Home Blog Page 2123

Dil Raju is worrying about Naga Chaitanya’s Thank you movie

0

Naga Chaitanya is coming up with Thank You. The movie when announced got good buzz in the industry. Director Vikram K Kumar is known for unique concepts or a fresh backdrop stories. So when Naga chaitanya joined hands with Vikram K Kumar, a fresh content based film is expected. Generally Vikram K Kumar writes and directs his own stories. But this time he is directing a film written by B V S Ravi. Dil Raju is producing it under Sei Venkateswara Creations.

Already two singles of Thank you has released. But both the songs failed to impress the audience and create the buzz. Now the third single is also released today. Now Dil Raju is worrying about the movie as the team is failing to create the buzz. Actually Dil Raju is very good at promoting the film and he knows that songs reach is very crucial for class content. He already postponed the movie for a week. And if the buzz has not created he is also in plans to postpone the movie for some more time.

సాయి తేజ్ తో నటించనున్న సంయుక్త

0

సినిమాల్లో అవకాశాలు రావడం అంత సులభం కాదు.అందం/టాలెంట్ మాత్రమే ఉంటే చాలదు వాటితో పాటు కొద్దిపాటి అదృష్టం కూడా కావాలి. ఇప్పుడు తెలుగు సినిమాలకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇతర బాషల నుంచి తెలుగులో సినిమాలు చేయడానికి చాలా హీరోయిన్ లు ప్రయత్నిస్తున్నారు.

దానికి కారణం ఇక్కడి ప్రేక్షాభిమానమే,కన్నడ నుంచి వచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు ఇక్కడ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకొని పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంది.అలాగే పూజా హెగ్డే,కీర్తీ సురేష్ వంటి హీరోయిన్ లు చాలా మంది తెలుగు సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మరో మలయాళ భామ అదే బాటను ఎంచుకుంది.

భీమ్లానాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ సంయుక్త మీనన్. త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా సరసన నటించింది సంయుక్త. ఈ సినిమా హిట్ అయినప్పటికీ, క్లైమాక్స్ లో సంయుక్త నటనకు పేరు వచ్చినప్పటికీ ఇప్పటిదాకా మరో సినిమా అవకాశం రాలేదు.

ఈ సమయంలో ఆమెకు ఓ భారీ సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. `వినోదాయ సితం’ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తున్నారని పుకార్లు వచ్చాయి కానీ ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.అయితే ఈ సినిమాకు హీరోయిన్ గా సంయుక్తను త్రివిక్రమ్ సిఫార్స్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

భీమ్లానాయక్ సినిమాలో సంయుక్త నటనకు మెచ్చి గురూజీ ఈ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. ఇందులో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది. ఈ సినిమా హిట్ అయితే సంయుక్త కూడా తెలుగులో వరుస ఆఫర్లు అందుకొని స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.అది నిజం అవ్వాలనే కోరుకుందాం.

దీపావళికి రానున్న కార్తీ “సర్దార్*

0

మంచి నటుడైన తమిళ హీరో కార్తీ “సర్దార్” అనే మరొక విభిన్నమైన సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న నటుడు కార్తీ.తెలుగు రాష్ట్రాల్లో కూడా తన ప్రతి సినిమాను కూడా అదే స్థాయిలో విడుదల చేస్తూ ఉంటారు.అదీ కాక తన సినిమాలని ఇక్కడ ప్రచారం చేసుకునే విధానంలో ఎంతో శ్రద్ధ వహిస్తారు కార్తీ.

కార్తీ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంటుంది.అందుకే అతను తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా బాగా ఇష్టపడ తాడు కూడా. కార్తీ నటించిన “ఖైదీ”సినిమా తెలుగులో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోగా ఆ తర్వాత వచ్చిన “సుల్తాన్” ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఓపెనింగ్స్ మాత్రం పరవాలేదు అనిపించుకుంది.ఇక కార్తీ తదుపరి చేయబోయే సర్దార్ పైనే అందరి చూపు.

PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు.రఫ్ లుక్ తో ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తిగా కార్తీక్ కనిపించబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా మంచి స్పందన రాబట్టింది.

https://twitter.com/AnnapurnaStdios/status/1541365470993031168?t=Qh5Ql87r0sjA4XrWU4TzwQ&s=19

ఇదిలా ఉండగా ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నారని చిత్ర బృందం ప్రకటించారు.తమిళ సినిమాలకు దీపావళి పండగ పెద్ద సీజన్ అన్న సంగతి తెలిసిందే.ఇక తెలుగులో ఈ సినిమా హక్కులను ప్రతిష్టాత్మక బ్యానర్ అన్నపూర్ణా స్టూడియోస్ దక్కించుకుంది.ఈ సినిమాలో కార్తీ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా,జీ వీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న సర్దార్ సూపర్ హిట్ అవ్వాలని ఆశిద్దాం.

మరో హిట్ కు నాంది పలికిన అల్లరి నరేష్

0

తెలుగు సినీ పరిశ్రమలో హిట్ కాంబినేషన్ ఏమీ కొత్త కాదు.ప్లాప్స్ లో ఉన్న హీరోలకు హిట్ వస్తే ఆ దర్శకులతో కలిసి మళ్ళీ పని చేయడానికి హీరోలు ఆసక్తి చూపుతారు.అలాంటి క్రేజీ కాంబినేషనే మళ్లీ కలిసి పనిచేయబోతోంది. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో అల్లరి నరేష్ కు ‘నాంది’ సినిమాతో సూపర్ హిట్ లభించింది. ఈ సినిమాని విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు. చేయని తప్పుకి శిక్ష అనుభవించే ఓ అమాయకుడు తిరగబడితే ఎలా వుంటుందనే ఆసక్తికరమైన కథ కథనాలతో  రూపొందించిన ఆ సినిమా చాలా రోజులకు అల్లరి నరేష్ కు హిట్ ను తెచ్చిపెట్టింది.నటుడిగా ఆయనలో కొత్త కోణాన్ని చూపిస్తూ విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది నాంది సినిమా.

ప్రస్తుతం ‘సభకు నమస్కారం’ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అంటూ రెండు విభిన్నమైన చిత్రాల్లో నటిస్తున్న అల్లరి నరేష్ హీరోగా మళ్లీ స్పీడు పెంచారు.ఇదిలా వుండగా పైన చెప్పుకున్నట్టు నాంది కాంబినేషన్ ను రిపీట్ చేయనున్నారు. “నాంది”సినిమాతో సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న అల్లరి నరేష్ విజయ్ కనకమేడల మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారు.

కృష్ణార్జున యుద్ధం,మజిలీ,గాలి సంపత్, టక్ జగదీష్ సినిమాలను నిర్మించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ద నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా సోమవారం ప్రకటించింది.ఏ షాడో ఆఫ్ హోప్’ పేరుతో ఓ కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసింది. విజయ్ కనకమేడల అల్లరి నరేష్ 2 అంటూ విడుదల చేసిన పోస్టర్ పై బేడీలు వేసిన చేతులు జత చేయగా షాడోలో ‘డేగ’ సింబల్ కనిపిస్తోంది.
ఈ సినిమాని పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందబోతుందని, అల్లరి నరేష్ ను ఇంతకు మునుపెన్నడూ చూడని యాక్షన్ హీరోగా మరియు ఇంటెన్స్ రోల్ లో కనిపించబోతున్నాడు అని చిత్ర బృందం తెలిపింది.ఖచ్చితంగా ఈ హిట్ కాంబినేషన్ మరోసారి హిట్ కొడతారని చిత్ర బృందం గట్టి నమ్మకంతో ఉన్నారు.

ప్రస్తుతం నరేష్ నటిస్తున్న ‘సభకు నమస్కారం’ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రాల తరువాత ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ని పట్టాలెక్కిస్తారట. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న రంగ రంగ వైభవంగా

0

తొలి సినిమా “ఉప్పెన”తో యంగ్ హీరోల లిస్ట్ లో రికార్డులు సృష్టించిన మెగా మెన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌.త‌రువాత వ‌చ్చిన ‘కొండ‌పొలం’ ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.వైష్ణవ్ తేజ్ తదుపరి చిత్రం ‘రంగ‌రంగ వైభ‌వంగా’.కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి త‌మిళ వెర్ష‌న్ ఆదిత్య వ‌ర్మ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గిరీశ‌య్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.శ్రీ వెంక‌టేశ్వ‌రా సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించాడు.

ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం త‌ర‌చూ ఒక అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తూ పబ్లిసిటీని చక్కగా చేస్తున్నారు.కాగా ఇదివరకు విడుదలైన ఈ చిత్రం తాలూకు ప్రి టీజర్ ఆకట్టుకుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతంలో ఇప్పటికే విడుదల అయిన రెండు పాటలు తెలుసా తెలుసా,కొత్తగా లేదేంటి జనాదరణ పొందాయి.

ఈ రోజు ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ సినిమా టీజర్ విడుదల చేయడం జరిగింది.సినిమాలో లవ్,యాక్షన్,ఎంటర్టైన్మెంట్ అన్నీ కలగలిపినట్టుగా అనిపిస్తుంది టీజర్ చూస్తుంటే.హీరో హీరోయిన్లు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నా ఇగోల వల్ల బయటకి చెప్పుకోలేని ప్రేమికులుగా వైష్ణవ్,కేతిక కనిపిస్తున్నారు. ఎనర్జీతో వైష్ణవ్ ఆకట్టుకోగా, క్యూట్ అండ్ హాట్ గా కనిపించి కేతీక కూడా ధీటుగా నిలిచింది.ఇక సినిమాలో ఆలీ,సుబ్బరాజు కూడా ఉన్నట్టు టీజర్ ద్వారా తెలిసింది.ఈ సినిమాని తొలుత జూలై 1న రిలీజ్ చేయాలని చూసినా,ఇతర చిత్రాల వాయిదా వల్ల మళ్ళీ మార్చాల్సి వచ్చింది.దాంతో ఈ సినిమానిజూలై నెల చివర్లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

Box-office: మరో రికార్డ్ కొట్టిన విక్రమ్

0

బాక్స్ ఆఫీసు వద్ద విక్రమ్ జోరు ఇంకా కొనగుతుంది.కెరీర్ చివరి దశకు వచ్చేసింది అనుకున్న కమల్ ఇంత భారీ బ్లాక్ బస్టర్ కొట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. వయసుతో సంబంధం లేకుండా సీనియర్ హీరోలు కూడా పెద్ద హిట్ లు కొట్టచ్చు అన్న నమ్మకాన్ని నిలబెట్టింది విక్రమ్.వాస్తవానికి కమల్ హాసన్ కి నటుడుగా ఎంత పేరున్నా, కలెక్షన్ల పరంగా భారీ హిట్ కొట్టి దాదాపు 15 ఏళ్లు అయింది. కానీ సరైన సినిమా పడటం దానికి టాక్ తో సహా ఇతర అంశాలు కూడా కలిసి రావడంతో భారీ హిట్ గా నిలిచింది. 

తమిళనాడులో ఇప్పటికే ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన “విక్రమ్” ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బాహుబలి సీరీస్,2.0,సాహో మరియు కేజీఫ్2 తరువాత ఆ ఘనత సాధించిన ఆరో దక్షిణ భారతీయ చిత్రంగా నిలిచింది.ఇది అసలు ప్రేక్షకుల నుంచి ఇండస్ట్రీ,ట్రేడ్ వర్గాల వరకూ ఎవరూ ఊహించి ఉండరు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ పకడ్బందీ కథనానికి తోడు అనిరుధ్ ఉర్రూతలూగించే సంగీతం ఈ చిత్ర విజయానికి ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు.

ఈ విజయంతో బాక్స్ ఆఫీసు రేసులోకి అనూహ్యంగా వచ్చారు కమల్ హాసన్. ఇక తన పోటీదారుడు అయిన సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా మళ్ళీ తన స్థాయిలో భారీ హిట్ కొడతాడు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.రోబో తరువాత ఆ స్థాయిలో ఆయనకు విజయం దక్కలేదు.ప్రస్తుతం ఆయన నెల్సన్ దర్శకత్వంలో “జైలర్” సినిమాలో నటిస్తున్నారు. మరి ఆ సినిమాతో కమల్ విసిరిన సవాల్ కి రజినీ బదులు చేప్తారో లేదో చూడాలి.

“పక్కా కమర్షియల్” పక్కా హిట్ అన్న మెగాస్టార్.

0

గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1న రాబోతోంది.ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం శిల్పా కళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు.
ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ మాట్లాడుతూ,కరోనా తరువాత ఫంక్షన్లు జరగడం, వాటికి ఇంత మంది అభిమానులు రావడం చాలా సంతోషంగా ఉంది. మేం సినిమాలు చేసేది ఈ కేరింతలు, చప్పట్లు, ప్రోత్సాహం కోసమే, నేను ఇక్కడకు రావడానికి కారణం వీళ్లు కాదు మీరు అంటూ అభిమానులను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడారు. మీ చప్పట్లే నాకు ప్రోత్సాహం. మీ ఎనర్జీని నేను తీసుకెళ్తాను. ఇదే నా ఇంధనం అంటూ అభిమానులను పొగడ్తలతో ముంచెత్తారు.

ఈ మేరకు అల్లు అరవింద్ గారు నాకు ఫోన్ చేసి ఈ సినిమా ఈవెంట్ కు రావాలని, గోపీచంద్, మారుతి అడిగారనీ చెప్పారు. గోపీచంద్, మారుతి, బన్నీ వాస్, ఎస్కేఎన్, విక్కీ, వంశీలతో నాకు ఎన్నో ఏళ్ల బంధం ఉంది,ఇలాంటి ఫంక్షన్లకు నేను వెళ్లాలని అనుకున్నాను,వస్తాను అని అన్నాను. ఇక్కడకు వచ్చినందుకు వారికి ఎంత సంతోషంగా ఉందో తెలియదు గానీ నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

నాకూ అల్లు అరవింద్ గురించి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ గోపీచంద్ గారితో నాకు ప్రత్యేక సంబంధం ఉందని చిరంజీవి చెప్పారు.ఒంగోలులో సీఎస్ఆర్ శర్మ కాలేజ్‌లో చదువుకునే సమయంలో గోపీచంద్ ఫాదర్ టీ కృష్ణ గారు నాకు సీనియర్. కొత్తగా ఓ అబ్బాయి వచ్చాడు,నా దగ్గరకు తీసుకురండి అని ఆయన నన్ను పిలిపించారు. స్టూడెంట్ ఫెడరేషన్‌కు లీడర్‌గా నిలబడుతున్నాను.నీ సాయం కావాలని ఆయన నన్ను అడిగారు.దగ్గరకు తీసుకుని ఒక అన్నయ్యలా నాకు సపోర్ట్ గా ఉన్నారు.కొత్తగా వచ్చిన నాలాంటి స్టూడెంట్‌కు భరోసా ఇచ్చి నాలో ధైర్యం నింపారు,అలాంటి టీ కృష్ణ గారు నాకు ఎప్పుడూ హీరోగా కనిపించేవారు.

ఆ తరువాత నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లడం.టీ కృష్ణ గారు కూడా రావడం, ఓ పక్క ఆయన సందేశాత్మక చిత్రాలు తీస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు.అయితే ఆయనతో కలిసి పని చేసే అవకాశం రాలేదు.ఆయనను మనకు దూరం చేసి ఆ భగవంతుడు మనకు అన్యాయం చేశాడు.ఆయనకు సినిమా మీదున్న ప్రేమ, అభిమానం గోపీచంద్ రూపంలో ముందుకు సాగుతుంది. విలక్షణ సినిమాలలో ముందుకు వచ్చారు.ఆయన ప్రతీ సినిమాను చూస్తుంటాను. సాహసం, ఒక్కడున్నాడు, చాణక్య వంటి చిత్రాలు చాలా వైవిద్యంగా ఉంటాయి.పక్కా కమర్షియల్ ద్వారా మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానని చిరంజీవి మాట్లాడారు.

ప్రజా రాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఫ్లాగ్ డిజైన్ సమయంలో మారుతి ఇచ్చిన డిజైన్‌లు ఎంతో ఇంట్రెస్ట్‌గా అనిపించాయి.అలాగే పార్టీకి సంబంధించిన సాంగ్ ను మారుతిని విజువలైజ్ చేయమని అడిగితే,అద్భుతమైన విజువల్స్‌తో వచ్చాడు.సాంగ్‌తో పాటు విజువల్స్ అద్బుతంగా తీశాడు అని, డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నావా? అని అడిగితే.. లేదండి కథలు రాస్తుంటాను.. గ్రాఫిక్స్ డిజైన్లు చేస్తాను అని అన్నాడు. కానీ నేను అన్నట్టుగా డైరెక్టర్ అయ్యాడు.. ఆయన సినిమాల్లో ప్రేమ కథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ చిత్రాలు నాకు ఇష్టం.మారుతి ఆడియెన్స్ పల్స్ బాగా తెలిసినవాడనీ చిరంజీవి చెప్తూ,పక్కా కమర్షియల్ అన్ని రకాల హంగులున్న చిత్రమనిపిస్తుందని. గత చిత్రాల కంటే ఎక్కువగా ఆడాలని కోరుకుంటున్నానని అన్నారు.

అలాగే యూవీ క్రియేషన్స్ కి సంభందించిన విక్కీ మా కుటుంబ సభ్యుల్లో ఒక్కడు,ఆయన వచ్చి నన్ను మారుతితో సినిమా చేయమని అన్నాడు.మారుతి అంటే మా ఇంట్లో సభ్యుడే. నా అభిమానిగా నన్ను ఎలా చూపించాలో తెలుసు.. చేద్దామని అన్నాను అని చిరంజీవి చెప్తూ స్టేజ్ పైనే మారుతి తో నీతో సినిమా చేయడానికి రెడీ అంటూ, పక్కా కమర్షియల్ సినిమా వేడుకలో మంచి బేరం కుదుర్చుకున్నాం అని సరదాగా ఆటపట్టించారు.

అలాగే బన్నీ వాసు ఎదుగుదలను కూడా చిరంజీవి కొనియాడారు. చూస్తుండగానే బన్నీ వాసు పైకి వచ్చాడని,అల్లు అరవింద్ గారు ఒక మనిషి టాలెంట్ ను నమ్మి భాధ్యత అప్పగించడం అంటే అది మామూలు విషయం కాదని అన్నారు.తనకున్న చిత్తశుద్ధి మరియు అల్లు అరవింద్ ఆశీస్సుల వల్లే బన్నీ వాసు ఈరోజు స్థాయిలో ఉన్నాడని చెప్పారు. ఇక సినిమా హీరోయిన్ రాశి ఖన్నా ను వరుణ్ తేజ్ తో చేసిన తొలిప్రేమలో బాగా నటించింది అని,మారుతితో చేసిన ప్రతి రోజూ పండగేలో కూడా టిక్ టాక్ అమ్మాయి పాత్రలో భలే చేశావని చిరంజీవి చెప్పారు.

రావు రమేష్ గారితో కలిసి నటించలేదు గానీ, ఆయన తండ్రి రావు గోపాల రావు గారిని నేను చిన్న మామయ్య గారు అని పిలుస్తాను. ఎంతో ప్రేమగా సెట్‌లో ఫుడ్ పెట్టేవారు. రావు రమేష్ మళ్లీ వాళ్ల నాన్న గారి ఇన్‌స్పిరేషన్‌తో వస్తున్నారు, రకరకాల పాత్రలతో అందరినీ మెప్పిస్తున్నారు. ఆయన లేని స్థానాన్ని భర్తీ చేస్తూ,ఆయనకంటే ఎక్కువ పాత్రలు వేస్తూ నటుడుగా ఎదుగుతున్నారు.నా సినిమాల్లో కూడా పాత్రలు వేయాలని కోరుతున్నానని చిరంజీవి గారు మాట్లాడుతూ, ఇంతవరకు నాతో కలిసి ఎందుకు నటించలేదు అని సరదాగా రావు రమేశ్ ను అడిగారు.నాతో కూడా పాత్రలు వేయాలని కోరుకుంటున్నాను.నీ టైమింగ్ చాలా బాగుంటుంది.ఎస్‌కేఎన్ వంటి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని చెప్తూ,ఇంక సినిమాలో హీరోగా గోపీచంద్ ఉన్నాడు కాబట్టి, ఫైట్స్ అదిరిపోతాయ్ అని అనుకుంటున్నాను ఎందుకంటే నార్త్ ఆడియెన్స్ గోపీచంద్ ఫైట్స్ కోసం చూస్తుంటారు  టైటిల్‌కు న్యాయం జరిగేట్టుగా ఈ సినిమాలో అన్ని రకాల అంశాలుంటాయని, ఫుల్ మీల్స్,పక్కా కమర్షియల్‌గా సినిమా ఉంటుందనీ,మళ్లీ థియేటర్లు కళకళలాడాలని.. ఈ అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్తూ చిరంజీవి ప్రసంగాన్ని ముగించారు.    

థాంక్యూ గురించి వర్రీ అవుతున్న దిల్ రాజు

0

నాగ చైతన్య హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్‌గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం “థ్యాంక్యూ”.ఇందులో మాళవిక నాయర్, అవికా గోర్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించబోతోన్నారు.ఇది వరకు విడుదల చేసిన పాటలు, పోస్టర్లు, టీజర్ అన్నీ బాగుండటం వల్ల సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి.విక్రమ్ కే కుమార్ అంటే ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది.మూడు దశల్లో హీరో జీవితం కనిపించే ఈ సినిమాలో హీరో నాగ చైతన్య ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు.

ఈ చిత్రాన్ని మొదట జూలై 8 న విడుదల చేస్తాం అని ప్రకటించిన చిత్ర బృందం ఇటీవలే ఆ విడుదల తేదీని 22కి మార్చడం జరిగింది.దానికి కారణాలు చెప్తూ నిర్మాత దిల్ రాజు ఏమన్నారు అంటే సినిమాకి సంభందించిన పబ్లిసిటీ పనులకి కాస్త సమయం కావాలని, ఇంకా మూడు సాంగ్స్ రిలీజ్ చేయాలనీ, ట్రైలర్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ అందుకే సినిమాను ఇంకో రెండు వారాలు లేటుగా తీసుకొద్దామని అనుకున్నట్టు తెలిపారు.

అయితే అసలు అది విషయం అది కాదని వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలు హిట్ కాకపోగా,కనీసం నామమాత్రపు స్పందన కూడా రాలేదు. మరో పాట రిలీజ్ చేయాల్సి ఉంది,ఇలాంటి క్లాస్ కంటెంట్ సినిమాలకు పాటల వల్ల ఎంత క్రేజ్ అవసరమో దిల్ రాజుకి బాగా తెలుసు. అందుకని తరువాత రిలీజ్ చేస్ పాటలు, ప్రోమోలతో అయినా సినిమాకి రావాల్సిన బజ్ తీసుకురావాలి అని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఒకవేళ అప్పటికీ సినిమాకి అనుకున్నంత స్థాయిలో క్రేజ్ రాకపోతే మరోసారి థాంక్యూ ను పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

థియేటర్లు మూసి వేయాల్సి వస్తుంది అంటున్న ఏపీ ఎక్జిబిటర్లు

0

ఏపీలో ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్ల విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసం యువర్ స్క్రీన్స్ పేరిట ప్రత్యేక పోర్టల్ కూడా రూపొందించారు. దీనిపై ఏపీఎఫ్ డీసీ ఎండీ విజయ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు. 

యువర్ స్క్రీన్స్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల అదనపు చార్జీల భారం ఉండదని వెల్లడించారు. యువర్ స్క్రీన్స్ పోర్టల్ వినియోగం ద్వారా బ్లాక్ టికెటింగ్ కు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. ప్రేక్షకులకు తక్కువ ధరలకే సినిమా టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆన్ లైన్ లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే సినిమా టికెట్ల అమ్మకాలు జరుగుతాయని వివరించారు.

ఇతర పోర్టల్స్‌ కంటే రూ. 20 నుంచి రూ.25 రూపాయల తక్కువకే టికెట్లను విక్రయించనున్నారు.థియేటర్లకు కూడా ఏ రోజు డబ్బులను ఆరోజే ఇస్తామని ఏపీ సర్కార్‌ చెబుతోంది. ఇటు ఇతర పోర్టల్స్‌తోనూ ఒప్పందాలు కొనసాగించనుంది ప్రభుత్వం.

అయితే ఈ విధానం పై థియేటర్ల యాజమాన్యం అంత సుముఖంగా లేరు. ఇదివరకే బుక్ మై షో, పే టీయం వంటి సంస్థలతో థియేటర్లు ఒప్పందం కుదుర్చుకున్నాయి.ఆయా ఒప్పందాలు ఇంకా కొనసాగుతుండగా ఇప్పుడు అకస్మాత్తుగా ప్రభుత్వం ఈ కొత్త టికెటింగ్ పోర్టల్ ప్రారంభించడం అందులోనూ ఖచ్చితంగా అదే పోర్టల్ తో థియేటర్ వారు ఒప్పందం కుదుర్చుకోవలసిందే అని బలవంతం చేయడం ఏమాత్రం సరి కాదని థియేటర్ యాజమాన్యం వారు వాపోతున్నారు. ప్రభుత్వ ఇలాగే బెదిరింపు వైఖరి కొనసాగిస్తే థియేటర్లు మూసివేస్తాం అని తెలిపారు. ఏదేమైనా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి అనుకుంటే ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎక్జిబిటర్ లతో చర్చలు జరిపి ఆ పై నిర్ణయం తీసుకుంటే మంచిది.

We’re ready to close theatres if government forces for agreement on online portal

0

The Andhra Pradesh High Court has given a green signal to the AP Government for its plan to implement online ticketing for theatres in the state. The government has been aggressively pushing this idea of an online portal. It claims that this would lead to a reduction of the service charge that the audience will have to pay per booking.

Under this new system, all the cinema tickets sold across AP will be done through the state government ticket portal. The government has directed district collectors to take up the responsibility and revenue department officials are closely following up on this.

However, theatre owners are not happy with this move of the government. Reportedly, the government officials are forcing the exhibitors to sign the agreement for the online ticket portal. Most of the exhibitors already have agreements with Book My Show, Ticket New, etc.

The exhibitors complain that the government is not doing this in the right process and they are forcing the exhibitors. Now the exhibitors have decided to the close the theatres if the government is not providing the time