Home Blog Page 2045

నాగార్జున – మహేష్ కాంబినేషన్లో సినిమా రానుందా?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ది ఘోస్ట్ ట్రైలర్ విడుదల సందర్భంగా సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు మరియు నాగార్జున మధ్య ఒక సరదా చిట్ చాట్ జరిగింది. ఆ సంభాషణ చూస్తుంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించాబోతున్నారనే అనిపిస్తుంది.నాగార్జున మరియు మహేష్ బాబుల కాంబోలో ఒక సినిమా వస్తే. అది ఖచ్చితంగా అభిమానులు మరియు ప్రేక్షకులకు కన్నుల పండగే అని చెప్పాలి.

తాజాగా నాగార్జున స్వయంగా ఈ మల్టీ స్టారర్ సినిమా గూర్చి ప్రస్థావించారు. మహేష్ ది ఘోస్ట్ ట్రైలర్ ను విడుదల చేసిన సందర్భంగా..గతంలో మీ నాన్న (సూపర్ స్టార్ కృష్ణ) గారితో కలిసి సినిమా చేశాను.. మరి మనిద్దరం ఎందుకు చేయకూడదు అన్న తరహాలో మహేష్ బాబు ను నాగార్జున ప్రశ్నించారు.

https://twitter.com/urstrulyMahesh/status/1562821570359623680?t=dnqKonWmnwMeyLgzVFA5VQ&s=19

ఆ ప్రశ్నకు మహేష్ బాబు అందుకు సంతోషంగా ఒప్పుకున్నట్లు సమాధానం ఇచ్చారు. తప్పకుండా మనం ఇద్దరం కలిసి సినిమా చేద్దాం.. అలాంటి రోజు కొసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నట్లుగా మహేష్ బాబు స్పందించారు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే.. వీరిద్దరు కలిసి సినిమా చేసేందుకు చాలా ఆసక్తిగానే కనిపిస్తున్నారు. అయితే అనుకున్నంత సులభం కాదు కదా. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించే సినిమాని హ్యాండిల్ చేసే దర్శకులు ఎవరు అనేది ఒక ప్రశ్న.

నాగార్జున – మహేష్ బాబు కలిసి ఒక సినిమాలో నటిస్తే ఖచ్చితంగా అది ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎంతో ఆసక్తిని రేపుతుంది. గతంలో మహేష్ – వెంకటేష్ ల కలయికలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటిస్తే నిజంగానే అలాంటి ఫ్యామిలీ సినిమా ఉంటుందా లేక మరేదైనా కథ ఉంటుందా అని సోషల్ మీడియాలో అప్పుడే కథలు, కథనాలు సిద్ధం చేసేస్తున్నారు.

ఇలా అభిమానులు ఈ చిత్రం పట్ల పలు రకాల చర్చలు జరుపుతూ నిజంగా ఈ సినిమా రూపు దాల్చితే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్న మహేష్ .. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో భారీ ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. బహుశా ఆ సినిమా లోనే నాగార్జున నటిస్తున్నారు ఎమో అనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ ఊహ నిజమైతే ఎంతో బాగుంటుంది. వారిద్దరిని కలిపి ఇరు వర్గాల అభిమానులను అలరించే సామర్ధ్యం రాజమౌళి కే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అది నిజమవుతుందా లేదా తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

ఛార్మికి కౌంటర్ ఇస్తున్న మెగా ఫ్యాన్స్

0

2015లో హీరో రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అనుకున్న స్థాయిలో కంటెంట్ లేకపోవడం వల్ల సినిమా బాగా ఆడలేదు, ప్రేక్షకులు ఆ చిత్రాన్ని తిప్పి కొట్టారు.అయితే ఆ విషయం పక్కన పెడితే, ఈ సినిమాలో చిరంజీవి అతిధి పాత్రే అప్పట్లో ప్రధాన చర్చగా నిలిచింది. ఇండస్ట్రీకి రిటర్న్ వస్తున్న చిరంజీవి ఆ సమయంలో పూరి జగన్నాధ్‌తో ఓ సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రూపు దాల్చలేదు.

సినిమా పరాజయం పాలవడంతో చిరంజీవి, రామ్ చరణ్ లను హేళన చేస్తూ అప్పట్లో ఛార్మీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అప్పట్లో సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఈ ట్వీట్ ను సీరియస్‌గా తీసుకుని శాడిస్ట్ ట్వీట్‌గా పరిగణించి కొట్టిపారేశారు కూడా.

https://twitter.com/Charmmeofficial/status/654953713916772352?t=hOQWQd9Ba-id4LmTfEMrAg&s=19

కానీ 7 సంవత్సరాల తరువాత, ఈ ట్వీట్ మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. అది కూడా ఎవరూ ఊహించని రీతిలో. నిన్ననే, ఛార్మీ కౌర్ పూరి జగన్నాథ్ తో కలిసి సంయుక్తంగా నిర్మించిన లైగర్ సినిమా విడుదలైంది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా దారుణమైన సమీక్షలను మరియు స్పందనను తెచ్చుకుంది. ఈ సినిమా అటు సామాన్య ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి చెత్త సినిమా అనే టాక్ ను అందుకుంది. ఓపెనింగ్ షోల వసూళ్లు భారీగా ఉన్నా.. ట్రెండ్ ను బట్టి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా కుప్ప కూలిపోయే దారిలో నడుస్తుంది.

దీంతో మెగా అభిమానులు లైగర్ చిత్ర ఫలితం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఛాన్స్ దొరికింది అని ఛార్మీని లక్ష్యంగా చేసుకున్నారు. ట్రోల్స్ నాన్‌స్టాప్‌గా చేస్తూ.. ఛార్మీ అప్పట్లో వేసిన ట్వీట్ ను కోట్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ” జీవితం ఎవ్వరినీ వదిలి పెట్టదు. అందరి సరదా తీర్చేస్తుంది” అని. ఇప్పుడు అదే పరిస్థితి పూరి.-. ఛార్మి లకు, మరియు లైగర్ చిత్ర బృందానికి ఉద్భవించింది.

కర్మ నిజంగానే ఎవ్వరినీ వదిలి పెట్టదు. అతి విశ్వాసం అన్ని వేళలా పనికి రాదు. లైగర్ చిత్ర ప్రచార సమయంలో చిత్ర బృందం భారీ స్టేట్మెంట్ లు ఇచ్చారు. విడుదలకు ముందు ఒక సందర్భంలో ఈ సినిమా అసలైన వసూళ్లను 200 కోట్ల నుండి లెక్కిస్తామని అన్నారు. అలాగే మరి కొన్ని అతి ధోరణిలో వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ వాస్తవం ఏమిటంటే, సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే వారు ఇంక కలెక్షన్లు లెక్కించాల్సిన అవసరం కానీ అవకాశం కానీ లేదు అనే చెప్పాలి.

Box-Office: 100 కోట్లకు చేరువలో కార్తీకేయ-2

0

తెలుగు సినిమా పరిశ్రమలోని టైర్ 2 యువ హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు. గత వారం నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సాధించిన ఘనత గురించే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. నిఖిల్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన కార్తీకేయ 2, అక్కడితో ఆగకుండా తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి చేర్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

2014 లో వచ్చిన కార్తికేయ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా కార్తికేయ 2 తెరకెక్కించారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన చందూ మొండేటి నే సీక్వెల్ కి కూడా బాధ్యతను మోశారు. ఈ సినిమా వల్ల నిఖిల్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.

యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో వచ్చిన కార్తీకేయ 2 ప్రేక్షకులను విశేష స్థాయిలో ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ అయ్యింది.ఆగస్టు 13న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రచార కార్యక్రమాల సమయంలో చిత్ర బృందం ఈ సినిమా విజయం మీద ఉన్నప్పటికీ, విడుదల తేదీ పలు మార్లు వాయిదా పడటం వల్ల ఒక దశలో మాత్రం తీవ్ర ఒత్తిడిని ఎదురుకున్నారు.

అయితే సినిమా విడుదల అయిన తరువాత వారి నమ్మకమే గెలిచింది. ఈ సినిమా సంచలన స్థాయిలో హిట్ గా ముద్రను వేసుకోవడంతో ఆశ్చర్యపోవడం అందరి వంతూ అయింది.అంతే కాకుండా ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే పెట్టుబడిని రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. రెండో వారంలో కూడా ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది.

ఇక హిందీలో అయితే అనూహ్యంగా ఈ చిత్రం ఆదరణకు నోచుకుంది. ఈ సినిమాలో శ్రీకృష్ణుడి గొప్పతనం గురించి చాటి చెప్పడంతో ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు అభిమానులు అయిపోయారు. ఉత్తరాదిన కార్తీకేయ 2 ప్రభంజనానికి అడ్డే లేకుండా పోయింది. రిలీజ్ అయిన 9వ రోజు 4 కోట్ల రూపాయలను వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది.

ఇప్పటి వరకూ తన థియేట్రికల్ రన్ లో 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇంకా జోరు తగ్గలేదు అన్న తరహాలో తన హవాను కొనసాగిస్తోంది. ఈ ఊపు చూస్తుంటే త్వరలోనే 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఎంతైనా ఉంది.

ఒకవేళ అదే గనక జరిగితే హీరో, నిఖిల్, చిత్ర బృందం తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా చాలా సంతోషిస్తారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు.

బిజినెస్ మ్యాన్ సీక్వెల్ కు అవకాశం ఉంది – పూరి జగన్నాథ్

0

పోకిరి అనే సినిమా మహేష్ బాబు కెరీర్‌లో ఒక మైలురాయిగా మిగిలిపోయిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తరువాత ఆరు సంవత్సరాలకు మహేష్ – పూరి కాంబినేషన్లో వచ్చిన బిజినెస్‌మెన్ కూడా మహేష్ కెరీర్ లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.అయితే ఈ రెండు చిత్రాల తరువాత మహేష్ బాబు – పూరి జగన్నాథ్ మళ్ళీ కలిసి ఏ సినిమాకీ పని చేయలేదు. జన గణ మన అనే సినిమా ఇద్దరి కలయికలో వస్తుందని చాలా సార్లు పుకార్లు షికార్లు చేసినా అవేవీ కార్య రూపం దాల్చలేదు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పోకిరి మరియు బిజినెస్ మాన్ చిత్రాల సీక్వెల్స్ ఆలోచన గురించి పూరి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.బిజినెస్ మ్యాన్ సినిమాను ఫ్రాంచైజీగా తెరకెక్కించే ఐడియా తనకు ఉందని, ఆ వెసులుబాటు ఉందని పూరీ జగన్నాథ్ అన్నారు. అంతే కాకుండా సూర్య భాయ్ క్యారెక్టర్‌తో ఇంకా చేయించాల్సినవి చాలా ఉన్నాయని కూడా అన్నారు. పోకిరి సినిమాకు కూడా సీక్వెల్ వచ్చే అవకాశం ఎంతైనా ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

పూరి జగన్నాథ్ నిజానికి ఈ రెండు సినిమాల సీక్వెల్ తాలూకు ఆలోచన ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదని, 2010 సమయంలోనే తనకు ఈ ఆలోచన వచ్చిందని, కానీ మహేష్ ఆ సమయంలో ఇతర సినిమాలతో చాలా బిజీగా ఉండటం వల్ల ఆ ఆలోచనలకు మహేష్ తో చర్చించే అవకాశం రాలేదని అందుకే ఆ రెండు చిత్రాల సీక్వెల్ లు తెరకెక్కించలేదని పూరి తెలిపారు.

పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ అవగా, బిజినెస్ మాన్ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి అంతటి భారీ ఘన విజయం సాధించిన సినిమాలకు ఒకవేళ నిజంగా సీక్వెల్స్‌ వస్తే అవి ఏ స్థాయిలో ఉంటాయో అనేది ఊహకి కూడా అందని విషయం.

అయితే బిజినెస్‌మెన్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ తన విజయ పరంపరను కొనసాగించలేకపోయారు. వరుస ఫ్లాపులతో తన స్థాయికి తగ్గ సినిమాలను రూపొందించలేకపోయారు.

ఆ తరువాత ఆయన చేసిన సినిమాల్లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎన్టీఆర్ నటన విశేష స్పందనను తెచ్చుకుంది. అయితే టెంపర్ తరువాత మళ్ళీ కొన్ని ప్రేక్షకుల పై ఏమాత్రం ప్రభావం చూపని సినిమాలు తీసిన తరువాత ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఇక ఆ చిత్రం తరువాత రౌడి స్టార్ విజయ్ దేవరకొండతో తాజాగా లైగర్ సినిమాను చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ విడుదలకు మరొక్క రోజే ఉంది. ఈ సినిమాపై దర్శకుడు పూరితో పాటు హీరో విజయ్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి వారి అంచనాలకు తగ్గట్టు సినిమా రాణిస్తుందా లేదా అన్నది చూడాలి.

Box-Office: అమీర్ ఖాన్ సినిమా.. అక్కడ హిట్టే

0

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని వయాకామ్ 18 పిక్చర్స్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై అమీర్ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే నిర్మించారు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మన అక్కినేని వారసుడు నాగ చైతన్య బాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. హాలీవుడ్ లో దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన ‘ఫారెస్ట్ గంప్’ చిత్రం ఆధారంగా దాదాపు రూ. 180 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ వంటి డిజాస్టర్ తరువాత అమీర్.. దాదాపు నాలుగేళ్ల పాటు విరామం తీసుకుని ఎంతో ఇష్టంగా ‘లాల్ సింగ్ చడ్డా’ ను తెరకెక్కించారు. స్వతహాగా సినిమా పబ్లిసిటీ అంటే అమీర్ చాలా విస్తృత స్థాయిలో చేస్తారు. లాల్ సింగ్ చడ్డా సినిమాకు ఇంకా భారీ స్థాయిలో ప్రచారం చేశారు. తెలుగులో నాగ చైతన్య తెలిసిన హీరో అవడంతో ఇక్కడకి వచ్చి మెగాస్టార్ చిరంజీవి మరియు నాగార్జునతో ప్రత్యేక ఇంటర్వ్యూను కూడా నిర్వహించారు. అంతే కాక ఈ చిత్రానికి తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా కూడా వ్యవహరించారు.

అమీర్ ఖాన్ అన్ని రకాల ప్రయత్నాలు చేసినా . చివరికి లాల్ సింగ్ చడ్డా ఆయనకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఇందుకు కారణం ఈ సినిమాకు మొదటి నుంచీ హిందీ ప్రేక్షకుల్లో సరైన అసక్తి లేకపోవడమే. అమీర్ ఖాన్ నుండి ఎప్పుడో హాలీవుడ్ లో వచ్చిన సినిమా రీమేక్ అనగానే ప్రేక్షకులు పెదవి విరిచారు. దానికి తోడు పాటలు, ట్రైలర్ ఏవీ కూడా అంతగా ప్రేక్షకులని ఆకట్టు కోవడంలో విఫలం అయ్యాయి. ఇక ఈ చిత్రానికి మరో దెబ్బ బాయ్ కాట్ నినాదాలు.

థియేటర్ల వద్ద ప్రేక్షకులు సరైన రీతిలో రాని కారణంగా కొన్ని షోలని రద్దు చేయాల్సి వచ్చిందంటే ఈ సినిమా ఎంతటి దారుణమైన ఫలితాన్ని అందుకుందో అర్థం చేసుకోవచ్చు. అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్ నటించిన ఈ సినిమా ఇండియా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లలో దాదాపు సగం రాబట్టింది..బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది.

అయితే ఓవర్సీస్ లో మాత్రం లాల్ సింగ్ చడ్డా బాగానే వసూళ్లను రాబడుతోంది. ఈ ఏడాది విదేశాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన హిందీ చిత్రంగా ‘లాల్ సింగ్ చడ్డా’ సరికొత్త రికార్డుని తన సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో 7.5 మిలియన్ డాలర్ల వరకూ వసులు చేసి ఇప్పటి దాకా ప్రథమ స్థానంలో ఉన్న ‘గంగూబాయి కతియావాడి’ (7.47 మిలియన్ డాలర్స్) రెండవ స్థానంలో ఉన్న ‘భూల్ భూలయ్యా 2 (5.88 మిలియన్ డాలర్స్) దాటేసింది.

ఆ రకంగా భారత దేశ వ్యాప్తంగా భారీ డిజాస్టర్ గా నిలిచిన ‘లాల్ సింగ్ చడ్డా’.. విదేశాల్లో మాత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవటం చిత్ర నిర్మాతలకు కాస్త ప్రశాంతతను ఇస్తుంది. ఖచ్చితంగా లాల్ సింగ్ చడ్డా ఓవర్సీస్ ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరిచింది అనే చెప్పాలి.

కంటెంట్ ఏ హీరో అని నిరూపిస్తున్న కార్తీకేయ-2.. లైగర్

0

కరోనా దాడుల అనంతరం అన్ని సినీ పరిశ్రమలు కొన్ని రోజులు గడ్డు కాలాన్ని ఎదురుకున్నాయి. ఒక దశలో సినిమాలు విడుదల చేయాలంటే అటు నిర్మాతలతో పాటు హీరో హీరోయిన్లకు కూడా వణుకు పుట్టే పరిస్థితి ఏర్పడింది. అయితే మారిన ప్రేక్షకుల అభిరుచుల కారణంగా కొన్ని రోజులు నిజంగానే కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ.. బాలీవుడ్ మినహా మిగతా పరిశ్రమలు వరుస విజయాలతో ఒక కొలిక్కి వచ్చాయి.

ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు ఆగస్టు నెల అత్యంత విజయవంతమైన సినిమాలను అందించింది. మొదటి వారంలో బింబిసార, సీతా రామం సినిమాలు అద్భుతమైన స్పందనను సొంతం చేసుకున్నాయి. అటు విమర్శకుల ప్రశంసలు, ఇటు బాక్స్ ఆఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధించి పరిశ్రమకు పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చాయి.

ఇక ఆ తరువాతి వారం విడుదలైన కార్తీకేయ 2 సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శ్రీకృష్ణుని తదనంతరం దాచి ఉంచిన ఒక కంకణం అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం విశేష స్థాయిలో ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. తొలి రోజు చాలా తక్కువ స్రీన్లతో ప్రారంభం అయినా, మౌత్ టాక్ విపరీతంగా ఉండటం వలన స్క్రీన్ లను పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు దాదాపు మూడు వేల సీన్లలో ప్రదర్శింపబడుతుంది. రెండు వారాల బాక్స్ ఆఫీస్ రన్ లోపే హిందీ మార్కెట్ లో 25 కోట్ల గ్రాస్ కు పైగా రాబట్టింది.

ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన తాజా సినిమా ‘లైగర్’. క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కించారు. పూరి కనెక్ట్స్ మరియు ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ లపై పూరి-చార్మి, కరణ్ జోహార్ తో పాటు అపూర్వ మొహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనన్య పాండే హీరోయిన్ గా నటించగా.. వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఆగస్టు 25న మరి కొన్ని గంటల్లో థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రానికి కూడా హిందీ ప్రేక్షకుల్లో చక్కని ఆసక్తి ఏర్పడింది.

ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. కార్తీకేయ 2 విజయం సాధించడానికైనా, ఇప్పుడు లైగర్ సినిమాకి క్రేజ్ రావడనికైనా ఒకటే కారణం.

సరైన కంటెంట్ ఉంటే మాత్రమే హిందీ మార్కెట్లో సినిమాకు విజయం దక్కుతుంది. చిన్న హీరోల దగ్గరనుంచి బాలీవుడ్ స్టార్ లు కూడా ప్రేక్షకులను థియేటర్లలోకి తీసుకురావడంలో విఫలమవుతున్న తరుణంలో.. కార్తికేయ2 ఎటువంటి భారీ ప్రమోషన్లు లేకుండా ఇంత పెద్ద విజయం సాధించింది. పైగా ఇప్పుడు లైగర్ బుకింగ్స్ కూడా బాగా ఉన్నాయి, ఉత్తరాదిన ఈ చిత్రం లాభసాటి బేరంగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులకు హీరోల కంటే కంటెంట్ ముఖ్యమని ఈ రెండు చిత్రాలకి దక్కిన ఆదరణ రుజువు చేస్తోందనే చెప్పాలి.

మారుతి తో సినిమా పై ఆందోళనలో ఉన్న ప్రభాస్ అభిమానులు

0

బాహుబలి తరువాత వరుసగా భారీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్.. కాస్త రిలీఫ్ గా ఉంటుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు మారుతితో ఒక హారర్ – కామెడీ సినిమా చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ నిర్ణయం పై ప్రభాస్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎవరో కొంత మంది తప్ప అందరు అభిమానులు ప్రభాస్ ఈ సినిమాని చేయడం పట్ల ఏ మాత్రం సుముఖంగా లేరు.

కాగా మధ్యలో మారుతి తో ప్రభాస్ చేయబోయే ప్రాజెక్ట్ నిలిపివేయబడిందని పుకార్లు రావడంతో అవి నిజమేనని అందరూ భావించారు. ప్రభాస్ అభిమానులు కూడా ఈ వార్త విని ఎంతగానో సంతోషించారు. అయితే వారిని నిరాశకు గురిచేస్తూ ఈ రోజు ప్రభాస్, మారుతిల సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమం జరిగింది.

నిజానికి దర్శకుడు మారుతి నిన్న మొన్నటి వరకూ నిలకడగా విజయాలను అందించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ గత కొన్ని రోజులుగా చిత్రంగా ఆయన సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి . ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చిన రెండు చిత్రాల ఫలితాలు కెరీర్ దారుణంగా ఉండటంతో ఆశ్చర్య పోవడం అందరి వంతూ అయింది.

మంచి రోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. అలాంటి నేపథ్యంలో ప్రభాస్‌కు ఉన్న పలుకుబడి దృష్ట్యా, మారుతీతో ఆయన తదుపరి సినిమా చేయడం గురించి ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఆయనకు ఉన్న స్టార్‌డమ్ మరియు మార్కెట్ విలువను ప్రభావితం చేసే అవకాశం ఉన్న కారణంగా అభిమానులుఈ కాంబినేషన్ తో సంతోషంగా లేరు.

బాహుబలి సక్సెస్ తర్వాత ప్రభాస్ భారీ హిట్ సాధించలేదు.. అందుకే ఆయన ఎప్పుడు మళ్ళీ భారీ విజయం సాధిస్తారు అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో మారుతి తో సినిమా వద్దని ఆయన అభిమానులు ట్విట్టర్‌లో #BoycottMaruthi అనే హ్యాష్‌ ట్యాగ్‌ ని ట్రెండ్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, సాలార్ సినిమాల పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా చాలా ఉత్కంఠ నెలకొంది, కానీ మారుతి చిత్రానికి మాత్రం ఎవరూ అంత ఆసక్తితో ఉన్నట్లు కనిపించట్లేదు.

లైగర్ సినిమా OTT రిలీజ్ డిటైల్స్

0

యువ సంచలనం.. రౌడి స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ (సాలా క్రాస్‌ బ్రీడ్) ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ మాస్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించారు.

ఈ చిత్రానికి ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాలు, ఉత్తరాది ఏరియాలతో పాటు ఓవర్సీస్ బుకింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కేవలం విజయ్ దేవరకొండ స్టార్ డం వల్ల ఇది సాధ్య పడిందని చెప్పవచ్చు. యూత్ లో విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్ లో ఉంది. అందుకే బుకింగ్‌లు చాలా వేగంగా హౌజ్ ఫుల్ గా నమోదు అవుతున్నాయి. ఇది చిత్ర యూనిట్‌ ను ఎంతగానో ఉత్సాహపరిచింది. కేవలం హైదరాబాద్ బుకింగ్స్ తోనే రూ. 3 కోట్ల గ్రాస్‌ను దాటడం విశేషం. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ చిత్రం విజయ్ మరియు పూరి కెరీర్‌లో బెస్ట్ డే 1 కలెక్షన్స్ సాధిస్తుందని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. ఒకప్పుడు సినిమా థియేటర్లలో విడుదల అయిన ఆరు నెలల తర్వాత కానీ టీవీలలో ప్రసారం అయ్యేవి కావు. కానీ ఓటిటి లు వచ్చాక ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు కొన్ని సినిమాలు నేరుగానే ఓటిటిలో విడుదల అవడం ఒక సాధారణ విషయంగా మారింది. ఇక ఇప్పుడు తెలుగు సినీ ప్రేక్షకులు ఒక సినిమాను ధియేటర్ లో చూస్తున్నపుడు ఆ సినిమా ఏ ఓటిటీ ప్లాట్ ఫారం లో వస్తుందో తెలుసుకోవాలని ఆశ పడుతున్నారు.

తాజాగా ఈరోజు విడుదలైన లైగర్ చిత్రం తాలూకు OTT స్ట్రీమింగ్ భాగస్వామిని ఎవరో తెలిసిపోయింది. ప్రముఖ OTT ప్లాట్‌ ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను భారీ ధరకు పొందిందని సమాచారం. అయితే ఎన్ని రోజుల తరువాత ఓటిటిలోకి అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియ రాలేదు. అక్టోబర్ 5న విడుదల కావచ్చని కొన్ని వార్తలు వచ్చాయి. మరి నిజమో కాదో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

ఈ పాన్ ఇండియా మూవీలో బాక్సింగ్ ఛాంప్ మైక్ టైసన్, రమ్య కృష్ణన్, విషు రెడ్డి, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించారు. అత్యధిక హైప్ తో విడుదలైన లైగర్ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

TRP రేటింగుల రెస్ లో వెనకబడిన ఆర్ ఆర్ ఆర్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ప్రధాన పాత్రల్లో.. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) ఎంతటి ఘన విజయం సాధించింది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై దాదాపు 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తరువాత ఒటీటి లో కూడా తన హవాను కొనసాగించింది. కాగా ఈ సినిమా ఇటీవల టీవీలో ప్రసారం అయ్యింది.

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభను అద్భుతంగా చూపిన ఈ చిత్రంలో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు తమ నటనతో కూడా మెప్పించారు. తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కింది ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీగా నిర్మించారు. అందరి అంచనాలను అందుకుంటూ ప్రేక్షకులందరినీ అలరించింది. కరోనా దాడుల వల్ల అనేక సార్లు వాయిదా పడిన తర్వాత ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25న విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషాల్లో విడుదలైన ఈ సినిమా భాషలకు అతీతంగా ఖ్యాతిని గడించింది.

ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. ఇక థియేటర్లలో రన్ ముగిసిన తరువాత ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (హిందీ), జీ5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) లో స్ట్రీమింగ్ కాబడింది. ఆ క్రమంలో, ఈ సినిమా అంతర్జాతీయ గుర్తింపను సొంతం చేసుకుంది. హాలీవుడ్ లోని ప్రేక్షకులతో పాటు అక్కడి సెలబ్రిటీలకు సైతం ఆర్ ఆర్ ఆర్ ఎంతగానో నచ్చింది.

ఇక ఈ చిత్రం గత ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ అయి టీవీ ప్రేక్షకులను, అభిమానులను అలరించింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీఆర్పీ తాజాగా విడుదల అయ్యింది. ఈ చిత్రం స్టార్ మాలో ప్రసారం అవ్వగా, దీనికి 19.6(urban), 18.36 (urban+rural) టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది… అయితే ఇది ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాకు రావాల్సిన రేటింగ్ కాదని అభిమానులతో పాటు విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అంత ప్రజాదరణ పొందిన సినిమాకు ఇంత తక్కువు రేటింగ్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫిదా, రంగస్థలం వంటి సినిమాల కంటే ఆర్ ఆర్ ఆర్ తక్కువగా రావడం ఏంటని అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక తెలుగులో టీఆర్పీ రేటింగ్ పరంగా రికార్డు సృష్టించిన సినిమాల విషయానికి వస్తే.. అల వైకుంఠపురములో (29.4), సరిలేరు నీకెవ్వరు, (23.4) బాహుబలి 2 (22.7) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

RRR Gets Shockingly Low Rating From TV Premiers

0

RRR has undeniably been a smash hit not only in India but overseas as well. In fact, the success of RRR in the USA has been truly amazing to see. The general audience has lapped up the film with open arms and given the film a lot of love.

So much so that RRR is in contention for the Oscars as well. A lot of Hollywood film reporters believe that RRR will be nominated for Best International Feature Film. RRR has also been trending on Netflix for over 10 weeks consecutively. This is a highly impressive feat for any film.

But what is shocking is the TV Ratings of RRR. The film has posted shockingly low TV ratings from its premiers. The film was expected to shatter all existing TRP records but the exact opposite has occurred. RRR has recorded a U+R:18.36 rating and U: a 19.61 rating.

It is far behind Allu Arjun’s Pushpa: The Rise as well as AVPL, which stands at 23.4 and 29.4 respectively. The only possible reason for this is that most of the audiences have already watched RRR and did not bother about the television premiere.