Home Blog Page 1948

బాక్సాఫీస్ వద్ద తగ్గని కాంతార జోరు.. 300 కోట్ల వసూళ్లు

0

కన్నడ నటుడు – దర్శకుడు రిషబ్ శెట్టి రూపొందించిన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద అప్రతీహత ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన ఐదు వారాల తర్వాత కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతోంది. భారతీయ సినిమా ప్రేక్షకుల నుండి భారీ ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్‌ను కొనసాగిస్తోంది. ఓవరాల్ గా 300 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసి మరో మైలురాయిని సాధించింది కాంతార.

ఈ చిత్రం హిందీ మరియు తెలుగు రెండు వెర్షన్ల నుండి 50 కోట్లకు పైగా వసూలు చేసింది. కేరళలో ఈ సినిమా 11.5 కోట్లు, కర్ణాటకలో 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో ఈ సినిమా 3.5 మిలియన్లు వసూలు చేసింది. ఓవరాల్‌గా వరల్డ్‌వైడ్ గ్రాస్ ఇప్పుడు 305 కోట్లకు చేరువలో ఉంది మరియు ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం ఫుల్ రన్‌లో 350 కోట్లను సులభంగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేయబడింది.

భారీ సెట్టింగులు, సూపర్ స్టార్లు, భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ ఉన్న సినిమాలు మాత్రమే మంచి ఆదరణకు నోచుకుంటుంది అనే అపోహ ప్రస్తుతం చాలా మందిలో ఉండగా.. కాంతార వాటన్నింటినీ తప్పని నిరూపించింది. అగ్ర తారాగణం లేకుండా తీసిన ఈ సినిమా పెద్ద సినిమాల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి దర్శక నిర్మాతలకు కొత్త పాఠాలు చెబుతోంది.

భారీ బడ్జెట్ చిత్రాలే జనాలను థియేటర్లకు రప్పిస్తాయన్న అపోహను తొలగించి కొత్త చర్చకు తెరలేపుతోంది కాంతార. ఈ సినిమా అనూహ్య విజయం పలు పరిశ్రమలకు పెద్ద గుణపాఠంగా మారడంతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ “కాంతార` చిత్ర బృందం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

గతంలో ఏ సినిమాను మెచ్చుకోని సెలబ్రిటీలంతా ‘కాంతార’ పై ప్రశంసల వర్షం కురిపిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే అన్ని భాషల్లోనూ రికార్డు స్థాయి ప్రదర్శనతో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా పై ట్రేడ్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

స్వచ్ఛమైన కన్నడ నేటివిటీతో రూపొందిన ఈ సినిమా నిజమైన ప్రాంతాలకు అతీతంగా కంటెంట్ ఉన్న సినిమా అందరికీ నచ్చుతుందని చూపిస్తూ భారీ వసూళ్లను రాబడుతోంది.

NTR30: కొరటాల గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా.. ఈసారి టార్గెట్ మెడికల్ మాఫియా..?

0

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మాత్రం చిత్ర యూనిట్ స్టార్ట్ చేయలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో ఎన్టీఆర్ 30వ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో తారక్ నయా లుక్‌లో కనిపిస్తాడని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ సినిమా కోసం కొరటాల ఓ సరికొత్త కథను రాసుకున్నాడని, ఈ కథలో ఎన్టీఆర్ చేసే పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా కథ మొత్తం మెడికల్ మాఫియా చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. కొరటాల శివ తన సినిమాల్లో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడం ఆయనకు అలవాటు. అలాగే, ఈ సినిమాలో మెడికల్ మాఫియాపై హీరో యుద్ధం చేస్తే ఎలా ఉండబోతుందా అనే పాయింట్‌ను కమర్షియల్ అంశాలు జోడించి మనకు మరింత పవర్‌ఫుల్‌గా చూపించనున్నాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తారక్ లాంటి స్టార్ హీరోతో ఇలాంటి కథను రెడీ చేస్తున్న కొరటాల ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Allu Sirish: మెగా హీరోకు ఈసారైనా హిట్టు దక్కేనా..?

0

Allu Sirish: మెగా కాంపౌండ్ నుండి ‘గౌరవం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్, ఆ తరువాత చాలా సినిమాలే చేశాడు. కానీ ఈ హీరోకు తన కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం పడలేదు. దీంతో చేసిన ప్రతి సినిమా వైవిధ్యంగా ఉన్నా, ప్రేక్షకులను అలరించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఈ హీరో కెరీర్ గ్రాఫ్ ముందునుండీ పడిపోతూనే ఉంది. అయితే ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా ప్రేక్షకులను అలరించడంలో కాస్త సక్సెస్ అయినా, కమర్షియల్‌గా మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ గతంలోనే పూర్తయి రిలీజ్‌కు రెడీగా ఉన్నా, పలు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్‌కు నోచుకోలేదు. దీంతో ఇప్పుడు అన్ని పనులు ముగించుకుని, ఈ సినిమాను నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బజ్ తెప్పించేందుకు చిత్ర యూనిట్ విశ్వప్రయత్నాలు చేసింది. నందమూరి బాలకృష్ణను ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా పిలిచిమరీ ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. కాగా, నేడు రిలీజ్ అయిన ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

దానికి పలు కారణాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అల్లు శిరీష్ సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉండటం, ఫేడవుట్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ ఈ సినిమాలో నటిస్తుండటం లాంటివే కాకుండా, చెప్పుకోదగ్గ టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు లేకపోవడం కూడా ముఖ్య కారణమని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా సక్సెస్ అయితేనే అల్లు శిరీష్ కెరీర్ గట్టెక్కుతుందనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మరి తొలిరోజు మౌత్ టాక్ బాగా వచ్చినా, రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ సరిగా లేకపోతే అల్లు వారి హీరోకు కష్టాలు తప్పవని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు.

Ponniyin Selvan Sequel (PS2) makers lock the release date

0

Ponniyin Selvan 1 was released on September 30th, touted as the dream project of the legendary director Maniratnam, made on a grand scale. The movie received a monumental reception from the Tamil fraternity all over the world, which helped the film reach new heights at the box office. The release of Ponniyin Selvan 2 is expected to occur in the summer of 2023, according to the earlier reports.

The first part of Ponniyin Selvan, celebrated as a Pride film of Kollywood, opened to excellent reviews and collected huge numbers at the box office. The film has also become an industry hit in Tamil and the first film to collect 400 Crores gross from only Tamil language and overall, it has collected more than 500 Crores worldwide.

It is now the highest-grossing Tamil movie of 2022, the fourth-highest Tamil movie ever, and the fifteenth-highest Indian movie ever. It is being reported that the makers are planning to release the sequel of Ponniyin Selvan on April 14th or April 28th 2023, during the Tamil New Year season.

After the ocean battle with Chola’s vicious enemies, the big epic period was brought to a close by the great hype and intrigue surrounding the plot about Aishwarya Rai’s dual role and the mystery that Arul Mozhi Varman (Jayam Ravi) and Vandiya Devan (Karthi) are alive or not.

The sequel will undoubtedly be a much bigger hit given the level of hype surrounding the first part. As per the sources, the final release date of the sequel will be announced by the makers within a month.

The five-chapter novel “Ponniyin Selvan,” written by Kalki Krishnamoorthy in 1955, serves as the basis for the plot of the movie. Ponniyin Selvan’s two parts were written by Elango Kumaravel and B. Jeyamohan. Mani Ratnam and Subaskaran Allirajah produced the movie through Madras Talkies and Lyca Productions respectively.

Aishwarya Rai Bachchan, Jayam Ravi, Karthi, Trisha, Jayaram, Aishwarya Lekshmi, Sobhita Dhulipala, Prabhu, R. Sarathkumar, Vikram Prabhu, Prakash Raj, Rahman, and R. Parthiban, are among the ensemble cast members of the film series. A. R. Rahman composed the music, Ravi Varman shot the movie, A. Sreekar Prasad edited it, and Thota Tharani handled the production design.

Sir Movie: ‘సార్’ మళ్లీ మాట మార్చారుగా!

0

Sir Movie: తమిళ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సె్స్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌లు ప్రేక్షకులు మంచి రెస్పాన్స్‌ను అందించారు. అయితే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా గతంలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఈ సినిమాను డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. దీంతో డిసెంబర్ 2న ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ, తాజాగా మరో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సార్ చిత్ర రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ మరోసారి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

సార్ సినిమాకు సంబంధించి ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉందని.. అందుకే ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది. ఇక జనవరిలో పలు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్‌కు రెడీ కావడంతో, సార్ మూవీ జనవరిలో కూడా రిలీజ్ కాదు. దీంతో ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ధనుష్ సరసన అందాల భామ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Kantara reaches another milestone at the box office, 8Cr budget and 300Cr collections

0

Kantara, the film made by Kannada Actor – Director Rishabh Shetty is creating a nonstop rampage at the box office. Even after five weeks from its release, the movie is rocksteady and minting good collections.

Along with the huge applause from round the corner of the Indian cinema audience, it is also continuing its blockbuster run at the box office. Kantara has achieved another milestone by crossing the 300 Crores gross mark overall.

The film has collected more than 50 crores from both Hindi and Telugu versions. In Kerala the movie has collected 11.5 crores and in Karnataka the movie has collected more than 150 crores gross. Overseas, the movie has collected 3.5 million. Overall, the worldwide gross is close to 305 Crores now and it will easily collect 350 Crores in the full run, as per trade circles.

When there is a misconception that only a movie which has huge settings, superstars, huge production values ​​and amazing VFX will perform well, Kantara has proved all of them wrong. The film was made without any top cast, but it has broken all the records of the big films and is teaching new lessons to the film makers.

The myth that only big budget films attract people to the theaters is dispelled and a new debate is being opened because of Kantara. As the unexpected success of this movie has become a big lesson for many industries, many celebrities are making sensational comments on the social media platforms and praising the “Kantara” team.

This movie is becoming a topic of discussion across the country as all the celebrities who have not praised any movie in the past are showering their praises on ‘Kantara’. Trade circles are expressing awe at this movie, which is already creating a sensation due to its record-level performance across all languages. This movie, made with pure Kannada nativity, shows that true content will be liked by everyone and is collecting huge numbers.

Meanwhile, recently Rishabh Shetty met superstar Rajinikanth to celebrate the success of Kantara. Hombale films took to social media and shared a bunch of pictures of Rishab and Rajni. A picture speaks louder than a thousand words and it was a joyous moment for the ‘Master and his Apprentice’ and that’s what Hombale wrote for them.

OTTలో విడుదలయిన భారీ ప్యాన్ ఇండియన్ సినిమాలు

0

ఈ రోజు తెలుగు ప్రేక్షకులకు భారీ ఆనందాన్ని ఇచ్చేందుకు OTTలో రెండు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలు మరేవో కాదు, ఇటీవలే విడుదలై పాన్-ఇండియన్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన పొన్నియిన్ సెల్వన్ మరియు బ్రహ్మాస్త్ర సినిమాలు.

కాగా ఈ రెండు సినిమాల స్ట్రీమింగ్ వేదికలు మాత్రం వేరు వేరు కావడం విశేషం. బ్రహ్మస్త్ర డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా, పొన్నియిన్ సెల్వన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.

రెండు సినిమాలు నవంబర్ 4వ తేదీ అంటే ఈ రోజు నుండి OTTలో ప్రసారం కానున్నాయి. కాగా ఈ రెండు సినిమాలు కూడా OTT స్ట్రీమింగ్‌లో మంచి స్పందన తెచ్చుకుంటాయని భావిస్తున్నారు. బ్రహ్మస్త్ర ఇప్పటికే థియేట్రికల్ రిలీజ్‌లో ప్రేక్షకుల నుండి మంచి కలెక్షన్స్ మరియు ప్రశంసలను అందుకోగలిగింది. మరియు ఇప్పుడు OTTలో మళ్లీ అదే స్థాయిలో స్పందన తెచ్చుకోగలదా అనేది చూడాలి.

ఇక సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్లలలో ఒకరైన మణిరత్నం యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియిన్ సెల్వన్ గత వారం అమెజాన్ ప్రైమ్‌లో వచ్చింది. కానీ అది కేవలం అద్దె ప్రాతిపదికన మాత్రమే అందుబాటులో ఉండింది. అయితే, ఈ చిత్రం ఈ రోజు నుంచి అమెజాన్ ప్లాట్‌ ఫారమ్‌లోని సబ్స్క్రైబర్లందరికీ అందుబాటులోకి వచ్చింది.

ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష కృష్ణన్, “జయం” రవి, “చియాన్” విక్రమ్, మరియు కార్తీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చారిత్రాత్మక కల్పిత గాథ సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అంతే కాక తమిళనాట ఏకంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

పొన్నియిన్ సెల్వన్ ఒక ప్రముఖ తమిళ నవల ఆధారంగా రూపొందించబడింది, అందుకే దీనికి తెలుగు ప్రేక్షకుల నుండి పెద్దగా ఆదరణ లభించలేదు. మరి ఇప్పుడు OTTలో అయినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

మరో వైపు, బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన తర్వాత, అయాన్ ముఖర్జీ యొక్క బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్-శివ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో అలియా భట్ మరియు రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించగా, అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున మరియు మౌని రాయ్ కీలక పాత్రల్లో కనిపించారు. షారూఖ్ ఖాన్ కూడా అతిధి పాత్రలో కనిపించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న థియేటర్లలోకి వచ్చింది.

Actor Suriya is back to the no1 race at the box office, his crazy lineup is scaring the competitors

0

Tamil Star and well acclaimed actor Suriya has made a nice image among the audience for his unique script selection and versatile characters.

Recently, Suriya is in a very bad form and his movies are also not doing well at the box office but now it seems that everything has beem changed. Suriya’s current film with director Sirutai Siva is a high budget film making in 3D format.

The movie already has huge demand in non theatrical and theatrical markets which is very surprising. After this Suriya has lot of commitments which are very interesting and exciting combos.

Suriya has committed for a film with Vetrimaran who has the image of best director of Tamil Cinema. Another film with Sudha Kongara who also has garnered respect and accolades for her movies. Recently Suriya has okayed another film with Jai Bhim director.

Jai Bhim was released in OTT but it got a reception like big blockbuster and also won many awards. Many people felt that the film should have been released in theatres which is true.

There are also reports coming about a big budget film in the combination of Suriya and Shankar which is said to be based on Historical backdrop.

Not only these but Suriya is also one of the main leads of Lokesh Cinematic Universe. It is known that Suriya has played a terrific cameo as Rolex in Kamal Haasan and Lokesh Kanagaraj ‘s Vikram.

Waltair Veerayya: చిరు-రవితేజల మధ్య బాలీవుడ్ బ్యూటీ చిందులు.. ఎవరంటే?

0

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. చాలా రోజుల తరువాత బాసు పూర్తి మాస్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మాస్ రాజా రవితేజ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. ఆయన ఈ సినిమా షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యారు. అయితే ఈ సినిమాలో చిరు, రవితేజలు ఓ మాస్ మసాలా సాంగ్‌లో కలిసి చిందులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్పెషల్ సాంగ్‌లో ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీని దింపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి ఊర్వశి రౌతేలాను ఈ మాస్ నెంబర్‌లో హాట్ అందాల ఆరబోతకు ఓకే చేశారట చిత్ర యూనిట్.

చిరు, రవితేజలు కలిస్తేనే మాస్.. అలాంటిది వారిద్దరు కలిసి చేసే సాంగ్ ఇంకా ఏ రేంజ్‌లో మాస్‌గా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక వారిద్దరి మధ్య అందాల భామ ఊర్వశి రౌతేలా చేసే అందాల ప్రదర్శన మరో హైలైట్ కావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

RRR Naatu Naatu Song: హాలీవుడ్ మ్యూజిక్ అవార్డ్స్‌లో ‘నాటు’ హవా..!

0

RRR Naatu Naatu Song: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పీరియాడిక్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కించగా, ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించగా, ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.

ఇక ఓటీటీలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చాక, ఈ సినిమా గ్లోబల్ ఆడియెన్స్‌కు మరింతగా చేరువైంది. ముఖ్యంగా ఇతర దేశాల ఆడియెన్స్ ఈ సినిమాను చాలా ఆసక్తిగా చూశారు. ఇక ఈ సినిమాలోని పాటలకు కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ‘నాటు నాటు’ పాటలో చరణ్, తారక్‌లు చేసిన ఫాస్ట్ స్టె్ప్స్ డ్యాన్స్‌కు వారు ఫిదా అయ్యారు. పలు షోలు, ఈవెంట్స్‌లలో ఈ పాటను ఇమిటేట్ చేస్తూ చాలా మంది పర్ఫార్మ్ చేశారు. అయితే ఇప్పటికే ఆస్కార్ అవార్డుల బరిలో ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయ్యింది.

తాజాగా మరో ప్రెస్టీజియస్ అవార్డ్స్ బరిలోనూ ఆర్ఆర్ఆర్ చోటు సాధించింది. ‘హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్’లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయ్యింది. ఈ వార్తను ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో తాజాగా వెల్లడించింది. ఇక దీంతో ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఖచ్చితంగా అవార్డ్ దక్కుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి మున్ముందు ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.