ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం జూబ్లీహిల్స్ లోని సినీనటుడు శ్రీ చిరంజీవి నివాసంలో నటులు శ్రీ చిరంజీవి, శ్రీ నాగార్జున లతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చలనచిత్ర పరిశ్రమ కు సంబంధించి పలు అంశాలను చర్చించినారు. ప్రధానంగా ఆన్ లైన్ టికెటింగ్ విధానం అమలు, ఇతర నగరాలలో కంటే దీటుగా సినిమా షూటింగ్ లకు శంషాబాద్ సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 24 విభాగాల కార్మికులు, టెక్నీషన్స్ నైపుణ్యంను మరింత పెంపొందింప చేసేందుకు ఒక శిక్షణ కేంద్రం ఏర్పాటు అవసరాన్ని వివరించారు. టికెట్ల ధరల సరళీకృత విధానం పాటించాలని పేర్కొన్నారు. చిత్రపురి కాలనీ పక్కనే సినీ కార్మికులకు ఇండ్ల నిర్మాణానికి మరో 10 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రస్తావించారు. సినీ కార్మికులు, కళాకారుల కోసం కల్చరల్ కేంద్రం ఏర్పాటుకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2 ఎకరాల స్థలం కేటాయించాలని అన్నారు. అదేవిధంగా సినీ, tv కళాకారులకు ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులను అందజేయాల
Minister Talasani Srinivas Yadav meets Chiranjeevi and Nagarjuna
Show
comments
Featured in this article
