Home Blog Page 2067

పోకిరి తరువాత జల్సా వంతు

0

సినిమా హీరోల పై వారి అభిమానులు చూపించే అభిమానానికి అంతే ఉండదు. తమకు సాధ్యమైన ప్రతి రీతిలో అభిమానాన్ని ఎంతో ఇష్టంగా చాటుకుంటూ ఉంటారు. అందులో బాగంగానే హీరోల పుట్టిన రోజు నాడు వారు నటించి, తమను ఎంతగానో అలరించిన బ్లాక్ బస్టర్ సినిమాలని రీ రిలీజ్ చేసి.. 4కెలో కి కన్వర్ట్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ కొన్నిటికి వారు అనుకున్నది సాధిస్తారు కూడా. ఇటీవల ఈ డిమాండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు `పోకిరి`తో మరింత పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా 2006లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన `పోకిరి`ని 4కెలోని కన్వర్ట్ చేసి ఆగస్టు 9న రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని మొత్తం 360 థియేటర్లలో విడుదల చేయడం విశేషం.

విడుదలైన ప్రతీ థియేటర్ లోనూ `పోకిరి` ప్రతీ షో హౌస్ ఫుల్స్ నమోదు చేసి ఒక్కసారిగా అందరినీ పోకిరి ఫస్ట్ డే ఫస్ట్ షో తాలూకు జ్ఞాపకాల్లోకి తీసుకు వెళ్లేలా చేశారు మహేష్ అభిమానులు. అంతే కాకుండా థియేటర్లలో వారి హంగామాతో నింపేశారు. ఈ హంగామా చూసిన మిగతా హీరోల అభిమానులు తాము మాత్రం ఏం తక్కువ కాకూడదనే ఉద్దేశంతో తమ హీరోల సినిమాలను కూడా రిమాస్టర్ చేయాలని ఆయా నిర్మాతల పై ఒత్తిడి చేస్తున్నారు. తమ అభిమాన హీరో ఫేవరేట్ సినిమాని కూడా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసి.. తమ తడాఖాను.చూపించాలి అని వారి తాపత్రయం.

ఇటీవల మహేష్ `పోకిరి` 4కె ప్రింట్ రిలీజ్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు `జల్సా’ సినిమాని పవన్ కల్యాణ్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న విడుదల చేయాలని గీతా ఆర్ట్స్ వర్గాలకు విజ్ఞప్తి చేశారట. ముందుగా వారి కోరిక తీరేలా కనిపించలేదు కానీ.. గీతా ఆర్ట్స్ వర్గాలు తాజాగా అభిమానుల డిమాండ్ ను నెరవేర్చే పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రింట్ సిద్ధంగా ఉందని.. దాన్ని 4కెలోకి మార్చే పనుల్లో ఉన్నట్లు సమాచారం.

పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ప్రతి ఏటా ఆయన అభిమానులు సెప్టెంబర్ 2న ఘనంగా జరిపే విషయం తెలిసిందే. అదే రోజున వాళ్ళు `పోకిరి` సినిమాకు మహేష్ అభిమానులు చేసిన హంగామాకు ధీటుగా `జల్సా` 4కె ప్రింట్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్ చేసి తమ సత్తా చూపించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి గీతా ఆర్ట్స్ వంటి బ్యానర్ రంగంలోకి దిగితే ఆ పని ఏమంత కష్టం కాదు. ఇప్పటికే 4కె పనులు ప్రారంభించారట. ప్రత్యేక షోలకు సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే గీతా ఆర్ట్స్ వర్గాలు వెల్లడించే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటికే సంబరాలు జరపడం మొదలు పెట్టేశారట. ఇక థియేటర్లలో `జల్సా`ని ఏ స్థాయిలో వేడుకలా చేస్తారో.. తాము కూడా ధియేటర్లు దద్దరిల్లే తరహాలో హంగామా చేస్తారా లేదా తెలియాలంటే సెప్టెంబర్ 2 వరకూ ఆగక తప్పదు.

ఈ వారం సినిమాల బుకింగ్స్: షాక్ లో బాలీవుడ్

0

బాలీవుడ్ లో ఈ వారం రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలకు కష్ట కాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రెండు పెద్ద సినిమాలు ఒకే వారంలో రావడం అనేది ఖచ్చితంగా ఇబ్బందికరం అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో రెండు సినిమాలు ఎదురు పడితే రెండిటికీ కూడా వసూళ్ల పరంగా నష్టం తప్పక పోవచ్చు అని ట్రేడ్ వర్గాల వాదన.

ఇక రెండు సినిమాల్లో ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 4 వేల స్క్రీన్స్ లో విడుదల చేస్టున్నారు. ఈ సినిమాని కేవలం హిందిలోనే కాకుండా తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు కాబట్టి.

మరో వైపు అక్షయ్ కుమార్ నటించిన ‘రక్షాబంధన్’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 4.2 వేల ధియేటర్లలో విడుదల చేస్తున్నారట. లాల్ సింగ్ చడ్డా సినిమాలో హీరోగా సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ ఉండటం వల్ల ఆ సినిమా పై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు భారీగా ఉండటం సహజం. ఇక అక్షయ్ కుమార్ వరుసగా సినిమాలు చేస్తూ మధ్య మధ్యలో హిట్ లు ఇస్తూ ఉంటారు. ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో సినిమా వచ్చి ఆరేళ్లు అయింది.

ఇక రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్ ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే.. రెండు సినిమాల్లో లాల్ సింగ్ చడ్డా యొక్క ముందస్తు అమ్మకాలు కాస్త పరవాలేదు అనేలా ఉన్నాయి. అక్షయ్ కుమార్ సినిమా కంటే ఆమీర్ ఖాన్ సినిమాను చూసేందుకే బాలీవుడ్ ప్రేక్షకులు అసక్తి చూపిస్తున్నారు. అయితే ఇందులో అంతగా ఆనందం పొందాల్సిన విషయం ఏమీ లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఎందుకంటే కేవలం రక్షా బంధన్ తో పోల్చుకుంటే లాల్ సింగ్ చడ్డా బుకింగ్స్ కాస్త బాగున్నాయి కానీ మామూలుగా చూస్తే ఆశ్చర్యకరంగా రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఘోరంగా ఉన్నాయనే చెప్పాలి. తొలి రోజు అక్షయ్ కుమార్ రక్షా బంధన్ 12 కోట్ల స్థాయిలో, అమీర్ ఖాన్ సినిమా 18 కోట్ల స్ధాయలో నెట్ కలెక్షన్లు సాధించవచ్చు అని ఒక అంచనా. ఇవి నిజంగా చాలా తక్కువ, పేలవమైన అడ్వాన్స్ బుకింగ్‌లు అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలకు ఇలాంటి బుకింగ్స్ ఉండటం ఏంటని ట్రేడ్ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

క్లాసికల్ హిట్ గా నిలిచిన సీతారామం

0

దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా `సీతా రామం`. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేష స్థాయిలో అలరించి ఏకగ్రీవంగా క్లాసికల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

అటు ప్రేక్షకుల ఆదరణను.. ఇటు విమర్శకుల నుంచి గొప్ప కితాబులను కూడా అందుకుని బాక్సాఫీస్ వద్ద తన హవాను కొనసాగిస్తుంది. తొలి రోజు కంటే తరువాతి రోజుల్లో ఎక్కువ కలెక్షన్లను సాధించడం విశేషం.


ఈ చిత్రాన్ని ఒక సరికొత్త ప్రయత్నంగా, ప్రేక్షకులను మాయ చేసిన ప్రేమకథగా రివ్యూయర్లతో పాటు ట్రేడ్ వర్గాలు వారు కూడా అభిప్రాయ పడుతున్నారు. ఇక ప్రఖ్యాత విమర్శకులు, సెలబ్రిటీలు కూడా ఈ దృశ్య కావ్యానికి మంత్ర ముగ్ధులు అయిపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత అద్భుతంగా తెరకెక్కిన ప్రేమకథను చూడలేదంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

దుల్కర్ సల్మాన్,మృణాల్ ఠాకూర్ ల నటనతో పాటు ప్రేమికులు గా వారు కెమిస్ట్రీ, శారీరకంగా కౌగిలింతలు వంటివి ఎక్కువ లేకపోయినా వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ను పండించిన తీరుకు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇక సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి మరో బ్యాక్ బోన్ గా నిలిచారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన పాటలు, హృద్యమైన నేపథ్య సంగీతం, హను రాఘవపూడి పటుత్వం ఉన్న దర్శకత్వంతో పాటు పీఎస్ వినోద్ స్టన్నింగ్ విజువల్స్.. వైజయంతీ స్వప్న సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్ని కలగలిపి ఈ సినిమాని క్లాసిక్ గా నిలబెట్టాయి.


మొదటి రోజు వసూళ్లు చూసిన అందరూ..ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించడం కాస్త కష్టమేనని భావించారు. అయితే ఈ సినిమా బాగుంది అన్న టాక్ అలా పెరుగుతూ పోయి రెండవ రోజు నుంచీ ఈ చిత్రం తాలూకు కలెక్షన్లు దినదినాభివృద్ధి చెందుతూ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా సెంటర్లలో ఈ సినిమా హౌస్ ఫుల్స్ లను నమోదు చేస్తూ మంచి వసూళ్లని రాబడుతోంది. సినిమా అద్భుతంగా ఉందన్న పాజిటివ్ టాక్ ప్రతి ఒక్కరి నోట వినిపిస్తూ ఉండటంతో ప్రేక్షకుల్లో సినిమా పట్ల మరింత ఆసక్తి పెరిగి అది వసూళ్ల రూపంలో కనిపిస్తుంది.


ఇక ఈ సినిమా 5 రోజుల వరకూ సాధించిన కలెక్షన్లు ఎంతంటే 33 కోట్ల గ్రాస్ ను రాబట్టింది అని తేలింది. సాధారణంగా క్లాస్ సినిమాలకి చక్కం ఆదరణ లభించే యుఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే వారాంతాల్లోనే కాకుండా ఈ సినిమా సోమవారం మరియు మంగళవారం కూడా చక్కని  వసూళ్లని రాబట్టడం విశేషం. ట్రెండ్ చూస్తుంటే ఈ వారాంతంలోనే వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


మొత్తంగా చక్కని ప్రయత్నం అయిన సీతారామం సినిమా తన స్థాయికి తగ్గట్టు అటు హృదయపూర్వక అభినందనలతో పాటు వసూళ్లను కూడా మెరుగు పరుచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని కొనసాగిస్తూ విజయపథంలో దూసుకు పోతుంది.

రియల్ లైఫ్ హీరో అనిపించుకున్న మెగాస్టార్

0

మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకి ఆ మహా మనిషికి ఎలాంటి ఇమేజ్ ఉందో.. అభిమానులలో ఆయనని ఎలా దేవుడిలా కొలుస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయన అంతలా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు, ఆ అభిమానులు ఆయనని ఎన్నో సంవత్సరాలుగా ఆరాధిస్తూ వచ్చారు.


అంతే కాకుండా వారి జీవితంలో కనీసం ఒక్కసారైనా తమ అభిమాన హీరోని కలవాలని ఆసక్తిగా ఎదురుచూస్తు ఉంటారు. ఏ అభిమానికైనా ఇది సర్వ సాధారణంగా ఉండే కోరిక. ఇదిలా ఉండగా చిరంజీవి గారి స్వస్థలమైన మొగల్తూరు నుండి వచ్చిన నాగరాజు.. మెగాస్టార్ ను అభిమానించే కోట్ల సంఖ్యలో ఉన్న అభిమానుల్లో ఒకరు.
అలాంటి నాగరాజును అదృష్టం వరించింది.

ఎట్టకేలకు మెగాస్టార్‌ని కలిసే అవకాశం నాగరాజుకు దక్కడంతో ఆయన ఆనందానికి అవధులు అనేవి లేకుండా పోయాయి. అయితే  తన ఆరాధ్య దైవాన్ని కలిసే సమయంలో నాగరాజు పరిస్థితి ఏమీ బాగోలేదు. తన రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, గత కొంత కాలంగా ఇదే పరిస్థితితో పోరాడుతున్నానే విషయాన్ని నాగరాజు చిరంజీవికి చెప్పుకుని బాధ పడ్డారు. నిజానికి ఆయన తన చివరి కోరికగా చిరంజీవిని కలవాలనుకున్నారట. తన అభిమాని ఎదురుకుంటున్న కష్టాలను చూసి చిరంజీవి చలించిపోయారు. అంతే కాదు తనకు అన్ని విధాలా ఆర్థిక సాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు.


హైదరాబాద్‌ లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఆ సమయంలో నాగరాజుతో చిరంజీవి గంటకు పైగా మాట్లాడారట. మెగాస్టార్ నాగరాజుకు అవసరమైన నైతిక మద్దతును ఇస్తూ.. దాంతో పాటు అత్యవసరమైన అన్ని రకాల వైద్య, ఆర్థిక సహాయాన్ని అందించారు.


వెండి తెర పై హీరోయిజం ను ప్రదర్శించే హీరోగానే కాకుండా.. తెర బయట చేసే సమాజసేవతో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ తన సేవా గుణాన్ని చాటుకున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టి వాటి దానాల ద్వారా ఎంతో మంది అభిమానులను సమాజ సేవ వైపు ప్రేరేపించారు. అలాగే ఇండస్ట్రీలో సీనియర్ నటులు లేదా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ఆర్టిస్టులను ఆదుకోవడంలో కూడా ఎన్నో సార్లు ముందుండి శభాష్ అనిపించుకున్నారు.

ఆ పచ్చబొట్టు తీసేయను – నాగ చైతన్య

0

అక్కినేని నాగచైతన్య – సమంతల జంట వారి కుటుంబాలు. మరియు అభిమానులు ఎంతో ఆనందించేలా వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వారు విడాకులు తీసుకున్నారు. వారిరివురూ విడిపోయి దాదాపు పది నెలలు కావొస్తున్నా ఇప్పటికీ వీరి విడాకులకు సంబంధించిన వార్తలు ఏదో రకంగా మీడియాలో చర్చకు వస్తూనే ఉన్నాయి. ప్రేమించి పెళ్ళి చేసుకున్న చైతన్య-సమంత.. పెళ్లయి నాలుగు ఏళ్ళు కూడా పూర్తి కాక ముందే విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికీ విస్మయం కలిగించారు.

అప్పటి నుంచి సమంత – చైతన్య ఇద్దరూ వారి వ్యక్తిగత కెరీర్ పై దృష్టి సారించి ఎవరి పనుల్లో వారు ఉన్నారు. విడాకుల విషయం వారి పై ప్రభావం చూపించకుండా.. వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.

అయితే విడాకుల ప్రకటన తర్వాత వీరిద్దరూ మళ్లీ పబ్లిక్ లో ఎక్కడా కలవలేదు. ఒకవేళ కలిస్తే ఏం చేస్తారు అనే ప్రశ్నకు చైతన్య చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్య పరిచింది.

నాగచైతన్య ప్రస్తుతం అమీర్ ఖాన్ తో కలిసి చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఇందులో బోడి బాలరాజు అనే పాత్రలో చైతన్య కనిపించనున్నారు. ఇది తనకు హిందీలో తొలి సినిమా కావడంతో ఈ సినిమాని చైతన్య భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో చైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఒకవేళ మీ మాజీ భార్య సమంత కనిపిస్తే ఏం చేస్తారనే ప్రశ్నను ఎదుర్కొన్నారు. దీనికి చైతన్య సమంతకు హాయ్ చెప్పి హగ్ చేసుకుంటానని సమాధానమిచ్చారు. అలాగే తన చేతిపై ఉన్న పచ్చబొట్టు గురించి చెప్తూ.. ఆ పచ్చబొట్టు సమంత గుర్తుగా ఉన్న మార్స్ కోడ్ అని..అయితే విడాకుల తరువాత కూడా ఆ పచ్చబొట్టును తీసేసే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు.

అయితే ఇటీవలే సమంతా ‘కాఫీ విత్ కరణ్’ షోలో దీనికి పూర్తిగా భిన్నంగా మాట్లాడిన విషయం తెలిసిందే.ఆ షోలో ఒక ప్రశ్న అడిగే సందర్భంలో నాగ చైతన్యను కరణ్ భర్త అని సంభోదించడానికి కూడా ఇష్టపడలేదు సమంత.. తమ మధ్య సరైన సంబంధాలు లేవనే విషయం చెప్పారు. అలాగే మరో ప్రశ్నకు సమాధానంగా.. మా ఇద్దరినీ ఒక గదిలో ఉంచినట్లయితే.. ఆ గదిలో ఉన్న పదునైన వస్తువులను దాచాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అలానే ఉంది. కానీ ఆ భావన భవిష్యత్తులో మారొచ్చని అని సమంత చెప్పుకొచ్చారు.

‘ఏమాయ చేసావే’ సినిమాలో కలిసి నటించిన నాగచైతన్య – సమంత.. ‘ఆటోనగర్ సూర్య’ ‘మనం’ వంటి చిత్రాల్లో నటించి.. విజయ వంతమైన జోడీగా ప్రేక్షకుల మన్నన పొంది అదే క్రమంలో ప్రేమలో పడి కొన్నాళ్లు డేటింగ్ చేసిన తరువాత పెద్దలను ఒప్పించి 2017 లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి ‘మజిలీ’ సినిమాలో నటించి మంచి హిట్ సినిమాని తమ ఖాతాలో జమ చేసుకున్నారు. అలాగే సమంత నటించిన ‘ఓ బేబీ’ చిత్రంలో చైతన్య గెస్ట్ రోల్ కూడా చేశారు.

అయితే అనూహ్యంగా వారు తమ దాంపత్య జీవితాన్ని సాఫీగా కొనసాగించలేక విడిపోతున్నారనే పుకార్లు మొదలయ్యాయి. మొదట్లో ఆ వార్తలను ప్రేక్షకులు నమ్మలేదు. కానీ ఆ వార్తలను నిజం చేస్తూ 2021 అక్టోబర్ లో చైతన్య – సమంత విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఎవరి దారిలో వారు ముందుకు వెళుతున్నారు.

బింబిసార-2 లో ఎన్టీఆర్ లేడు – కళ్యాణ్ రామ్

0

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా బాక్సాపీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి.. మూడవ రోజు నుండే పంపిణీదారులకి లాభాలను తెచ్చిపెట్టింది. ఇక లాంగ్ రన్ లో ఈ చిత్రం బయ్యర్లకు మరియు నిర్మాతకు రెట్టింపు లేదా అంతకు మించి లాభాలను తెచ్చి పెట్టినా ఆశ్చర్యం లేదు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఈ సమయంలో నందమూరి అభిమానులని ఆశ్చర్య పరిచే ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకి వచ్చింది. అదేంటంటే బింబిసార సినిమాలో ఎన్టీఆర్ తో ఒక చిన్న పాత్ర చేయిస్తే బాగుంటుందని అనుకున్నారట. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ బిజీగా ఉండటంతో ఆ పాత్రను ఎన్టీఆర్ చేయలేక పోయారట. ఇప్పుడు బింబిసార చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలవడంతో రెండవ భాగంలో ఎన్టీఆర్ ని నటింపజేసే ఆలోచనలో కళ్యాణ్ రామ్ మరియు బింబిసార చిత్ర బృందం ఉన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. అయితే అదేమీ లేదని, ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు.

అసలు బింబిసారలో ఎన్టీఆర్ ను ఏ రకంగా కూడా భాగం చేయాలని తాము అనుకోలేదని.. ఒక వేళ అలాంటి వార్తలు వచ్చినా అవి కేవలం ఊహాగానాలే అని ఆయన అన్నారు. అయితే అవి కేవలం పుకార్లే అయినప్పటికీ.. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత బింబిసార లాంటి సోషియో ఫాంటసీ చిత్రంలో నటించి ఉంటే ఖచ్చితంగా అది సినిమాకు ఉపయోగపడేది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

ఇక బింబిసార చిత్రం ఘన విజయం సాధించడం పట్ల కళ్యాణ్ రామ్ ఆనందంగా ఉన్నారు. ఆ సినిమాను ఎలా తెరకెక్కించారు అనే వివరాలు ఆయన మీడియాతో పంచుకున్నారు. ముందుగానే బింబిసార సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ లో రెండు భాగాలకి సరిపడా స్క్రిప్ట్ సిద్ధంగా ఉంచుకున్నామని ఆయన తెలిపారు. అయితే రెండు భాగాలు ఒకేసారి చిత్రీకరిస్తే ఏ భాగానికి కూడా న్యాయం చేయలేమని భావించి ముందుగా ఒక స్థాయిలో మొదటి భాగాన్ని ప్రేక్షకులకి అందించి.. ఆ తరువాత రెండో భాగాన్ని అత్యున్నత స్థాయిలో తెరకెక్కించే ఆలోచన చేశామని కళ్యాణ్ రామ్ తెలిపారు.

మొత్తానికి బింబిసారతో కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఆ చిత్రం సీక్వెల్ తో మరింత.ఘన విజయాన్ని, బాక్స్ ఆఫీస్ వద్ద మరో సారి బ్లాక్ బస్టర్ ను అందుకోవాలి అని కోరుకుందాం.

Box-office: నిరాశ పరుస్తున్న లాల్ సింగ్ చడ్డా బుకింగ్స్

0

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా “లాల్ సింగ్ చడ్డా”, ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ పాత్రలో, నాగ చైతన్య , మోనా సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. లాల్ సింగ్ చడ్డా సినిమా హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కినది. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 11న సినిమా విడుదల కానుంది. 


అయితే సినిమా విడుదలకు ముందు ఆశించిన స్థాయిలో బజ్ అయితే రాలేదు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాతో పాటు అక్షయ్ కుమార్ రక్షా బంధన్ కూడా రిలీజ్ అవుతుంది. అయితే అనూహ్యంగా రెండింటి మీద ఆశించిన స్థాయిలో బజ్ లేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేసింది. లాల్ సింగ్ నిన్నటి అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా జరిగాయి అని చూస్తే ఇప్పటివరకూ కేవలం 25 వేల టికెట్లు అమ్ముడయ్యాయి అని తెలుస్తోంది.


అయితే ఇంకా రిలీజ్ కు ఒక రోజు సమయమే ఉండగా ఇంత తక్కువ స్థాయిలో సినిమాకి క్రేజ్ ఉండటం పలువురు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా బాలీవుడ్ లో బుకింగ్స్ కంటే థియేటర్ల వద్దకు వచ్చి చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువ. ఆ రకంగా చూసుకుంటే మొదటి రోజు కలెక్షన్లు బాగానే వస్తాయి అని కొందరు అంటున్నారు. అయితే ఎలా చూసుకున్నా ఒక అగ్ర హీరొ రేంజ్ కు తగ్గట్టు ప్రేక్షకులు టికెట్ల కోసం ఆతృతగా లేరని అర్థమైపోయింది. టాక్ మరియు రివ్యూస్ చూసిన తరువాతే సినిమా వెళ్ళాలా వద్దా అని నిర్ణయించుకుంటున్నారు.


లాల్ సింగ్ చడ్డా బుకింగ్స్ దక్షిణ సినిమాలైన కెజిఎఫ్ 2, ఆర్ ఆర్ ఆర్ కన్నా చాలా తక్కువ ఉండటం గమనార్హం. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే తప్ప థియేటర్లలో పికప్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. ఏమాత్రం టాక్ తారుమారు అయినా.. ఈ చిత్రంతో తమ పూర్వ వైభవం దక్కించుకోవలని ఆశిస్తున్న బాలీవుడ్ కు నిరాశ తప్పదు.

హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ గా రూపొందిన లాల్ సింగ్ చడ్డాని హిందీలో కంటే ఎక్కువ అమీర్ తెలుగులోనే ప్రచారం చేయడం విడ్డూరంగా కొంతమంది అనుకుంటున్నారు. తెలుగులో లాల్ సింగ్ చడ్డా సినిమాకి మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు పబ్లిసిటీ పనుల్లో కూడా పాలు పంచుకున్నారు, అలాగే ప్రీమియర్ షో కూడా వేయించి వీలయినంత క్రేజ్ తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.

Entire Script Work Has Been Completed For Balakrishna Film

0

Balakrishna is on a roll at the moment, with multiple projects under his kitty. He is currently shooting for his next film with Gopichand Malineni but has also signed another film. He will be working with Anil Ravipudi for the first time in his career.

It was announced a long time ago that Anil Ravipudi and Balakrishna will be collaborating for a film. But, Anil was busy with the shooting and post-production work of F3. He was then occupied with the promotions of the film, so he could not finish the script.

Anil Ravipudi has finally finished the complete script work of the film. He is now on the hunt for his cast and crew. Anil is always very particular about his cast and crew and he wants to get the best in all departments this time as well.

It has also been reported that it will be a very different role for Balayya than his previous films. He will play the role of a 45 year old man who has just come out of a prison sentence. Actress Sreeleela is being roped in to play the role of Balakrishna’s daughter in the film.

The first half will be dedicated to Balayya’s action episodes whereas the second half will have Anil Ravipudi’s tone of comedy sprinkled all over it. The movie is expected to go on floors by the end of next month.

ఖైదీ-2 సినిమా తొందరలోనే మొదలవుతుంది – కార్తీ

0

దర్శకుడు లోకేష్ కనగరాజ్ – హీరో కార్తీ కాంబినేషన్లో వచ్చిన ‘ ఖైదీ’ సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించింది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన పాటలు, హీరోయిన్, హీరోకి రొమాంటిక్ ట్రాక్ వంటి అంశాలు లేకుండా… దానికి తోడు సినిమా అంతా హీరో ఒకే కాస్ట్యూమ్‌లో కనిపించడం వంటి వినూత్న రీతిలో తెరకెక్కిన ఆ సినిమా అటు విమర్శకుల నుంచి ఇటు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది.

కేవలం తమిళనాడులో మాత్రమే కాదు… తెలుగు రాష్ట్రాల్లోనూ ఖైదీ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్, హీరో కార్తీలకు ఎంతగానో ప్రశంసలు లభించాయి.ప్రస్తుతం తమిళ స్టార్ విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా (Thalapathy 67) రూపొందుతోంది. ఆ సినిమా పూర్తయిన అయిన తర్వాత ‘ఖైదీ 2’ మొదలవుతుందని కార్తీ చెప్పారు. ఈ శుక్రవారం (ఆగస్టు 12న) ఆయన హీరోగా నటించిన తాజా సినిమా ‘విరుమాన్’ తమిళంలో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో కార్తీ ముచ్చటించారు.

ఆ సందర్భంగా ‘ఖైదీ 2’ గురించి చెప్పారు. ప్రస్తుతం లోకేష్ విజయ్ సార్ తో సినిమా చేస్తున్నారు. ఆ సినిమాను లోకేష్ పూర్తి చేసిన తర్వాత ఖైదీ 2 సినిమా మొదలు పెడతాం అని కార్తీ పేర్కొన్నారు.కమల్ హాసన్ తో ఇటీవలే ‘విక్రమ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నారు.

ఎన్నో ఏళ్ళకి కమల్ హాసన్ కు కమర్షియల్ విజయాన్ని అందించడమే కాక.. ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి వంటి మేటి నటులను ఆయన సమర్థవంతంగా నటింపజేసుకున్న తీరుకు ప్రశంసలు అందుకున్నారు.అంతే కాక బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకున్నారు. పైగా ఆ చిత్రానికి, ‘ఖైదీ’ చిత్రానికి లింక్ ఉంది.

‘విక్రమ్’ సినిమా చివర్లో ‘ఖైదీ 2’ గురించి, అందులో కార్తీ పోషించిన ఢిల్లీ పాత్ర గురించి చిన్న హింట్ కూడా ఇచ్చారు. అంతకు ముందే ‘ఖైదీ 2’ ఉంటుందని చెప్పారు కూడా. అయితే… ‘ఖైదీ 2’ కంటే ముందు విజయ్ ‘మాస్టర్’, ‘విక్రమ్’ చేశారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఇప్పుడు విజయ్ హీరోగా మరో సినిమా చేస్తున్నారు.

ఇక ‘విక్రమ్’లో సూర్య రోలెక్స్ పాత్రలో కనిపించారు. ఆయన తెరపై కనిపించింది కాసేపే అయినా ఆ పాత్ర ప్రేక్షకులను భలే ఆకట్టుకుంది. రోలెక్స్ పాత్రను ఆధారంగా చేసుకుని కూడా ఒక సినిమా ఉంటుందని లోకేష్ ఇదివరకే తెలిపారు. ‘విక్రమ్ 2’లో కూడా సూర్య మెయిన్ విలన్ గా కనిపిస్తారు అని కూడా ఒక టాక్ ఉంది. ఇక ఇవి కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లోకేష్ మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సింది.

కమల్ హాసన్, సూర్య, కార్తీలతో లోకేష్ కనగరాజ్ హాలీవుడ్ తరహాలో ఒక సినిమాటిక్ యూనివర్స్ తయారు చేసే ఆలోచనలో భాగమే ఈ ఖైదీ2 మరియు విక్రమ్2 సినిమాలు వస్తున్నాయి. అయితే తమిళ సూపర్ స్టార్ విజయ్ తో లోకేష్ చేస్తున్న సినిమా కూడా ఆ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆ వార్తలు నిజమో కాదో తెలియాలంటే ఆ సినిమా విడుదల అయ్యే వరకూ ఆగక తప్పదు.

Other Hero Fans Are Insecure About Pokiri Special Shows Numbers And Craze

0

Pokiri is one of the most iconic films in the history of Telugu cinema. The massy dialogues, Mahesh’s powerful screen presence and the swag with which he portrayed the role still remain fresh in people’s minds. It was a huge success when it released and its story continues to this day.

Yesterday, fans of Mahesh stormed to the theatres to watch the special shows of Pokiri. People rocked up in numbers to celebrate the birthday of their favorite star. The special shows of Pokiri have created unprecedented numbers and broken all imaginations.

The movie has collected 1.5 crores in gross due to the special shows, which is a record in itself. On top of that, it has also broken the record for number of shows, with a mind-bending 375+shows. 80% of the shows were houseful and the remaining posted excellent occupancies.

Mahesh fans are very happy with the success of the special shows but he fans of other heroes, not so much. Some fans are feeling insecure and are complaining that the shows are managed by Mahesh’s team and the numbers are bloated.

But it is simply common sense that exhibitors will only play the shows because of demand. Many people kept trying to book tickets which is why extra shows were added. Pokiri special shows started with a minimum number of shows but due to huge demand, the shows were added.