Home Blog Page 2086

Officer For Nagarjuna, Thank You For Naga Chaitanya

0

The Film Industry is the most volatile industry that exists. One Friday can make or break the fortunes of actors, directors, producers, and so on. Therefore, hits and flops are very common for actors and it usually gets overcomes with the next movie.

But there are some movies that become industry disasters. Perhaps Nagarjuna’s Officer is a prime example of that. It is the biggest disaster in his career and the film hardly even collected any shares. At that point, no one wanted to take Ram Gopal Varma seriously and the film was a complete loss venture.

Now, the same thing is happening with Naga Chaitanya’s Thank You movie. If the calculation is done purely on the basis of shares, there are hardly any collections in shares for the movie. The film is expected to have deficits for the 1st week, which is a horror for all parties involved.

In fact, a few theatres are already running in deficits on the 1st weekend itself. this was the same case with Nagarjuna’s Officer, which ran on deficits from the 1st week and crashed at the box office. After Thank You’s disastrous run, Naga Chaitanya will need to deliver a huge blockbuster to come out of the result of this movie.

Naga Chaitanya needs the magic of something like a Love Story to bring him back up the ladder once again.

Ravi Teja’s Ramarao On Duty Pre-release Business Details

0

Ravi Teja is one such actor who has little to no haters. He is very lovable and shares a great connection with the audience. Being an outsider and still achieving the star hero range is something very few people can boast about and Ravi Teja is one among them. Yet, he chooses to remain humble and not talk about his successes.

While Ravi Teja has mostly tasted success in his career, one cannot but notice the pattern of his movies. Every time the actor scores a hit, he reverts back to back-to-back flops. In 2021, Krack performed exceedingly well at the box office but in 2022, Ravi Teja followed it with the extremely underwhelming Khiladi.

He is now back once again with Ramarao On Duty and things seem to be better. The trailer of the film has been received very well by the audiences. The talk about the film is mostly positive and fans are eager to witness the film in theatres.

The film has done decent pre-release business as well. The Nizam rights have been sold at 5.5 crores while Ceeded stands at 3.2 crores. The Andhra area has been sold at 7-7.5 crores. Overall, the Telugu states business is valued at 16 crores and the worldwide valuation is at 18 crores.

The film is releasing this week on 29th July in theatres. Apart from Ravi Teja, the film also stars Rajisha Vijayan, Divyansha Kaushik, and Venu Thottempudi among others. Sarath Mandava is the writer as well as the director of the film. Sam CS is the music director of the movie.

రెమ్యునరేషన్ వద్దు.. లాభాలే ముద్దు అంటున్న అఖిల్

0

భారీ అంచనాల మధ్య హీరోగా తెరంగేట్రం చేసిన అక్కినేని వారసుడు అఖిల్ తొలి మూడు చిత్రాల ఫలితాలు ఆయనను ఆయన అభిమానులను నిరాశ పరిచాయి. అయితే గతేడాది గీతా ఆర్ట్స్ బ్యానర్ లో దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమాతో మొదటి కమర్షియల్‌ హిట్‌ అందుకున్నారు హీరో అఖిల్‌.ఇక ఇప్పుడు ఏజెంట్‌ గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డి ఈ యాక్షన్‌ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్‌ ఇండియా స్థాయిలో అఖిల్‌ సినిమా విడుదల కానుంది.

ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం తాలూకు టీజర్‌ను చూస్తుంటే సరికొత్త స్పై థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. యాక్షన్‌ సీక్వెన్సులు హాలీవుడ్‌ రేంజ్‌లో ఉండి ఆకట్టుకోగా, ఇక అఖిల్‌ ఆహార్యం, ఆయన చెప్పిన డైలాగులు ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని నింపేలా ఉన్నాయి టీజర్ లో. ఈ సినిమాకు తమిళ పరిశ్రమకి చెందిన సంగీత దర్శకుడు హిప్‌ హాప్‌ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ పై రామబ్రహ్మం సుంకర ఈ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు.

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని నిర్మాత అనిల్ సుంకర తెలియజేశారు. ఈ సినిమాకి హీరో అఖిల్ మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి రెమ్యునరేషన్ ఏమీ తీసుకోకుండా సినిమా లాభాల్లో భాగం తీసుకోనున్నారు అని మొదటి నుంచీ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ విషయాన్ని స్వయంగా నిర్మాత అనిల్ సుంకర ధృవీకరించారు అని తెలుస్తుంది.

ఇది నిజంగా ఏజెంట్ టీమ్ చేసిన మంచి పనిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాల్లో దాదాపు అరవై శాతం బడ్జెట్ రెమ్యునరేషన్ లకే పోతుంది. ఇలాంటి సమయంలో ఇలా సినిమా లాభాల్లో భాగం తీసుకుంటే మిగతా డబ్బు సినిమా బడ్జెట్ కు కేటాయించవచ్చు. మరి ఏజెంట్ సినిమా టీమ్ తీసుకున్న నిర్ణయం ఫలించి సినిమా సూపర్ హిట్ అయి అటు అఖిల్ కు ఇటు దర్శకుడు సురేందర్ రెడ్డికి లాభాలు అందించాలని కోరుకుందాం.

అప్పుడు ఆఫీసర్ – ఇప్పుడు థాంక్యూ

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం థాంక్యూ సినిమా ఈ వారం విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం మొదటి రోజునే నెగటివ్ టాక్ ని తెచ్చుకుంది. అంతే కాకుండా మొదటి రోజు నుండి కలెక్షన్స్ పరంగా పూర్తిగా దిగువ స్థాయిలో వెళుతుంది. సరే మొదటి రోజు అంతో ఇంతో పర్వాలేదు అనిపించిన కలెక్షన్లు రెండో రోజు నుంచి మరింత దారుణంగా పడిపోయాయి.

ఇక సాధారణంగా తెలుగు సినిమాలకు మూడో రోజు ఎంతో కొంత అడ్వాంటేజ్ తీసుకుని మంచి కలెక్షన్లు రాబడతాయి. అయితే థాంక్యూ సినిమా ఆ మూడో రోజు అడ్వాంటేజ్ కూడా ఏమాత్రం ఉపయోగించుకోలేదు. చాలా సెంటర్ల లో డెఫిసిట్ లు మూటగట్టుకుని నెగటివ్ షేర్ ను తెచ్చుకోవడం గమనార్హం.

ఇలా అతి తక్కువ కలెక్షన్లతో సినిమా షేర్ ఏ రావడం గగనం అయినందున, చాలా సెంటర్లలో పర్సంటేజ్ విధానంలో థాంక్యూ చిత్రాన్ని అడిస్తున్నారు. అందువల్ల సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఆసలు షేర్ గా పరిగణించబడదు. ఇలా జీరో షేర్ సినిమాను ఇవ్వడం అక్కినేని వారికి కొత్తేమీ కాదు.

హీరో నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో 2018 లో వచ్చిన “ఆఫీసర్” చిత్రం కూడా అప్పట్లో జీరో షేర్ సినిమాగా నిలిచింది. ఇండస్ట్రీలో హిట్లు సూపర్ హిట్లు ఎలా ఉంటాయో.. ఫ్లాప్ లు మరియు భారీ డిజాస్టర్ లు కూడా ఉంటాయి. అయితే ఇలా ఒకే కుటుంబానికి చెందిన హీరోలు ఇలా జీరో షేర్ రికార్డులు తమ పేరిట మూటగట్టుకోవడం కాస్త విడ్డూరంగానూ, వారి అభిమానులకు అత్యంత బాధాకరంగా ఉంటుంది.

ఈ భారీ పరాజయం నుంచి కోలుకోవాలి అంటే నాగ చైతన్య తన తదుపరి చిత్రంతో గట్టి హిట్ నే కొట్టాలి.ప్రస్తుతం నాగ చైతన్య రెండు సినిమాలకు కమిట్ అయి ఉన్నారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్లో తెలుగు / తమిళ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్.. వీరిద్దరూ కలిసి ఇదివరకు బంగార్రాజు చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇక దర్శకుడు పరశురామ్ తోనూ నాగ చైతన్య ఒక సినిమా చేయాల్సి ఉంది.ఆ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన “లాల్ సింగ్ చడ్డా” చిత్రంలో నాగ చైతన్య ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది.

తన పై వచ్చిన పుకార్లను నిజం చేసిన సమంత

0

హీరోయిన్ సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలోని విషయాలను పక్కన పెట్టి కెరీర్ ను చక్కబెట్టే పనిలో ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటూ తన ఇమేజ్ ను స్టార్ డం ను పెంచుకుంటూ పోతున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె మొన్నటి వరకు తెలుగులో చాలా బిజీగా కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తన దృష్టిని అంతా బాలీవుడ్ ఇండస్ట్రీ పైన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక రాబోయే రోజుల్లో సమంత నుంచి చాలా పెద్ద సినిమాలే రాబోతున్నాయట.

ఇదివరకే బాలీవుడ్ యువ హీరో ఆయుష్మాన్ ఖురానా తో ఒక సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారు సమంత. అలాగే ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులలో కూడా నటించేందుకు చర్చలు జరుపుతున్నారట. అలాగే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో ఒక పెద్ద సినిమాలో కూడా నటించే అవకాశాలు ఉన్నాయి. ఇక వీటితో పాటు తాజాగా స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోలో సమంత పాల్గొన్న విషయం తెలిసిందే.

ఆ షోలో ఆమెతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా అతిధిగా విచ్చేశారు. ఈ షోలో సమంత తన వ్యక్తిగత జీవితం గూర్చీ, అలాగే హీరోయిన్ గా తనని తాను వృద్ధిలో ఉంచేందుకు ఎలా కృషి చేస్తున్నారో తెలిపారు.

ఈ రోజుల్లో ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవాలి అంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు. మనల్ని మనం మార్కెట్ కూడా చేసుకోవాలి. అది సినిమా ఇండస్ట్రీలో సర్వ సాధారణం. హీరోలు హీరోయిన్లు పబ్లిసిటీ నిమిత్తం ఒక మనిషి లేదా టీమ్ ను పెట్టుకుని వారి వారి సినిమాల గురించి మరియు వాళ్ల పనితనం గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేయడం ఒక ఫార్ములాగా దాదాపు అందరూ పాటిస్తున్నారు.

ఇదే విషయం పై సమంత కూడా నోరు విప్పారు. ఫలానా సర్వేలో ఎక్కువ పాపులర్ హీరోయిన్ గా తన పేరు వచ్చేలా చేసేందుకు గానూ తన పీఆర్ (PR) టీమ్ కు డబ్బులు ఇచ్చి పని చేయించినట్లుగా తెలిపారు. సమంత ఇలా డబ్బులు ఖర్చుపెట్టి తనని తాను మార్కెటింగ్ చేసుకుంటున్నారు అని ఇదివరకే కొన్ని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు సమంత స్వయంగా ఆ మాట చెప్పడంతో ఈ వ్యవహారం మీద కొంత మంది పాజిటివ్ గా రియాక్ట్ అయితే మరికొందరు విమర్శలు చేస్తున్నారు.

థాంక్యూ చిత్రంతో దిల్ రాజుకు తీరని నష్టాలు

0

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాత దిల్ రాజు జ‌డ్జిమెంట్ పై ఇండస్ట్రీ వర్గాలందరికీ మంచి గురి. ఆయన ఒక సినిమా కంటెంట్ ను చూసి ఫలితం ఇదీ అని చెబితే దానికి ఇక తిరుగు ఉండ‌ద‌న్న‌ది అంద‌రి న‌మ్మ‌కం. చాలా సంద‌ర్భాల్లో ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరిగింది కూడా. అయితే దిల్ రాజు ఖాతాలో కూడా కొన్ని ఫ్లాపులు ఉన్నాయి అనుకోండి. ఎందుకంటే సినిమా పరిశ్రమలో సక్సెస్ పర్సంటేజ్ అలాంటిది కాబట్టి ఎవరికయినా సాధ్య పడదు. అలాంటి కొన్ని సినిమాలు ఊహించని విధంగా ప‌రాజ‌యాల పాలవుతాయి. అయితే వాటిని దిల్ రాజు ముందే చాక చక్యంగా బిజినెస్ విషయంలో వ్యవహరించే వారు. అందువల్ల నష్టాలు కాస్త తప్పేవి. అయితే ఎంత దూరదృష్టి ఉన్నా కొన్నిసార్లు అనుభవజ్ఞులు కూడా తప్పటడుగులు వేస్తుంటారు. అలాంటి అనుభవమే దిల్ రాజుకు “థాంక్యూ” చిత్రంతో ఎదురవుతుంది.

థాంక్యూ తొలిరోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. సరే కనీసం మౌత్ టాక్ బాగుంటే తరువాత పిక్ అప్ అవుతాయి అనుకుంటే అటు రివ్యూలు సినిమాకి చాలా తక్కువ రేటింగ్ లు ఇవ్వగా, ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అంతంత మాత్రంగా వచ్చింది. తొలి రోజు వచ్చిన కలెక్షన్లు మాత్రమే పుల్ రన్ లో తొంభై శాతంగా పరిగణించవచ్చు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. చాలా సెంటర్లలో ఈ చిత్రం అప్పుడే పర్సెంటేజి రేషియోలో ఆడిస్తున్నారు అంటే కలెక్షన్లు ఎంత దారుణంగా వస్తున్నాయో అర్థం అవుతుంది. వరుసగా హిట్లు కొడుతూ కెరీర్ లో చక్కని దశలో ఉన్న నాగ చైతన్య కు ఈ సినిమా ఫలితం నిరాశను కలిగిస్తుంది. ఈ సినిమా వల్ల ఆయనకు నష్టమే తప్ప ఏ రకంగానూ లాభం చేకూరలేదు.

అక్కినేని నాగ చైతన్య హీరోగా పరిచయం అయిన జోష్ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. వాసువర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పరాజయం పాలైన సంగతి తెలిసిందే. థాంక్యూ సినిమాతో అయినా దిల్ రాజు నాగచైతన్యకు హిట్ ఇచ్చి పాత గాయాన్ని మరచిపోయేలా చేస్తారని అక్కినేని అభిమానులు ఆశించారు. అయితే వారి ఆశలపై నీళ్ళు చల్లినట్లు థాంక్యూ చిత్రం కూడా భారీ పరాజయం దిశగా పయనిస్తుంది.

దిల్ రాజు థాంక్యూ సినిమాను ముందుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారట. ఆ మధ్య ఇదే వార్త కొన్ని రోజులు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొట్టింది కూడా. అయితే మళ్ళీ ఆ ఆలోచనను మానుకుని థియేటర్లలో విడుదల చేసారట.

మహేష్ – రాజమౌళి సినిమా షూటింగ్ మరియు రిలీజ్ డేట్ వివరాలు

0

తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 మరియు ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు రెండూ కూడా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే దానికంటూ ఒక బ్రాండ్ వాల్యూ ఏర్పడింది. ఇక ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని అగ్ర హీరోలలో ఒకరైన మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తుండడం వల్ల ఆ సినిమా మరో సంచలనంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇప్పటికే రాజమౌళి ఈ సినిమా స్క్రిప్టుకు సంబంధించి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో పలు రకాల కథలను, నేపధ్యాలను పరిశీలిస్తూ చాలా జాగర్తగా మొత్తం వ్యవహారాన్ని చూసుకుంటున్నారు. అంతే కాదు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా విదేశాలలో భారీ విజువల్ స్టూడియోస్ లను కూడా సినిమా మేకింగ్ లో ఇన్వాల్వ్ చేయడానికి రాజమౌళి విదేశాలకు వెళ్లారట. అడవి నేపథ్యంలో ( Forest Adventure Backdrop) ఈ సినిమా తేరకెక్కనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తాజాగా కొన్ని వార్తలు వచ్చాయి.

ఈ సినిమా షూటింగ్ 2023 ఆగస్ట్ ముందు మొదలవుతుందని సమాచారం. మూడేళ్ల పాటు జరగనున్న ఈ షూటింగ్ లో టాకీ పార్ట్ తో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ కు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని 2026 లో విడుదల చేసే సన్నాహాల్లో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఆ మూడేళ్లలో మహేష్ పూర్తిగా రాజమౌళి దగ్గరే లాక్ అయిపోతారు అన్నమాట. ఈ చిత్రంలో అద్భుతమైన గ్రాఫిక్స్ తో పాటు కళ్ళు చేదిరే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని అంటున్నారు. రాజమౌళి సినిమా అంటేనే ఉద్వేగభరితమైన ఫైట్లకు పెట్టింది పేరు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆ విభాగంలో మరింత అత్యున్నత స్థాయికి వెళ్ళారు. మరి మహేష్ తో చేయబోయే సినిమాలో ఇంకెంత అద్భుతంగా ఫైట్లని తెరకెక్కిస్తారో చూడాలి.

విజయ్ దేవరకొండ మాటలకు బండ్ల గణేష్ కౌంటర్

0

ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు హీరో విజయ్ దేవరకొండ. అంతే కాదు తన ఎదుగుదలతో ప్రస్తుతం స్టార్ హీరోలకు ఈ రౌడీ హీరో పోటీ ఇస్తున్నారు అంటే అది అతిశయోక్తి కాదు.

ఇక ఆయన తాజాగా క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌ తో “లైగర్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. విజయ్ – పూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన మొదటి చిత్రం అయిన ‘లైగర్’ ట్రైలర్ లాంచ్ ఒక పెద్ద పండగలాగా జరిగింది. అయితే ఈ ఈవెంట్‌లో విజయ్ మాటలు సంచలనాన్ని సృష్టించాయి.విజయ్ దేవరకొండ సినీ కుటుంబానికి చెందిన హీరో కాదనే విషయం తెలిసిందే.

ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ ఆయన లైగర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘మా నాన్న ఎవరో మీకు తెలీదు. మా తాత ఎవరో మీకు తెలీదు. రెండేళ్లలో నా సినిమా ఏమీ రాలేదు. అంతకు ముందు వచ్చిన సినిమా కూడా పెద్దగా గుర్తుపెట్టుకునేది కాదు. అయినా మీ అభిమానం అలాగే ఉంది’ అంటూ ఫ్యాన్స్‌ను ప్రశంసించారు విజయ్. ఈ మాటలు అటు సోషల్ మీడియాలో.. ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా సినీ పరిశ్రమలో ఉన్న వారసుల గురించే అనే భావన అందరిలోనూ వచ్చింది.

ఇక పోతే తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టుగా ఆ తరువాత నిర్మాతగా మారారు బండ్ల గణేష్. అయితే ఆయన సినిమాల్లో నటించడం తగ్గినా, పవన్ కళ్యాణ్ చిత్ర ఆడియో ఫంక్షన్లలో తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తుంటారు, ఇతర ఈవెంట్ లలోనూ ఆయన వచ్చినప్పుడు ఏదో ఒక గోల వాతావరణం ఉంటుంది. ఎందుకంటే బండ్ల గణేష్ ఆ సమయానికి ఏది అనిపిస్తే అది మాట్లాడే రకం కాబట్టి. సీరియస్ విషయాన్ని కాస్త సెటైర్ జోడించి ఆయన వ్యాఖ్యానిస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా ఇటీవలే నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు పూరీ జగన్నాధ్‌ పై ఆయన కొడుకు ఆకాశ్ పూరి హీరోగా చేసిన “చోర్ బజార్” సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు కాస్త దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన హీరో అయిన విజయ్‌పై కూడా పరోక్షంగా సెటైర్ వేశారు.

https://twitter.com/ganeshbandla/status/1550487588976222209?t=Lwk7xL89YS9dYXrmcIW9-g&s=19

‘తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్‌లా, మహేష్ బాబులా, రామ్ చరణ్‌లా, ప్రభాస్‌లా గుర్తుపెట్టుకో బ్రదర్’ అని ట్వీట్ చేశారు బండ్ల గణేష్. ఈ ట్వీట్‌లో ఎవరి పేరును ప్రస్తావించకపోయినా.. ఇది ఖచ్చితంగా విజయ్‌ దేవరకొండ వ్యాఖ్యలకు కౌంటర్ అని చూసేవారికి అర్థమయిపోతోంది.

Hit The Second Case: కాస్త విరామం కావాలి అంటున్న అడివి శేష్

0

విభిన్నమైన కథలు మరియు పాత్రలతో ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు తీస్తూ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న నటుడు అడివి శేష్. వైవిధ్యభరిత సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఒక అభిరుచి గల నటుడిగా మంచి పేరును దక్కించుకున్నారు.

ఇటీవలే మేజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరక్కిన మేజర్ చిత్రం విశేష స్థాయిలో ఆదరణ పొందింది. ఈ చిత్రానికి ప్రచార కార్యక్రమాలను తన భుజాలపై వేసుకుని అడివి శేష్ ఆ పనులను సమర్థ వంతంగా నడిపించారు. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులకి ఈ సినిమాని స్పెషల్ ప్రీమియర్ షోలు వేసి బాగా ప్రచారం చేశారు.

ఇక ఇదిలా ఉంటే అడివి శేష్ త్వరలో హిట్ 2 సినిమా తో ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉంది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం హిట్ 2 సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి అవ్వాల్సింది. అయితే మేజర్ చిత్ర ప్రచార కార్యక్రమాలను తానే అన్నీ అయి నడిపించిన అడివి శేష్ ఆ బిజీ షెడ్యూల్ నుండి కాస్త విరామం తీసుకున్నారు.

హిట్ 2 సినిమా షూటింగ్ కు తాను ఎందుకు హాజరు అవ్వలేక పోతున్నాను అనే విషయం పై శేష్ స్వయంగా ఒక లేఖ రాశారు. అలసి పోయాను. షూటింగ్ కు కాస్త బ్రేక్ కావాలి. అందుకే హిట్ 2 ను వచ్చే నెలలో కొత్త షెడ్యూల్ కు ప్లాన్ చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.మానసికంగా మరియు శారీరకంగా చాలా అలసి పోయానని.. అందుకే హిట్ 2 నిర్మాత నాని మరియు దర్శకుడు శైలేష్ లను అడిగాను అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

అందుకు వారు కూడా ఒప్పుకున్నారని చెప్తూ, బ్రేక్ నుండి తిరిగి వచ్చాక చివరి షెడ్యూల్ లో పాల్ గొంటానని, తొందరలోనే హిట్ 2 సినిమాలోని KD పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆయన తెలిపారు.ఇక త్వరలోనే హిట్ 2 సినిమా ను పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు అడివి శేష్ . సినిమా షూటింగ్ ఇప్పటికే మెజార్టీ పార్ట్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది.

హిట్ – ఫస్ట్ కేస్ లో విశ్వక్ సేన్ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కరోనా మొదటి వేవ్ ముందు చివరి హిట్ సినిమా అదే కావడం విశేషం. థియేట్రికల్ రిలీజ్ లోనే కాకుండా ఓటీటీ విడుదల తరువాత కూడా హిట్ సినిమా నిజంగా పెద్ద హిట్ అయ్యింది. అందుకే హిట్ 2 కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పైగా ఈ ప్రాజెక్ట్ లో అడివి శేష్ నటిస్తున్న కారణంగా ప్రేక్షకులకు సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది.హిట్ సెకండ్ కేస్ ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి మొదటి భాగం స్థాయిలో రెండవ కేసు కూడా ఆసక్తిగా సాగుతుందా అనేది చూడాలి.

ఆచార్య ఫలితంతో నాకు సంబంధం లేదన్న చిరంజీవి

0

కొరటాల శివ అంటే నిన్న మొన్నటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో పేరు ఉండేది. అయితే ఒక్క సినిమాతో ఆయన పరిస్థితి తలక్రిందులు అయింది. రచయితగా ‘భద్ర, మున్నా, నిన్న నేడు రేపు, ఒక్కడున్నాడు, సింహా, బృందావనం, ఊసరవెల్లి’ వంటి విజయవంతమైన సినిమాలకు పని చేసి ‘మిర్చి’తో దర్శకుడుగా మారారు కొరటాల శివ. ఆ సినిమా ఘన విజయం సాధించి కొరటాలను స్టార్ డైరెక్టర్ ల లిస్ట్ లో చేరేలా చేసింది. ఆ తర్వాత ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను’ వంటి సినిమాలతో వరుసగా స్టార్ హీరోలతో సూపర్ డూపర్ హిట్లతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఇన్ని హిట్ సినిమాలు ఉన్న కొరటాలను ఒకే ఒక్క సినిమా అటు కెరీర్ పరంగా ఇటు ఆర్ధికంగా తీవ్రంగా దెబ్బతీసింది. అదే ‘ఆచార్య’.

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య పాత్రలో కలసి నటించిన ఈ సినిమా నిర్మాణం దాదాపు మూడేళ్ల పాటు కొనసాగింది. ఇక ఈ సినిమాకు దర్శకత్వం తో పాటు బిజినెస్ లోనూ ఇన్వాల్వ్ అయ్యారు కొరటాల శివ. అదే ఆయనను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. సినిమా రిలీజ్ అయి డిజాస్టర్ కావటంతో అన్ని ఏరియాల నుంచి కొనుగోలు దారులు నష్టపోయిన మొత్తాలను చెల్లించాలని కొరటాలపై వత్తిడి తెచ్చారు. చాలా వరకు ఈ వ్యవహారాలను పెద్ద సమస్యగా మారకుండానే సెటిల్ చేశారు కొరటాల మరియు ఆయన స్నేహితుడు సుధాకర్. అయితే సీడెడ్ ఏరియాకు సంబంధించిన వ్యవహారం మాత్రం కాస్త వివాదం అవడం.. ఎగ్జిబిటర్స్ తమ డబ్బు చెల్లించాలని కొరటాల ఆఫీస్ కు వెళ్ళి వత్తిడి చేయడం వంటి సంఘటనలతో సమస్య తీవ్రత పెరిగింది. కొరటాల నేరుగా వచ్చి హామీ ఇస్తే కానీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. అలా ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకుని ఆచార్య చిత్రం యొక్క ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేశారు కొరటాల. అయితే తాజాగా ఆయన పై మరి అభియోగం మోప బడింది.

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన “లాల్ సింగ్ చడ్డా” చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం తాలూకు తెలుగు వెర్షన్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చలకు దారి తీస్తున్నాయి.

ఇంతకీ చిరంజీవి ఏమన్నారంటే.. ” నేను ఎప్పుడూ సినిమాలు తీసెప్పుడు అవి జనాదరణ పొందాలి, జనామోదంగా ఉండాలి అని మినిమం గ్యారెంటీ సినిమాలు తీస్తుంటాను, అమీర్ అలా కాదు.. ఆయన.ప్రయోగాత్మకంగా సినిమాలు తీయడం కాకుండా ప్రేక్షకులని మెప్పిస్తూ ఉంటారు. అదే నేను అయితే ఏం చేస్తే ప్రేక్షకులు చప్పట్లు కొడతారో, శభాష్ అంటారో అలాంటి సినిమాలు చేస్తాను, కాకపోతే మధ్యలో నా ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోతుంటాయి వాటి గురించి నేను మాట్లాడదల్చుకొలేదు” అని.చిరంజీవి అన్నారు.

ఆయన అన్న మాటలు పరోక్షంగా ఆచార్య చిత్రం గురించి మరియు దర్శకుడు కొరటాల శివ గురించి అని అందరికీ అర్థం అయింది. అయితే ఇండస్ట్రీలో ఇంత సీనియర్ నటుడు మరియు హీరో అయి ఉండి చిరంజీవి ఇలా మాట్లాడటం ఏంటని ఆ విడియో చూసిన ప్రేక్షకులు అంటున్నారు.