Home Blog Page 2041

Will Prabhas Break Mahesh Babu And Pawan Kalyan’s Record

0

Mahesh Babu’s Pokiri special shows set the bar very high for special shows when the film was screened on the special occasion of Mahesh Babu’s birthday. The shows generated mass hysteria among the audiences and the movie collected over 2+ crores in gross and was screened for over 375+ shows.

After Mahesh Babu’s display of stardom, Pawan Kalyan fans decided to take the bar higher. On the occasion of Pawan Kalyan’s birthday, fans have planned for a re-release of his iconic film Jalsa. Going by the bookings, the special shows of Jalsa are set to topple Pokiri. More than 500+ shows are expected to take place.

But it doesn’t end here, Prabhas’ Billa is also waiting in the line to wreak havoc. On the occasion of the Rebel Star’s birthday, fans are planning to re-release the 4K print version of Billa in all territories in a grand manner.

But the real question is, will Prabhas be able to break Mahesh and Pawan Kalyan’s record? It is also a surprising choice to pick Billa from a wide variety of Prabhas films. Firstly because Billa is a remake of the Tamil film Billa, which was much better than the Telugu remake. Secondly, Prabhas has made much better mass entertainers like Chatrapathi and Mirchi.

RRR Lead Heroes Playing With Upcoming Directors’ Careers

0

Ram Charan and JR.NTR are one among the biggest stars in the country right now. Post the success of RRR, their reach has transcended borders and they have become household names. Naturally, everyone is now looking forward to their upcoming films but there seems to be a slight issue.

Both Ram Charan and JR.NTR have committed to projects before signing for RRR. Jr.NTR signed a film with Uppena director Buchi Babu before RRR but now it looks like that project is on hold. NTR has repeatedly held the film’s shooting and is looking to cancel the film.

NTR’s plate is already full with Koratala Siva’s NTR30 as well as Prashant Neel’s NTR31. The actor wants to work with only established directors and hence Buchi Babu’s project is in danger. Buchi Babu is still waiting on NTR and is saving the story for him only.

Similarly, Ram Charan has also signed a film with Jersey fame director Gowtam Tinnanuri. It was touted to be a sports drama in the zone of Jersey. But Ram Charan now plans to shelve this project as he wants to work with directors who only have brand value.

Supreme Court Notices To Balakrishna, Producers, Telugu States’ Government And Gunashekar

0

In a recent turn of events, the Supreme Court has issued notices to Nandamuri Balakrishna and the team of Gautamiputra Satakarni. They also went after Anushka’s Rudramadevi. This was after the Cine Consumers Association filed a petition against the two films.

The petition focused on the idea of reducing the ticket prices by taking tax concession for the movie. To this extent, the Supreme Court has issued notices to all the respondents including Balakrishna, Krish and the producers of Gautamiputra Satakarni. They also sent notices to the governments of Andhra Pradesh and Telangana.

Notices have also been issued regarding another historical drama, Rudramadevi. Rudramadevi was directed by Gunashekar and starred Anushka Shetty in the lead role. The film was released on October 2015.

Since both the above mentioned films are historical dramas, the government has given a tax concession. However, years later, The Cinema Audience Consumers’ Association has filed a petition stating that the ticket prices have not been reduced even after taking the concession.

They pleaded that the benefits of the tax concessions were not transferred to the moviegoers. They demanded that the government should recover the money back. Supreme Court judge Justice DY Chandra Choudh heard the case and issued notices, asking for explanations also.

Box-Office: కోబ్రాతో కమ్ బ్యాక్ ఇవ్వనున్న చియాన్ విక్రమ్

0

తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన తాజా సినిమా ‘కోబ్రా’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకుడు. అరుళ్ నిధితో ‘డీమోంటీ కాలనీ’.. నయనతార, అధర్వ, అనురాగ్ కశ్యప్ కాంబినేషన్లో ‘ఇమైక్కా నోడిగల్ ‘ వంటి యాక్షన్ థ్రిల్లర్ లని అందించిన అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన మూడవ సినిమా ‘కోబ్రా’.

చియాన్ విక్రమ్ గత కొంత కాలంగా స్టార్ హీరోగా తన ఫామ్ ని కోల్పోయారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా వరకు మంచి ఓపెనింగ్స్ ను సాధించలేకపోయాయి, అయితే కోబ్రా సినిమా మాత్రం ప్రేక్షకులలో చాలా మంచి బజ్‌ను సృష్టించింది, తమిళ నాట ఈ చిత్రానికి చక్కని అడ్వాన్స్ బుకింగ్‌లు నమోదయ్యాయి. కాగా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తమిళ బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు రెండంకెల సంఖ్యలతో ప్రారంభం కానుందని అంచనా. ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద విక్రమ్ తన స్టార్డం ను తిరిగి పొందుతారని అందరూ భావిస్తున్నారు.

‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. కాగా మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్ గా నటించడం విశేషం. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రిలీజ్ డేట్ ని మార్చేసి కొత్త రిలీజ్ డేట్ అంటే ఆగస్ట్ 31న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్ర బృందం ప్రకటించారు.

తమిళంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లో కూడా విడుదల కానున్న ఈ సినిమాలో మియాజార్జ్, పద్మప్రియ, మృనాళిని రవి, ఆనంద్ రాజ్, కె.ఎస్. రవికుమార్, రోబో శంకర్, బాబు ఆంటోనీ తదితరులు నటించారు.

రష్యా నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో హీరో విక్రమ్ దాదాపు 20 విభిన్నమైన గెటప్ లలో కనిపించనున్నారని సమాచారం. ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ట్రైలర్ లు కూడా ఆకట్టుకున్నాయి. విక్రమ్ చివరిగా నటించిన మహాన్ చిత్రం నేరుగా ఓటిటిలో విడుదలయింది. ఆ చిత్రంలో విక్రమ్ తనయుడు అయిన ధ్రువ్ విక్రమ్ కూడా నటించారు. తండ్రీ కొడుకులు పొటీ పడి నటించిన తీరుకు గొప్ప ప్రశంసలే దక్కాయి.

అయితే బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించాల్సిన నేపథ్యంలో విక్రమ్ తిరిగి తన ఫార్మ్ ను అందుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పలు రకాల గెటప్పులు అంటూ హంగామా చేసినా.. సరైన కంటెంట్ ఉంటేనే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే మొన్నటి వరకూ కాస్త నీలినీడలు కమ్ముకున్నట్లు ఉన్న కోబ్రా చిత్రం ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయిన తరువాత ఊపు అందుకున్నట్లు కనిపిస్తుంది. మరి భారీ హిట్ కొట్టలన్న రానున్న విక్రమ్ ఆశను ప్రేక్షకులు నెరవేరుస్తారా లేదా అన్నది తెలియాలంటే ఇంకొక్క రోజు వేచి చూడాల్సిందే.

Power Star Pawan Kalyan’s Jalsa is on track to break Mahesh Babu’s Pokiri

0

Re-releases are the flavour of the season. After the massive success of Mahesh Babu’s Pokiri and Okkadu, Megastar’s Gharana Mogudu was screened for his birthday. However, it failed to live up to the expectations. Now, Power Star Pawan Kalyan’s fans are organizing screenings of Jalsa and Thammudu for his birthday and if the bookings are any indication, this will be a massive success.

Pawan Kalyan’s Jalsa in particular is on its way to superb success with large-scale screenings planned the world over. The show numbers are increasing day by day and more than 500 shows are expected. The advance bookings are very good there is a very good demand for tickets in all stations.

The movie is on track to break Pokiri re-release and this is great news for Pawan Kalyan fans. The special shows have been planned for September 1st. Just like Pokiri, Pawan Kalyan’s Jalsa tickets have also been in high demand and got sold out in many centers in minutes.

Directed by Trivikram Srinivas, Jalsa became a successful film at the time of release and Power Star’s style and mannerisms were loved by fans all over.

Cobra – The comeback of Chiyaan Vikram at box office

0

2022 is an extremely crucial year for Vikram. After the release of his ambitious project Mahaan co-starring his sone Dhruv Vikram, he is now gearing up for the release of action thriller ‘Cobra’ tomorrow and mega Kollywood project Ponniyin Selvan 1 later this year.

Vikram’s movies are continuously failing at box office with most of his recent films not being able to put decent opening at box office. However, Cobra has created very good buzz among the audience. The advance bookings started on a good note and the film is expected to open with double digit numbers in Tamil Nadu. Looking at the positive buzz and bookings, it looks like the film will mark a strong return of Vikram at box office.

Cobra is an action-thriller which will feature Vikram in nearly 20 different looks. Srinidhi Shetty is playing the lead opposite the Kollywood star while cricketer Irfan Pathan is marking his debut with this film as a villain. The film has been made on a budget of Rs 90 crore and R. Ajay Gnanamuthu has directed it.

డాన్స్ ఇండియా డాన్స్ ప్రోగ్రాంలో కనువిందు చేసిన మహేష్ – సితార

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే నటించనున్నారు. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఈ చిత్రం (SSMB28) సినిమా ఎప్పుడు మొదలవుతోందా అని ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఊహలకు భిన్నంగా వారికి చిన్న కానుక అందించారు మహేష్. వెండితెర పై కాకుండా.. మహేష్ సాధారణంగా ఇంటర్వ్యూలు లేదా ఇతర రియాల్టీ షోలకు చాలా అరుదుగా వస్తుంటారు. అయితే తాజాగా జీ తెలుగు వారు నిర్వహిస్తున్న డాన్స్ రియాల్టీ షోలో తన కూతురు సీతారతో కలిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

మహేష్ – సితార కలిసి తొలిసారిగా టీవీ షోలో కనిపించడంతో పాటు డాన్స్ ఇండియా డాన్స్ ప్రోగ్రాం లోని యాంకర్లు, న్యాయనిర్ణేతలు మరియు పోటీదారులు కలిసి చేసిన సందడిని ప్రేక్షకులు ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ ప్రోగ్రాంలో చూసి ఆనందించవచ్చు. అంతే కాకుండా ఈ ప్రోగ్రాంలో సితార డాన్స్ పెర్ఫార్మెన్స్ మరియు తనదైన శైలిలో జరిపిన సంభాషణలు మరో ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

ఈ సందర్భంగా పోటీలను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం నటుడు మహేశ్‌బాబు మాట్లాడుతూ.. “సితారకు డ్యాన్స్‌ పై ఉన్న మక్కువ మమ్మల్ని డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ తెలుగు వద్దకు వచ్చేలా చేసింది. నా కుమార్తెతో వేదికపై ఉండటం చాలా ఉత్సాహంగా మరియు ఆనందంగా ఉంది అన్నారు. అలాగే ఇప్పటికే ఈ కార్యక్రమం వివిధ భాషలలో ఒక సంచలనం సృష్టించింది. ఆ కోవలోనే తెలుగు వెర్షన్ కొరకు జీ తెలుగు మరియు డాన్స్ ఇండియా డాన్స్ టీమ్ మారుమూల ప్రాంతాలనుండి భిన్న నేపథ్యాలు గల ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడం నాకు సంతోషంగా ఉంది” అన్నారు.

ఇక సితార కూడా ఈ కార్యక్రమానికి రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. “మొదటి సారి నేను వేదికపై నేను, నా పక్కన నాన్న ఉండటం చాలా ప్రత్యేకమైన క్షణం. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం & డాన్స్ ఇండియా డాన్స్ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్న అద్భుతమైన ప్రతిభ గల పోటీదారుల ప్రదర్శన చూడటం చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ ప్రదర్శన నాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. నేను చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. అది ప్రతి ఒక్కరూ చూసే వరకు నేను వెయిట్ చేయలేను. నన్ను డాన్స్ ఇండియా డాన్స్ తెలుగులోకి తీసుకెళ్లినందుకు నాన్నకు కృతజ్ఞతలు చెప్పాలి” అన్నారు.

ఈ సందర్భంగా జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు హీరో మహేష్ బాబుకు ధన్యవాదాలు తెలుపుతూ.. “డాన్స్ ఇండియా డ్యాన్స్ తెలుగు పోటీకి సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఆయన కూతురు సితార విచ్చేయడం మా అదృష్టం. ఇటీవలి కాలంలో ఏ టెలివిజన్ షోల భారీ లాంచ్‌లలో అయినా ఈ షో ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. డాన్స్ ఇండియా డాన్స్ తెలుగులో పోటీదారులు ప్రతిభ అపారమైనది. ప్రతి వారం వారు ఇచ్చే అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ షో ప్రదర్శన కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నాము. మహేష్ బాబు, సితార మొదటిసారి టీవీలో కలిసి కనిపించడం మా షోకు లభించిన భారీ ప్రోత్సాహం. అంతే కాకుండా, వారిని చూడటం అభిమానులకు మరియు వీక్షకులు పెద్ద సంబరంలా జరుపుకుంటారు ” అన్నారు.

పూరి తప్పుడు నిర్ణయం వల్ల కోట్లు నష్టపోయిన ఛార్మీ

0

లైగర్ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న తరుణంలో.. సినీ ప్రేమికులతో పాటు పరిశ్రమ వర్గాల నుండి అనేక రకమైన వ్యాఖ్యలకు, కథనాలు వినపడుతున్నాయి. కేవలం ఒక్క సినిమా కోసం ఎక్కువ సమయం వృధా చేయకూడదని కొందరు భావిస్తే, మరి కొందరు పూరీ ఇంత బలహీనమైన స్క్రిప్ట్‌తో పాన్-ఇండియా విడుదలకు వెళ్లకుండా ఉండాల్సిందని భావిస్తున్నారు. సాధారణంగా సినిమా పరిశ్రమలో ఒక సినిమా భారీ వైఫల్యం చెందితే.. రకరకాల కారణాలు మరియు ఆ చిత్ర బృందం మీద నిందలు వేయడం మామూలే. కానీ , లైగర్ చిత్ర ఫలితం మాత్రం ఖచ్చితంగా పూరీ మరియు ఛార్మీలకు ఒక చేదు జ్ఞాపకంగా మిగులుతుంది అనడంలో సందేహం లేదు.

పూరి మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగానే లైగర్‌కి సహ నిర్మాతగా ఉన్న ఛార్మీ కౌర్, ఇప్పుడు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. కోవిడ్ సమయంలో చాలా సినిమాలకు OTT ప్లాట్‌ ఫారమ్‌ల నుండి చాలా మంచి ఆఫర్‌లు వచ్చాయి. అందుకు నిర్మాతలు కూడా సంతోషంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లాభాలను పొందారు.

అయితే లైగర్ సినిమా కూడా ప్రముఖ OTT ప్లాట్‌ ఫారమ్ భారీ ఆఫర్‌ను అందుకుంది, ఆ అఫర్ ను చిత్ర బృందం కనుక ఒప్పుకుని ఉంటే సినిమామొత్తం బడ్జెట్‌ను చాలా సులభంగా తిరిగి పొందగలిగేది. అంతే కాకుండా ఛార్మీ, పూరీలకు భారీ లాభాలు కూడా వచ్చి ఉండేవి. అయితే ఆ సమయంలో ఛార్మీ ఆఫర్ తీసుకోవడానికి ఆసక్తి చూపినప్పటికీ.. పూరి అందుకు ఒప్పుకోకుండా సినిమాను థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించారట. ఇప్పుడు ఈ నిర్ణయం వారికి కోట్లాది నష్టాలను మిగిల్చింది.

లైగర్ సినిమా తాలూకు థియేట్రికల్ రైట్స్ దాదాపు 90కోట్ల వరకూ అమ్ముడయ్యాయి. కానీ కలెక్షన్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి, 60 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చే దశలో ఉన్న లైగర్ చిత్రం.. పూరీ మరియు విజయ్ దేవరకొండల కెరీర్‌ లోనే కాకుండా మొత్తంగా తెలుగు సినీ చరిత్రలో కూడా అతి పెద్ద డిజాస్టర్‌ లలో ఒకటిగా నిలిచింది.

హీరో బాలకృష్ణ – దర్శకుడు గుణశేఖర్ లకు సుప్రీం కోర్టు నోటీసులు

0

నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన హీరోగా నటించిన వందవ చిత్రం అయిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకి పన్ను రాయితీ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం వద్ద నుంచి పన్ను రాయితీ తీసుకున్న తరువాత కూడా ఆ చిత్రానికి ధియేటర్లలో టికెట్ రేటు తగ్గించలేదని సినీ వినియోగదారుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు బదలాయించలేదని కోర్టు వెల్లడించింది.

ఈ మేరకు హీరో బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ నిర్మాతలతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సహా ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. మరో వైపు.. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రుద్రమదేవి’కి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఈ రెండూ చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు కావడం వల్ల అప్పటి టీడీపీ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది.

అయితే పన్ను రాయితీ పొందిన డబ్బు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి రికవరీ చేయాల్సిందిగా పిటిషన్‌లో కోర్టు విజ్ఞప్తి చేసింది. ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. వై.చంద్ర చూడ్ ధర్మాసనం.. మొత్తం వ్యవహారం పై సరైన వివరణ ఇవ్వాల్సిందిగా సినీ నటుడు బాలకృష్ణ, సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.

గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా బాలకృష్ణ కెరీర్‌లో 100వ సినిమాగా తెరకెక్కింది. మహారాజు శాతకర్ణి జీవితం ఆధారంగా తీసిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి చక్కని స్పందనను సొంతం చేసుకుని ఆకట్టుకుంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తనదైన శైలిలో వెండితెర పై చూపించారు. హేమమాలిని, శ్రియ కీలక పాత్రల్లో నటించారు. 2017 జనవరిలో బాక్సాఫీసు ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను రాయితీ ఇచ్చాయి.

ఇక, రుద్రమదేవి విషయానికి వస్తే.. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కిచ్చారు. కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కృష్ణంరాజు, అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్.. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే 2015లో విడుదలైన ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పన్ను రాయితీ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి ఆంధ్రా ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన సమయంలో.. రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వకపోవడం పై ఆవేదన వ్యక్తం చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు గుణశేఖర్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ లేఖ పెద్ద దుమారాన్నే రేపింది.

Box-Office: లైగర్ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

0

విజయ్ దేవరకొండ “లైగర్” ఈ నెల 25న విడుదలైన సంగతి తెలిసిందే. భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమాని విమర్శకులతో పాటు ప్రేక్షకులు కూడా ఫస్ట్ షోలోనే మ్యాటర్ లేని సినిమా అని తేల్చేశారు. సాధారణంగా కొన్ని సినిమాలకి ముఖ్యంగా ఈ మధ్య రివ్యూలు అటు ఇటు అయినా సినిమాలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి లైగర్ సినిమా విషయంలో విమర్శకుల మాట, ప్రేక్షకుల మాట ఒకటే అయింది.

లైగర్‌ ను మొదటి రోజు మ్యాట్నీ షో నించే కలెక్షన్లు కిందకి పడిపోతూ వచ్చాయి. రౌడీ స్టార్ – పూరీ జోడీ బాక్సాఫీస్ వద్ద ఇరగదీస్తుంది అనుకుంటే అందరి అంచనాలను త్రుంగలో తొక్కినట్లు గా సినిమా పరిస్థితి ఏర్పడింది. ఆదివారం రోజు కూడా చాలా థియేటర్లు పూర్తిగా ఖాళీగా కనిపించాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మొదటి రెండు రోజులు కలిపి హిందీలో డబుల్ డిజిట్ నెట్ సాధించినా.. కలెక్షన్లలో ఎదుగుదల లేదు.

మొదటి వారాంతంలో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 13.5 కోట్ల షేర్ వసూలు చేసింది , సినిమా తొలి రోజు భారీ ఓపెనింగ్ షోలతో మొదలై తర్వాత టాక్ పెరిగి ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. అంతే కాకుండా ఈ నాలుగు రోజుల్లో వచ్చిన షేర్ ఏ ఇంక దాదాపు క్లోజింగ్ షేర్ గా పరిగణించవచ్చని ట్రేడ్ వర్గాలు తేల్చాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇలా ఈ మూడు రాష్ట్రాల వసూళ్లు ఉమ్మడిగా లెక్కిస్తే దాదాపు 2 కోట్లు వచ్చింది. ఇక సౌత్ ఇండియా మొత్తం మీద 15.5 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్ నుండి ఈ చిత్రం దాదాపు 6.5 కోట్ల షేర్‌తో, 13.5 కోట్ల నెట్‌ను వసూలు చేసింది.

ఆ రకంగా మొత్తం భారతదేశం షేర్ 22 కోట్లకు చేరుకోగా.. ఓవర్సీస్ షేర్ కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల వరకు షేర్ సంపాదించింది. ఈ చిత్రానికి అయిన థియేట్రికల్ హక్కుల విలువ దాదాపు 90 కోట్లు. ఆ రకంగా చూసుకుంటే లైగర్ భారీ నుంచి అతి భారీ నష్టాలను మూట గట్టుకుంది అనే చెప్పాలి.

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో అనన్య పాండే మరియు రమ్య కృష్ణన్ కీలక పాత్రల్లో నటించారు. కరణ్ జోహార్, పూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన లైగర్ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు మలయాళంలో కూడా విడుదలైంది.