Home Movie News Bheeshma Combo: బ్లాక్ బస్టర్ భీష్మ కాంబోలో మళ్లీ కొత్త సినిమా

Bheeshma Combo: బ్లాక్ బస్టర్ భీష్మ కాంబోలో మళ్లీ కొత్త సినిమా

యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన భీష్మ చిత్రం.. హీరో నితిన్ కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా చక్కని ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులని అలరించింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ముగ్గురూ మళ్లీ కొత్త సినిమా కోసం చేతులు కలపబోతున్నారని తెలుస్తోంది.

నిజానికి దర్శకుడు వెంకీ కుడుముల డీవీవీ సినిమా నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవితో ఓ కామెడీ ఎంటర్టైనర్ చేయాల్సి ఉండగా, ఈ ప్రాజెక్ట్ పురోగతి పై ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి యువ దర్శకుడితో వారి అభిమాన హీరోని చూడాలన్న మెగా అభిమానుల ఆశలు నిజం కాకుండా పోయాయి.

నితిన్ చివరగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మాచర్ల నియోజికవర్గంలో కనిపించారు, ఈ చిత్రం కమర్షియల్ గా ఫెయిల్యూర్ గా నిలవడమే కాకుండా ప్రేక్షకుల మరియు విమర్శకుల నుండి కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ సినిమాతో తనకు మాస్ ఇమేజ్ వస్తుందని నితిన్ ఆశించారు కానీ దురదృష్టవశాత్తు ఆయన ప్రయత్నం విఫలం అయ్యింది.

ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రానికి దర్శకత్వం వహించిన వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్నారు.

మరో వైపు రష్మిక మందన్న తాజాగా విజయ్ నటించిన వారిసు సినిమాలో హీరోయిన్ గా కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి ఈ పొంగల్ విజేతగా నిలిచింది. నితిన్, వెంకీ కుడుముల, రష్మిక మందన్నల లక్కీ కాంబినేషన్లో మరో బ్లాక్ బస్టర్ సినిమా రావాలని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version