Home Movie News తమకు అనుకూలంగా నిభందనలు మార్చేస్తున్న తెలుగు నిర్మాతలు

తమకు అనుకూలంగా నిభందనలు మార్చేస్తున్న తెలుగు నిర్మాతలు

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సార్లు చిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రెస్ మీట్ లు పెట్టి చెప్పిన మాటలు, తీసుకున్న నిర్ణయాలను అగ్ర నిర్మాతలు అన్నీ సమయానికి అనుగుణంగా మార్చేసి తాము అనుకున్నదే చేస్తారు. ప్రస్తుతం సంక్రాంతి సినిమాల థియేటర్ల విషయంలో కూడా అదే జరుగుతుంది.

2019 సంక్రాంతి సందర్భంగా దిల్ రాజు ఒక మాటను పదే పదే వల్లించారు. పండగల సీజన్‌లో తెలుగు సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని ఆయన అన్నారు. డబ్ చిత్రాలను కొంటున్న చిన్న నిర్మాతలకు మంచి థియేటర్లు రావడం లేదంటూ పెట్టా సినిమా తెలుగు నిర్మాత చేసిన విమర్శలకు సమాధానంగా దిల్ రాజు ఇలా చెప్పటం జరిగింది.

కానీ ఇప్పుడు సంక్రాంతి రేసులో ఓ డబ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు తనకు అనుకూలంగా రూల్స్ మార్చుకుంటున్నారు. విజయ్ నటించిన వారిసుకు మంచి నాణ్యమైన థియేటర్లను భారీ సంఖ్యలో కేటాయిస్తున్నారు. ఈ సందర్భంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్మాత మండలి దిల్ రాజుకి తన 2019 వ్యాఖ్యలను గుర్తు చేసింది.

అయితే, తమిళ డబ్ సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో ఆంక్షలు పెట్టే ప్రయత్నాల వల్ల తమిళనాడులో తెలుగు సినిమాలకు చెడు పరిణామాలు ఉంటాయని తమిళ నిర్మాతల మండలి తాజాగా పత్రికా ప్రకటన విడుదల చేసింది.

తెలుగు నిర్మాతల్లో సీనియర్ మోస్ట్ దిగ్గజాలలో ఒకరైన అల్లు అరవింద్ ఈ వివాదం పై స్పందిస్తూ బాహుబలి తర్వాత భాషాభేదాలు లేవు. ప్యాన్-ఇండియన్ సినిమాలు జరుపుకునే కాలంలో సినిమాల పై ఆంక్షలు విధించడం అసాధ్యమని అన్నారు.

ఈ స్టార్ ప్రొడ్యూసర్ల నుంచి ఈ నాటకాల వంటి మాటలను నెటిజన్లు గమనిస్తూనే ఉన్నారు. అందువల్ల, నియమాలను చిన్న నిర్మాతలు మాత్రమే అనుసరించాలి అని.. పెద్ద సినిమాల నిర్మాతలు మాత్రం ఇష్టానుసారంగా నియమాలను ఉల్లంఘించవచ్చా అని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.

ఈ తరహా ట్రిక్కులు మరియు ప్రకటనలను వక్రీకరించడం పరిశ్రమలో కొత్త కాదు, పైన చెప్పినట్లుగా వారు నిబంధనలను రూపొందించవచ్చు మరియు వారి సౌలభ్యం కోసం వాటిని ఉల్లంఘించవచ్చు.

ఇదిలా ఉంటే, అల్లు అరవింద్ తెలుగు రాష్ట్రాల్లో వరుణ్ ధావన్ నటించిన భేడియాను తోడేలు అనే టైటిల్ తో తెలుగులో విడుదల చేస్తున్నారు. అల్లు అరవింద్ కన్నడ సెన్సేషనల్ ఫిల్మ్ కాంతారను ఇటీవలే తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసారు. కాగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ తోడేలు విజయం పై విశ్వాసం వ్యక్తం చేశారు. కృతి సనన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా తెలుగు మీడియా ఇంటరాక్షన్ నిన్న సాయంత్రం జరిగింది.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version