Home Blog Page 2015

‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ విడుదలకు కారణం ‘స్రవంతి’ రవికిశోర్ గారే అంటున్న గౌతమ్ మీనన్

0

తమిళ స్టార్ హీరో శింబు కథానాయకుడిగా, అభిరుచి గల దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ‘వెందు తనిందదు కాడు’. ఈ చిత్రంలో సిద్దీ ఇధ్నానీ కథానాయికగా నటించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. తమిళంలో గురువారం విడుదలై అద్భుతమైన టాక్ ను, మరియు విమర్శకుల నుండి గొప్ప ప్రశంసలను అందుకుంది ఈ చిత్రం.

కాగా ఈ చిత్రాన్ని ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ విడుదల చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్రం మార్నింగ్ షోలు సరైన సమయానికి మొదలవలేదు. ఐతే మ్యాట్నీ షో నుండి సినిమా చూసిన అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో తెలుగు మీడియాతో చిత్ర బృందం ముచ్చటించింది.

దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ ”నిజానికి మొదట్లో ఈ సినిమాను తెలుగులో విడుదల చేయాలనే ఆలోచన నాకు లేదు. కానీ ‘స్రవంతి’ రవికిశోర్ గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు. ‘ పాటలు విన్నాను, చాలా బావున్నాయి. అలాగే ట్రైలర్ చూశాను. నాకు బాగా నచ్చింది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేద్దాం’ అన్నారు.

తమిళనాడులో ఒక పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా కథ మొదలవుతుంది. మరి తెలుగులో విడుదల చేయాలనుకున్నప్పుడు ఏ ఊరు అయితే బావుంటుంది? హీరో మాట్లాడే యాస ఎలా ఉండాలి? అన్న విషయాల పై కొంత పరిశోధన చేశాము. అంతే కాకుండా డబ్బింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నాం . ఇంతకు ముందు నా సినిమాలకు కొన్ని రివ్యూలలో ‘గౌతమ్ మీనన్ సినిమాల్లో హీరో బైక్ మీద తిరుగుతూ అమ్మాయితో పాటలు పాడుకుంటాడు’ అని రాశారు. కానీ, ఈ సినిమాలో మాత్రం అవేవీ లేవు. నేను ఇంతకు ముందు తీసిన సినిమాలకు చాలా భిన్నమైన సినిమా ఇది అని అన్నారు.

ఈ చిత్రానికి హీరో శింబు కాబట్టి… సినిమాను ఇంత సహజంగా తెరకెక్కించగలిగాను. అదే మరో హీరో అయితే స్టార్ డమ్, ఫ్యాన్స్ వంటి విషయాల వల్ల అనవసరమైన విషయాలు జోడించాల్సి వచ్చేది. కానీ శింబు అటువంటివి పట్టించుకోడు. అందువల్ల ఈ సినిమా తీయడం చాలా సులభంగా జరిగింది. ఇక తమిళంలో పేరున్న రచయిత జయమోహన్ ఈ చిత్రానికి కథ అందించారు.

తెలుగు, తమిళ ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. దీనికి సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉంది. రెండు మూడు రోజుల్లో ఆ వివరాలు వెల్లడిస్తానని గౌతమ్ మీనన్ అన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ..గౌతమ్ మీనన్ తో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని, ఇద్దరం కలిసి ఒక సినిమా చేయాలని అనుకున్నామని.. ఆ చర్చలో భాగంగానే ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ గురించి తెలిసిందని చెప్పారు. ఇంతకు ముందు వారి సంస్థ ద్వారా విడుదలైన ‘నాయకుడు’, ‘పుష్పక విమానం’ , ‘రెండు తోకల పిట్ట’, ‘రఘువరన్ బీటెక్’ వంటి సినిమాల తరహాలో ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని అన్నారు.

హీరోయిన్ సిద్ధీ ఇధ్నానీ మాట్లాడుతూ.. గౌతమ్ మీనన్ సినిమాలో కథానాయికగా నటించడం, ఈ రోజు ఆయన పక్కన కూర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తెలుగులో సినిమాను విడుదల చేసిన నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ గారికి థాంక్స్ కూడా చెప్పారు. ఇంతకు ముందు తెలుగులో కొన్ని సినిమాలు చేశానని.. కొంత విరామం తర్వాత ఈ సినిమాతో విజయం అందుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.

భారతీయ సినిమా చరిత్రను మార్చేసిన సినిమా బాహుబలి – రాజమౌళి

0

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతూనే ఉంది. ఆ సినిమాకి అంత పెద్ద హిట్ అవుతుందని, అంతర్జాతీయంగా ఈ స్థాయిలో గుర్తింపు వస్తుందని అనుకోలేదని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఆయన తెరకెక్కించిన భారీ చిత్రాలైన ఆర్ ఆర్ ఆర్, బాహుబలి వంటి సినిమాలకు సంభందించిన విషయాలను ఆయన ఇటీవలె జరిగిన టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో వెల్లడించారు.

ఆర్ఆర్ఆర్ సినిమా కథ చేస్తున్నప్పుడు ఈ సినిమా ఇతర రాష్ట్రాల వారికి బాగా నచ్చుతుందనే నమ్మకం అంతగా ఉండేది కాదన్నారు. ఇక రాష్ట్రాలకే అలా ఉంటే దేశాలకు అతీతంగా ప్రేక్షకులకి నచ్చుతుందని, ఇంతటి భారీ ఎత్తున ప్రశంసలు వస్తాయని అసలు కలలో కూడా అనుకోలేదని రాజమౌళి తెలిపారు. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమా హాలీవుడ్ ప్రేక్షకుల ఆదరణను విశేష స్థాయిలో పొందింది అన్న విషయం తెలిసిందే. జపాన్‌లో ప్రేక్షకులకు కూడా ఆర్ఆర్ఆర్ చాలా బాగా నచ్చింది. అయితే అక్కడ వారి రివ్యూలని చూసి స్వయంగా రాజమౌళి షాక్‌కు గురయ్యారట.

హాలీవుడ్ ప్రేక్షకులతో పాటు అక్కడి స్టార్లు, హాలీవుడ్ దర్శకులు మరియు ప్రొడ్యూసర్లకు కూడా మన తెలుగు సినిమా నచ్చింది. ఇది ఖచ్చితంగా మనందరికీ గర్వంగా అనిపించే విషయం. ఐతే హాలీవుడ్‌కు నచ్చుతందని తన శైలిని మార్చుకోలేనని రాజమౌళి అన్నారు. హాలీవుడ్ తరహాలో సినిమాని తెరకెక్కించడం తనకు రాదని, సొంత శైలిలోనే ఉన్నంతలో ప్రత్యేకంగా తీయడమే వచ్చు అని చెబుతూ.. ఒకవేళ తను తన శైలిని మార్చుకుని సినిమాలు తీస్తే అవి హాలీవుడ్ ప్రేక్షకులకి నచ్చకపోవవచ్చు అన్నారు రాజమౌళి.

రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక మహేష్ బాబు హీరోగా ఓ అడ్వెంచర్ మూవీని తెరకెక్కించడానికి జక్కన్న రెడీ అవుతున్నారు. ఇక ఇదే క్రమంలో తన విజయపథానికి తొలి మెట్టైన బాహుబలి చిత్రం గూర్చి రాజమౌళి మాట్లాడారు.

భారతదేశంలో ఉన్న అన్ని చలన చిత్ర పరిశ్రమల కంటే తెలుగు సినిమా పరిశ్రమ ఎక్కువగా రామాయణం మరియు మహాభారతం నుంచి స్ఫూర్తి పొంది చిత్రాలను నిర్మించిందని రాజమౌళి అన్నారు. ఈ రెండు ఇతిహాసాలలో చాలా భావోద్వేగాలతో పాటు ఎంతో నాటకీయత మరియు పోరాట అంశాలు ఉన్నాయి. అందుకే రామాయణం, మహాభారతాల సారాంశాన్ని తీసుకుని కథలను రూపొందించి సినిమాలు తీయగలిగితే ఆ సినిమాలను కేవలం తెలుగు వారికే పరిమితం చేయనవసరం లేదని ఆయన అన్నారు.

బాహుబలి కూడా అలాంటి స్ఫూర్తితో తెరకెక్కించిన సినిమా అని, అందువల్లే భాష, జాతి భేదాలకు అతీతంగా అంతటి భారీ విజయం సాధించి.. భారతదేశంలో సినిమా పరిశ్రమ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, మరెన్నో పరిశ్రమలు ఉన్నాయి అన్న విషయాన్ని అందరికీ తెలిసేలా చేసిందని, ప్రత్యేకించి తెలుగు సినిమా పరిశ్రమ గురించి తెలుసుకోవడం ప్రారంభించారని రాజమౌళి చెప్పారు.

ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీ కూడా ప్యాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు అంటే అందుకు ముఖ్య కారణం బాహుబలి సినిమా సాధించిన విజయం, ఇచ్చిన స్ఫూర్తి వల్లే అనేది నూటికి నూరు పాళ్ళూ నిజం.

Mahesh Fans Are Frustrated With Zee Telugu Serial Advertisements

0

Mahesh Babu is one of the leading actors in Tollywood and owing to this, he has a considerable amount of brand value. Numerous brands have partnered with Mahesh to promote their product/brand to reach out to the masses. One such recent collaboration is Mahesh Babu and Zee Telugu’s whopping 9 crores deal.

Mahesh has signed a deal with Zee Telugu to promote the shows and serials in Zee Telugu. As per the deal, he will feature in select shows to increase audience engagement. While it is very natural for stars to promote brands to increase their following, Mahesh fans are not happy with this deal.

Zee Telugu has been continuously releasing the promos of new serials and dance shows with Mahesh Babu being at the forefront of all the promos. This has upset a lot of Mahesh fans as they do not want to see Mahesh in such promos. According to the fans, Mahesh is too classy for such promos.

However, Mahesh will be walking away with a hefty 9 crore sum for just some appearances. Coming to Mahesh’s films, he has started the shooting of Trivikram’s SSMB28.

Liger Distributors Are Not Happy With The Producers’ Compensation Ratio

0

When any director has a disaster at the box office, the next few weeks are spent in the process of compensating for the losses. When Acharya crashed at the box office, Koratala Siva was forced to leave everything aside and focus on compensating the distributors.

After Liger, even Puri Jagan has been busy dealing with the Liger losses. After the disastrous showing of the film, there have been heavy losses incurred and the distributors are demanding compensation from Puri Jagan and Charmee Kaur.

Puri is ready to give the compensation but the distributors are not happy with the amount. According to them, the makers of Liger have got quite a bit of profit from the theatrical and non-theatrical business of the film.

The distributors are asking 25 crores ratio for the Telugu states but Puri is only willing to give half of that. Puri is in deep turmoil at the moment and we will have to see what happens. With Vijay reportedly also backing out of Jana Gana Mana, the troubles have only worsened for the star director.

మహేష్ – జీ తెలుగు ప్రచారం పట్ల నిరాశతో ఉన్న అభిమానులు

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కాలంలో తరచుగా బుల్లితెర మీద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగులో తన కూతురు సితార ఘట్టమనేనితో కలిసి సీరియల్స్ మరియు రియాలిటీ షోలను ఆయన ప్రమోట్ చేస్తున్నారు. ఆ ఛానల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కారణంగానే మహేష్ టీవీలో కనిపిస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ‘డాన్స్ ఇండియా డాన్స్’ అనే షోకి మహేష్ మరియు సితార ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఇదే క్రమంలో జీ తెలుగు ఛానల్ లోని దాదాపు అన్ని టీవీ సీరియల్ ప్రోమోలలో కనిపిస్తున్నారు. అయితే సూపర్ స్టార్ హోదా ఉన్న మహేష్ ఇలా టీవీ సీరియల్స్ ప్రచారం చేయడం, వాటి ప్రోమోలలో కనిపించడం వల్ల సోషల్ మీడియాలో ఆయన మీద భారీ స్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది.

అయితే మొదట్లో మహేష్ అభిమానులు ఈ విషయంలో తమ హీరోకి మద్దతుగా నిలిచారు. కానీ ఒప్పందం కుదుర్చుకున్నాం కదా అని మహేష్ ను జీ తెలుగు వారు ఏడా పెడా ప్రతి ప్రోమోలో చూపించడం, ఈ క్రమంలో ఇతర హీరోల అభిమానులు దొరికిందే అవకాశంగా తీసుకుని మహేష్ మీద ట్రోల్స్ మరియు మీమ్స్ ఎక్కువగా చేయడంతో ఇక మహేష్ బాబు అభిమానులు కూడా చేతులు ఎత్తేశారు. అసలు మహేష్ జీ తెలుగు తో ఒప్పందం కుదుర్చుకొక పోయి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఆ రకంగా వారు కూడా మహేష్ నిర్ణయం పై అసంతృప్తిగా ఉన్నారు.

మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ఇలా టీవీ సీరియల్స్ – షోలలో కనిపించడం ఏంటని బాధ పడుతున్నారు. అంతే కాకుండా ఆయనతో పాటు సితార ను కూడా ఇలా బుల్లితెర మీద అరంగేట్రం చేయించడం సరైన పద్ధతి కాదని అభిమానులు ఆందోళన పడుతున్నారని సమాచారం.

మహేష్ బాబు కూతురు సితార తో ఇదివరకు ‘సర్కారు వారి పాట’ మ్యూజిక్ వీడియోలో నటింపజేసిన సంగతి తెలిసిందే. ఇక దానికి ముందే ఆమె క్లాసికల్ డ్యాన్స్ వీడియోలు మరియు ఇతర రీల్స్ వంటివి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అందువల్ల సితారకు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో చక్కని అభిమానుల సంఖ్య ఏర్పడింది. అలాంటిది సితారను ఇలా సీరియల్ ప్రచారాలకు ఉపయోగించడం ఎందుకని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి టీవీల్లో ఇలా కనిపించడం మహేష్ కు కొత్తేమీ కాదు. 2017 లో స్పైడర్ సినిమా విడుదల సందర్భంగా ఆయన ఇలాగే జీ తెలుగులో కొత్త ప్రోగ్రామ్ మరియు సీరియల్స్ కు ప్రచారం చేశారు. అయితే అప్పట్లో ఇంతగా సోషల్ మీడియా ప్రభావం లేదు. అందుకే పెద్దగా ట్రోల్స్ ఏమీ జరగలేదు. అయితే ఇప్పుడు అలా కాదు, సినిమా స్టార్లు చేసే ప్రతి చిన్న విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది. అలాంటి సమయంలో మహేష్ జీ తెలుగుతో ఈ కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అభిమానులకి తలనొప్పిగా తయారయింది.

నిజానికి ఇలా టివిలో కనిపిస్తే అందువల్ల టివి రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులకు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. కానీ ట్రెండ్ కు తగ్గట్టుగా వినూత్నంగా ప్రచారం చేయకుండా ఇంకా పాత పద్ధతిలో ఏమాత్రం ఆసక్తి కలిగించని విధంగా మహేష్ – జీ తెలుగు యాడ్స్, ప్రోమోస్ ఉండటం వలన అవి ట్రోలింగ్ కు గురవుతున్నాయి అని ఒక వర్గం ప్రేక్షకులు అంటున్నారు.

తొలి రోజే డిజాస్టర్లుగా నిలిచిన ఈ వారం సినిమాలు

0

గత కొద్ది రోజులుగా పెద్ద సినిమాలన్నీ విడుదల అయిపోవడంతో చిన్న సినిమాలన్నీ ఇప్పుడు రిలీజ్ కోసం క్యూ కట్టాయి. ఈ వారం మూడు చిన్న సినిమాలు తెలుగు వెండి తార మీద సందడి చేయడానికి వచ్చాయి. ఈ వారం విడుదలైన మూడు సినిమాల మీద విడుదలకు ముందు మంచి బజ్ ఏర్పడింది. సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా సెప్టెంబర్ 16వ తేదీన విడుదల అయిన సినిమాల్లో మొదటిది.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నప్పటికీ.. ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమయింది. అక్కడక్కడా కొన్ని మంచి సన్నివేశాలు తప్ప ఏమాత్రం బాగోలేదని సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరిచారు.

ఇక రెండో చిత్రం యువ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని. శ్రీధర్ గదే దర్శకత్వంలో ఈ సినిమాను కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి తన సొంత నిర్మాణ సంస్థ నిర్మాణంలో నిర్మించారు. కిరణ్ అబ్బవరం వరుస విజయాల బాటలో వచ్చిన ఈ చిత్రం మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అవుతుందని ప్రేక్షకులు ఆశించారు. 

అయితే సినిమా మరీ మూస ధోరణిలో ఉండటం వలన ప్రేక్షకులను అసలు ఆకట్టుకోలేకపోయింది. కేవలం కొన్ని కామెడీ సన్నివేశాలు, మణిశర్మ అందించిన పాటలు మినహా సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదని సినిమా చూసిన అందరూ అభిప్రాయపడ్డారు. నిజానికి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా ఒక వారం వాయిదా పడింది. 

ఇక ఈ రెండు సినిమాలు కాకుండా శాకిని డాకిని అనే సినిమా కూడా 16వ తేదీన విడుదలయింది. నివేదా థామస్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి సునీత తాటి అనే నిర్మాత ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం కొరియన్ సినిమా ” మిడ్నైట్ రన్నర్స్” అధికారిక రీమేక్ గా రుపొందించబడింది. చక్కని క్రైమ్ కామెడీ అయ్యే అన్ని లక్షణాలు ఉన్నా కూడా మరీ నత్తనడకన సాగిన కథనం వల్ల సినిమాలో ఉండాల్సిన బిగి లేకుండా పోయిందని, ఇదే సినిమా OTTlo విడుదలై ఉంటే బాగుండేదని కొందరు ప్రేక్షకులు అనడం కొసమెరుపు.

ఆ రకంగా నెగటివ్ టాక్ మరియు పేలవమైన రివ్యూలను తెచ్చుకున్న ఈ మూడు సినిమాలూ బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజే డిజాస్టర్లుగా నిలిచాయి. కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ దక్కించుకోలేకపోవడమే కాకుండా చాలా ఏరియాలలో థియేటర్ రెంట్ కూడా వసూలు చేయలేనంత దారుణంగా ఈ సినిమాల కలెక్షన్లు ఉండటం గమనార్హం.

పూరీ జగన్నాథ్ ఇచ్చే నష్టపరిహారంతో సంతోషంగా లేని లైగర్ డిస్ట్రిబ్యూటర్లు

0

సినిమా ఇండస్ట్రీలో హిట్లు ప్లాపులు అనేవి సర్వ సాధారణం. ఎందుకంటే ఇది గ్యారంటీ లేని ఇండస్ట్రీ. పక్కా హిట్ అనుకున్న సినిమాలు అట్టర్ ఫ్లాప్ లు అవడం.. అసలు ఆడుతుందో లేదో అనుమానం ఉన్న సినిమాలు సూపర్ హిట్ లు అవడం చాలా సార్లు జరిగింది.. ఇక ముందు కూడా అలానే ఉంటుంది. ఐతే ఒక సినిమా విజయం సాధిస్తే ఆ చిత్రానికి సంభందించిన అందరూ లాభాల బాట పడతారు. అదే పరాజయం పాలైతే నష్టాలను మూటగట్టుకుంటారు. ఒక్కో సారి భారీ డిజాస్టర్స్ సినిమాలు వస్తుంటాయి. ఆ సమయాల్లో భారీ రేట్లకు కొనుగోలు చేసిన బయ్యర్లు మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అలాంటప్పుడే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య సమస్యలు మొదలవుతాయి.

ఎందుకంటే కొందరు నిర్మాతలు లేదా హీరోలు తమకి సినిమా పట్ల, పరిశ్రమ పట్ల ఉన్న బాధ్యతతో ఆయా నష్టాలలో కొంత వరకు భర్తీ చేస్తుంటారు.. అది డబ్బు తిరిగి ఇచ్చే రూపంలో అయినా కావచ్చు లేదా తదుపరి సినిమాకు రేట్లు సర్దుబాటు చేయడం కావచ్చు ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని అనుసరిస్తుంటారు. కొందరు నిర్మాతలు మాత్రం ఇలాంటి విషయాల్లో సరిగ్గా స్పందించకుండా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో తాజాగా ఒక సినిమా భారీ పరాజయం పాలయింది.

ఇటీవల కాలంలో భారీ అంచనాలతో విడుదలైన “లైగర్” బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే జంటగా నటించారు. ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ మరియు ఛార్మీ కౌర్ ఈ సినిమాని నిర్మించారు.

ప్యాన్ ఇండియా స్థాయిలో ఆగస్ట్ 25న రిలీజ్ అయిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ‘లైగర్’ ఫలితం దారుణంగా వచ్చిన తరువాత డిస్ట్రిబ్యూటర్లకు మరియు పూరీ- ఛార్మీల మధ్య నష్టాలకు సంభందించి రకరకాల వార్తలు వచ్చాయి.

రిలీజ్ కు ముందు ‘లైగర్’ చుట్టూ నెలకొన్న అద్భుతమైన హైప్ వల్ల బయ్యర్లు ఆ చిత్రాన్ని అధిక రేట్లకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేశారు. అయితే సినిమా డిజాస్టర్ అవడంతో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ భారీ నష్టాలను చవిచూశారు. దీంతో పూరీ మరియు ఛార్మి వారికి పరిహారం చెల్లించడానికి ముందుకు వచ్చారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం పూరి జగన్నాథ్, లైగర్ సినిమా నష్టాలను తీర్చే పని ప్రారంభించారట, అయితే ఆయన నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కానీ డిస్ట్రిబ్యూటర్లు ఆయన తిరిగిచ్చే అమౌంట్ తో సంతోషంగా లేరని సమాచారం. డిస్ట్రిబ్యూటర్లు తెలుగు రాష్ట్రాలకు పరిహారంగా 25కోట్ల భారీ మొత్తాన్ని అడుగుతుండగా పూరీ మాత్రం అందులో సగం మాత్రమే ఇచ్చేందుకు పూరీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎక్కడ ఆగుతుందో చూడాలి.

ఇకపోతే ‘లైగర్’ ప్లాప్ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కాల్సిన ‘జనగణమన’ సినిమా దాదాపు ఆగిపోయినట్లే అంటున్నారు. నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా.. ఈ సినిమా ఆగిపోయిన వార్త దాదాపు ఖరారు చేసుకోవచ్చని అంటున్నారు

Can NTR, Ram Charan, or Rajamouli bring the Oscar to Telugu cinema?

0

RRR’s global impact has been much bigger than expected. This SS Rajamouli film has managed to impress the audience world over and the film had re-release and extended runs in several theatres in the overseas market on the audience’s demand.

The film remained on the top spot at Netflix viewing charts for multiple consecutive weeks further stamping its domination outside the theatres as well.

The box-office numbers for the film have been sensational as well and Jr NTR and Ram Charan’s performance along with SS Rajamouli’s vision and execution won applause from all over. Such has been the movie’s impact that popular lifestyle and pop culture magazine ‘Variety’ has shortlisted NTR, Charan, and Rajamouli in their annual Oscars predictions list.

Along with this, Variety magazine has predicted nominations in the following categories.

Best International Feature

Best Director – SS Rajamouli

Best Actor – NTR and Ram Charan

Best Original Screenplay

Best Original Song – Dosti

Rajamouli, NTR, and Charan’s name is now making noise on social media and this upsurge has become the talk of the town. Director Anurag Kashyap has also said that RRR has a terrific chance of making noise at the Academy Awards.

First Day First show OTT streaming date and release partner

0

First Day First Show directed by Lakshmi Narayana and Vamsidhar Goud is all set to release on OTT platform. The film was released on September 2nd to poor reviews and deficits from the initial weekend itself. Anudeep KV, who earlier directed Jathiratnalu is the writer of the film. This created some hype for the film which it failed to live up to.

The film’s crew did widespread promotions for the film. These promotions involved light-hearted interviews with Allu Aravind and Vennela Kishore. But, despite the huge buzz, the film turned out to be disappointing and did not impress the critics or the audience.

The film can be streamed on an OTT platform Aha. The same was announced by the streaming platform a while ago. The OTT release date is fixed to be September 23.

First Day First Show stars Srikanth Reddy, Vamshidar Goud, Vennela Kishore, Tanikella Bharani, and a bunch of others. Lakshminarayana and Vamshidar Goud are the directors of the film and Radhan is the music director.

Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Review : Tests your patience

0

Movie: Nenu Meeku Baaga Kavalsinavaadini
Rating: 1.75/5
Cast: Kiran Abbavaram, Sanjana Anand, Sonu Thakur
Director: Sridhar Gadhe
Produced By: Kodi Divya Deepthi
Release Date: September 16th, 2022

Kiran Abbavaram’s Nenu Meeku Baaga Kavalsinavaadini released today marking his third release of the year. This year he had two releases in the form of Sebastian P.C.524 and Sammathame. Both these movies failed to win the audience’s hearts and he has pinned high hopes on this project. Does the film have enough to get him out of the slump? Let’s find out.

Story: Teju (Sanjana Anand) an IT employee finds herself in a dangerous situation after a drunk episode. Vivek (Kiran Abbavaram) a cab driver rescues her from this situation and the two get close after this. Where does this friendship head to? And what happens when Teju and Vivek’s past is revealed? How they deal with the flurry of emotions is what the movie is about.

Performances:  Kiran Abbavaram has the same old boy next door role in the project. Performance-wise, there is nothing new to take back and his mannerisms and dialogues can be distracting at times. The comedy from his side also falls flat and the punches don’t land as intended. Sanjana Anand as the damsel in distress has a meaty role but fails to impress with her acting skills. Ditto with Sonu Thakur who has a well-written character but does little justice to her role.

Analysis: Nenu Meeku Baaga Kavalsinavaadini can be described as a collection of gags that fail to impress. The writing by Kiran Abbavaram is the biggest weak point of the film. The film definitely has a few moments but doesn’t have many of these to keep the audience entertained. The emotions between father and daughter are given a lot of prominences but not established well at all. The audience might feel detached to the proceedings.

Plus Points:

  • Mani Sharma’s music
  • Runtime

Minus Points:

  • Screenplay
  • Lazy writing
  • Cringe scenes

Verdict: 

Kiran Abbavaram definitely needs to reinvent himself both as a writer as well as an actor. While a lot of emphasis has been put on giving commercial elements in the film, the most important part- writing has been heavily ignored.