Home Blog Page 2083

పోరుకు సిద్ధం అంటున్న బాలయ్య – అఖిల్

0

అఖండ సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి బాలకృష్ణ అభిమానులను అలరించేందుకు తదుపరి సినిమాలను భలే ప్లాన్ చేసుకున్నారు. ఇక ఆయన నుండి వస్తున్న తాజా చిత్రం NBK 107 ను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.

ఇది వరకే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ సోషల్ మీడియాలో ఏ స్థాయిలో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయం పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం జై బాలయ్య మరియు అన్నగారు వంటి టైటిల్స్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏదో ఒక టైటిల్ ను ఫైనల్ చేసి ప్రకటించాలి అని దర్శకుడు ఆలోచిస్తున్నా , ఇంకా హీరో అయిన బాలకృష్ణ నుంచి మాత్రం అందుకు అనుమతి రాలేదు అని తెలుస్తోంది.

ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. అలాగే బాలయ్య పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కూడా అదిరిపోయాయి అని ఒక టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని, మిగిలిన షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

ముందుగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని భావించినా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల అఖండ అన్నివర్శరీ రోజున రిలీజ్ చేయాలని అనుకున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ రెండు డేట్లు కాదని NBK 107 సినిమాని సంక్రాంతి పండుగకు విడుదల చేయాలని భావిస్తున్నారట.అయితే సంక్రాంతికి బాలయ్య బాబుతో పాటు అక్కినేని వారసుడు అఖిల్ కూడా తన సినిమాని విడుదల చేస్తున్నారట.

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా “ఏజెంట్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారు. హీరో అఖిల్ 5వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా విజయం సాధించడం అఖిల్ కెరీర్ కు అత్యంత కీలకంగా మారింది.

అందుకే సరైన సీజన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు అని తెలియవచ్చింది. ఏజెంట్ సినిమా కూడా ముందుగా దసరా, దీపావళికి విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. అవేవీ కాదు క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తున్నారు అని కూడా పుకార్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ సంక్రాంతికి విడుదల చేస్తున్నారని తాజాగా వినిపిస్తుంది.

సంక్రాంతికి ఇదివరకే ప్రభాస్ నటించిన ప్యాన్ ఇండియా సినిమా ” ఆది పురుష్” వస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పాటు తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి , నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న “వారసుడు” (తమిళంలో వారిసు) కూడా విడుదల కాబోతుంది. వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా విడుదల చేస్తారని ప్రకటించినా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సంక్రాంతి రేసులో నుండి వైదొలగినట్లుగా తెలుస్తోంది.

మరో రికార్డును సొంతం చేసుకున్న కేజీయఫ్ -2

0

కేజీయఫ్ చాప్టర్ 2′ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన ‘కేజీఎఫ్’ పార్ట్ 1 కుకొనసాగింపుగా వచ్చిన ఈ భారీ యాక్షన్ సినిమా.. పాత రికార్డులన్నీటినీ బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఇటివలే ఈ చిత్రం విడుదలై 100 రోజులు పూర్తి చేసుకుంది.

కేజీయఫ్ 2′ సినిమా థియేట్రికల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 2022లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లను సాధించిన సినిమాగా ‘కేజీఎఫ్ 2’ నిలిచింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో భారతీయ సినిమాగా రికార్డు సృష్టించడం మరో విశేషం. ఈ జాబితాలో ‘దంగల్’ సినిమా మొదటి స్థానంలో ఉంటే.. రెండో స్థానంలో మన ‘బాహుబలి 2’ చిత్రం ఉంది.

ఇక భారత దేశంలో అన్ని వెర్షన్లు కలిపి ‘KGF 2’ సినిమా దాదాపు రూ. 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్ సీస్ లెక్కలను మినహాయిస్తే ఇక హిందీ మార్కెట్ లో ‘దంగల్’ వంటి చిత్రాన్ని అదిగమించి నార్త్ ఇండియాలో బాహుబలి 2 తరువాత రెండో స్థానంలో నిలిచింది .. ఓవరాల్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా కలెక్షన్స్ ను అధిగమించిందీ కన్నడ సినిమా, రాబోయే రోజుల్లో ‘KGF 2’ రికార్డులను వేరే సినిమాలు కొల్లగొట్టడం అంత తేలికైన విషయం ఏమీ కాదు.

తాజాగా కేజియఫ్ -2 ఖాతాలో మరో రికార్డు చేరింది. అదేంటంటే భారత దేశంలో మల్టీప్లెక్సులలో అతి పెద్ద సంస్థ అయిన పీవీఆర్ సంభందించిన థియేటర్లలో 124 కోట్ల నెట్ కలెక్ట్ చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ వరుసలో రెండో చిత్రంగా “ఆర్ ఆర్ ఆర్” 93.7 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని పీవీఆర్ పెట్టుబడిదారుల త్రైమాసిక సమావేశంలో తెలియజేశారు.

కేజీయఫ్’ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన ”కేజీయఫ్ 2” చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్ – రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. అర్చన జాయిస్ – ప్రకాష్ రాజ్ – రావు రమేష్ – ఈశ్వరీ రావు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.

హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. రవి బస్రుర్ దీనికి సంగీతం సమకూర్చారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ వర్క్ చేశారు. ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్ర సంస్థ విడుదల చేసింది.

అన్నదమ్ములుగా కనిపించనున్న మెగాస్టార్ – మాస్ మహరాజ్

0

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ తరువాత మూడు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో రెండు సినిమాలు రీమేక్ గా రూపొందుతున్నాయి. ఒకటి మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసీఫర్’ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు ‘గాడ్ ఫాదర్’ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా నటించిన ‘వేదాళం’ ఆధారంగా ‘భోళా శంకర్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బాబి డైరెక్ట్ చేస్తున్న మూడవ సినిమా మాత్రం స్ట్రెయిట్ సినిమాగా రూపొందుతోంది.’వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిమిస్తున్నారు. అందుకే గాడ్ ఫాదర్ మారుతూ భోళా శంకర్ సినిమాల కంటే ఈ చిత్రానికే అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. అందుకో మరో కారణం కూడా ఉంది. అదేంటంటే ఈ సినిమాలో మెగాస్టార్ తో కలిసి మాస్ మహారాజా రవితేజ నటిస్తుండటమే. ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో రవితేజ కనిపించబోతున్నారు. అయితే ఇందులో రవితేజ ఏ పాత్రలో నటించబోతున్నారు? .. ఆయన పాత్రకు చిరంజీవి పాత్రకున్న సంబంధం ఏంటీ? అన్న సందేహాలు గత కొన్ని రోజులుగా రవితేజ అభిమానులు మరియు మెగా అభిమానులలో తలకెత్తాయి.

ఇటీవలే సినిమా సెట్స్ లోకి రవితేజ అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఆ వీడియోలో చిరంజీవి కారవాన్ డోర్ ఓపెన్ చేసి చేయి అందించడం, బదులుగా రవితేజ కన్ను గీటడం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. ఆ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ లో శంకర్ దాదా ఎంబీబీఎస్ టైటిల్ సాంగ్ తో పాటు మాస్ తో పెట్టుకుంటే మడతడి పొద్ది పాట రీమిక్స్ గా రావడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటికి వచ్చింది. రవితేజ మెగాస్టార్ ల పాత్రలు ఎలా వుంటాయి. వాళ్లిద్దరి మధ్య వున్న సంబంధం ఏంటీ అన్న విషయంలో తాజాగా ఒక అందమైన పుకారు బయటికి వచ్చింది.

ఈ సినిమాలో చిరంజీవి – రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారట. ఇద్దరి తండ్రి ఒక్కడైనా తల్లులు మాత్రం వేరే అని, అలాగే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ సవతి తమ్ముడిగా కనిపించనున్నారని తెలిసింది. ఇక ఇద్దరి మధ్య మాస్ ప్రేక్షకులని ఉర్రూతలూగించేలా హై వోల్టేజ్ ఫైట్ లు మరియు సన్నివేశాలు దర్శకుడు బాబి ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ వార్త ఇద్దరి అభిమానులకు ఆనందం తెప్పించడమే కాకుండా సినిమా పై అంచనాలు భారీగా పెరగడం ఖాయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

గతంలో రవితేజ ‘అన్నయ్య’ సినిమాలో చిరంజీవి సోదరుడిగా నటించిన విషయం తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా కేథరిన్ నటిస్తున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో రవితేజ పాత్ర నిడివి దాదాపు 30 నిమిషాల పాటు వుంటుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలోని ఇతర ముఖ్య పాత్రల్లో బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్ మరియు వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా ఆర్థర్ ఏ. విల్సన్, ఎడిటింగ్ నిరంజన్ దేవరమానె, సంగీతం దేవిశ్రీప్రసాద్.

గార్గి ఓటిటి విడుదల తేదీ ఖరారు

0

తెలుగులో ఒక హీరో స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి ఇటీవలే విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే సాయి పల్లవి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక రెండు వారాల ముందు మరోసారి గార్గి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా జూలై 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. ముందు నుంచి సినిమాకు పెద్దగా ప్రచారం జరగకపోయినా, సినిమా ట్రైలర్ విడుదల చేశాక ప్రేక్షకులకి సినిమా మీద ఆసక్తి పెరిగింది.

అలాగే రిలీజ్ కు ముందు రోజు సినిమాకు ప్రివ్యూలు వేసారు. ఆ ప్రీమియర్ షో చూసిన విమర్శకులు మరియ మీడియా సినిమాకి చాలా మంచి టాక్ చెప్పారు. ఇతర మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రివ్యూలు బాగానే వచ్చాయి. అయితే బాక్స్ ఆఫీసు వద్ద సందడి మాత్రం అనుకున్నంత లేదు. కోర్ట్ రూమ్ డ్రామా, మరియు ఒక సున్నితమైన అంశంతో తెరకెక్కిన గార్గి సినిమా ఒక మంచి ప్రయత్నంగా పేరు తెచ్చుకుంది. ఇక కలేక్షన్ల పరంగానూ పరవాలేదు అనిపించుకుందీ చిత్రం.

సాయి పల్లవి నటనకు అద్భుత స్పందన లభించగా, సహాయక పాత్రలో నటించిన కాళి వెంకట్ నటనను కూడా పొగడ్తలతో ముంచెత్తారు విమర్శకులు మరియు ప్రేక్షకులు. అయితే ముందుగానే చెప్పుకున్నట్టు మనసు తట్టుకోలేని విధంగా ఉన్న కథా వస్తువు వల్ల ఈ చిత్రం జనరంజకమైన సినిమాగా ఆదరణ పొందలేకపోయింది. ఒక్కోసారి ఇలాంటి సినిమాలు రావాలి, సమాజంలో జరుగుతున్న ఘోర నేరాలను ప్రశ్నించాలి. కాబట్టి ఇతర సినిమాల లాగా కమర్షియల్ సూత్రాలలో ఈ చిత్రాన్ని కొలవడం సబబు కాదు.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ ఎప్పుడనే చర్చ కాస్త ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఈరోజుల్లో ఒక సినిమా థియేటర్లలో విడుదల అవుతున్నపుడే ఏ ఓటీటి యాప్ లో వస్తుంది అని ఆలోచించే ప్రేక్షకులు కూడా ఉన్నారు. కాబట్టి ఆ వార్తలను తూచా తప్పకుండా ఫాలో అయ్యే ప్రేక్షకులు ఓటిటి రిలీజ్ కూడా ఒక విశేషమైన వార్త లాగా చూస్తారు.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం గార్గి సినిమా వచ్చే వారం అంటే ఆగస్ట్ రెండో తారీఖు నుంచి సోనీ లైవ్ (sony liv) లో స్ట్రీమ్ అవబోతుందని తెలిసింది. మరి ఓటిటి విడుదల తరువాత సాయి పల్లవికి, ఆవిడ సినిమాకి ఇంకెంత ఆదరణ లభిస్తుందో చూద్దాం.

ధనుష్ “సార్” ఫస్ట్ లుక్

0

తమిళ యువ స్టార్ హీరో.. జాతీయ ఉత్తమ నటుడు ధ‌నుష్ .. విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన సామాన్య ప్రజలకి దగ్గరగా ఉండే పాత్రలు, వాళ్ళ జీవితాలను తెరపై చర్చించే సినిమాలు చూస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అంతే కాకుండా కేవలం తమిళంకే పరిమితం కాకుండా.. హిందీలో పలు చిత్రాల్లోనూ నటించారు.

అంతే కాకుండా ధనుష్ ఇటీవల ఏకంగా అవెంజర్స్ దర్శకులతో కలిసి ది గ్రె మ్యాన్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో అతనికి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు దక్కలేదు అనే మాట వాస్తవం. ఏదో అనుకుంటే ఇంకేదో తరహాలో కేవలం రెండు ఫైట్లు రెండు డైలాగులు పరిమితం అయింది ఆయన పాత్ర.

కానీ హాలీవుడ్ వరకు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇది ఒక విధంగా భవిష్యత్తులో వచ్చే అవకాశాలు దారి ఇచ్చినట్లే అని చెప్పవచ్చు.ఇపుడు ధనుష్ దృష్టి తెలుగు సినీ పరిశ్రమ పై పడింది.

ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ స్ట్రెయిట్ తెలుగు చిత్రంలో నటిస్తోన్న ధనుష్. దాంతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ అనే సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ రిలీజ్ గురించిన వివరాలను చిత్ర బృందం ప్రకటించింది.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో ధనుష్ టేబుల్ వద్ద కూర్చుని చీకట్లో లాంప్ వెలుతురులో ఏదో రాస్తున్నట్టు కనిపిస్తుంది. మరి అది అల్లరి మూకల పైన ఫిర్యాదు పత్రం అయి ఉంటుందా లేక ఏదైనా బలమైన సంఘటనకు సంబంధించిన కవిత్వం లేదా విప్లవ నినాదం అయి ఉంటుందా అని ఆ పోస్టర్ చూసిన ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఇక ఈ చిత్రం తాలూకు టీజర్ ను రేపు ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

తెలుగులో ‘సార్’ టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రం తమిళంలో మాత్రం ‘వాతి’ టైటిల్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగ వంశీతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమని సాయి సౌందర్య నిర్మిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Another massive record for Yash’s KGF: Chapter 2

0

Rocking Star Yash’s KGF: Chapter 2 has added another feather to its cap. The film has now become the highest all-time grosser across the PVR Cinemas franchises all over. This action thriller has collected a whopping Rs 124 crores at PVR Cinemas alone.

The second spot on this list is held by SS Rajamouli’s RRR which collected a massive Rs 93. 7 crores. These figures were revealed at PVR Quarterly Investor Update Meeting. After KGF: Chapter 2 and RRR, other notable names in this list are Bhool Bhulaiyya with Rs 47.4 crores, Dr Strange with Rs 45.8 crores, and Vikram at Rs 26.6 crores.

These numbers are another strong indicator of the pan- India appeal of the KGF brand. The film collected Rs 101.65 crores share in just the Telugu version and did a solid business in the Bollywood market as well.

KGF also recorded the highest ever tickets sold on Book My Show with 17.1 million tickets sold on the portal. This Prashanth Neel project has created another big record which only 3 Indian films have done so far. It has crossed the Rs 1000 crores benchmark at the box office. Only Bahubali 2, Dangal, and RRR have achieved this so far and it is indeed a massive moment for the entire team.

Sita Ramam is a classic like Godavari says Sumanth

0

Actor Sumanth will be next seen in Dulquer Salmaan and Rashmika Mandanna starrer Sita Ramam. The film’s trailer was released recently and has recorded 7.5 million views already. Sumanth will be seen as an Army man in Sita Ramam.

Speaking about the film, the actor said that this film is going to be a classic just like his 2006 film Godavari. Sumanth was last seen in romantic drama Malli Modalaindi early this year. While the film failed at the box office, his performance was well appreciated.

Coming to Sita Ramam, it has been directed by Hanu Raghavapudi and the trailer has received a positive response from all sections. The visuals and background music have received a special response.

Mrunal Thakur, Tharun Bhascker, Prakash Raj, Gautham Menon, and Bhoomika Chawla will also be seen in key roles in this film. Vishal Chandrashekhar has composed the music for the film and Vyjayanthi Movies and Swapna Cinema are producing it. Sita Ramam will release on 5th August worldwide.

సీతా రామం ఒక క్లాసిక్ అంటున్న సుమంత్

0

దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామం’. ‘వైజయంతీ మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకం పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లోనే కాదు ప్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న రష్మిక మందన కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడం విశేషం.


అంతే కాదు బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో సుమంత్ కూడా ఓ ప్రాముఖ్యమైన పాత్రలో కనిపించ బోతున్నారు. ఈ చిత్రంలో ఆయన లుక్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ అవ్వడం, దానికి ప్రేక్షకుల నుంచి భలే ఆసక్తికరంగా ఉంది అన్న స్పందన లభించడం జరిగింది.


ఇటివలే విడుదలైన ఈ చిత్రం తాలూకు ట్రైలర్ చూశాక సినిమాలో సుమంత్ పాత్ర ఆకట్టుకునే విధంగా తయారు చేశారు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. సీతారాముల ప్రేమ కథకి ఆయన పాత్ర ఏ రకంగా ఉపయోగ పడుతుంది అనే ఆలోచన ప్రేక్షకుల్లో వచ్చింది.

ఇక ‘ సీతా రామం’ ని తను నటించిన ‘గోదావరి’ వంటి క్లాసిక్ సినిమాతో పోల్చి అంచనాలు మరింత పెంచారు హీరో సుమంత్. 2006 లో దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వచ్చిన “గోదావరి” చిత్రం ఎంత పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


ఇప్పుడు ‘ గోదావరి ‘ చిత్రంతో ‘సీతా రామం’ ని పోల్చడంతో సుమంత్ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. సుమంత్ మాట్లాడుతూ.. ” నేను ఈ ఈవెంట్ కి చాలా క్యాజువల్ గా వచ్చేసాను. కానీ మా హీరో దుల్కర్ సూటు బూటు వేసుకొని వచ్చాడు. ఎప్పుడు.. టీ షర్ట్ లు వేసుకునే మా డైరెక్టర్ కూడా షర్ట్ వేసుకుని వచ్చాడు.


వచ్చేసారి నుండి ప్రమోషన్స్ కు నేను కూడా సూటు బూటు వేసుకొనే వస్తాను. ఇక ఈ సినిమా 150 పేజీల కథ మొత్తం చదివిన తర్వాత ‘సీతా రామం’ దృశ్య కావ్యం అవుతుంది అని నాకు అనిపించింది. గతంలో నేను ‘గోదావరి’ అనే సీతారాముల కథ చేశాను ఆ సినిమా అందరికీ గుర్తుంది కదా. ఆ సినిమా అప్పుడు క్లాసిక్ గా నిలిచింది.

ఇప్పుడు ‘సీతా రామం’ కూడా అలాగే క్లాసిక్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా పై నాకు చాలా నమ్మకం ఉంది. నేను ఇందులో చాలా మంచి పాత్ర చేశాను. ఆగస్టు 5 తారీఖు కోసం ఎదురుచూస్తున్నాను. ఇది ఖచ్చితంగా అందరూ థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఆగస్టు 5న అందరం థియేటర్లో కలుద్దాం” అంటూ చెప్పుకొచ్చారు సుమంత్.

Telugu Film Producers Guild Decides To Put Film Shoot On Hold

0

The Telugu Film Producers Guild has been taking a lot of initiative to revive the theatrical market once again. They have been conducting timely meetings to discuss various aspects as such as OTT release, remunerations of actors, ticket rates, and so on.

Just today, they let out a press note which has created quite the talk in the industry. They are planning to withhold the shooting of films from August 1st, 2022 to sit down and discuss the concerns of the industry until suitable solutions are found.

Post the COVID-19 pandemic with the changing revenue situations and increasing costs, it has become very important for the producers to discuss the issues in the industry. In the guild’s own words, “It is very important that we discuss our issues as a community.”

“It is our responsibility to better our ecosystem and ensure that we are releasing our films in a healthy environment. In this regard, all producer members of the Guild have voluntarily decided to withhold shootings from August 1st,2022.”

The industry has been going through a lot in the recent past with back-to-back disasters. This is a very proactive move from the industry and one can only hope that this leads to some change in the industry.

రెమ్యునరేషన్ల విషయంలో నిర్మాతల ఆలోచన సరైనదేనా?

0

గత కొంత కాలంగా తెలుగు సినీ నిర్మాతలు.. పరిశ్రమ ఎదురుకుంటున్న సమస్యల పై చర్చలు మరియు పలు నిర్ణయాలు తీసుకునే ఆలోచన చేస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు కరోనా వల్ల షూటింగ్ లు ఆగిపోయి నిర్మాణ వ్యయం పెరిగిపోయి నిర్మాతలు చాలా వరకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. మరో వైపు ఓటీటీల ప్రభావం పెరిగిపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే ఆలోచించే పరిస్తితి ఏర్పడటం, ముఖ్యంగా పెరిగిన టికెట్ రేట్ల కారణంగా సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావడానికి ఆసక్తిని చూపించడం లేదనే భావన అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ.. ఇటు సినీ విమర్శకులు మరియు ట్రేడ్ వర్గాల్లోనూ ఉంది.

ఇక సినిమా బడ్జెట్ ను కాస్త తగ్గించి సినిమాలు నిర్మించే ప్రయత్నం చేయాలంటే స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్ భారీగా పెంచేశారని నిర్మాతలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా సమస్యలన్నింటినీ ఓ కొలిక్కి తీసుకురావాలన్న ఆలోచనతో నిర్మాతలు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి సినిమాల షూటింగ్ లని నిరవధికంగా ఆపి వేయాలనే ఆలోచనకు వచ్చాయి.

ఈ మేరకు సోమవారం నిర్మాతల మండలి అత్యవసర భేటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ లో ఓటీటీ లో సినిమాల రిలీజ్ లతో పాటు టికెట్ రేట్ల పై అలాగే ఇతర సమస్యల పై చర్చించారట. అయితే ఓటీటీల్లో సినిమాల రిలీజ్ లపై మాత్రం నిర్మాతలు అందరూ ఏకాభిప్రాయానికి రాలేదనే వార్తలు వినిపించాయి. దీంతో 27న మరోసారి నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని తలపెట్టింది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, రెమ్యునరేషన్ అనేది అయా నటుడు లేదా హీరో.. తనతో చిత్రం నిర్మించే నిర్మాతతో చర్చించుకుని తీసుకునే నిర్ణయం పరస్పరం లాభాలు మరియు నష్టాలు లెక్కించుకుని జరిగే ఒప్పందం. దాన్ని ఇలా ఏదో ఆఫీసులో జీతాలు నిర్ణయించినట్టుగా చర్యలు తీసుకోవడం లేదా ఫలానా అమౌంట్ వరకే ఇవ్వాలి అనడం ఏమాత్రం సబబు కాదు. అది అసలు కుదరని పనిగా చెప్పవచ్చు.

ఎందుకంటే ప్రస్తుతం యువ హీరోలు కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో చిత్రాలు చేస్తున్నారు. అందుకు వారు శారీరకంగా మరియు మానసికంగా ఎంతో కష్టపడుతూ విలువయిన సమయాన్ని కూడా ప్రచార నిమిత్తం వెచ్చిస్తున్నారు. మరి ఆ కష్టానికి ధర వారు నిర్ణయించడమే సరైన పద్ధతి. ఏదైనా బేరం చేసి తగ్గించాలంటే అది సదరు సినిమా నిర్మాత చేయాలి కానీ ఇలా ఎన్ని మీటింగ్ లు పెట్టి ఎన్ని తీర్మానాలు చేసినా లాభం ఉండదు అందువల్ల జరిగే మార్పూ ఏదీ ఉండదు.