నటులుగా మారుతున్న తమిళ దర్శకులు

    tamil directors

    ఇటీవల మనం తమిళ్ సినిమా పరిశ్రమలో గమనిస్తే పలువురు డైరెక్టర్స్ నటులుగా మారిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఏ మాయ చేసావే సినిమాతో మంచి పేరు సంపాదించిన గౌతమ్ మీనన్ ప్రస్తుతం అక్కడక్కడ పలు సినిమాల్లో నటుడిగా కూడా కనిపిస్తున్నారు. 

    అలానే నాని, ఖుషి వంటి సినిమాలు తీసిన ఎస్ జె సూర్య కూడా తమిళ్, తెలుగు సినిమాల్లో నటుడిగా మంచి పేరుతో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. అలానే మరొక దర్శకుడు మిస్కిన్ కూడా అక్కడక్కడ పలు సినిమాల్లో కీలకపాత్రలు చేసి ఆకట్టుకున్నారు.

    అయితే విషయం ఏమిటంటే ఇప్పటికే శృతిహాసన్ తో కలిసి ఒక ప్రత్యేకమైన సాంగ్ లో కనిపించిన యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ త్వరలో అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు.

    లేటెస్ట్ కోలీవుడ్ న్యూస్ ప్రకారం అతి త్వరలో శింబు హీరోగా వెట్రిమారన్ తెరకెక్కించునున్న వడా చెన్నై ఫ్రాంచైజ్ సిరీస్ మూవీలో డాక్టర్, జైలర్ మూవీస్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అతిత్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి. 

    Follow on Google News Follow on Whatsapp


    Show comments
    Exit mobile version