-time record business for a tier-2 hero, a 72-crore business for just the Telugu version has never been seen before for a tier-2 hero.

If everything goes to plan, Liger is on track to become a career-changing movie in Vijay’s filmography. Liger is releasing in Hindi, Telugu, Tamil, Kannada as well as Malayalam. It also stars Ananya Pandey, Ramya Krishna, and Mike Tyson in a cameo. Puri Jagannadh is the director of the film.

భారీ స్థాయిలో తెరకెక్కనున్న అడవి శేష్ సీక్వెల్

0

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు అడవి శేష్. కేవలం నటుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయన తన ప్రతిభను చక్కగా నిరూపించుకున్నారు. ఆయన ఒక సినిమా చేస్తున్నారు అంటే ప్రేక్షకుల్లో తప్పకుండా ఆ చిత్రం పై మంచి ఆసక్తి కలిగి ఉంటుంది. ఆ విధంగా మొదటి సినిమా నుండి మొన్నటి మేజర్ వరకు నటుడిగా విభిన్న కాన్సెప్ట్ లతో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు అడవి శేష్.

ప్రస్తుతం శేష్ హిట్ 2 సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం మొదటి భాగంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంతో పాటు అడివి శేష్ మరో సీక్వెల్ లో నటిస్తున్నారు. ఆ సినిమానే గూడచారి 2 కాగా ఈ సినిమా గురించి ఇటీవల మీడియాతో మాట్లాడిన శేష్, నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే జరుగుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారని, ఆ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు.

అయితే ప్రస్తుతం తన మనసులో ఉన్న ఒక లైన్ ని పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా మార్చే ప్రయత్నంలో ఉన్నట్లు శేష్ తెలిపారు. అంతే కాకుండా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న గూఢచారి-2 సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లుగా ఆయన చెప్పారు.

తప్పకుండా గూఢచారి 2 అందరి అంచనాలను అందుకునే విధంగా తెరకెక్కించేలా తాను, తన టీమ్ కష్టపడుతోందని చెప్పారు శేష్. శశికిరణ్ టిక్కా దర్శకత్వంలో వచ్చిన గూఢచారి సినిమా 2018లో ప్రేక్షకుల ముందు వచ్చి అటు విమర్శకుల ప్రశంసలని ఇటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను సాధించి విజయం సాధించింది. ఇందులో రా ఏజెంట్ గోపి పాత్రలో కనిపించారు అడివి శేష్.

మరి త్వరలో తెరకెక్కనున్న గూఢచారి 2 పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను అడవి శేష్ అండ్ టీమ్ అందుకుంటుందో లేదో చూడాలి. కాగా ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Vijay Devarakonda: లైగర్ రిలీజ్ తో ఇండియా షేక్ అవుతుందన్న విజయ్

0

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం లైగర్. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలను మమ్మురం చేశారు చిత్ర బృందం.

తాజాగా ఈ రోజు ఉదయం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే, దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు నిర్మాత కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ (లైగర్ మూవీ టీం) తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

అయితే ట్రైలర్ రిలీజ్ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.విజయ్ మాట్లాడుతూ.. రెండేళ్లు అయ్యింది నా సినిమా రిలీజ్ అయ్యి, నా చివరి చిత్రం పెద్దగా చెప్పుకునే సినిమా కూడా కాదు. ఇన్ని రోజుల తర్వాత వస్తుంటే ట్రైలర్ కు ఈ రచ్చ ఏందిరయ్యా.. అన్నారు విజయ్. అలాగే లైగర్ చిత్రాన్ని తన అభిమానులకు అంకితం ఇస్తున్నట్లు ఆయన బావోద్వేగంగా మాట్లాడారు.అలాగే తనకి డాన్స్ అంటే చిరాకు అని, అయినా కేవలం అభిమానుల కోసం చేశానని ఆయన అన్నారు. రేపు మా మావాళ్లు గర్వంగా చెప్పుకోవాలి అనే భావనతోనే డాన్స్ చేశానని అన్నారు. ఇక ఆగస్టు 25న లైగర్ రిలీజ్ అయ్యాక ఇండియా షేక్ అవడం పక్కా. అప్పుడు కూడా ఇదే రేంజ్ లో సెలబ్రేషన్స్ జరుపుకుందాం అని విజయ్ అభిమానులను ఉద్దేశించి అన్నారు. ఈ క్రమంలో సినిమా ట్రెయిలర్ లో లాగే నత్తితో మాట్లాడుతూ ఐ లవ్ యూ అని చెప్పారు విజయ్. అదేవిధంగా 25న ‘ఆగ్ లాగా దేంగే’ అన్నారు విజయ్ .ఈ సినిమాకి ప్రమోషన్స్ చేయడం లేదు అన్నారు కానీ పూరిగారి స్టైల్ లో చెప్పాలంటే.. ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా..? అని పోకిరి సినిమా డైలాగ్ కూడా చెప్పారు విజయ్.

ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ భారత సినీ చరిత్రలో పెద్ద స్టార్ అవుతాడు అని చెప్పారు. అలాగే నిర్మాత కరణ్ జోహార్ ను ఇక్కడకి పిలుచుకు వచ్చింది కేవలం ట్రైలర్ లాంచ్ కోసం కాదని, మన తెలుగు వాళ్ళ సినిమా పిచ్చి, అభిమానం ఎలా ఉంటుందో చూపించడానికి అని పూరి జగన్నాథ్ చెప్పారు.

కాజల్ లేక పోవటం వలన 10 కోట్లు నష్టపోయిన ఆచార్య

0

దర్శకుడు కొరటాల శివకి ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలవటం పెద్ద తల నొప్పిగా మారిన సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్లు, బయర్ల సెటిల్మెంట్ ల సమస్య దాదాపు రెండు నెలల పాటు రకరకాల పుకార్లు మరియు వివాదాల మధ్య సాగింది. ఇక ఆ సమస్య తీరిందని ఊపిరి పీల్చుకునే లోపే మరో చిక్కు వచ్చి పడింది.

శ్రీమంతుడు, జనతా గారేజ్, భరత్ అనే నేను.. ఇలా వరుస హిట్లతో ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే స్టార్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నారు కొరటాల శివ. సమాజంలో ఉన్న పలు సమస్యలను, పరిస్థితులను కమర్షియల్ ఫార్ములాతో మిళితం చేసి తనదైన శైలిలో సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. అయితే దాదాపు ఐదు సంవత్సరాలుగా ఆయన పెంచుకున్న ఇమేజ్.అంతా ఒక్క ఆచార్య సినిమాతో తుడిచి పెట్టుకు పోయినట్టయింది.

నిజానికి కొరటాల ముందుగా రాసుకున్న ఆచార్య కథలో కాజల్ పాత్రకు చోటు లేదట. కమర్షియల్ టచ్ కావాలనుకున్న మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ తో ఉన్న సీన్లు కొన్ని తనే రాయించి అవి కథలో పెట్టాలని కొరటాలని కోరారట. పెద్ద హీరో కాబట్టి ఆయన చెప్పింది కాదనలేక కొరటాల ఆ సీన్లను సినిమాలో ఎలాగోలా అతికించి షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇక ఎప్పటికప్పుడు షూటింగ్ వివరాలు సోషల్ మీడియాలో షికార్లు కొడుతూనే ఉన్నాయి కాబట్టి కాజల్ సినిమాలో ఉండటం ఖాయమే అనుకున్నారు అందరూ. అయితే సినిమాలో కాజల్ హీరోయిన్ గా ప్రేక్షకులతో పాటు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుదారులు కూడా నమ్మారు.

తీరా సినిమా అయిపోయాక రషెస్ చుసిన కొరటాలకి కాజల్ సీన్లు అసలు నచ్చకపోవటంతో అవి ఎడిట్ చేసి ఫైనల్ కట్ లో ఒక్క సన్నివేశం కూడా లేకుండానే సినిమా రిలీజ్ చేసారు. ఇదే ఇప్పుడు కొరటాలకి సమస్య గా మారింది.

ఆచార్య సినిమా ధియేటర్ల వద్ద ఘోరంగా పరాజయం పాలయింది. ఆ సినిమా పంపిణీదారులకి నష్టాలలో కాస్త తిరిగి ఇవ్వాల్సిన పరిస్తితి రావడంతో.. డిజిటల్ హక్కుల ద్వారా ఆ డబ్బుని సర్దుబాటు చేశారు. అయితే ఆ క్రమంలో డిజిటల్ హక్కుదారులు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వలేదని సమాచారం. అగ్రిమెంట్ జరిగిన సమయంలో సినిమాలో కాజల్ ఉంది అని చెప్పిన సాకును చూపిస్తూ.. ఇప్పుడు సినిమాలో కాజల్ లేదు కాబట్టి ముందు ఇచ్చిన అడ్వాన్స్ నే ఫైనల్ అమౌంట్ నే మొత్తం సెటిల్మెంట్ కింద పరిగణించాలని కొరటాలకి షాక్ ఇచ్చారు డిజిటల్ హక్కుదారులు.

మొత్తానికి మెగాస్టార్ చేసిన మార్పులు చేర్పుల వల్ల, సినిమా మేకింగ్ లో దొర్లిన ఒక చిన్న తప్పిదం వల్ల కొరటాలకి 10 కోట్ల పైనే నష్టం వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక కొరటాల తదుపరి చిత్రం జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో అయినా కొరటాల ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అనుకున్నది అనుకున్నట్టు తీసి విజయం సాధించాలని ఆశిద్దాం.

లైగర్ – సాలా క్రాస్‌బ్రీడ్ ట్రైలర్ రివ్యూ

0

యువ స్టార్ హీరో హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “లైగర్”. ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఒక చాయివాలా నుండి బాక్సర్‏గా ఎదిగిన పాత్రలో విజయ్ కనిపించనుండగా.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తున్నారు. అలాగే ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తుండటం విశేషం.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) కు చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది.ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 21న అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించారు. ఆ పోస్టర్ తోనే సినిమా చూడాలి అన్న ఆతృత పెంచేశారు అని చెప్పవచ్చు.

ఇక అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన లైగర్ ట్రైలర్ వచ్చేసింది. ముందుగా చెప్పుకున్నట్టు విజయ్ ఇందులో బాక్సర్ గా కనిపిస్తున్నారు. ఇక ట్రైలర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ సన్నివేశాలు.. సినిమాలో ఫైట్ లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి ఊహించే విధంగా ట్రైలర్ ను కట్ చేయడం జరిగింది. ఇక హీరో తల్లిగా రమ్యకృష్ణ పక్కా మాస్ రోల్ లో కనిపిస్తున్నారు. హీరోయిన్ అనన్య పాండే తన అందాలతో కనువిందు చేయగా.. ట్రైలర్ చివరలో “నువ్వు ఫైటర్ వి అయితే మరి నేనెవరిని” అంటూ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కనిపించడం విశేషం.

భారీ అంచనాలతో విడుదల కాబోతున్న లైగర్ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సారథ్యంలో ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Thank you movie: థాంక్యూ సినిమా సెన్సార్ మరియు ప్రీమియర్ షో డిటైల్స్

0

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “థాంక్యూ”. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. సెన్సార్ బోర్డు నుంచి కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ సినిమా యూ/ఎ సర్టిఫికెట్‌ పొందింది. సినిమా నిడివి కూడా ఖరారు అయింది. సినిమా నిడివి 2 గంట‌ల 9 నిమిషాలకు రంగరించారు. పక్కా ఫీల్ గుడ్ సినిమాగా వస్తున్న ఈ చిత్రం ఈ శుక్రవారం అంటే జులై 22న థియేటర్లలో విడుదల కానుంది.


ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య,  సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా కనిపించనున్నారు. అదీ కాకా ఈ చిత్రంలో హీరో పాత్ర మూడు కోణాల్లో సాగుతుందని, ఆ పాత్రలో నాగ చైతన్య అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. రాశీ ఖన్నా, అవికా గోర్‌, మాళవిక నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. స్వతహాగా తన సినిమాల్లో  స్క్రిప్ట్ విషయంలో ఆయన పాలు పంచుకుని తనదైన ఐడియాలతో సినిమాని విజయవంతం చేయడంలో తన వంతు కృషి చేస్తూ ఉంటారు. థాంక్యూ సినిమాకి కూడా అదే విధంగా ఆయన చేసినట్లు తెలుస్తోంది. అందుకే మొదట్లో ఈ చిత్రానికి దాదాపు మూడు గంటలు ఉన్న నిడివిని ఒక 40 నిమిషాల వరకూ కుదించారని సమాచారం.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రంలో తన నటనకు అత్యుత్తమ ప్రశంసలు అందుకున్నారు నాగ చైతన్య. సాయి పల్లవి లాంటి అద్భుతమైన ప్రతిభ గల నటితో పోటీ మెప్పించడం సామాన్యమైన విషయం కాదు. ఇక ఆ తరువాత ఈ ఏడాది సంక్రాంతికి తన తండ్రి కింగ్ నాగార్జునతో కలిసి బంగార్రాజు వంటి  సూపర్ హిట్ సినిమాను అందించారు నాగ చైతన్య. ఆ సినిమాతో పండగ పూట పసందైన పల్లెటూరు వినోదాన్ని అందించి ప్రేక్షకులను అలరించారు.


అయితే చిత్రం విడుదల తేదీ దగ్గరకి వస్తున్నా, థాంక్యూ సినిమాకి అనుకున్నంత స్థాయిలో ఆన్లైన్ బుకింగ్ జరగట్లేదు. దీనికి కారణం చాలా ఆలస్యంగా బుకింగ్స్ ఓపెన్ అవడం కూడా అనచ్చు. ఇక ఈ కారణం చేత చిత్రానికి మరింత హైప్ తెప్పించడానికి గురువారం అంటే జూలై 21 రాత్రి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేయనున్నారని సమాచారం.


ఇక జూలై 22న థాంక్యూ విడుదల తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డా మూవీలో కూడా కీలక పాత్రలో నటించారు నాగ చైతన్య. ఆ సినిమా ఆగస్టు 11న థియేటర్స్‌లోకి రానుంది. ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక.. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు సినిమాను ఒకే చేశారు. ఈ సినిమాలో చైతన్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని టాక్. ఇవే కాక అటు పైన  పరశురామ్‌, తరుణ్‌ భాస్కర్‌ వంటి దర్శకులతో కూడా నాగ చైతన్య సినిమా చేయనున్నారని తెలుస్తోంది.