Home Blog Page 2079

Raninikanth: రాకెట్రీ సినిమాని మెచ్చిన సూపర్ స్టార్

0

ఏ సినీ పరిశ్రమలో అయినా బయోపిక్ అనేది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా. ఇప్పటికే ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలబ్రెటీల జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన పలు చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల తమిళ నటుడు మాధవన్ ప్రధాన పాత్రలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్ సినిమాను తెరకెక్కించారు. జూలై 1న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది.

తాజాగా ఈ సినిమా ఓటిటిలో విడుదల అయింది, దాంతో ప్రశంసల వెల్లువ కొనసాగుతుంది. ఎందరో ప్రేక్షకులు మరియు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా ఆ లిస్ట్ లోకిసూపర్ స్టార్ రజినీకాంత్ చేరారు. హీరో మాధవన్ పై ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా రాకెట్రీ సినిమా గురించి తన అభిప్రాయాలను ఓ స్పెషల్ నోట్ విడుదల చేశారు.

రాకెట్రీ.. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ముఖ్యంగా యువకులు. మాధవన్ దర్శకత్వంలో తన తొలి చిత్రం పద్మభూషణ్ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ పై తీయడం ద్వారా తనను తాను సమర్థుడైన చిత్ర నిర్మాతగా నిరూపించుకున్నారు. భారతదేశ అంతరిక్ష పరిశోధన కోసం పని చేస్తున్నప్పుడు వారి జీవితంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఇలాంటి చిత్రాన్ని మాకు అందించినందుకు మాధవన్ కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు సూపర్ స్టార్. అలాగే ఈ సందర్భంగా సినిమా తీసిన మాధవన్ ను, శాస్త్రవేత్త నంబి నారాయణన్ ను ఆయన సత్కరించారు.

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా హీరో మాధవన్ రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్ చిత్రాన్ని తెరకెక్కించారు. అతను సాధించిన విజయాలతో పాటు దేశం అభివృద్ధి చెందాలనే ఆశయం కోసం ఏం త్యాగాలు చేశారు, అలాగే ఆయన పై తప్పుడు ఆరోపణలు చేసి గూఢచారి కేసులో ఇరికించినపుడు ఆయన ఎన్ని అవమానాలు దిగమింగి కష్టాలు ఎదురుకున్నారు.. చివరికి తను నిర్దోషి అని ఎలా నిరూపించుకున్నాడు అనే అంశాలను రాకెట్రీ సినిమాలో చక్కగా చూపించారు. ఇందులో నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ నటించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. ఇందులో సిమ్రాన్, రవి రాఘవేంద్ర, మిషా ఘోషాల్ కీలకపాత్రలలో నటించారు.

మొదటి నుండి మాధవన్ కు నటుడుగా చక్కని పేరు ఉంది. ఎలాంటి పాత్ర చేసిన దానికి తన నటనతో ప్రత్యేకతను జోడించడం ఆయనకు ఆయనే సాటి. శాస్త్రవేత్త నంబి నారాయణన్ పాత్రలో ఆయన జీవించారంటే అది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఇక ఆయన భార్య పాత్రలో సిమ్రాన్ కూడా అద్భుతంగా నటించారు. కొన్ని సన్నివేశాల్లో వారిరివురి నటనకు ప్రేక్షకుల కళ్ళు చెమర్చేచే స్థాయిలో భావోద్వేగాలని పండించారు. ఇక ఇంత మంచి సినిమాలో అతిథి సహాయక పాత్రల్లో తమిళ నటుడు సూర్య, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించి తమ అభిరుచిని చాటుకున్నారు. తెలుగు, తమిళ వెర్షన్లో సూర్య నటించగా, హిందీ వెర్షన్లో షారుక్ ఖాన్ నటించారు.

Box – Office – జూలై తెలుగు సినిమా రిపోర్ట్

0

కరోనా ప్యాన్డేమిక్ రాక ముందు తెలుగు సినిమా మార్కెట్ ఎంతో అద్భుతంగా ఉండేది. యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా చక్కని వసూళ్లు సాధించేవి. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా తొలి మూడు రోజుల కలెక్షన్లు చాలా బాగుండేవి. వాటి వల్ల సినిమాలు ఫ్లాప్ అయినా నష్టాలు కొంత మేరకే వచ్చేవి. అయితే కరోనా వరుస వేవ్ ల దాడి తరువాత పరిస్తితి పూర్తిగా మారిపోయింది.


ఈ ఏడాది ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ విజయం తరువాత చాలా కాలం తెలుగు నుంచి హిట్ సినిమానే లేదు. F3, సర్కారు వారి పాట చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచాయి. చిన్న సినిమాగా వచ్చిన అశోక వనంలో అర్జున కళ్యాణం పరవాలేదు అనిపించింది.

ఇక జూన్ నెలలో విడుదలైన మేజర్ చిత్రం మాత్రం అందరికీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ ఏడాదిలో ఆర్ ఆర్ ఆర్ తరువాత విజయం సాధించిన ఒకే ఒక్క తెలుగు సినిమా మేజర్ కావడం విశేషం.


ఇక జూలై నెలకు వస్తే తొలి వారం గీతా ఆర్ట్స్ బ్యానర్ పై, మారుతి దర్శకత్వంలో హీరో గోపీచంద్ మరియు రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన పక్క కమర్షియల్ ఎన్నో అంచనాల మధ్య వచ్చి నిరాశ పరిచింది. ఆ తరువాత వచ్చిన చిన్న సినిమా హ్యాపీ బర్త్ డే కూడా పరాజయం పాలయ్యింది. పక్కా మాస్ బొమ్మగా వచ్చిన రామ్ పోతినేని “ది వారియర్” చిత్రం కూడా ఫ్లాప్ గా నిలిచింది. ఇక నాగ చైతన్య హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన “థ్యాంక్యూ” చిత్రం ఐతే అత్యంత భారీ డిజాస్టర్ గా నిలిచింది.


ఇక ఈ వారం విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ సినిమా అయినా కాస్త రిలీఫ్ ను ఇస్తుంది అనుకున్నారు ట్రేడ్ వర్గాలు. కాస్త తక్కువ అమౌంట్ కే బిజినెస్ జరగడం, మాస్ లో రవితేజకు మంచి ఫ్యాన్ బేస్ ఉండటం వల్ల సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ అయినా అవుతుంది అనుకున్నారు. కానీ మొదటి షోలు కాస్త సందడి చేసిన తరువాత చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద చతికిల బడింది.

ఇక డబ్బింగ్ సినిమాలైన రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్, సాయి పల్లవి గార్గి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అయితే ఈ వారం విడుదలైన కన్నడ సినిమా “విక్రాంత్ రోణ” అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విజయం సాధించి అందరికీ లాభాలను తెచ్చిపెట్టింది. ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ కు తోడు కాస్త న్యాయమైన టికెట్ రేట్లు ఉంచితే ఖచ్చితంగా సినిమాలు విజయం సాధిస్తాయి అనే పాఠాన్ని మన తెలుగు సినీ నిర్మాతలు మరియు పంపిణీదారులకు చెప్పకనే చెప్పింది “విక్రాంత్ రోణ”.

Directors and Heros are unhappy with Dil Raju decision on budgets

0

Tollywood’s leading producer Dil Raju is along with the producer’s council made some decisions recently that have sparked controversy. This decision is directly targetting to Heroes and directors’ remunerations and is aiming to put a slab on them. The announcement was made amidst the ongoing low phase Tollywood is facing.

The star Heros and star directors are not happy with Dil Raju’s decision as they don’t want to reduce their remunerations because of other movies’ failures. The star Heros and directors feel that their movies are doing well and they are able to pull the audience with brand and content.

Dil Raju’s recent films Thank You incurred heavy losses while F3 didn’t perform as expected. His recent Bollywood outing through Shahid Kapoor’s Jersey also failed miserably at the box-office.

In such a case, why should they reduce the remunerations is what directors and star heroes are stating. Even a few producers are also against Dil Raju team as they feel there is no need of stop the shootings putting the industry in a much more difficult position.

Producers like Aswini Dutt and Bandla Ganesh have openly made statements against Raju. Aswini Dutt made it very clear that he will not stop the shootings of his films. “Our productions will not be a part of Dil Raju’s rules. We will continue our shooting” he added.

July Box office: A big lesson for Distributors and Exhibitors

0

July was one of the most disappointing months ever for Tollywood at the box office. None of the films managed to attract any audience and recorded massive deficits.

Starting with Pakka Commercial, many medium-budget movies have released in July and every movie failed to impress the audience. Films like The Warrior, Thank You, Ramarao On Duty all failed miserably at the office.

Stars like Ravi Teja , Ram, Naga Chaitanya failed to pull the audience to theatres. Surprisingly Vikrant Rona performed well and worked well for everyone involved. This has brought forth an important lesson for the trade circles. Just hiking the ticket prices won’t bring in the collection. The content is the priority and if it is there in the movie, the audience will be willing to come to the theatres.

Now all eyes are on August releases like Macherla Niyojakavargam, Liger, and Bimbisara and it needs to be seen if they bring any spark to the box office and relief to the trade circles.

రూసో బ్రదర్స్ – రాజమౌళి ఇంటర్వ్యూ

0

తెలుగు సినీ పరిశ్రమకే కాదు భారత దేశ దిగ్గజ దర్శకుల్లో ఒకరైన ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక థియేటర్లలో తన సత్తా చాటిన తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ లోనూ తన సత్తా చాటింది. నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ వల్ల ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గ్లోబల్ రీచ్ వచ్చింది. విదేశీ ప్రేక్షకులే కాకుండా హాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ సినిమాని ప్రశంసలతో ముంచెత్తారు.

ఇక అవెంజర్స్ వంటి ప్రాంచైజీ రూపకర్తలు, ఇటీవల ” ది గ్రే మ్యాన్” ను తెరకెక్కించిన రూసో బ్రదర్స్ ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని చూసి దర్శకుడు రాజమౌళి ని ప్రశంసించడమే కాకుండా ఆయనతో కలసి సినిమా చేయాలని కోరుకుంటున్నట్లు తెలపడం విశేషం. ఈ నేపథ్యంలో రాజమౌళి మరియు రూసో బ్రదర్స్ తో నెట్ ఫ్లిక్స్ సంస్థ స్పెషల్ ఇంటరాక్షన్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వరల్డ్ సినిమా గురించి.. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపు వంటి పలు అంశాలపై దర్శకుడు రాజమౌళి మాట్లాడారు.

నెట్ ఫ్లిక్స్ లో భారతదేశం నుండి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా ఆర్ ఆర్ ఆర్ చరిత్ర సృష్టించింది. అలానే 15 విభిన్న భాషల్లోకి సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ చేయబడిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 47 మిలియన్ అవర్స్ కు పైగా వీక్షించబడింది, ఇది కూడా ఒక రికార్డు. ఇక వరుసగా 13 వారాల పాటు ట్రెండింగ్ లో కొనసాగడం మరో విశేషం. ఈ ఊహించని స్పందన తనకెంతో సంతోషాన్ని కలిగించిందని రాజమౌళి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

నిజంగా ఆర్ ఆర్ ఆర్ కు అంతర్జాతీయంగా లభించిన ఆదరణతో ఆశ్చర్యపోయానని ఆయన తెలిపారు.మంచి కథతో తీస్తే అది ఏ రకమైన ప్రేక్షకుడిని అయినా నచ్చుతుందని, కానీ వెస్ట్రన్ సెన్సిబులిటీస్ కి తగ్గట్టుగా సినిమాలు తీయగలనని తాను ఎప్పుడు అనుకోలేదని.. కానీ ఆర్ ఆర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన తరువాత ప్రజలు చూడటం ప్రారంభించినప్పుడు.. అద్భుతమయిన స్పందనలు వచ్చినప్పుడు, విమర్శకులు మంచి సమీక్షలు కూడా ఇవ్వడం ప్రారంభించినప్పుడు మాత్రం నిజంగా చాలా ఆశ్చర్యపోయానని రాజమౌళి తెలిపారు.

ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ ఇంటర్వెల్ ఎపిసోడ్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆ ఎపిసోడ్ లో జూనియర్ ఎన్టీఆర్ జంతువులతో కలిసి ఓ వ్యాన్ నుంచి దూకే సీన్ క్లిప్పింగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే ఏకంగా 3 మిలియన్లకు పైగా వ్యూస్ పొందింది అంటేనే ఆ సన్నివేశం ఎంతగా ప్రభావం చూపింది అనేది అర్థం అవుతుంది. మన భారత సినీ ప్రేక్షకులే కాక విదేశీ ప్రేక్షకులను సైతం ఈ సన్నివేశం ఔరా అనుకునేలా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సన్నివేశం అంతలా ప్రఖ్యాతి పొందింది.

ఈ నేపథ్యంలో రూసో బ్రదర్స్ తో తాజా ఇంటరాక్షన్లో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ఇంటర్వల్ లో ఎన్టీఆర్ పులుల ఎంట్రీ గురించి వివరించారు. ఆ సన్నివేశం ఎన్టీఆర్ క్యారక్టర్ డిజైనింగ్ నుంచి వచ్చిందని.. భీమ్ అడవుల్లో నుండి వచ్చినవాడు. అతనికి జంతువులతో సంబంధం ఉండటం సహజం అని చెప్తూ, ఆ రకంగా ఆ సీక్వెన్స్ ని డిజైన్ చేశామని, ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేయడం తనకు చాలా ఇష్టం అని చెప్పిన రాజమౌళి ఆ సన్నివేశం అందరికీ నచ్చినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు.

https://twitter.com/ssrajamouli/status/1553260426997428224?t=BHgSpMX038MluZc1x5SsrA&s=19

ఇక పోతే రూసో బ్రదర్స్ ఈ సంభాషణ గురించి ట్వీట్ చేస్తూ.. ”గ్రేట్ ఎస్.ఎస్. రాజమౌళిని కలవడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నాం” అని పేర్కొన్నారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ.. ”గౌరవం మరియు ఆనందం నావి.. ఇది గొప్ప ఇంటరాక్షన్. మీ క్రాఫ్ట్ ను కలుసుకోవడానికి దాన్నుంచి ఎంతో కొంత నేర్చుకోడానికి ఎదురు చూస్తున్నాను” అని అన్నారు.

కాగా ఆర్ ఆర్ ఆర్ ఈ ఏడాది భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన తరువాత లభించిన అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకుంది. అల్లూరి సీతారామరాజు – కొమురం భీమ్ వంటి ఇద్దరు నిజ జీవిత స్వాతంత్ర్య సమరయోధుల స్పూర్తితో తెరకిక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందింది.

అల్లు అర్జున్ కొత్త లుక్ వారెవ్వా అంటున్న అభిమానులు

0

స్టయిలిష్ స్టార్‌ నుంచి ఐకాన్‌ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌ `పుష్ప` సినిమాతో దేశ వ్యాప్తంగా తన స్థాయిని పెంచుకున్నారు. ఈ సినిమా భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో పుష్పగా బన్నీ చెప్పిన డైలాగ్ లు, మ్యానరిజం ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తగ్గేదేలే డైలాగ్ చెబుతూ ఇన్స్టా రీల్స్ చేసి సందడి చేస్తున్నారు. ఇప్పటికి కూడా బన్నీ మ్యానరిజంతో కూడిన వీడియోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఈ హవా తగ్గకముందే మరో డిఫరెంట్‌ లుక్‌లో కనుపించి అందరినీ విస్మయ పరిచారు అల్లు అర్జున్‌. సాల్ట్ పెప్పర్‌ లుక్‌లోకి మారి ప్రేక్షకులకి తీయని షాకిస్తున్నారు. స్టయిలిష్ లుక్ అదిరింది అనిపించే బన్నీ కొత్త లుక్‌ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నోట్లో బీడీ కట్ట, నెరిసిన తెల్ల జుట్టు, డిఫరెంట్‌ సైడ్‌ హెయిర్‌ కట్టింగ్‌లతో సరికొత్తగా కనిపిస్తున్నారు. తాజాగా ఈ కొత్త లుక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఐకాన్‌ స్టార్‌ కొత్త లుక్ చూసి ఆయన ఫ్యాన్స్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

అయితే ఇంతలా పాపులర్ అయిన ఈ కొత్త లుక్ ఒక సినిమా లుక్‌ కాదు, ఓ యాడ్‌ కోసం చేసిన లుక్‌ కావడం విశేషం.బన్నీ `పుష్ప2` షూటింగ్ ఆలస్యం అవడం వల్ల ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. ఈ గ్యాప్‌లో ఆయన యాడ్స్ తో బిజీగా గడుపుతున్నారు. మొన్ననే త్రివిక్రమ్‌తో ఓ యాడ్‌ చేసిన అల్లు అర్జున్‌ ఇప్పుడు మరో యాడ్‌ చేశారు.

తాజాగా హరీష్‌ శంకర్‌తో మరో కొత్త యాడ్‌ చేశారు. `ఆస్ట్రాల్‌ పైప్స్` అనే సంస్థ కోసం చేసిన యాడ్‌లో తాజాగా బన్నీ నటించారు. దీని కోసం ఈ కొత్త లుక్‌ లోకి మారిపోయారు. హరీష్‌ శంకర్‌ ఈ యాడ్‌ ను డైరెక్ట్ చేయగా, బన్నీ న్యూ ట్రాన్ఫ్సర్మేషన్‌తో అదరగొడుతున్నారు. జస్ట్ లుక్ ఏ ఇలా ఉంటే, ఇక యాడ్‌లో ఆయన ఏ విధంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్‌ ఈ కొత్త లుక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది.

ఇండస్ట్రీ కష్టాల్లో లేదు అన్న ఎన్టీఆర్

0

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బింబిసార. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పా కళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు అందరూ ఊహించినట్టు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఒకరోజు కళ్యాణ్ అన్న ఫోన్ చేసి.. నాన్న.. ఒక ఆసక్తికరమైన కథను విన్నాను.. ఒక్కసారి నువ్వూ వింటే బావుంటుంది అని చెప్పినప్పుడు.. ఆరోజు తనకొక చిన్న ఐడియాగా ఈ బింబిసార కథ చెప్పడం జరిగింది.

ఆరోజు ఒక భయం మొదలైంది. అనుభవం లేకుండా కొత్తగా వచ్చిన దర్శకుడు ఇంత పెద్ద చిత్రాన్ని హ్యాండిల్ చేయగలడా లేదా అని ఒక బెరుకు.. కానీ సినిమా చూసాక.. ఎంత కసిగా అయితే సినిమా కథ చెప్పాడో.. అంతే అద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచాడు. ఇది చిన్న విషయం కాదు.. ఎందుకంటే కథ తెలుసు, కథనం తెలుసు, ఆ కథలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు .. ఇన్ని తెలిసిన నాకు ఈ సినిమా చూసినప్పుడు గురైన ఎక్సయిట్మెంట్ ను రేపు థియేటర్ లో మీరు కూడా ఫీల్ అవుతారు. చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తను నమ్మిన విధంగా మలచడం చిన్న విషయం కాదు. ఈ సినిమానే ఇంత అద్భుతంగా మలిచాడు అంటే దర్శకుడు వశిష్ఠ రేపు ఏ పెద్ద సినిమాను అయినా మరింత అద్భుతంగా తీయగలడని ఎన్టీఆర్ అన్నారు.

ఇక ఈ సినిమాకు ఎన్ని ఉన్నా ఒక వెలితి కనిపించిందని, అదే ఎమ్ఎమ్ కీరవాణి.. ఆయన ఈ సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే.. ఈ చిత్రానికి ఆయనే బ్యాక్ బోన్ అని అందరూ అంటారని ఎన్టీఆర్ కీరవాణిని కొనియాడారు. ఇక ఇదే స్టేజ్ మీద ఒక మాట అభిమానులకు నచ్చేవరకు సినిమాలు చేస్తూనే ఉంటామని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఈ స్టేజి పై చెప్తున్నాను.. ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ ఎక్కువ కాలర్ ను ఎగరేస్తారని, కళ్యాణ్ రామ్ కెరీర్ బింబిసార కు ముందు బింబిసార తరువాత అని ఖచ్చితంగా అనుకుంటారని ఎన్టీఆర్ చెప్పారు. కల్యాణ్ రామ్ పడే కష్టం నిజంగానే తెరపై కనిపించదని.. తమ్ముడిని కాబట్టి ఎక్కువసార్లు ఆయనను కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి తనకు ఆయన ఎంత కష్టపడతారో తెలుసు అని ఎన్టీఆర్ చెబుతూ కళ్యాణ్ రామ్ లేకపోతే బింబిసార స్థానంలో ఎవరిని ఉహించుకోలేం అని అన్నారు.

ఇక ప్రస్తుతం తెలుగు ఇండ్టస్త్రీ పై వస్తున్న వార్తల పై కూడా ఎన్టీఆర్ మాట్లాడారు. ఇండస్ట్రీకి గడ్డుకాలం అంటున్నారు. థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదంటున్నారు.. ఇవన్నీ నేను నమ్మను. అద్భుతమైన సినిమా వస్తే చూసి ఆదరించే గొప్ప మనసున్న తెలుగు ప్రేక్షక దేవుళ్లు మీరందరు.. అదే తరహాలో గొప్ప కంటెంట్ గల బింబిసారను కూడా ఆదరిస్తారని, అలాగే ఈ సినిమాతో పాటు సీతారామం కూడా వస్తోంది .. ఆ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటూ, మా తాత గారు మరియు మా నాన్న గారు వదిలి వెళ్లిన అభిమానులు మీరు.. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి అంటూ ఎప్పటిలాగే అభిమానుల క్షేమం కోరుతూ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.

కార్తీకేయ 2 రిలీజ్ కష్టాల ధాటికి ఎడ్చేశాను అన్న నిఖిల్

0

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో నిఖిల్, స్వామి రారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాలతో తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆ తరువాత కొన్ని పరాజయాలు ఎదురైనా.. ఆయన నటించిన చివరి చిత్రం అర్జున్ సురవరం హిట్ గా నిలిచింది.

ఇక వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటించిన కార్తికేయ పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా కాన్సెప్ట్, టేకింగ్, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ పరంగా కూడా కార్తికేయ మంచి మార్కులు రాబట్టింది. 2014లో విడుదలైన ఈ సినిమాలో స్వాతి హీరోయిన్ గా నటించారు.

కార్తికేయ చిత్రం తర్వాత దర్శకుడు చందూ మొండేటి మళయాళ సినిమా ప్రేమమ్ తెలుగు రీమేక్ తెరకెక్కించారు. అది చక్కని విజయం సాధించగా, ఆ తరువాత అదే కాంబినేషన్లో వచ్చిన సవ్యసాచి ఘోరంగా పరాజయం పాలయింది. ఇక ఆయన తాజా సినిమా బ్లడీ మేరీ ఓటీటీ లో విడుదలై పరవాలేదు అనిపించుకుంది.

అందువల్ల కార్తీకేయ 2 స్క్రిప్టు పై చందూ మొండేటి చాలా జాగ్రతగా పని చేసినట్లు సమాచారం. జులై 22న విడుదల కావాల్సిన కార్తికేయ 2, కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఆగస్టు 12 తేదీన విడుదల అవుతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమాను సెన్సార్ కార్యక్రమాలకు పంపించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న కార్తికేయ 2 యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది. ఇక సినిమాలో ఒక్క కట్ కూడా చెప్పకుండా సెన్సార్ సభ్యులు పాస్ చేసినట్లు సమాచారం.

ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా ప్రచార కార్యక్రమాలలో భాగంగా హీరో నిఖిల్ పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆయన కొన్ని అంశాల పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.ఏ రకమైన బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఒక సినిమాని విడుదల చేయడం ఎంత కష్టమో తెలిసి వచ్చింది అని నిఖిల్ అన్నారు. జూలై 22న సినిమాని విడుదల చేయడానికి అంతా సిద్ధం చేసి ఉంచితే, వేరే సినిమా కోసం పోస్ట్ పోన్ చేయమన్నారని, సరే అని ఆగస్ట్ 12న విడుదల తేదీ ప్రకటిస్తే, థియేటర్ల కేటాయింపులో కష్టం అవుతుందని, అందువల్ల సినిమా విడుదల తేదీని అక్టోబర్ కు వాయిదా వేసుకోమని కొందరు చెప్పినట్లు నిఖిల్ తెలిపారు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఇక నిస్సహాయ స్థితిలో ఉండి పోయానని, ఒక సమయంలో ఎడ్చేసానని నిఖిల్ బాధ పడ్డారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా కార్తికేయ 2 భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో నటించడం విశేషం. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. మరి అన్ని సమస్యలను అధిగమించి విడుదలవుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధించి నిఖిల్ కు మరపురాని సినిమాగా మిగిలిపోతుందని ఆశిద్దాం.

షూటింగ్ ల బంద్ తో నిర్మాతల సమస్యలు తీరిపోతాయా ?

0

తెలుగు సినిమా పరిశ్రమ రేపటి నుంచి అన్ని సినిమాల తాలూకు షూటింగ్ లని నిలిపి వేయాలనే ఏకాభిప్రాయానికి వచ్చింది. నిర్మాతల గిల్డ్ ప్రకటించిన బంద్ కు మొదటి నుంచి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వ్యతిరేకించినా, మొత్తానికి అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. గిల్డ్ నిర్ణయానికి అందరూ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. దీంతో నిర్మాతలు అందరూ కలిసి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి సంపూర్ణంగా షూటింగ్ ల బంద్ ని పాటిస్తున్నామంటూ ఆదివారం సంచలన ప్రకటన చేసింది.

ఇలాంటి ఒక నిర్ణయం తెలుగు సినీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇంత వరకూ ఇండస్ట్రీలో వున్న 25 శాఖల్లో ఏదో ఒక శాఖ లేదా 24 శాఖలకు ప్రాతినిధ్యం వహించే ఫేడరేషన్ షూటింగ్ ల బంద్ కు పిలుపునిచ్చేది. లేదా జూనియర్ ఆర్టిస్ట్ లు షూటింగ్ లలో పాల్గొనము అంటూ ధర్నాకు దిగేవారు. కానీ తొలి సారి తెలుగు సినీ చరిత్రలో నిర్మాతలే స్వయంగా రంగంలోకి దిగి షూటింగ్ లని ఆపేయడం అనేది ప్రప్రథమంగా జరుగుతోంది. ఇంతకీ నిర్మాతల డిమాండ్లేంటీ? అవి షూటింగ్ లను ఆపి వేయడంతో నెరవేరతాయా? ..బంద్ తో వారు ఎదురుకుంటున్న సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం అందరిలోనూ ఉన్నాయి.

నిన్నటి వరకు బంద్ విషయంలో గిల్డేతర నిర్మాతలు వ్యతిరేకతని వ్యక్తం చేశారు. అయితే ఆదివారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో మాత్రం అందరూ గిల్డ్ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా నమోదు చేయడంతో ఆగస్టు 1 నుంచి షూటింగ్ ల బంద్ నిర్ణయానికి అడ్డు లేకుండా పోయింది. ఇంతకీ నిర్మాతల ప్రధాన డిమాండ్ లు ఏంటి అన్నది ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయం పై అగ్ర నిర్మాత దిల్ రాజు కొంత వరకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కోవిడ్ తరువాత పరిశ్రమలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేక్షకుల అభిరుచుల్లో మరియు ఓటీటీ, టికెట్ రేట్లు ఇలా చాలా మార్పులు వచ్చాయి. అంతే కాకుండా షూటింగ్లలో చాలా వేస్టేజీ జరుగుతోంది. ఈ సమస్యలపై ప్రధానంగా చర్చించడానికే షూటింగ్ లను ఆపేస్తున్నాము. వీటన్నిటికీ పరిష్కారాలు దొరికిన తర్వాతే మళ్లీ షూటింగ్ లు తిరిగి ప్రారంభిస్తాము అని దిల్ రాజు తెలిపారు..

నిర్మాతలు చెబుతున్న ప్రధాన సమస్య వేస్టేజీ.. అయితే దాన్ని ఎలా కట్టడి చేస్తారన్న దాంట్లో ఎవరికీ ఒక స్పష్టత లేదనే చెప్పాలి. స్టార్ హీరోలకి సంబంధిన స్టాఫ్, లేదా స్టార్ హీరోయిన్ ల స్టాఫ్ లకు అదనంగా చేసే ఖర్చులు ఉంటూనే ఉంటాయి. దానికి కారణం ఫలానా సినిమాకు ఫలానా స్టార్ కావాలి అని నిర్మాతలే ఎంచుకుంటారు కాబట్టి వారి డిమాండ్ లను ఒప్పుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఇక స్టార్ హీరోల పారితోషికాల పరిస్థితి కూడా అంతే. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు తమ పారితోషికం నిర్ణయించుకుంటారు.

ఇక ఈ మధ్య ప్రతి దానికి ఓటీటీ సంస్థలను కారణంగా చూపడం నిర్మాతలకు ఒక అలవాటుగా మారింది. కరోనా దాడి సమయంలో అసలు దిక్కు తోచని పరిస్తితిలో నిర్మాతలకు చక్కని లాభసాటి వ్యాపారం వచ్చేలా చేసింది ఓటిటి సంస్థలే. ఆ విషయాన్ని నిర్మాతలు మరిచిపోకూడదు.

టికెట్ రేట్లు కూడా ఓ సమస్యగా మారాయని అందు వల్లే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని నిర్మాతలు చెప్పడం మాత్రం వింతల్లోకెల్లా అతి పెద్ద వింతగా చెప్పుకోవచ్చు. ఇది నిర్మాతలు స్వయంగా తలకెత్తుకున్న సమస్య. భారీ చిత్రాలు రిలీజ్ అయిన సందర్భంలో టికెట్ రేట్లని భారీగా పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వాలు కల్పిస్తే. వారితో జీవోలు రిలీజ్ చేయించుకుని చిన్న పెద్దా తేడా లేకుండా ఇష్టానుసారం ప్రతి సినిమాకీ అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచేసుకుని ఇప్పుడు అదే టికెట్ రేట్ల కారణంగా సమస్యలు వచ్చాయని అంటున్నారు. అసలు సరైన ఆలోచన గానీ అవగాహన గానీ లేకుండా నిర్ణయం తీసుకుంది ఎవరు? మీకు మీరే అన్నీ పెంచేసుకుని మళ్లీ ఇప్పుడు అయ్యో సినిమాలు ఆడట్లేదు అంటూ తల బాదుకుంటే ఎలా అని ప్రేక్షకులు తిరిగి సినీ నిర్మాతలను అడిగినా ఆశ్చర్యం లేదు.

ది వారియర్ OTT రిలీజ్ ఎప్పుడంటే..

0

తెలుగు సినీ పరిశ్రమ లోకి ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా అడుగు పెట్టారు రామ్‌ పోతినేని. నటనతో పాటు డాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ తనదైన శైలిలో ప్రతిభను చూపిస్తూ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఆ మధ్య వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డ రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’తో కమ్ బ్యాక్ హిట్ ఇచ్చి మళ్ళీ రేసులోకి వచ్చేశారు. ఆ వెంటనే ‘రెడ్’ అనే సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు.

తాజాగా, ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామితో ‘ ది వారియర్‌’ సినిమా చేశారు రామ్. ఆ సినిమా జులై 14న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ అయింది. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించగా.. యువ నటుడు ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించారు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయింది. తొలి రోజు మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ఆ రోజు మినహా బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రభావం చూపించలేక పోయింది.

రామ్‌ నటన బాగుంది అనిపించినా, మూస కథ మరియు పసలేని కథనం ది వారియర్‌ పెద్ద మైనస్‌గా మారాయి. ఒక చక్కని మాస్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు సినిమాలో ఉన్నా, అన్నిటినీ సరిగ్గా ఒక పద్ధతిలో పొందు పరచడంలో దర్శకుడు లింగుసామీ విఫలం అయ్యారు. మాస్ సినిమాలకు ఉండాల్సిన పకడ్బందీ కథనం లేకపోగా, సరైన వేగం లేకుండా సీన్ లు అన్నీ అలా సాదాసీదాగా రావడం ప్రేక్షకులకు రుచించలేదు.

ఇక ఈ క్రమంలో సినిమా విడుదలై నెల రోజులైనా గడవక ముందే డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో ఆగస్టు 11 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ మేరకు హాట్ స్టార్ సంస్థ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రేక్షకులకి తెలియజేసింది. హి ఈజ్‌ రెడీ అంటూ ట్వీట్‌ చేసింది.

https://twitter.com/DisneyPlusHSTel/status/1553629099720990720?t=iNEVQESITJP_FDb3feII3A&s=19

ది వారియర్ సినిమా తరువాత హీరో రామ్, దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం తన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉంది. ఈ చిత్రం ఆగస్ట్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది.