Home Movie News Sankranthi 2023: అభిమానులను మరియు ప్రేక్షకులను నిరాశపరుస్తున్న దర్శకుల ఓవరాక్షన్ మరియు ఓవర్‌హైప్

Sankranthi 2023: అభిమానులను మరియు ప్రేక్షకులను నిరాశపరుస్తున్న దర్శకుల ఓవరాక్షన్ మరియు ఓవర్‌హైప్

2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణల మధ్య ఆసక్తికరమైన పోటీని చూడబోతున్నామనే విషయం తెలిసిందే. తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా వీరితో పాటు వస్తున్నారు. కాగా ఈ మూడు సినిమాల రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.

అయితే వీరసింహారెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమాల దర్శకులు మరియు బృందం ప్రతి అప్‌డేట్‌కి చాలా ఓవర్ హైప్ చేస్తూ ప్రేక్షకుల అంచనాలను తదుపరి స్థాయికి పెంచుతున్నారు, కానీ అప్‌డేట్ ఇచ్చిన తర్వాత, అవి అభిమానులను మరియు ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి.

వాల్తేరు వీరయ్య యూనిట్ మరియు దర్శకుడు బాబీ సోషల్ మీడియాలో మాస్ మూల విరాట్, మాస్ ఈజ్ కమింగ్, పూనకాలు లోడింగ్ మొదలైన ట్యాగ్‌లతో భారీ హైప్ చేస్తున్నారు. సినిమా అప్‌డేట్‌లు ఒక మాస్ ఎంటర్‌టైనర్‌ లా చూసుకుంటే బాగున్నాయి.

కానీ వారు తమ ఓవర్‌బోర్డ్ స్టేట్‌మెంట్‌లతో అనవసరంగా అదనపు హైప్‌ని క్రియేట్ చేస్తున్నారు. వీటి వల్ల సినిమాలకి మంచి జరగదు సరికదా ఒక రకంగా కీడు జరిగే అవకాశం ఉందనే చెప్పాలి.

నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి విషయంలోనూ అదే జరుగుతుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని అండ్ టీమ్ గాడ్ ఆఫ్ మాస్ అనే ట్యాగ్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు థమన్ ఇటీవల విడుదల చేసిన సుగుణ సుందరి పాటకు చాలా హైప్ క్రియేట్ చేసారు.

బాలకృష్ణ డ్యాన్స్ ఏదో మ్యాజిక్ లా ఉంటుందని ట్వీట్ చేశారు. ఇక అసలు పాట విడుదలయ్యాక చూస్తే బాలయ్య లుక్స్, ఎనర్జీ బాగానే ఉన్నాయి కానీ అందులో అసాధారణంగా ఏమీ కనిపించలేదు.

మాటల కంటే కంటెంట్ ఎక్కువగా మాట్లాడాలని వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి రెండు చిత్ర బృందాలు అర్థం చేసుకోవాలి. రెండు చిత్రాల యూనిట్లు ఈ విషయాన్ని నేర్చుకుని, హైప్ ను అనవసరంగా పెంచే ప్రకటనల కంటే సినిమాకి తగిన ప్రమోషన్‌లతో ముందుకు వస్తారని కోరుకుందాం.

Show comments
Exit mobile version